మళ్లీ మన్యం గజగజ
జి.కె.వీధిలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత
చింతపల్లి: జిల్లాలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గూడెంకొత్తవీధిలో అత్యల్పంగా 7.4 డిగ్రీలు, అరకులోయలో 8, డుంబ్రిగుడ, హుకుంపేట 8.2, చింతపల్లి 8.5, జి.మాడుగుల 8.9, పాడేరు 9.2, పెదబయలు 9.6, ముంచంగిపుట్టు 9.9, కొయ్యూరు 13.7, అనంతగిరిలో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment