
విశాఖపట్నం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సూచించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విశాఖ నగరంలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ నజీర్