కణేకల్లు: ద్విచక్ర వాహనంఅదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ, అనసూయమ్మ (38) దంపతులు. మంగళవారం ఉదయం బొమ్మనహళ్ మండలంలోని కృష్ణాపురంలో జరిగిన బంధువుల పెళ్లికి తన భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై సత్యనారాయణ వెళ్లాడు. అనంతరం రాయదుర్గం మండలంలోని కదరంపల్లిలో ఉన్న అత్తారింటికి బయలుదేరాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కణేకల్లు క్రాస్లోని ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment