రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ ‌క్రిస్మస్‌ శుభాకాంక్షలు | Andhra Pradesh CM Jagan Christmas Wishes To People | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ ‌క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Dec 24 2020 12:41 PM | Updated on Dec 24 2020 1:13 PM

Andhra Pradesh CM Jagan Christas Wishes To People - Sakshi

సాక్షి, అమరావతి : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర  ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి అని సీఎం ‌ జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని  ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement