సోదాల కలకలం | - | Sakshi
Sakshi News home page

సోదాల కలకలం

Apr 4 2025 2:05 AM | Updated on Apr 4 2025 2:05 AM

సోదాల కలకలం

సోదాల కలకలం

● రవాణాశాఖ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు ● రాత్రిపూట రంగంలోకి దిగిన వైనం ● వాంకిడి వద్ద రూ.45,100 నగదు లభ్యం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో వాంకిడి చెక్‌పోస్టులో రూ.45,100 పట్టుబడ్డాయి. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ డీఎస్పీలు విజయ్‌కుమార్‌, రమణమార్తి, మరో నలుగురు సీఐలు ఏకకాలంలో అక్కడి రికార్డులు పరిశీలించారు. రెండు ఫోన్లు సీజ్‌ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఏఎంవీ మాత్రమే ఉండగా, ఇంకా ప్రైవేట్‌ వ్యక్తులూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో గతేడాది మేలో భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద రూ.11,630, గత డిసెంబర్‌ 4న రూ.62,500 నగదు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. చెక్‌పోస్టుల్లో నిత్యం వాహనదారులు, డ్రైవర్లు, సహాయకుల నుంచి బండికో రేటుగా అనధికారికంగా ప్రైవేట్‌ సిబ్బంది వసూళ్లు చేస్తున్నది బహిరంగ రహస్యమే. ఏసీబీ సోదాలతో గురువారం వాంకిడిలో ఎలాంటి వాహన తనిఖీలు లేకుండానే రాకపోకలు సాగించాయి.

మూడు చోట్ల ఇదే తంతు

ఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుతో, ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రోడ్డు మార్గంగా ఉంది. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్‌–44పై భోరజ్‌, ఆసిఫా బాద్‌ జిల్లా ఎన్‌హెచ్‌–363పై వాంకిడి, నిర్మల్‌ పరిధి ఎన్‌హెచ్‌–61 వద్ద తానూరు మండలం బెల్‌తరోడా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. ఇక్కడే సమీకృత చెక్‌పోస్టులూ ఉన్నాయి. రవాణాశాఖ చెక్‌పోస్టులో నిత్యం వందల వాహనాలను చట్టప్రకారం అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీలు చే స్తూ అధికారులు అనుమతి ఇవ్వాలి. అయితే పరిశీ లన పేరిట వాహనదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నరనేది ప్రధాన ఆరోపణ.

డ్యూటీకి కోసం పోటీ

రవాణా శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది చెక్‌పోస్టుల్లో డ్యూటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది వరకు రాజకీయ, ఉన్నతాధికారుల పైరవీలతో అక్కడ డ్యూటీలు తెచ్చుకుని పని చేస్తున్నారు. చెక్‌పోస్టు డ్యూటీకి వెళ్తే ‘లాభదాయంకం’గా మారడంతో పోటీ పడుతున్నారు. అక్కడ పని చేస్తున్న అధికారుల సంఖ్యను బట్టి రోజువారీగా డ్యూటీల్లో ఉంటున్నారు.

నగదు ముట్టుకోకుండా..

ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపైనే కేసులు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటారు. ఒకవేళ ప్రైవే ట్‌ వ్యక్తులు ఉంటే వారు ఏ అధికారి ప్రోద్బలంతో ఉన్నారు? వారివెనుక ఎవరున్నారనే స్పష్టమైన ఆ ధారాలు తీసుకుంటారు. లేకపోతే అధికారులపై కే సులు నమోదు చేసే అవకాశం లేదు. సాధారణంగా లంచం తీసుకునేటప్పుడు నేరుగా దొరికిన ఆ అధి కారి చేతులు, నగదుతో రసాయన పరీక్ష చేసి, సాంకేతిక ఆధారాలతో కోర్టులో అందజేస్తారు. కానీ చెక్‌పోస్టుల్లో ఏ అధికారీ చేతితో డబ్బులు ముట్టుకోరు. దీంతో లెక్కచూపని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేవి మిస్టరీగా మారుతోంది. అవినీతి కేసులో ప క్కా ఆధారాలుంటే కేసు ముందుకు వెళ్తుంది. గతంలో పట్టుబడిన నగదుపైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా దొరికిన నగదుపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement