చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా ఉదయం 9 గంటలు దాటే వరకూ మంచు కురుస్తుండడంతో దారి కనిపించక వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం జీకే వీధిలో 9.6 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.6 డిగ్రీలు, జి.మాడుగులలో 11.0 డిగ్రీలు, అరకులోయలో 11.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.1 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీలు, పెదబయలులో 13.2 డిగ్రీలు, హుకుంపేటలో 13.9 డిగ్రీలు, పాడేరులో 14.1 డిగ్రీలు, అనంతగిరిలో 14.8 డిగ్రీలు, కొయ్యూరులో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment