గ్రావెల్ తరలిస్తున్న మూడు వాహనాల సీజ్
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి సెక్షన్లోని తెల్లకొండ బీటు నుంచి అక్రమంగా మైదాన ప్రాంతానికి గ్రావెల్(ఎర్రమట్టి) తరలిస్తున్న రెండు టిప్పర్లను, ఒక ప్రొక్లెయినర్ను సోమవారం సీజ్ చేసినట్టు ఎఫ్ఎస్వో రాము తెలిపారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 30 ట్రిప్పుల మట్టి తరలించనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పా రు. కాగా అటవీ అధికారులను చూసి వాహనా లు నడుపుతున్న కొంత మంది అక్కడ నుంచి పరారైనట్టు ఆయన తెలిపారు. దీంతో 12 మంది అటవీ అధికారులు చీకటి పడిన తరువాత కూడా ఆ వాహనాల వద్ద కాపలా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment