AP" 25 వరకు అసెంబ్లీ | Andhra Pradesh Assembly budget Sessions until 25th March | Sakshi
Sakshi News home page

AP" 25 వరకు అసెంబ్లీ

Published Tue, Mar 8 2022 4:35 AM | Last Updated on Tue, Mar 8 2022 9:18 AM

Andhra Pradesh Assembly budget Sessions until 25th March - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించింది. సోమవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ మీటింగ్‌ హాలులో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 12 రోజులు సభ నిర్వహించాలని నిర్ణయించారు.

సభ షెడ్యూల్‌ ఇలా ఉంది..
► 8వ తేదీన దివంగత రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా
► 9వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు
► 10వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ
► 11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు
► 12, 13 శని, ఆదివారాలు సెలవు
► 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ
► 16, 17 తేదీల్లో బడ్జెట్‌ డిమాండ్లపై చర్చ
► 18న హోలీ, 19, 20 శని, ఆదివారాలు సెలవు
► 21 నుంచి 24వ తేదీ వరకు బడ్జెట్‌ డిమాండ్లపై చర్చ
► 25న ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది శాసన మండలి సమావేశాలు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయి. మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement