
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,086 కరోనా పాజిటీవ్గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 14 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 1,745 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం, 9 లక్షల 3వేల 72 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 31,710 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,55,70,201 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment