విద్యుత్ బిల్లుల దహనం
చింతపల్లి: విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్ ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కార్యాలయం ఎదుట సోమవారం బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా.. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం వేల కోట్లు బిల్లులు పెంచాలని ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటుందన్నారు. తక్షణం చార్జీలు తగ్గించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాగిన చిరంజీవి, రాంబాబు నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment