మార్చిలోనే మండుతోంది | - | Sakshi
Sakshi News home page

మార్చిలోనే మండుతోంది

Published Wed, Mar 5 2025 1:09 AM | Last Updated on Wed, Mar 5 2025 1:05 AM

మార్చ

మార్చిలోనే మండుతోంది

సాక్షి,పాడేరు: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి.మార్చిలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం వేళల్లో 13 నుంచి 23 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా,మధ్యాహ్నం సమయంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో మంగళవారం అత్యధికంగా మారేడుమిల్లిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వై.రామవరంలో 38.5, రాజవొమ్మంగిలో 37.8, కొయ్యూరులో 37.7, రంపచోడవరంలో 37, ఎటపాకలో 36.6, గంగవరంలో 36.4, అడ్డతీగలలో 36.2, పాడేరులో 36.1, చింతూరులో 35.7, జీకే వీధిలో 35.1,పెదబయలులో 34.6,అరకులోయలో 34.2, డుంబ్రిగుడలో 34.1, ముంచంగిపుట్టులో 33.8, చింతపల్లిలో 33.3, జి.మాడుగులలో 33, హుకుంపేటలో 32.7, అనంతగిరిలో 31.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత తగ్గింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మారేడుమిల్లిలో 39 డిగ్రీలు నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment
మార్చిలోనే మండుతోంది 1
1/1

మార్చిలోనే మండుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement