పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్‌ | CM Jagan Comments At Launching Food Processing Units ndustries | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్‌

Published Wed, Oct 4 2023 1:45 PM | Last Updated on Wed, Oct 4 2023 2:51 PM

CM Jagan Comments At Launching Food Processing Units ndustries - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మొత్తం  13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.  

13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో  6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. 
చదవండి: పవన్‌ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement