ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్‌  | chicken biryani for 5 paise in nandyal | Sakshi
Sakshi News home page

ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్‌ 

Published Sun, Jan 1 2023 7:20 AM | Last Updated on Sun, Jan 1 2023 3:56 PM

chicken biryani for 5 paise in nandyal - Sakshi

నంద్యాలలో బిర్యానీ కోసం భారీగా క్యూలో ఉన్న ప్రజలు  

సాక్షి, బొమ్మలసత్రం: డిసెంబర్‌ 31 (2022 చివరి రోజు) సందర్భంగా నంద్యాల పట్టణంలోని క్లాసిక్‌ జైల్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు పాత 5 పైసల నాణెం ఇస్తే  బిర్యానీ ఇస్తామంటూ ఆఫర్‌ ఇచ్చారు. దీని కోసం 5 పైసల నాణేలు తీసుకొచ్చి వందల మంది స్థానిక పద్మావతి నగర్‌లోని రెస్టారెంట్‌ వద్ద గుమిగూడారు.

ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్‌ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపి రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. 

చదవండి: (రేషన్‌ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement