Food processing
-
వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది
ఉదయపూర్: రాజస్థాన్లోని ఉదయపూర్లో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒక వివాహ వేడుకకు హాజరైన అతిథులు అక్కడ వడ్డించిన విందులో పాల్గొన్నాక అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం తింటున్న సమయంలోనే కొందరు వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోయారు.విందు భోజనం వికటించిన ఘటన ఉదయ్పూర్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంపాలైనవారంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. మరికొంతమంది బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించేందుకు ఆస్పత్రిలో తగినంతమంది వైద్యులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించారు. బాధితులు కడుపు నొప్పితో తల్లడిల్లిపోతుండటాన్ని చూసిన వైద్యసిబ్బంది వెంటనే వారికి ప్రథమచికిత్స అందించారు. దీంతో పలువురి ఆరోగ్యం కాస్త కుదుటపడింది.సమాచారం అదుకున్న పోలీసులు ఆ పెళ్లిలో వండిన ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. బాధితుల్లో 15 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం 200 మంది బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ప్రత్యేక వార్డులో 57 మందికి చికిత్స అందిస్తున్నారు. కొందరు బాధితులకు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నవారిలో ఉన్నారు.ఉదయపూర్లోని ధన్ మండిలోని ఓస్వాల్ భవన్లో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మందికి విందు ఏర్పాటు చేశారు. ఉదయపూర్తో పాటు వివిధ జిల్లాల నుండి కూడా జనం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆహారం తిన్న తర్వాత వందలమంది అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు అంబులెన్స్కు ఫోన్ చేసి బాధితులను ఎంబీ ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: ‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 13228.. 72 గంటలు లేటుగా ..’ -
మీ రుణం మాకొద్దు
సాక్షి, అమరావతి: చెప్పేదొకటి.. చేసేది మరొకటి. పైకి పరిశ్రమలు తెస్తామంటారు.. వస్తున్న పరిశ్రమలకూ మోకాలడ్డుతారు. వాటి కోసం కేటాయించిన స్థలాలను లాగేసుకోవడం ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల కుతంత్రాలివి. ఇందుకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటున్న వైనమే ఇందుకు తార్కాణం. ఈ పరిశ్రమల కోసం రుణాలిస్తానన్న బ్యాంకుకు తమ ‘పాలసీ’మారిందని, రుణం అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వీటికోసం జిల్లా కేంద్రాలకు సమీపంలో సేకరించిన విలువైన భూములపై టీడీపీ పెద్దలు కన్నేసినందునే ప్రభుత్వ ‘పాలసీ’ మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు డిమాండ్ కల్పించడం ద్వరా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రూ.3,559.11 కోట్లతో 27 ఆహార శుద్ధి యూనిట్లు, రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తొలుత రెండు దశల్లో రూ.1,250 కోట్లతో 10 ఆహార శుద్ధి యూనిట్లు, 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం జిల్లా కేంద్రాలకు సమీపంలోనే 322.61 ఎకరాలు సమీకరణ చేసి లాండ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసింది.115 కంపెనీలు ఆసక్తిఈ పరిశ్రమల ద్వారా వచ్చే 15 ఏళ్లలో పన్ను రూపంలో రూ. 9వేల కోట్ల రాబడితో పాటు జీడీపీ 1,500 కోట్లకుపైగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వమే స్వయంగా వీటిని నిర్మించి ఆసక్తి చూపే బహుళ జాతి సంస్థలకు 15 ఏళ్లకు లీజు పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ముడి సరుకును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్క్ఫెడ్, ఆర్బీకేల ద్వారా కొనాలని నిర్దేశించింది. తొలి దశ ప్రాజెక్టుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు ఆపరేటర్ల ఎంపిక కోసం టెండర్లు పిలవగా హల్దీరామ్స్, ఐటీసీ వంటి 115 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. వీరికి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఇవ్వాలని సంకల్పించింది. తొలిదశ యూనిట్ల ఏర్పాటు కోసం సిడ్బీ రూ.1,000 కోట్లు రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ను కూడా విడుదల చేసింది. ఫేజ్–1లో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద రూ.72.47 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్తో పాటు ఒక్కొక్కటి రూ.5 కోట్ల అంచనాతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గతేడాది అక్టోబర్లో శ్రీకారం కూడా చుట్టారు. ఇలా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా రంగం సిద్ధమైన తరుణంలో వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాము ఈ పాలసీని పునః సమీక్షిస్తున్నామని, రుణం అవసరం లేదంటూ బ్యాంకుకు చెప్పేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశ్నార్ధకంగా మారింది.రూ.1,000 కోట్ల విలువైన భూములను కొట్టేయాలన్న కుట్రతోనే..ఆహార శుద్ధి పరిశ్రమలకు జిల్లా కేంద్రాల సమీపంలో సమీకరించిన విలువైన భూములపై టీడీపీ బడా నేతల కన్ను పడినందునే వీటి ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పీపీపీ మోడ్లో ఇచ్చే పేరుతో వేల కోట్ల విలువైన ఈ భూములను కొట్టేయాలని కుతంత్రం పన్నినట్లు సమాచారం. ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేయించి, బహుళ జాతి సంస్థల ద్వారా రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు తలపెట్టిన గొప్ప కార్యక్రమానికి తూట్లు పొడిచి ఆ స్థలాల్లో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.యూనిట్లు ఏర్పాటు ఇలా..తొలిదశ : ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్ల లోపువేరుశనగ – అనంతపురంకాఫీ – అరకుమామిడి తాండ్ర – కాకినాడబెల్లం అనుబంధ ఉత్పత్తుల తయారీ – అనకాపల్లి కందులు – గుంటూరు, ఒంగోలువీటితోపాటు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లురెండో దశ: ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్లకు పైబడ్చిఅరటి – పులివెందులటమాటా – నంద్యాలపండ్లు, కూరగాయలు – రాజంపేటసుగంధ ద్రవ్యాలు – నరసరావుపేట -
చిరాగ్ పాశ్వాన్కు జెడ్– కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే. -
పండ్లకే నష్టం ఎక్కువ!
సాక్షి, అమరావతి: పంటల కోత అనంతరం పండ్లకు అత్యధికంగా నష్టం వాటిల్లుతోందని, ఆ తరువాత ఆ నష్టం ఎక్కువగా కూరగాయల్లో ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండ్లు, కూరగాయలు కోత అనంతరం అధిక ఉష్ణాగ్రతల కారణంగా నాణ్యత క్షీణించడం, వృధా అవ్వడం జరుగుతోందని పేర్కొంది. పండ్ల కోత అనంతరం దేశంలో 6.02 శాతం నుంచి 15.05 శాతం మేర నష్టపోతున్నాయని, ఆ తరువాత కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం మేర నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, విలువ జోడింపులు పెంచడం తదితర చర్యలను తీసుకుంటోందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెగా ఫుడ్ పార్క్లు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, విలువ పెంపు మౌలిక సదుపాయాలను, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను, ఫుడ్ ప్రాసెసింగ్–ప్రిజర్వేషన్ కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1,680 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడానికి సులభతరం చేసిందని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత
పుణె: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లోని 17 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భంద్గావ్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ యూనిట్లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ యూనిట్ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి అమ్మోనియా గ్యాస్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది ప్రమాదవశాత్తూ లీకైంది.ప్రమాద సమయంలో యూనిట్లో 25 మంది పనిచేస్తున్నారని.. వీరిలో చాలా మంది మహిళలేనని పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ్ దేశ్ముఖ్ తెలిపారు. లీకైన తర్వాత అమ్మోనియా రెగ్యులేటర్ను వెంటనే ఆఫ్ చేసినట్లు వివరించారు. బాధిత కార్మికులను వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.అయితే గ్యాస్ లీక్ పాయింట్కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు ధ్రువీకరించారని దేశ్ముఖ్ వెల్లడించారు. -
ఫాస్టింగ్ని.. ఇలా బ్రేక్ చేద్దాం!
రేపు ఉదయం దోసెలు కావాలంటే... ఈ రోజు ఉదయమే పప్పు నానబెట్టాలి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే... ఇదిగో... ఇవి ప్రయత్నించండి. దినుసుల కోసం బజారుకెళ్లక్కర్లేదు. పోపుల పెట్టె ముందు పెట్టుకోండి. ఫ్రిజ్ తెరిచి అరలన్నీ వెతకండి. ఇక బాణలి పెట్టి స్టవ్ వెలిగించండి..బ్రెడ్ ఉప్మా..కావలసినవి..బ్రెడ్ ముక్కలు – 3 కప్పులు;నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు;అల్లం తురుము – టీ స్పూన్;వెల్లుల్లి తురుము – టీ స్పూన్;పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;టొమాటో ముక్కలు – కప్పు;పసుపు – అర టీ స్పూన్;మిరప్పొడి – టీ స్పూన్;టొమాటో కెచప్ – టేబుల్ స్పూన్;నిమ్మరసం– 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;ఆవాలు – 2 టీ స్పూన్లు;కరివేపాకు– 1 రెమ్మ;తరిగిన కొత్తిమీర– టేబుల్ స్పూన్;నీరు– 2 టేబుల్ స్పూన్లు.తయారీ..వెడల్పుగా ఉన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి.ఆవాలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు వేయించాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు, మిరప్పొడి, నీరు వేసి కలిపి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి.ఇప్పుడు టొమాటో కెచప్, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి ఓ నిమిషం పాటు మగ్గనివ్వాలి.చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసి సమంగా కలిసేటట్లు కలుపుతూ ఓ నిమిషం పాటు వేయించి దించేయాలి. గమనిక: బ్రెడ్ ఉప్మా చేయడానికి తాజా బ్రెడ్ మాత్రమే కాదు గట్టిపడిపోయిన బ్రెడ్తో కూడా ఉప్మా చేసుకోవచ్చు.వీట్ వెజిటబుల్ చీలా..కావలసినవి..గోధుమపిండి – 2 కప్పులు;టొమాటో ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);క్యారట్ తురుము – పావు కప్పు;తరిగిన పచ్చిమిర్చి – టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నీరు – 2 కప్పులు (చిక్కదనం చూసుకుని అవసరమైతే పెంచుకోవచ్చు);నూనె – టేబుల్ స్పూన్;తయారీ..గోధుమ పిండిలో ఉప్పు వేసి నీరు పోసి పెరుగు చిలికే బీటర్తో చిలకాలి.ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.పెనం వేడి చేసి పెనాన్ని పచ్చి ఉల్లిపాయతో రుద్దాలి.ఇప్పుడు గోధుమపిండి మిశ్రమం ఒక గరిటె వేసి జాగ్రత్తగా రుద్దాలి.దోశెలాగ పలుచగా రుద్దకూడదు. ఊతప్పంలాగ మందంగా ఉంచాలి.ఈ గోధుమపిండి అట్టు చుట్టూ అర టీ స్పూన్ నూనె వేయాలి.మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా కాలనివ్వాలి.ఇలాగే పిండినంతటినీ అట్లు వేసుకోవాలి. ఈ వీట్– వెజిటబుల్ చీలాని చట్నీ లేదా సాంబార్తో తింటే రుచిగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా..కావలసినవి..గోధుమపిండి – కప్పు;జొన్న పిండి – అర కప్పు;రాగి పిండి – అర కప్పు;సజ్జ పిండి– అర కప్పు;మెంతి ఆకులు – అర కప్పు (తరగాలి);నువ్వులు – టేబుల్ స్పూన్;అల్లం – పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్;నూనె – టీ స్పూన్;అవిశె గింజలు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– 3 టేబుల్ స్పూన్లు.తయారీ..పైన చెప్పుకున్న పదార్థాల్లో నూనె మినహా మిలిగినవన్నీ ఒక వెడల్పు పాత్రలో వేసి గరిటెతో కలపాలి.తర్వాత నీటిని పోసి చపాతీ పిండిలా కలపాలి.పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని చపాతీలా వత్తి పెనం మీద వేసి, కొద్దిగా నూనె చిలకరించి రెండు వైపులా చపాతీ కాల్చినట్లే దోరగా కాలిస్తే మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా రెడీ.వీటిని ఇక వేరే కాంబినేషన్ అవసరం లేకుండా నేరుగా తినవచ్చు.పప్పు లేదా కూరలతో కూడా తినవచ్చు. లంచ్కి ప్యాక్ చేసుకుని వెళ్లడానికి కూడా అనువుగా ఉంటాయి.ఉదయం బ్రేక్ఫాస్ట్లో రెండు తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. -
ఊరూరా ఉపాధికి బాటలు
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థాయిలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఊరూరా ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. ఈ తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ఉంటే.. మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని ఆధునికీకరించేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ‘వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రోడక్ట్’ కింద జిల్లాకో ఉత్పత్తిని ఎంపిక చేసి.. ఆ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్ప్రైజస్ (పీఎం ఎఫ్ఎంఈ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఆర్థిక చేయూత ఇస్తున్నాయి. 2021లో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.460 కోట్ల ఆర్థిక చేయూతతో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక చేయూత అందింది. రూ.10 లక్షల వరకు చేయూత వ్యక్తిగత కేటగిరీతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు (ఎఫ్పీఓ), ఉత్పత్తిదారుల సంఘాలు (పీఓ), స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణ అనుసంధాన గ్రాంట్ మంజూరు చేశారు. పచ్చళ్లు, తినుబండారాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే ఎస్హెచ్జీల్లోని çసభ్యులకు రూ.40 వేల వరకు సీడ్ క్యాపిటల్ కింద అందించారు. వ్యక్తిగత కేటగిరీలో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందించారు. ఇందులో 10 శాతం లబ్దిదారు భరిస్తే మిగిలిన 55 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించారు. కల్పించిన సౌకర్యాలివే.. ఈ స్కీమ్ కింద పొందే రుణాలతో కామన్ ప్రోసెసింగ్ ఫెసిలిటీ కింద వ్యవసాయ ఉత్పత్తులను సారి్టంగ్, గ్రేడింగ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతోపాటు ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్, ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా 9 కేటగిరీల్లో ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, ఆహార ప్రమాణాలు, నిబంధనలు, ఫుడ్ లైసెన్సింగ్ వంటి వాటిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మనుగడలో ఉన్న పరిశ్రమల క్రమబద్దీకరణతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్లో శిక్షణ, రిటైల్ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో చేయూత ఇచ్చారు. బ్రాండింగ్ ఉత్పత్తుల ద్వారా మెరుగైన వాణిజ్యానికి సహకారం అందించారు. యంత్రాలు కొన్నాం మాది గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్. మసాలా దినుసులు తయారు చేస్తాం. పరిశ్రమను విస్తరించాలనుకున్నాం. కరోనా వల్ల వెనక్కి తగ్గాం. ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులొచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పారు. దగ్గరుండి దరఖాస్తు చేయించారు. 35 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నాం. కొత్త యంత్రాలు కొనుగోలు చేశా. వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడింది. – బలుసు వీణ, గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్, కడప జీడిపప్పు వ్యాపారానికి చేయూత కొన్నేళ్లుగా జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మెషినరీ కొనుగోలు కోసం ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో రూ.7.50 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మెషినరీ కొనుగోలుకు ఉపయోగపడింది. – మణిదేవి, వజ్జిలపేట, తూర్పు గోదావరి జిల్లా పప్పు పరిశ్రమకు విస్తరించాం పప్పు ప్రోసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తాం. వ్యాపారం విస్తరించుకోవాలని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. పీఎంఎఫ్ఎ స్కీమ్ కింద దరఖాస్తు చేశాం. రూ.28 లక్షల రుణమిచ్చారు. మెషినరీ కొనుగోలుతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగాం. – జోడు లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు -
ఫుడ్ ప్రాసెసింగ్కు జీఐఎస్ బూస్ట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమల హబ్గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పాడి, మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఆహారశుద్ధిలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలనిస్తోంది. గతేడాది విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్(జీఐఎస్)లో జరిగిన మెజార్టీ ఒప్పందాలు ఏడాది తిరగకుండానే కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ సదస్సులో రూ.5,765 కోట్ల విలువైన 33 ఒప్పందాలు జరగ్గా, వీటి ద్వారా ప్రత్యక్షంగా 12,600 మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేశారు. ఇప్పటికే వీటిలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో ఏటా 11.90 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు మేజర్ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా పరోక్షంగా 5,380 మందికి ఉపాధి లభిస్తుండగా, 23 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది. మరొక వైపు రూ.2,227 కోట్ల విలువైన మరో ఆరు పరిశ్రమలు శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అధికారులు వేగంగా అనుమతులు మంజూరు చేయడం వల్ల జీఐఎస్ ఒప్పందాల్లో 60 శాతం పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలివే.. ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రూ.1,350 కోట్ల పెట్టుబడితో నాలుగు భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ► అనా ఓలీయో ప్రైవేట్ లిమిటెట్ సంస్థ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 1,000 టన్నుల సామర్థ్యంతో పామ్ ఆయిల్, రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో సన్ఫ్లవర్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా 2,100 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోంది. ► డీపీ కోకోవా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతిలోని శ్రీసిటీ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో కోకో బట్టర్, ఫౌడర్, మాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఏటా 40 వేల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ► గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఏడాదికి 4.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,150 మందికి ఉపాధి కల్పిస్తోంది. ► గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద రూ.100 కోట్లతో ఎడిబుల్ ఆయిల్ రిఫనరీ అండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్తో పాటు రోజుకు 200 టన్నుల సామర్థ్యంతో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ ద్వారా 1,130 మందికి ఉపాధి కల్పించగా, 5 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. నిర్మాణ దశలో ఉన్నవి ఇవీ.. తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో రూ.2227 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఆరు పరిశ్రమలకు భూమిపూజ జరగ్గా, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏటా 3,39,300 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలతో 2,180 మందికి ఉపాధి లభించనుండగా, 24,100 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ► మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ తిరుపతి శ్రీసిటీ వద్ద రూ.1,600 కోట్ల పెట్టుబడితో చాక్లెట్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కాడ్బరీ, టాంగ్, బోర్నవిటా, ఒరియా, ఫైవ్స్టార్ వంటివి ఈ కంపెనీ ఉత్పత్తులే. ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవాను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది. ► సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజస్ కంపెనీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కువ్వకొల్లి గ్రామం వద్ద రూ.400 కోట్ల పెట్టుబడితో భారీ ఇన్స్టెంట్ కాఫీ యూనిట్కు శంకుస్థాపన చేసింది. ఏటా 16వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కాబోతున్న ఈ పరిశ్రమ ద్వారా 950 మందికి ఉపాధి కల్పించనుండగా, 2,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► శ్రీ వెంకటేశ్వర బయోటెక్ కంపెనీ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొమ్మూరు వద్ద రూ.144 కోట్లతో రోజుకు 400 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొక్కజొన్న పిండి తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 310 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద ఒరిల్ ఫుడ్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ఇన్స్టంట్ విజిటబుల్ చట్నీస్ యూనిట్కు శంకుస్థాపన చేసింది. ఏటా 7,500 టన్నుల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తూ రెడీమేడ్ చట్నీలు తయారు చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 175 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లతో అనకాపల్లి జిల్లా కొండవాటిపూడి వద్ద కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఏటా వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి కల్పించనుండగా, వెయ్యి మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొనాడ వద్ద బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.13 కోట్ల పెట్టుబడితో పొటాట చిప్స్, పాస్తా, నూడిల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఏటా 3,600 టన్నుల గోధుములు, 480 టన్నుల మిల్లెట్స్, 720 టన్నుల పొటాటో ప్రాసెస్ చేయనుంది. 45 మందికి ఉపాధి లభించనుండగా, 100 రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా జీఐఎస్లో జరిగిన మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం
ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం. (చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ ) -
కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు..
ఉదయం నుంచి రాత్రి వరకు కావాల్సిన రుచులను తయారు చేసుకోవడంలో ఈ న్యూ టెక్నాలజీ బర్నర్ భలే చక్కగా పనిచేస్తుంది. ఇది సౌకర్యవంతమైనదే కాదు.. సురక్షితమైనది కూడా. సాధారణ హాట్ ప్లేట్ బర్నర్తో పోలిస్తే ఇది ఫార్–ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అసెంబ్లింగ్ టెక్నాలజీతో తరచుగా ఉపయోగించడానికి, ఉష్టోగ్రతను తట్టుకునేందుకు వీలుగా రూపొందింది. ఐరన్ పాన్, స్టెయిన్ లెస్ స్టీల్, సిరామిక్, అల్యూమినియం.. ఇలా అన్ని రకాల పాత్రలనూ దీనిపై పెట్టి, కావల్సిన వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. ఈ బర్నర్ చాలా తేలిగ్గా ఉండటంతో.. క్యాంపింగ్లకు తీసుకుని వెళ్లడం, చిన్నగా ఉండటంతో.. వంటగదిలో స్టోర్ చెయ్యడమూ చాలా ఈజీ. అలాగే కుకింగ్ బౌల్స్ ఉంచే క్రిస్టల్ గ్లాస్ ప్లేట్ను తడి వస్త్రంతో క్లీన్ చేయొచ్చు. వేరియబుల్ హీట్ సెట్టింగ్స్ కలిగిన ఈ గాడ్జెట్పైన ఫ్రై, డీప్ ఫ్రై, బాయిలింగ్, కుకింగ్ ఇలా చాలానే చేసుకోవచ్చు. హైక్వాలిటీ టెక్నాలజీ కారణంగా ఎలాంటి ప్రమాదాలూ తలెత్తవు. ఇదే మోడల్లో రెండు మూడు బర్నర్స్ ఉన్న డివైస్లు కూడా మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. అయితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: Dried Prawns Pickle Recipe: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు! ) -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి
-
పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు -
ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. 90, 700 వందల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ► అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా ►తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్లామ్ సౌత్ ప్రాజెక్టు ►బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద రూ.225 కోట్లతో శ్రావణి బయో ఫ్యూయల్ ►శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్ ►తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్ ►శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ ►శ్రీసత్యసాయి జిల్లా మడక శిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ -
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!
సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్ అప్గ్రేడ్ చేయడం, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్గా మార్కెట్లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం.. వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ప్రాసెసింగ్ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుములు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. వారసత్వ సంపదగా గుర్తింపు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం. – కేజే మారుతి, ఏపీ ఫుడ్ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ -
సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత
సాక్షి. అమరావతి: రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు అటు రైతులను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేయడం, ఇటు యువతకు ఉపాధి కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. రాష్ట్ర ప్రగతికి తోడ్పడే ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. 35 శాతం సబ్సిడీతోపాటు కేవలం 6 శాతం వడ్డీకే రుణాలు లభించేలా ఏర్పాట్లు చేసింది. ఈ యూనిట్లకు రుణాలిచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ఈమేరకు మంగళవారం సచివాలయంలో ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) వి.హేమ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ. 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు ఈ ప్రాజెక్టు కింద రూ.10లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 35 శాతం సబ్సిడీపై ఎస్బీఐ రుణం మంజూరు చేస్తుంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి అంచనా వ్యయంతో పెట్టే యూనిట్లకు మాత్రం పూచీకత్తుతో రుణాలు మంజూరు చేస్తారు. సబ్సిడీ 35 శాతం లేదా గరిష్టంగా రూ.10 లక్షలుగా నిర్ణయించారు. తాజా ఒప్పందం ద్వారా కనీసం 7,500 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఆధునికీకరణ, స్థాపనకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కుల, మత, లింగ భేదాల్లేకుండా 18 ఏళ్లు పైబడిన వారెవరైనా వ్యక్తిగత యూనిట్లు పెట్టుకోవచ్చు. యూనిట్ వ్యయంలో లబ్దిదారులు 10 శాతం వాటాగా భరిస్తే తొలుత 90 శాతం రుణంగా ఎస్బీఐ మంజూరు చేస్తుంది. రుణ ప్రక్రియ పూర్తి కాగానే ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీ జమ చేస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఎఐఎఫ్) కింద అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే 6 శాతం వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయి. అంతేకాదు యూనిట్ ప్రారంభ దశలో 3 నెలలపాటు మారటోరియం వ్యవధి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద వ్యక్తిగతంగానే కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూడా సూక్ష్మ ఆహార శుద్ధి ప్రాజెక్టుల విస్తరణకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా అనకాపల్లి బెల్లం, గువ్వలచెరువు పాలకోవా, మాడుగుల హల్వా వంటి సంప్రదాయ ఆహార క్లస్టర్లలోని మైక్రో ప్రాసెసింగ్ యూనిట్లను అత్యాధునిక యంత్రాలతో అప్గ్రేడ్ చేయవచ్చు. గతేడాది రూ.8 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటైన 500 యూనిట్లకు 55 శాతం సబ్సిడీపై ఎస్బీఐ ఆర్థిక చేయూతనిచ్చి ంది. ఆహారశుద్ధి పరిశ్రమల విస్తరణ మరింత వేగం: చిరంజీవి చౌదరి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చిరంజీవి చౌదరి చెప్పారు. ఇటీవలే సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు ఆరి్ధక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పుడు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఎస్బీఐతో కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరం 500 యూనిట్లకు రుణాలిచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు పెద్ద ఎత్తున యూనిట్ల విస్తరణకు ప్రధాన రుణభాగస్వామిగా ఉద్భవించడం శుభపరిణామమన్నారు. పూచీకత్తు లేకుండా రూ.10లక్షల వరకు రుణాలిస్తామని ఎస్బీఐ డీజీఎం హేమ చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో ఏర్పాటయ్యే యూనిట్లకు మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డిప్యూటీ సీఈవో ఈ.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరింత లాభసాటిగా వ్యవసాయం
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండటంతో రైతులకు మరింత ఆదాయం సమకూర్చడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఓవైపు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇంధన తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో బయో ఇథనాల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. బయో ఇథనాల్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో అస్సాగో యూనిట్కు స్వయంగా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా క్రిభ్కో, డాల్వకోట్ యూనిట్లకు వర్చువల్గా శంకుస్థాపనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే అస్సాగో, క్రిభ్కో, అవేశా ఫుడ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్, చోడవరం షుగర్స్, రోచే గ్రీన్ ఆగ్రో, నితిన్సాయి, గ్రేస్ వెంచర్స్ వంటి 20కిపైగా సంస్థలు రాష్ట్రంలో రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ యూనిట్ల అన్నింటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిపి చూస్తే రోజుకు 5,000 కిలో లీటర్లకు పైగా బయో ఇథనాల్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది దేశంలోనే అత్యధికమని చెబుతున్నాయి. –సాక్షి, అమరావతి పెట్టుబడుల ఆకర్షణ.. రాష్ట్రంలో రైతులు ధాన్యం, మొక్కజొన్నలను అత్యధికంగా సాగు చేస్తుండటమే కాకుండా భారీగా ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ఇథనాల్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 13 మిలియన్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అలాగే మూడు మిలియన్ టన్నులకు పైగా మొక్కజొన్న ఉత్పత్తి అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 6 మిలియన్ టన్నుల బియ్యం (నాన్ బాస్మతి), ఒక మిలియన్ టన్ను మొక్కజొన్నను ఎగుమతి చేశారు. మిగులు ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్ను తయారు చేయడానికి కేంద్రం అనుమతించడంతో పెట్టుబడిదారుల చూపు మనరాష్ట్రంపై పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తోంది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో వ్యవసాయం నుంచి ఇంధన తయారీకి హబ్గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం.. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను మిశ్రమం చేయడానికి 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్లు అవసరమవుతుందని అంచనా. ఇథనాల్ కలపడాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతిఆయోగ్ అంచనా. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 16 కోట్ల లీటర్ల పెట్రోల్ను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. క్లీన్ ఎనర్జీకి పెద్దపీట.. పర్యావరణహిత క్లీన్ ఎనర్జీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, బయో ఇథనాల్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో 20కుపైగా ఇథనాల్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. – ప్రవీణ్ కుమార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ–ఎండీ, ఏపీఈడీబీ సీఈవో -
రైతులకు చేయూత.. మహిళలకు ఉపాధి
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటాలతో పాటు కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. పొదుపు సంఘాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుచేయనుంది. వీటికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొ చ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)తో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఎపీఎఫ్పీఎస్) నేడు (సోమవారం) అవగాహనా ఒప్పందం చేసుకోబోతుంది. తొలిసారి కర్నూలు జిల్లాలో ఏర్పాటు.. ఉల్లి, టమాటా రైతుల వెతలు తీర్చేందుకు ఏపీఎఫ్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారి కర్నూలు జిల్లాలో రూ.కోటి అంచనాతో 100 సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటుచేశారు. రూ.లక్ష అంచనా వ్యయంతో కూడిన ఈ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 35% సబ్సిడీతో వీటిని మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ ఆరు టన్నుల చొప్పున ఏటా 7.200 వేల టన్నుల ఉల్లి, టమాటాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కల్గిన ఈ యూనిట్ల 100 మందికి ఉపాధి లభిస్తుండగా, ఆయా ప్రాంతాలకు చెందిన 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరుతోంది. వీటిని ఇటీవలే సీఎం జగన్ ప్రారంభించారు. ఇంట్లోనే ఏర్పాటుచేసుకునే ఈ యూనిట్ల ద్వారా ప్రతీనెలా రూ.12వేల నుంచి రూ.18వేల వరకు అదనపు ఆదాయాన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల యూనిట్లు మంజూరుచేయాలని సంకల్పించింది. బీఓబీ ఆర్థిక చేయూత.. మరోవైపు.. ఈ సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల విస్తరణ పథకానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొ చ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీపై వీటిని మంజూరు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో రూ.లక్ష అంచనాతో ఒక్కో యూనిట్ ఏర్పాటుచేయగా, ఇక నుంచి రూ.2లక్షల అంచనా వ్యయంతో రెట్టింపు సామర్థ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు వె చ్చిస్తున్నారు. ఈ మొత్తంలో రూ.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చుచేయనుండగా, లబ్దిదారులు తమ వాటాగా రూ.10కోట్లు భరించాల్సి ఉంటుంది. రూ.65 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక చేయూతనిస్తోంది. ఇక బీఓబీ–ఏపీఎఫ్పీఎస్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు నేడు అవగాహనా ఒప్పందం చేసుకోబోతున్నాయి. -
కళ్లేపల్లిరేగలో చిరుధాన్యాల ప్రోసెసింగ్ ప్లాంట్ ప్రారంభం
-
11 ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్ గా సీఎం వైఎస్ జగన్ శ్రీకారం
-
రైతుకు మరింత రొఖ్ఖం!
ప్రారంభమైన ఎఫ్పీవోలు ► చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పండ్లు, కూరగాయల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం. ► విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం రేగ గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం. ► కర్నూలు జిల్లా తడకనపల్లెలో 100 మైక్రో యూనిట్స్తో ఆనియన్, టమాటా సోలార్ డీ హైడ్రేషన్ క్లస్టర్ ప్రారంభం. వీటికి సీఎం శంకుస్థాపన ► తిరుపతి జిల్లా శ్రీసిటీలో మోన్ డ లీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్కు శంకుస్థాపన. ► శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గ్రౌండ్నట్ ప్రాసెసింగ్ యూనిట్కు భూమిపూజ. ► అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాల్లో మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన. సాక్షి, అమరావతి: రైతన్నలు పండించే పంటలకు మరింత మెరుగైన ధరలను కల్పించే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆర్బీకేల స్థాయిలో ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, జిల్లా స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటి వల్ల రైతులు పండించిన పంటలకు మరింత విలువ తోడై మెరుగైన ధర లభిస్తుందన్నారు. గత నాలుగేళ్లలో పంటలు ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్ జోక్యం ద్వారా రూ.8,000 కోట్లతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పంటలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించిందని తెలిపారు. చిరుధాన్యాలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు (ఎఫ్పీవోలు) వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆర్బీకేల స్థాయిలో అనుసంధానం.. ఇవాళ 421 ప్రైమరీ ప్రాసెసింగ్ కలెక్షన్ సెంటర్లను ప్రారంభించుకున్నాం. ఇవన్నీ 1,912 ఆర్బీకేలతో మ్యాపింగ్ చేసినవి. మొత్తం 945 కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తొలిదశలో 344 కోల్డ్ రూమ్ల పనులు జరుగుతుండగా 43 కోల్డ్ రూమ్లను ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇవి 194 ఆర్బీకేలతో అనుసంధానమయ్యాయి. ప్రతి ఆర్బీకేను కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్లకు మ్యాపింగ్ చేస్తూ ప్రైమరీ ప్రాసెసింగ్లో డ్రయ్యింగ్ ప్లాట్ఫామ్లు, కలెక్షన్ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు లాంటి వాటిని రైతు భరోసా కేంద్రం పరిధిలోకి తేవాలి. గ్రేడింగ్, సెగ్రిగేషన్ లాంటివి ఆ స్ధాయిలో జరిగితే సెకండరీ ప్రాసెసింగ్ జిల్లా స్థాయిలో చేపట్టేలా అడుగులు పడుతున్నాయి. పోటీ పెంచేలా మద్దతు ధరల ప్రదర్శన రైతులు పండించిన ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర కల్పిస్తూ ఆర్బీకేలలో పోస్టర్ల ద్వారా ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్లో పోటీ నెలకొనేలా చర్యలు తీసుకున్నాం. ఏదైనా పంటకు ధరలు పడిపోతే సంబంధిత ఆర్బీకే స్థాయిలోనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నాం. ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇందుకు ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులన్నింటితో రైతు తాను పండించే పంటకు ఇంకా మెరుగైన రేటు పొందే పరిస్థితి వస్తుంది. మార్కెట్లో రైతులకు మద్దతు ధరలు తగ్గిన ప్రతిసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టి తోడుగా నిలుస్తున్నాం. ఆర్బీకేలో ప్రదర్శించే రేటు కన్నా రైతులకు ఎక్కడైనా తక్కువ ధర వస్తుంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ పంటలను సేకరిస్తుంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఏటా రూ.3 వేల కోట్లు కేటాయిస్తూ నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం దాదాపు రూ.8 వేల కోట్లు వెచ్చించాం. ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం శ్రీసిటీలో మరో రూ.1,600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం ఆనందాన్ని కలిగిస్తోంది. ‘మోన్ డ లీజ్’ కంపెనీ రెండో విడతలో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. చాక్లెట్, క్యాడ్బరి, బోర్న్వీటా లాంటివి తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెంది మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. ధర్మవరం వేరుశెనగ రైతులకు లబ్ధి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో వేరుశెనగ పంటకు మరింత విలువ పెరిగి స్థానిక రైతన్నలకు ప్రయోజనం చేకూరుతుంది. వేరుశెనగ రైతులకు మెరుగైన ధరలు ఇవ్వగలిగే పరిస్థితి రావాలని ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించాం. రూ.75 కోట్లతో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ ధర్మవరంలో ఏర్పాటవుతోంది. 55,620 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్ 15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా వేరుశెనగ పంట నుంచి చిక్కీ, వేరుశెనగ నూనె, పీనట్ బటర్ లాంటి ఉప ఉత్పత్తులు తయారై పంటకు మార్కెటింగ్ పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా రైతన్నలకు చాలా మేలు జరుగుతుంది. రెండు జిల్లాల్లో 4 ఎఫ్పీవోలు ఇవాళ చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తున్నాం. దాదాపు 14,400 మెట్రిక్ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రావడం ద్వారా మార్కెటింగ్ సౌకర్యం పెరిగి రైతులకు మంచి ధరలు లభిస్తాయి. విజయనగరంలో మిల్లెట్స్ ప్రాసెసింగ్ మిల్లెట్స్లో దాదాపు 13 సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 32 పైచిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్ మిల్లెట్ యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిల్లెట్స్కు కూడా ఎంఎస్పీ అందిస్తోంది మన రాష్ట్రంలోనే. మిల్లెట్స్ రేటు పడిపోతే జోక్యం చేసుకుని కొర్రలు లాంటి చిరుధాన్యాలకు ఎంఎస్పీ అందించాం. విజయనగరంలో 7,200 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ రావడం వల్ల ఈ ప్రాంతంలో రైతులకు మంచి జరుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. కర్నూలు ఉల్లి రైతన్నకు ఆదాయాన్నిచ్చేలా కర్నూలులో ఆనియన్ డీహైడ్రేషన్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నాం. రూ.లక్ష పెట్టుబడితో ప్రతి ఒక్కరికి దాదాపు రూ.12 వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిది. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతాం. 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నాం. దీనివల్ల టమాటా రైతులందరికీ మంచి జరుగుతుంది. 250 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో టమాటా రైతుల ఇబ్బందులు తీరతాయి. మార్కెట్లో ధరలు పడిపోయినా అయినకాడికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ధరలకు విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. చిరుధాన్యాల రైతులకు లబ్ధి నాబార్డు సహకారంతో చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1,500 మంది సభ్యులున్నారు. ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో సీఎం జగన్ మా కష్టాలు తీర్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రూ.4 కోట్ల విలువైన యూనిట్ను ఏర్పాటు చేయడంతో నేరుగా 30 మంది ఉపాధి పొందుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 10 వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. సచివాలయ వ్యవస్థ చక్కగా పని చేస్తోంది. – సరస్వతి, సీఈవో, ఆరోగ్య మిల్లెట్స్ ఎఫ్పీవో, విజయనగరం జిల్లా సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం గత 30 – 35 ఏళ్లుగా రైతులతో కలిసి పనిచేస్తున్నాం. రైతులతో కలిసి ‘ధరణి’ ఎఫ్పీవోని ప్రమోట్ చేస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయాన్ని, మిల్లెట్స్ను ప్రోత్సహిస్తున్నాం. మేం నెలకొల్పిన సొసైటీలో 2 వేల మందికి పైగా రైతులున్నారు. 115 ఉత్పత్తులను తయారు చేసి 500 రీటెయిలర్స్ ద్వారా 13 రాష్ట్రాలలో వ్యాపారం చేస్తున్నాం. సేంద్రీయ కూరగాయలు, పండ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పుడు మాకు అవకాశం లభించింది. – మేరి, కో ఫౌండర్, ద టింబక్తు కలెక్టివ్, అనంతపురం జిల్లా నేరుగా పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ పలమనేరులో కూరగాయలు పండించే రైతులతో నాబార్డు సహకారంతో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రైతులు పండించే కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్ చేసి కార్పొరేట్ సంస్థలకు అందించే మా ఎఫ్పీవోను గుర్తించి ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 కోట్లతో మిషనరీ, కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. 720 మంది రైతులు ఈ యూనిట్ను వినియోగించుకుని దళారీలతో సంబంధం లేకుండా నేరుగా తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకుంటున్నారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. దాదాపు 1000 మంది రైతులు దీనిని వినియోగించుకుని లబ్ధిపొందుతున్నారు. – హరిబాబు, పలమనేరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీఈవో -
ఆహార శుద్ధి పరిశ్రమలకు శ్రీకారం
-
ఫుడ్ ప్రాసెసింగ్కు రాష్ట్రం గమ్యస్థానం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో రాష్ట్రం విప్లవాత్మక పురోగతి సాధించడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సాధించిన ఐదు విప్లవాలతో అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తుండటంతో రైతులు, ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు, రిటైల్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన లులు గ్రూప్ తెలంగాణలో రూ. 3,650 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సోమవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ యూసుఫాలీ ఎంఏ స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం రెట్టింపైందని, జీఎస్డీపీలోనూ భారీగా వృద్ధిరేటు నమోదైందన్నారు. నాలుగేళ్ల రికార్డు సమయంలో కాళేశ్వరాన్ని ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 90 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి వరి దిగుబడి 68 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ప్రస్తుతం 3.5 కోట్ల టన్నులకు చేరిందని చెప్పారు. తెలంగాణ బియ్యం కోసం కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్య, మాంసం, పాడి , పామాయిల్ విప్లవాలు సాధించడంతో రైతులకు ఆదాయం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోజుకు ఐదు లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే మెగా డెయిరీని రూ. 300 కోట్లతో ఈ ఏడాది ఆగస్టులో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10 వేల ఎకరాల్లో ప్ర త్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో ముందుకొస్తే స్థలం కేటాయించేందుకు సిద్ధమని యూసుఫాలీకి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో లులు పెట్టుబడులు రూ. 3,650 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా పనిచేస్తున్న తాము తెలంగాణలో రూ. 3,650 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సీఎండీ యూసుఫాలీ ఎంఏ ప్రకటించా రు. తొలివిడతలో రూ. 500 కోట్ల మేర పెట్టుబడి పెడుతుండగా ఇందులో రూ. 300 కోట్లతో కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన మాల్ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మరో రూ. 200 కోట్లతో చెంగిచెర్లలో రోజుకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2,500 మందికి ఉపాధి కల్పించేలా ఆధునిక ఇంటిగ్రేటెడ్ మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 18 నెలల్లో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లులు గ్రూప్ ద్వారా తెలంగాణలో రూ. 3,150 కోట్ల కొత్త పెట్టుబడులు వస్తాయని, రూ. 2 వేల కోట్లతో హైదరాబాద్లో డెస్టినేషన్ షాపింగ్మాల్, రూ.వెయ్యి కోట్లతో ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో మినీమాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ నుంచి 5 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుతోపాటు ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేస్తా మని యూసుఫాలీ ప్రకటించారు. సమా వేశంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక కార్యదర్శి అధర్ సిన్హా, టీఎస్ఐఐసీ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
18 దేశాల్లో పేదల ఆకలి తీర్చిన భారత్
న్యూఢిల్లీ: పంచ ఆహార ప్ర వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్కు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించారు. జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచి్చన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో 18 దేశాలకు భారత్ 10.8 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, పేద ప్రజల ఆకలి తీర్చిందని కొనియాడారు. ఇటీవలి కాలంలో తృణధాన్యాల సాగుకు భారత్ అధిక ప్రాధాన్యం వేస్తుండడం ప్రశంసనీయమని చెప్పారు. ఆహార ఉత్పత్తి విషయంలో భారత్ ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం ‘గ్లోబల్ సౌత్’లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని అల్వారో లారియో వివరించారు. వాతావరణ మార్పులు విపరీత ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాల సాగు చేపట్టడం రైతులకు లాభదాయకమని సూచించారు. కరువులను తట్టుకొనే శక్తి తృణధాన్యాలకు ఉందన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. -
IWD2023: విలేజ్వనిత ఘనత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మహిళలు రూట్ మార్చారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు.‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ వీరికి చేదోడుగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న మహిళలు తాము ఆదాయాన్ని పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో స్టార్టప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కింద విలేజ్ ఆర్గనైజేషన్స్ (గ్రామ సంస్థలు)లో ఈ ‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ ఏర్పాటవుతున్నాయి. ఒక్కో విలేజ్ ఆర్గనైజేషన్లో 5–8 దాకా మోడల్ ఎంటర్ప్రైజెస్ ఉంటున్నాయి. గత రెండేళ్లలో 1.70 లక్షలకు పైగా మోడల్ ఎంటర్ప్రెజెస్ను ప్రమోట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద కూడా గ్రామ ప్రాంతాల్లో స్టార్టప్ ప్రమోషన్, ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్, ధాన్యం సేకరణ, తదితరాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. స్వయం సహాయక బృందాల్లో (ఎస్హెచ్జీల) సభ్యులుగా ఉంటున్న మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. 2022–23లో ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాయి. కమీషన్ల రూపంలో రూ.64 కోట్ల మేర ఆదాయం పొందాయి. నాడు వ్యవసాయ కూలీ.. ♦ మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన పండ్ల శ్రీలత స్కూల్ స్థాయిలోనే చదువు మానేశారు. వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె.. శ్రీరామ విలేజ్ ఆర్గనైజేషన్లోని ఝాన్సీ ఎస్హెచ్జీలో సభ్యురాలు. ప్రస్తుతం భీమారంలోనే ఆదివాసీ విస్తరాకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా.. బ్యాంకులు, ఇతర రూపాల్లో అందిన రుణాలతో మోదుగ, అడ్డాకులతో పర్యావరణహిత టేబుల్ ప్లేట్లు, బఫె ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, దొప్పలు తయారీకి సంబంధించి సొంత మెషిన్లను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలత, ఆమె భర్త, పిల్లలు ఈ యూనిట్లోనే పనిచేస్తున్నారు. మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. తాము ఆదాయం పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. బిస్కెట్ల యూనిట్తో భరోసా.. ♦ వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన కొడంగల్ హజీరా బేగం గతంలోనే మహబూబ్ సుభానీ ఎస్హెచ్జీలో చేరారు. తర్వా త బిస్కెట్ల తయారీ, మార్కెటింగ్ యూనిట్ వైపు మళ్లారు. బ్యాంకులు, స్త్రీనిధి, ఇతర రూపాల్లో ఆర్థిక సహకారం అందడంతో బేకరీ ఉత్పత్తులతో పాటు పలురకాల తినుబండారాలు తయారు చేస్తూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారు. వివిధ రకాల బిస్కెట్లు, బ్రెడ్డు, బన్ను, టోస్టులు, ఎగ్, కర్రీ పఫ్లు విక్రయిస్తున్నారు. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాపారంలో నిమగ్నం కావడంతో పాటు మరో ఐదుగురు పనివారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్టఫికెట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టఫికెట్ పొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా ఆదాయం మిగులుతోంది. అవుషా ఫుడ్స్ అదుర్స్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన 18 మంది మహిళా సభ్యులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్గా ఏర్పడి ఎన్ఐఆర్డీలోని రూరల్ టెక్నాలజీ పార్క్లో శిక్షణ అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పా టు చేశారు. తమ తమ సంఘాల నుంచి రుణ రూపేణా తీసుకున్న మొత్తంతో ఆహార భద్రత, ప్రమా ణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ పొంది అవుషా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కారంపొడి, పసుపు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కోల్డ్ప్రెస్డ్ నూనెలు, రాగి, జొన్న ఇతర పిండి పదార్థాలు కలిపి మొత్తం 41 వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్ నెలవారీ టర్నోవర్ రూ.3 లక్షలుగా ఉంది. గ్రూపులోని మహిళలంతా సొంతకాళ్లపై నిలబడడమే కాకుండా ఎస్హెచ్జీలకు చెందిన మరో పది మంది మహిళలకు నెలకు రూ. 4 వేల చొప్పున ఉపాధి కల్పి స్తున్నారు. ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షలకు పైగా ఎంటర్ప్రెజెస్ ప్రమోట్ చేశాం. వాళ్లకు రూ.75 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫండింగ్ సపోర్ట్ కల్పించాం. బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందిన రుణాలను ఈ ఔత్సాహిక మహిళలు తమ తమ యూనిట్లతో పొందే ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్హెచ్జీ బృందాల్లోని ఉత్సాహవంతులు, సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారిని బ్యాంక్లతో టయ్యప్ చేయిస్తాం. 2021–22లో దీనిని మొదలు పెట్టాం. ఆ ఏడాది 65 వేల దాకా ఎంటర్ప్రెజెస్ గ్రౌండ్ చేశాం. 2022–23లో 1.34 లక్షలు టార్గెట్గా పెట్టుకుని 1.10 లక్షల దాకా సాధించాం. – రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) అధికారులు -
ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా రాష్ట్రం
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ఆవిర్భవిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో రూ.450 కోట్ల పెట్టుబడితో 59 ఎకరాల్లో ఐటీసీ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని పరిశ్రమ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్పూరితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ భవిష్యత్లో మరో రూ.350 కోట్లు వెచ్చించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కంపెనీలో తయారు చేసే చిప్స్, బిస్కెట్ల కోసం ఆలుగడ్డలు, గోధుమలను ఇక్కడే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం స్థానిక రైతులను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్ను తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనితో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని, మిషన్ కాకతీయ ద్వా రా 46 వేల చెరువులను బాగు చేశామని వివరించారు. పాడిపంటలతోనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్: పాడి అభివృద్ధికి కృషి చేయడంతో పాటు విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తులను కూడా పెంపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కోసం ప్రత్యేకంగా సెజ్ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ఇక్కడ ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు స్థానికులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలతాశేఖర్ గౌడ్, సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే రుణాలివ్వండి
సాక్షి, అమరావతి: మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అర్హత నిబంధనలను సడలించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆ యూనిట్లు స్థాపించే వారికి బ్యాంకులు వీలైనంత త్వరగా రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన బ్యాంకర్ల ఉప కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం నిబంధనల సడలింపు, రుణాల మంజూరుకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఈ పథకం కింద ఎక్కువ మంది సాధారణ వ్యక్తులే యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకుంటారని, వారు ఐటీ చెల్లింపుదారులుగా ఉండబోరని, అందువల్ల ఐటీ రిటర్న్ల కోసం బ్యాంకులు ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులకు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల పేరుతో ఒత్తిడి తేవద్దు రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు 400 దరఖాస్తులు బ్యాంకులు వద్ద ఉన్నాయని, వెంటనే వాటన్నింటినీ పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బ్యాంకులకు సూచించారు. లబ్ధిదారుడు ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు సాధ్యత ఉంటే వెంటనే రుణం మంజూరు చేయాలని ఏజీఎం సూచించారు. బ్యాంకు బ్రాంచీల స్థాయిలో దరఖాస్తులను తిరస్కరించవద్దని, పథకానికి సంబంధించి జిల్లా సమన్వయ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు సమయంలో మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ల పేరుతో ఒత్తిడి తేవద్దని, బ్యాంకు నిబంధనల మేరకే అవసరమైన డాక్యుమెంట్లనే తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్కు సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్, డాక్యుమెంటేషన్, బ్యాంకు రుణం పొందడంలో సహాయంతో సహా హ్యాండ్ హోల్డింగ్ మద్దతును అందించడానికి ప్రతి జిల్లాకు జిల్లా రిసోర్స్ పర్సన్లు ఉన్నారని, రుణాలు మంజూరులో వారిని భాగస్వామ్యం చేయాలని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండినవారు అర్హులు కేంద్రం ఇటీవల అర్హత నిబంధనలు సడలించిన మేరకు 18 సంవత్సరాలు నిండిన వారు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అర్హులు. అలాగే 8వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను కేంద్రం తొలగించింది. విద్యార్హతతో సంబంధం లేకుండా ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద వ్యక్తిగతంగా యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకునే వారికి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందించడం, ఆ యూనిట్లు సమర్థవంతంగా పనిచేసే విధంగా చేయిపట్టుకుని నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఉన్న వ్యక్తిగత సూక్ష్మ సంస్థల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి, వ్యక్తిగతంగా కొత్త యూనిట్లు స్థాపనకు అవసరమైన మూలధన పెట్టుబడికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ల విస్తరణ, అప్గ్రేడేషన్ లేదా కొత్త యూనిట్ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ప్రాజెక్ట్ వ్యయంలో లబ్ధిదారుల వాటా కనీసం 10 శాతం ఉండాలి. ఈ పథకం కింద, వ్యక్తిగతంగా యూనిట్ల స్థాపనకు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసే యూనిట్లకు గరిష్టంగా రూ. 10 లక్షల పరిమితితో అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు. -
టమాటా రైతుకు దిగుల్లేదిక..
సాక్షి, అమరావతి: టమాటా రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర కంటే అదనపు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 20 టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో నాలుగు యూనిట్లు ఈ నెలాఖరులో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా రాయలసీమ జిల్లాల పరిధిలోనే 56,633 హెక్టార్లు ఉన్నాయి. ఏటా 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు ఆ జిల్లాల నుంచే వస్తోంది. మూడున్నరేళ్లుగా టమాటా రైతుకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని, వ్యాపారులతో పోటీపడి ధర పెరిగేలా చేస్తోంది. దీంతో పాటు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ గ్రీన్స్’ ప్రాజెక్టు కింద రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో 4 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన యూనిట్లను మార్చి కల్లా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనిట్ను ఎకరం విస్తీర్ణంలో రూ.3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గంటకు 1.5 టన్నుల చొప్పున నెలకు 300 టన్నులు, ఏడాదికి 3,600 టన్నుల చొప్పున ప్రాసెస్ చేయనున్నారు. సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్.. ఒక్కో యూనిట్ పరిధిలో కనీసం 250 టన్నులు నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పండ్లు, కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్ చేసి.. అధిక ధరలకు విక్రయించే అవకాశం కలుగనుంది. ఈ రంగంలోని బడా కంపెనీలతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను (ఎఫ్పీవో – ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) అనుసంధానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లీఫ్ అనే కంపెనీతో ఒప్పందం జరిగింది. సాధారణంగా రైతులు తాము పండించిన టమాటాలను మార్కెట్కు తీసుకెళ్లి అమ్మగా వచ్చే ఆదాయంలో రవాణా, కమీషన్ చార్జీల రూపంలో 10–20 శాతం కోల్పోతుంటారు. ఈ యూనిట్ల ఏర్పాటు వల్ల రైతులు ఈ నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు. వీటన్నింటి వల్ల మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా వస్తుంది. దళారుల చేతిలో నష్టపోకుండా అధిక లాభాలను ఆర్జించగలుగుతారు. వీటి నిర్వహణా బాధ్యతలను రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు అప్పగిస్తున్నారు. వచ్చే లాభాలను ఆయా సంఘాల పరిధిలోని రైతులే పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులను ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ.. మార్కెటింగ్ బాధ్యతలను లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ నిర్వహించనున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం ఒక్కో యూనిట్ను ఒక్కో ఎఫ్పీవోకు అప్పగించనుండగా, మొత్తంగా 20 వేల మంది టమాటా రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి దశలో చిత్తూరు జిల్లా అటుకురాళ్లపల్లి, చప్పిడిపల్లె, కమిరెడ్డివారిపల్లితో పాటు అన్నమయ్య జిల్లా తుమ్మనంగుంటలలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 3,300 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇటీవలే ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. రెండో దశలో అన్నమయ్య జిల్లా చెంబకూర్, పోతపొల్లు, చిన్నమండెం, తలవం, ములకల చెరువు, కంభంవారిపల్లె, బి.కొత్తకోట, కలికిరి, చింతపర్తి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా వీ.కోట, పలమనేరు, పుంగనూరు, రాజ్పేట, చెల్దిగనిపల్లి యూనిట్లు మార్చిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దళారుల నుంచి ఉపశమనం ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా దళారుల చేతిలో నష్టపోకుండా టమాటా రైతులు అధిక లాభాలు ఆర్జించే వీలు కలుగుతుంది. రవాణా, కమిషన్ నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా, తమకు గిట్టుబాటైన ధరకు నచ్చిన వారికి అమ్ముకోగలుగుతారు. పైగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటి నిర్వహణా బాధ్యతను కూడా రైతు సంఘాలకే ఇస్తున్నాం. వచ్చే లాభాలు సంఘాలే పొందనున్నాయి. – ఎల్.శ్రీధర్రెడ్డి, సీఈఒ, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కోసం ఎంఎస్ఎంఈని ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: ఆహార ప్రాసెసింగ్ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు కీలకమని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం అవశ్యమని ఉద్ఘాటించారు. పారిశ్రామిక వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించన ఒక కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించడానికి సూక్ష్మ లఘు చిన్న మధ్య (ఎంఎస్ఎంఈ) రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల ఆదాయ పురోగతికే కాకుండా, పోషకాహార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ దిశలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దేశంలో క్రమంగా పురోగతి చెందుతోందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పురోగతికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి అనుసంధానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విభాగం నుంచి భారఎగుమతులు లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫుడ్ వేస్టేజ్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాసెసింగ్ కీలక భూమికను పోషిస్తుందని అన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ఉమ్మడి పోర్టల్
న్యూఢిల్లీ: వ్యవసాయం, ఆహార శుద్ధి శాఖలు అమలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి ఉమ్మడి పోర్టల్.. ఆహార శుద్ధి పరిశ్రమలో సూక్ష్మ యూనిట్లకు మేలు చేస్తుందని కేంద్ర ఆహార శుద్ధి శాఖ ప్రకటించింది. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్వై) పథకాలను ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తాయన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. పీఎంఎఫ్ఎంఈ, పీఎంకేఎస్వై పథకాల కింద అర్హత కలిగిన లబ్ధిదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకితోడు.. 3 శాతం వడ్డీ రాయితీ పొందొచ్చని ఆహార శుద్ధి శాఖ తెలిపింది. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద అందిస్తున్న 35 శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొంది. ఈ రెండు పథకాల కింద ప్రాజెక్టుల ఆమోదానికి దరఖాస్తులను ఏఐఎఫ్ ఎంఐఎస్ పోర్టల్ నుంచి స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్బర్గ్! -
అవిగో..! ఆహారశుద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు నిరంతర డిమాండ్ కల్పించడం ద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో అందుబాటులోకి తెస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచి్చన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిబ్డీ) మంగళవారం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో పనులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మేరకు.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా రూ.3,726.16 కోట్ల అంచనా వ్యయంతో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. తొలిదశలో రూ.1,148.11 కోట్లతో పది పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, రూ.66.92 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. రెండో దశలో రూ.2,511.13 కోట్లతో 16 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పంటలను శుద్ధిచేసి అదనపు విలువను జోడించడం, వృథాను తగ్గించడం, ఎగుమతి సామర్థ్యంతో పాటు బేరసారాల శక్తిని పెంపొందించడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించారు. తద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. అవసరమైన ముడి సరుకును రైతులు, రైతు ఉత్పాదకత సంఘాలు, మార్క్ఫెడ్, ఆర్బీకేల ద్వారా సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయగా రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏపీ యూఐఎఎంఎల్)తో పాటు నాబ్కాన్స్ సంస్థలు డీపీఆర్ రూపొందించాయి. 24 యూనిట్లకు భూసేకరణ పూర్తి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 24 యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన 325.39 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తైంది. 23 చోట్ల 295.39 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి ఇప్పటికే అప్పగించారు. 13 మిల్లెట్ యూనిట్ల కోసం 13 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. అంచనా వ్యయంలో 90% రుణంగా సేకరించనుండగా మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. వీటి నిర్వహణకు 118 జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు రూ.1,000 కోట్ల రుణం అందించేందుకు సిబ్డీ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె.ఆదినారాయణ సమక్షంలో ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో శ్రీధర్రెడ్డి, సిబ్డీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.రాజేంద్రప్రసాద్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీయూఐ ఎఎంఎల్ సీనియర్ ఆఫీసర్లు రాహుల్రెడ్డి, సుదీష్ పాల్గొన్నారు. 3.25 శాతం స్వల్ప వడ్డీతో రుణం ఈ ఒప్పందం ప్రకారం 3.25 శాతం వడ్డీతో రూ.1,000 కోట్లను సిబ్డీ రుణంగా అందించనుంది. ఈ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.215 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చనుంది. తొలిదశ యూనిట్ల కోసం నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్లో భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మార్చి కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ ఆర్థిక సాయం కోసం నాబార్డు, అప్కాబ్తో పాటు పలు వాణిజ్య బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం
అడవి నుంచి దూరమయ్యాం.. పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్ రజియా. ఛత్తీస్గడ్లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’ పేరుతో సంస్థను నెలకొల్పి అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు. ‘‘జగ్దల్పూర్లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్లోనూ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్స్టంట్ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గడ్ మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్గడ్లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ ప్రారంభించాను. సవాళ్లను ఎదుర్కొంటూ... ముందు ఈ బిజినెస్కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్ బిజినెస్’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్ ఆఫీసర్ రెండు నెలల ప్రోగ్రామ్కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేర్చుకునేవారికి శిక్షణాలయం బస్తర్ ఫుడ్ ఫర్మ్ని ఇన్స్టిట్యూట్లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్ మోడల్గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను. నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్స్టిట్యూట్ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్ గ్రూప్స్గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా. పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ! ‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్గా ఉన్నాం. నక్సలైట్స్ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’ పల్లెకు–పట్టణానికి వారధి ‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్లో ప్రమోషన్స్ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా? అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల యుఎస్ వెళ్లడానికి ఫెలోషిప్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్పోజర్ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’ – నిర్మలారెడ్డి -
రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్ పార్క్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక యడ్లపాడు స్పైసెస్ పార్కు ప్రస్తుతం రైతులకు మేలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే.. రూ.వంద కోట్ల భారీ కలల ప్రాజెక్టు సాకారమవుతుంది. రైతులు, వ్యాపారులు ఆర్థిక పురోగతి సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా ఎగుమతులు ఊపందుకుంటాయి. యడ్లపాడు: మిరప, పసుపు తదితర పంట ఉత్పత్తులను ముడి రూపంలో ఎగుమతి చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో సుంగంధ ద్రవ్యాల ఆదాయంలో మన వాటాను పెంచుకోవాలంటే మేలు రక వంగడాల ఉత్పత్తితోపాటు పంట దిగుబడులను గ్రేడింగ్ చేసి పొడులు, ఇతరత్రా రూపాల్లో వివిధ సైజుల్లో ప్యాకింగ్ చేస్తే ఎగుమతులు పుంజుకుంటాయి. అందుకే ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లా యడ్లపాడులో దేశంలోనే అతిపెద్ద సుంగంధ ద్రవ్యాల(స్పైసెస్) పార్కును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలో 124.79 ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పార్కును నిర్మించడం విశేషం. వైఎస్సార్ చలువే దేశంలో 6 చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2007లో కేంద్రప్రభుత్వం భావించింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి స్పైసెస్ పార్కు కేటాయించాలని కేంద్రాన్ని పట్టుబట్టారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 60 శాతం ఏపీలోనే.. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుందని, అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి కేంద్రం ఆమోదాన్ని పొందారు. వెనువెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2015లో పార్కు నిర్మాణం పూర్తయింది. పార్కు వల్ల ప్రయోజనాలు ► రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందేందుకు ఎగుమతిదారులతో ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరుచుకోవాలి. దీనికి ఈ పార్కు ఎంతో దోహదపడుతుంది. ► క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ కోసం సాధారణ అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ► నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిర్ధారణకు దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి ధర లభిస్తుంది. ఇంకా ఏమేం వస్తాయి? ► పార్కులో ఇంకా గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ స్టెరిలైజేషన్, స్టీమ్, చిల్లీపౌడర్, చిల్లీపేస్ట్, క్లోనింగ్ ఎక్స్పోర్టుకు కావాల్సిన ప్యాకింగ్ సిస్టం వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ► మిర్చి నుంచి రంగు, ఘాటు వేరు చేసే యూనిట్లు, ఓలియేరేజిన్ వంటివి తయారు చేసేవి, మసాల తయారీ, వివిధ మిర్చి ఉత్పత్తుల యూనిట్లు త్వరలోనే రానున్నాయి. ► ఈ రంగంలో ఇప్పటికే పేరున్న బహుళ జాతి కంపెనీలూ ఇక్కడ సొంత యూనిట్లు ప్రారంభించనున్నాయి. ► చిల్లీ డ్రైయర్స్, లేబొరేటరీస్, వేబ్రిడ్జిలు, బ్యాకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ► మిర్చి, పసుపు అనుబంధన సంస్థలు, కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్పైసెస్ పార్కు అభివృద్ధికి కృషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే స్పైసెస్ పార్కు ఏర్పాటైంది. దీని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ పార్కు వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పార్కుకు వెళ్లే ప్రధాన మార్గం విస్తరణకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శీతల గిడ్డంగులతో ఉపయోగం శీతల గిడ్డంగుల వల్ల రైతులకు మేలు కలుగుతోంది. గతంలో పంట ఉత్పత్తులను గుంటూరుకు తీసుకువెళ్లేవారం. ఇప్పుడు స్పైసెస్ పార్కులో గిడ్డంగులు ఉండడంతో దూరంతోపాటు రవాణా భారం తగ్గింది. – బండారు వెంకటసాంబశివరావు, మిర్చిరైతు, వంకాయలపాడు గ్రామం మిర్చి రైతులకు బంగారు భవిత గతంలో పంటను భద్రపరిచే అవకాశం లేక మిర్చి పంటను కల్లాల్లోనే తెగనమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం స్పైసెస్పార్కులో రెండు కోల్డ్స్టోరేజీలు రావడంతో సరైన ధర వచ్చేవరకు భద్రపరుచు కుంటున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లూ రావడంతో మేమే గ్రేడింగ్ చేసుకుంటున్నాం. పార్కు వల్ల మా భవిత బంగారంలా ఉంటుంది. – కర్రా పెదరాజారావు, మిర్చిరైతు జాలాది గ్రామం రైతుకు భరోసా స్పైసెస్ పార్కులో సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. పార్కు ఏర్పాటైనప్పటి నుంచి మా ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. పార్కు రైతుకు భరోసాగా ఉంది. – కొసన సాంబశివరావు, రైతు చెంఘీజ్ఖాన్పేట క్యూ కట్టిన కంపెనీలు ప్రస్తుతం పార్కులో స్పైసెస్ బోర్డు సొంతంగా కారంపొడి తయారు యూనిట్ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన పైలెట్ స్మి తిరుచూరు నుంచి రూ.2 కోట్లతో ‘చిల్లీప్రాసెసింగ్ యూనిట్ మిషన్’ను తెప్పించి లీజుకు ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటు కోసం కంపెనీలకు కేటాయించేందుకు బోర్డు 93.42 ఎకరాల విస్తీర్ణాన్ని 58 ప్లాట్లుగా విభజించింది. వీటికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బోర్డు కేటాయించింది. వీరిలో ఐదుగురు యూనిట్లను స్థాపించి నిర్వహిస్తున్నారు. డాలి, రామి ఆగ్రో, ఎస్ఎంఈ అగ్రిటెక్, స్వమి స్పైస్మిల్, ఉమా ఎక్స్పోర్ట్స్, డీకే ఎంటర్ప్రైజెస్ వంటి మరో ఏడు కంపెనీలు యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టాయి. ఇప్పటికే ఉన్న యూనిట్లలో క్వాలిటీ స్పైసెస్, స్పైస్ఎగ్జిన్, నంద్యాల సత్యనారాయణ, ఆగ్రోట్రేడ్, ఐటీసీ, జాబ్స్ ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రధానమైనవి. సరుకు నిల్వకు గిడ్డంగులు 2018లో పార్కులో రూ.53.2 కోట్లతో 4 గోదాములను నిర్మించారు. 12 ఎకరాల్లో ఏర్పాటైన వీటి సామర్థ్యం 23 వేల మెట్రిక్ టన్నులు. వీటిలో 13వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదంతస్తుల రెండు శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి విద్యుత్ అవసరాల కోసం 200కేవీఏ సామర్థ్యంగల రెండు సోలార్ యూనిట్లనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనపు నిల్వల కోసం ప్రత్యేక యూనిట్ నిర్మించారు. పంట ఉత్పత్తుల రక్షణ కోసం కావాల్సిన యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. మిర్చి, పసుపు మాత్రమే కాకుండా అపరాలు, బియ్యం, నూనెవస్తువులు, వేరుశనగ, నువ్వులు, కందులు, పెసలు వంటి వాటినీ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. శీతల గిడ్డంగులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. సాధారణ గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తోంది. రాయితీపై సేవలందిస్తోంది. (క్లిక్: పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్యూ) -
10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతంగా ఉంది. 2013–14లో రూ.1.12 లక్షలుగా ఉన్న తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2.28 లక్షలకు పెరిగింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పండ్లు, పూలు, కూరగాయలకు రాష్ట్రంలో భారీగా డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తి వైపు మన రైతులను మళ్లించేందుకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’పేరుతో ప్రభుత్వం రెండు ప్రదర్శనశాలలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ములుగులోని తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆవరణలో 53 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల సాగు కేంద్రాన్ని నెలకొల్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో కూరగాయలు, పూల సాగుపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యం తో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమల (సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆదేశించారు. తొలి దశలో ప్రతిపాదించిన యూనిట్లను నెల రోజుల్లో గ్రౌండింగ్ చేయడంతో పాటు వాటిని ఏడాదిలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్పై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తే రైతుకు అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 21 చోట్ల భూసేకరణ పూర్తి ఇప్పటికే 21 చోట్ల యూనిట్ల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, తొలి దశలో 11 యూనిట్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. గ్రౌండింగ్ చేయడం కాదని నెల రోజుల్లో అవి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. నిమ్మకాయల మార్కెట్ అయిన పొదలకూరు మార్కెట్ యార్డులో యాసిడ్ లైమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో శ్రీధర్రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. -
భూమి కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అక్కడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు తమ భూములను ఇవ్వబోమంటూ ఐదారు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన అన్నదాతలు శుక్రవారం తమ ఆందోళనను ఉధృతం చేశారు. మరోవైపు హన్వాడకు చెందిన రైతు బొక్కి మాసయ్య హైదరాబాద్కు వెళ్లి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్ జిల్లాలో 500 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గతంలోనే అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా హన్వాడలో 718 సర్వే నంబర్లో 3,100 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని అధికారులు గుర్తించారు. మొదటి విడతగా రెవెన్యూ అధికారులు 240 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అయితే, 50 ఏళ్ల క్రితమే ఈ భూమిలో కొంత భాగాన్ని అధికారులు అసైన్మెంట్ కింద దళిత, బీసీ రైతులకు కేటాయించారు. ఇప్పటికే 718 సర్వే నంబర్లో 144 మంది రైతులు 86.28 ఎకరాలు, పక్కనే ఉన్న 456 సర్వే నంబర్లో సుమారు 30 మంది రైతులు 60 ఎకరాల మేర సాగుచేసుకుంటున్నారు. పోలీస్ పహారాలో సేకరణ యత్నం..: తహసీల్దార్ బక్క శ్రీనివాసులు శుక్రవారం రెవెన్యూ బృందంతో కలిసి 718, 456 సర్వే నంబర్లో సర్వేకు వెళ్లారు. అదే సమయంలో పోలీస్ బలగాలు సైతం అక్కడికి చేరుకున్నాయి. భూమికి సరిపడా సాగుకు యోగ్యమైన భూమి ఇవ్వాలని, ఇంటి స్థలం ఇవ్వాలని తహసీల్దార్ను రైతులు నిలదీశారు. భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు భూమికి బదులుగా వేరే చోట కేటాయిస్తామని తహసీల్దార్ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ సైతం తహసీల్దార్కు ఫోన్ చేసి భూమిని కోల్పోతున్న ప్రతి రైతుకు సాగుకు యోగ్యమైన భూమితోపాటు ఇంటిస్థలానికి పట్టా లివ్వాలని, ఈ మేరకు ప్రొసీడింగ్స్ తీసుకోవాలని, తర్వాతే భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. మేము ఎటెళ్లాలి: ఆంజనేయులు, రైతు, హన్వాడ మాకు 4 ఎకరాలుంది. వంశపారం పర్యంగా సాగు చేసుకుంటున్నాం. భూమిని రూ.2 లక్షలు పెట్టి చదును చేసుకున్నాం. మరో రూ.2 లక్షలు వెచ్చిం చి మూడు బోర్లు వేయించాం. భూమిని వదిలిపెట్టాలని అధికారులు చెబుతున్నారు. మేం ఎటెళ్లాలి. భూసేకరణకు ముందుగా పొజిషన్ చూపించి పట్టాలు ఇవ్వాలి. రాజ్యసభకు హన్వాడ దళితరైతు నామినేషన్ తమకు కేటాయించిన భూములను లాక్కుంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసేందుకు హన్వాడకు చెందిన సుమారు 15 మంది రైతులు గురువారంరాత్రి హైదరాబాద్కు వెళ్లారు. ఈ క్రమంలో దళితరైతు బొక్కి మాసయ్య శుక్రవారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మాసయ్యకు 718 సర్వే నంబర్లో 1.17 ఎకరాల భూమి సాగులో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటులో తన భూమిని కోల్పోతుండటంతో నిరసనగా రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
మల్లవల్లి ఫుడ్ పార్క్ ద్వారా రూ.260 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద అభివృద్ధి చేసిన రెండు మెగా ఫుడ్ పార్కుల ద్వారా రూ.260 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమేగాక, 6,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.112.94 కోట్లతో 57.95 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కును అభివృద్ధి చేయగా, దాని పక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ఫుడ్ పార్కును అభివృద్ధి చేసింది. మెగా ఫుడ్ పార్కులో రూ.86 కోట్ల తో ఏర్పాటు చేసిన కోర్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ)ను ఈ మామిడి పండ్ల సీజన్కు అందుబాటులోకి తెస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, టమాట, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకునేలా సీపీసీని తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏప్రిల్ మొ దటి వారంలో రోడ్ షోలు నిర్వహిస్తామని ఏపీఐ ఐసీ వీసీ,ఎండీ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు. -
అందరికీ అభివృద్ధి ఫలాలు
అమెరికన్ ఉదారవాద రాజకీయ తత్వవేత్త జాన్ రాల్స్– ‘థియరీ ఆఫ్ జస్టిస్’ గ్రంథంలో మూడు అంశాలు కీలకం అని చెబుతారు. సమానత్వం ఉండాల్సింది– 1. హక్కుల్లో 2. అవ కాశాల్లో 3. ఎక్కువమందికి ప్రయో జనం కలిగించడం (బెనిఫిట్ ఆఫ్ మాగ్జిమైజేషన్)లో అంటారు. ఈ దృష్టి నుంచి చూసినప్పుడు, మనది వ్యవసాయ ప్రధాన సమాజం కనుక, ఇక్కడ జరిగిన సాంఘిక మార్పునకు– ‘కాటన్ తర్వాత భూమి’ (1852) ప్రాతిపదిక. అది ఆర్థిక పరిస్థితులపై మాత్రమే కాకుండా, ఇక్కడి ‘సోషల్ ఎకో సిస్టం’ మీదా ప్రభావం చూపి, కొన్ని తరాల పాటుగా కదలికలు లేకుండా చట్టు కట్టిన సామాజిక దొంతర్ల (సోషల్ ఫ్యాబ్రిక్)ను గుల్లబార్చింది. చరిత్రకారుడు బీబీ మిశ్రా గ్రంథం– ‘ది ఇండియన్ మిడిల్ క్లాస్–దెయిర్ గ్రోత్ ఇన్ మోడరన్ టైమ్స్’ (1962)లో వర్గీకరించిన పదకొండు అంశాల్లో 60 ఏళ్ళ క్రితమే, ఆరు అంశాలు గోదావరి మండలంలో కనిపిస్తాయి. భూమికి నీటి వసతి తోడవ్వడం వల్ల... వందేళ్లలో ఆ ప్రాంతం అన్ని రంగాల్లోనూ మిగతా ప్రాంతాల నుంచి వేరు పడింది. అయితే మరి ఈ ప్రాంతాల్లో ప్రొ. మిశ్రా చెబుతున్న మధ్యతరగతి ఏది? భూములున్న ఆధిపత్య వర్గాలదే ఇక్కడా తొలి విస్తరి అయితే, ఇన్నేళ్ళ ‘సరళీకరణ’ తర్వాత కూడా– ‘వెనుకబడిన వర్గాలు వెనుకే...’ అనే పాత సూత్రమేనా? అందుకు జవాబుగానే వనరుల సమాంతర పంపిణీ కోసం... ‘జల వద్దనే ప్రవాహ దిశల్ని నలుదిక్కులకు దారి మళ్ళించడం’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలయింది. కానీ ఆరంభ దశలోనే ఈ మార్పును ఎగువ మధ్యతరగతి అంగీకరించలేకపోతున్నది. ఇదే చిత్రం! సరళీకరణ విధానాలు తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల సంప్రదాయ సామాజిక దొంతర బలహీనమైంది. అదే సమయంలో అభివృద్ధి హారిజాంటల్గా విస్తరించడం చూడవచ్చు. ఈ అభివృద్ధిని రైతన్నలకే కాక, అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లడానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్ర విభజన తర్వాత భూమికి జలకళ తోడవ్వడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. వీటి ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధి చేస్తే వ్యవసాయాధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. (చదవండి: ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!) వెనుకబడిన సామాజికవర్గాల నుంచి కొత్తగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా మారిన– ‘ఎంటర్ ప్రెన్యూర్’ యువతకు ఈ ప్రభుత్వం కొత్త అభివృద్ధి– ‘ప్లాట్ ఫార్మ్’ను ప్లాన్ చేసింది. సహజంగానే వీరిలో బహుజన–దళిత–మైనారిటీ సామాజిక శ్రేణులు వారి వారి దామాషా మేరకు ఎటూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ నిర్మాణ కాలంలో రెండేళ్లపాటు– ‘వ్యాట్’, ‘జీఎస్టీ’ల్లో రూ. 2 కోట్లు మించకుండా ‘ఎంటర్ ప్రెన్యూర్’కు తిరిగి చెల్లిస్తున్నారు. కోల్డ్ చైన్స్, కోల్డ్ స్టోరేజి, కాయలు పండ్లుగా మార్చే ‘రైపెనింగ్ యూనిట్స్’కి అవి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఐదేళ్లపాటు యూనిట్ రూ. 1.50 విద్యుత్తు సబ్సిడీ ఇస్తారు. కొత్త యూనిట్లకు– ‘క్యాపిటల్ సబ్సిడీ’ 25 శాతం ఇస్తున్నారు. అలాగే, యూనిట్లను అప్ గ్రేడ్ చేస్తే ఒక కోటి రూపాయలకు మించకుండా 25 శాతం ఇస్తారు. తొలి దశ ప్రాసెసింగ్ చేసే యూనిట్లకు రూ. 2.5 కోట్లు మించకుండా యాభై శాతం వరకు ‘కేపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. వ్యవసాయ, హార్టికల్చర్, డైరీ, మీట్ ఉత్పత్తుల ‘కోల్డ్ చైన్’కు 35 శాతం క్యాపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. రెండు శ్లాబుల్లో కేపిటల్ పెట్టుబడి మీద ఐదేళ్ళ పాటు వడ్డీ మీద సబ్సిడీ 7 శాతం ఇస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి బయటకు వెళ్లి, ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న మన యువత సంపాదన నిల్వలు, వారి సొంత ప్రాంతంలో పెట్టు బడులుగా పెట్టడం వల్ల– ‘మైక్రో స్మాల్ అండ్ మీడియం’ యూనిట్లు రాష్ట్రంలో బాగా పెరుగుతాయి. రైతు పంటలకు గిరాకీ పెరుగుతుంది. ‘డైరీ’ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. రైతు కూలీకి ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది. రవాణా, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లు, బ్యాంకింగ్, హోటళ్ళు... ఇలా ఒక్కొక్కటిగా ప్రతి రంగం విస్తరించి చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుంది. ఫలితంగా సామాజిక వ్యవస్థలోని అన్ని వర్గాలూ అభివృద్ధికి చేరువవుతాయి. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) - జాన్సన్ చోరగుడి రాజకీయ – సామాజిక విశ్లేషకులు -
రాష్ట్రంలో అమెరికా సంస్థ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దుబాయ్ ఎక్స్పో–2020లో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గురువారం పేరెన్నికగన్న మరో రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భాగస్వామ్యం కావల్సిందిగా మరో సంస్థకు ఆహ్వానం పలికింది. ప్రధానంగా అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ను తయారుచేసే అమెరికాకు చెందిన అలుబాండ్ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అల్యూమినియం కాయిల్స్, ప్యానల్ తయారీ యూనిట్ను ఈ సంస్థ ఏర్పాటుచేయనుంది. దుబాయ్ ఎక్స్పోలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, పరిశ్రమలు–పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ సమక్షంలో ఏపీ ఈడీబీ సీఈఓ జవ్వాది సుబ్రమణ్యం, అలుబాండ్ గ్లోబల్ చైర్మన్ షాజి ఎల్ ముల్క్లు గురువారం సాయంత్రం దుబాయ్లో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి లభించనుందని, దీని ఏర్పాటుకు 150 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూర్చనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. షరాఫ్ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం రెండు లాజిస్టిక్ పార్కులకు కూడా.. షిప్పింగ్, లాజిస్టిక్, సప్లై చైన్ రంగాల్లో విస్తరించి ఉన్న షరాఫ్ గ్రూపు కూడా రాష్ట్రంలో పోర్టు ఆథారిత సేవల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో రెండు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, డిస్ప్లే యూనిట్లు, సరుకు రవాణాకు తగిన రైల్ సైడింగ్ వంటి సౌకర్యాలతో ఈ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు దుబాయ్ తాజ్బే హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఈడీబీతో షరాఫ్ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంవల్ల ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1,300 మందికి ఉపాధి లభించనుందని మంత్రి మేకపాటి వివరించారు. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆంధ్రా పెవిలియన్ కార్యక్రమంలో ఇప్పటివరకు ఆరు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఫుడ్ పార్కుల్లో భాగస్వాములు కండి.. ఇక వ్యవసాయ రంగాన్ని పెద్దఎత్తున్న ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మంచి ధర లభించాలన్న ఉద్దేశ్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు పెద్దపీట వేస్తున్నారని, ఇందులో భాగస్వామ్యం కావాల్సిందిగా అలానా గ్రూపును మేకపాటి కోరారు. గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ను పరిశీలించిన మంత్రి.. అలానా గ్రూపు స్టాల్ను సందర్శించి ఆ సంస్థ చైర్మన్ ఇర్ఫాన్ అలానాతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక ఫుడ్ పార్కును అభివృద్ధి చేస్తోందని వీటిలో భాగస్వామ్య కావాల్సిందిగా కోరారు. ఇప్పటికే అలానా గ్రూపు కాకినాడ సమీపంలో మాంసం శుద్ధిచేసే యూనిట్ను రూ150 కోట్లతో ఏర్పాటుచేయడమే కాకుండా కర్నూలు జిల్లా ఆదోని వద్ద మరో యూనిట్ను ఏర్పాటుచేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. మంత్రి మేకపాటి ఆహ్వానం మేరకు రంజాన్ మాసం తర్వాత రాష్ట్ర పర్యటనకు వస్తానని ఇర్ఫాన్ అలానా హామి ఇచ్చారు. ఈ సందర్భంగా అలానా గ్రూపు ఉత్పత్తి చేస్తున్న వివిధ ఆహార ఉత్పత్తులు, వాటిని ఏయే దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీతో మంత్రి మేకపాటి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!
పై నుంచి కిందికి జారే ప్రవాహధారను– నీటిబుగ్గ వద్దనే అది నలువైపులకు విస్తరించేట్టుగా దారులు సరిచేసినప్పుడు, బీడు భూములు సైతం జలాలతో తడుస్తాయి. ‘సోర్స్’గా పిలిచే ఈ నీటిబుగ్గను ఆంగ్లంలో ‘ఫౌంటెన్ హెడ్’ అంటాం. అయితే, పెట్టే చేతిని మెలివేయగలిగే శక్తి ఉన్నవారికి– ‘జల’ వద్దనే ఇవి దారులు మళ్ళించబడతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇటువంటి మౌలిక అంశాల పట్ల స్పృహ ఉన్నప్పుడే, ‘రాజ్యం’ అందించే ఫలాల పంపిణీలో సమన్యాయం అమలవుతుంది. ఈ దృష్టి ప్రభుత్వాలకు లేనప్పుడు, నీటిబుగ్గ వద్దనే జలాలు–ఫలాలు కూడా దారులు మళ్ళించబడతాయి. ఇన్నాళ్ళు జరిగింది అదే. అయితే, అనివార్యస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు జరిగే పంపిణీ న్యాయాన్ని ఎవరైనా కేవలం ప్రేక్షక పాత్రగా చూడ్డం తప్ప మరేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏళ్ల క్రితం– ఇకముందు వ్యవసాయం సాగదేమో? అనే అనుమానాన్ని స్వయంగా సర్కారులోని పెద్దలే వ్యక్తం చేయడం మనం చూశాం. అప్పటికే కౌలు రైతుల వెతలు పెరిగి సాగుబడి భారమయింది. భూముల సొంతదారులు ఊళ్ళను వదిలిపెట్టి, నగరాలలోనో, విదేశాలలోనో ఉంటూండటంతో రాష్ట్ర మంతా – ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డిజం’ ఎక్కువయింది. ఆ తర్వాత – ‘జలయజ్ఞం’ మొదలై సాగునీటి వసతి పెరుగుతున్న దశలో– డాక్టర్ వైఎస్ఆర్ తాత్కాలిక ఉపశమనంగా చిన్న సన్నకారు రైతులు– పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయల పెంపకం వంటివాటితో అదనపు ఆదాయం పెంచుకోవాలని సభల్లోనే బహి రంగంగా కోరేవారు. రాష్ట్ర విభజన తర్వాత తన తండ్రి ఆలోచన నుంచి– ఆ ‘లైన్’ స్ఫూర్తిగా తీసుకుని, గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో కొత్తగా– ‘ఫుడ్ ప్రాసె సింగ్ ఇండస్ట్రీ’ శాఖను ప్రారంభించారు. ‘కాటన్ తర్వాత భూమి...’ ఒక ఆరంభం అనుకుంటే, ‘గోదావరి మండలంలోని రెండు జిల్లాల్లోని ప్రముఖ ‘ఆగ్రో–ఇండస్ట్రీస్’ కంపెనీల కారణంగా, ఇప్పటికంటే మరింత మేలైన మానవీయ కేంద్రిత స్థిమిత స్థితిని సామాజిక పర్యావరణంగా ఒకప్పుడు ఇక్కడ చూడగలిగాము. అయితే, ‘అటోమెషన్’ ‘కంప్యూటర్ల’ ప్రవేశం తర్వాత, ఉద్యోగులు/కార్మికుల సంఖ్య నియంత్రణతో... ఉపాధి వెతుకులాట కోసం మొదలైన పట్టణాల వలసల ప్రభావం తొలుత పంటలపైన, ఆ తర్వాత ఈ పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా పైనా కనిపించింది. సంస్కరణలు తర్వాత, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో కేంద్రం తీసుకున్న వైఖరితో, మన ఆగ్రో పరిశ్రమల్లో సంక్షోభం చూశాం. సహకార చక్కెర మిల్లుల మూత ఈ పరిస్థితుల పర్యవసానమే! నిజానికి – ‘వ్యవసాయం దండగ...’ అనే ముగింపునకు వచ్చినప్పుడే, తదుపరి దశ గురించి పాలకుల్లో యోచన మొదలు కావాలి. అటువంటిది లేదు కనుకనే, గత ప్రభుత్వంలో 2014 జూన్లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో– ‘కాటన్ ఆనకట్ట కట్టిన తర్వాత, రైస్ మిల్లులు పెట్టడం తప్ప మీరు ఏం చేశారు?’ అని అప్పటి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కానీ 1952 నాటికే తణుకులో ‘ఆంధ్ర షుగర్స్’, ఆ తర్వాత ఏలూరులో ‘అన్నపూర్ణ పల్వరైసెస్’ వంటివి మొదలయ్యాయి. రవాణాకు గ్రాండ్ ట్రంక్ రోడ్, కోరమండల్ రైల్వే లైన్, విశాఖపట్టణం, కాకినాడ పోర్టుల అందుబాటును ఈ ప్రాంత– ‘ఆంట్రప్రెన్యూర్లు’ గరిష్ట స్థాయిలో వినియోగించుకున్న కాలం ఒకటి వుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఏలూరులో జనుము ఉత్పత్తులు, తాడేపల్లి గూడెంలో వంట నూనెలు ఉత్పత్తి చేశారు. ఈ నేపథ్యమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడానికి కారణం అయింది. (చదవండి: మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?) ఈ ప్రాంత తదుపరి దశ గనుక– ‘డిజిటలైజేషన్’ అయితే, భూమిని నమ్ముకుని దిగువన మిగిలిపోతున్న వర్గాల సాగుబడికి, వారి పిల్లల ఉపాధికి దారేది? అనే ప్రశ్నకు మాత్రం జవాబు లేకుండానే, విభజిత ఏపి తొలి ఐదేళ్ళు ముగిసింది. ఇలా ఎటువంటి దిక్సూచి లేని స్థితిలో, తన ప్రభుత్వానికి కొత్త దారులు తానే వేసుకునే తప్పనిసరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇందుకు మేలైన మానవ వనరులు అవసరం కనుక, విద్య, వైద్యం, వ్యవసాయం మీద దృష్టి తప్పలేదు. విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ఉపాధి వనరులు సృష్టించే వరకు, వివిధ వర్గాలకు తొలుత నగదు చెల్లింపు వంటి– ‘ఊతం పథకాలు’ తప్పలేదు. అయితే– ‘కరోనా’ దాన్ని అనివార్యం చేసి కొనసాగించేట్టుగా చేసింది. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) అదే సమయంలో మరో అర్ధ శతాబ్ది అవసరాలకు సరిపడిన– ‘ఎకో సిస్టం’ లక్ష్యంగా, ఈ ప్రభుత్వ ప్రణాళికలు వాగ్దానపూరితంగా కనిపిస్తున్నాయి. ఇందుకు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన– ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’ని చూడవలసి వుంటుంది. (చదవండి: మా కోరిక వికేంద్రీకరణే!) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యా -
ఫుడ్ ప్రాసెసింగ్ మరింత పటిష్టం!
న్యూఢిల్లీ: ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార ఉత్పత్తుల పరిశ్రమ) రంగాన్ని దేశంలో మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద రాయితీలను ప్రకటించింది. ఈ విభాగంలో దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీలు సహా మొత్తం 60 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. జాబితాలో పార్లే, డాబర్, బ్రిటానియా, నెస్లే ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), అమూల్ తదితర కంపెనీల దరఖాస్తులున్నాయి. రెడీ టు ఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్నవి), రెడీ టు కుక్ (స్వల్ప సమయంలోనే ఉండుకుని తినేవి), పండ్లు, కూరగాయలు, మెరైన్, మొజరెల్లా చీజ్ విభాగాల కింద ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 91 దరఖాస్తులు రాగా, అందులో 60కి ఆమోదం తెలిపింది. ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా చేసే ఉత్పత్తిపై ఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అనుమతులు సంపాదించిన ఇతర ముఖ్య కంపెనీల్లో అవంతి ఫ్రోజన్ ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ప్రతాప్ స్నాక్స్, టేస్టీ బైట్ ఈటబుల్స్, ఎంటీఆర్ ఫుడ్స్ ఉన్నాయి. పెద్ద పరిశ్రమగా అవతరిస్తుంది భారత్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దీర్ఘకాలంలో పెద్ద పరిశ్రమగా అవతరించేందుకు పీఎల్ఐ పథకం సాయపడుతుందని ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అభిప్రాయపడింది. ఉద్యోగ కల్పనలో తాము కీలక పాత్ర పోషిస్తామని దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పెద్ద పరిశ్రమగా అవతరిస్తుందని పార్లే ఆగ్రో ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్షా అన్నారు. మెరుగైన యంత్రాలు, ప్లాంట్ల ఏర్పాటుకు ఈ పథకం వీలు కల్పిస్తుందని.. అంతర్జాతీయంగా గొప్ప భారత బ్రాండ్లు అవతరిస్తాయన్నారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు పోటీపడగలవంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా కూడా ఇదే మాదిరి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనతోపాటు దేశీయంగా భారీ ఉత్పాదకతకు పీఎల్ఐ పథకం సాయపడుతుందున్నారు. పీఎల్ఐ పథకం భారత్లో రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చేదోడుగా నిలుస్తుందని.. పండ్లు, కూరగాయల విభాగంలో ప్రోత్సాహకాలకు ఎంపికైన నెస్లే ఇండియా పేర్కొంది. -
ఫుడ్ ప్రాసెసింగ్కు చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేస్తున్న 26 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక చేయూతనివ్వాలని నాబార్డుకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య విజ్ఞప్తి చేశారు. ముంబైలోని నాబార్డు ప్రధాన కార్యాలయంలో సీజీఎం బి.రఘునాథ్తో గురువారం ఆమె సమావేశమయ్యారు. స్థానికంగా సాగు అయ్యే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. వీరికి కావాల్సిన ముడిసరుకు(పంట)ను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు. వాటికొచ్చే లాభాల్లో కూడా రైతులకు కొంత భాగం ఇచ్చేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసిందన్నారు. స్థలాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, అవసరమైన ఆర్థిక చేయూతనందించాలని కోరారు. నాబార్డు సీజీఎం రఘునాథ్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నాబార్డు బృందం ఏపీలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
మీ వ్యవసాయ ఉత్పత్తులు కావాలి
సాక్షి, అమరావతి: భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని శ్రీలంక వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి సదాశివం మియా లాండారన్, శ్రీలంక ప్రధానమంత్రి సమన్వయ కార్యదర్శి సెంథిల్ తొండమాన్ చెప్పారు. వారు శుక్రవారం విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం, మిర్చి, పసుపు, పంచదార, వివిధ రకాల పండ్లను దిగుమతి చేసుకుంటామని, ఇక్కడి నుంచి ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు చాలా బాగున్నాయంటూ ప్రశంసించారు. తమ దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈ ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్శాఖ కార్యదర్శి మధుసూదనరెడ్డి, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు హెచ్.అరుణ్కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కృష్ణానదికి కొనసాగుతున్న వరద ప్రకృతి వ్యవసాయానికి 5వేల సీహెచ్సీలు రాష్ట్రంలో ప్రకృత్రి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే)లో ప్రత్యేకంగా నేచురల్ ఫామింగ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీలు) ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక సీహెచ్సీల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సాగు ఉత్పాదకాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ విధంగా రెండుదశల్లో 5 వేల సీహెచ్సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతుసాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి.విజయకుమార్, సీఈవో రామారావులతో మంత్రి శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతును ప్రకృతి సాగువైపు మళ్లించడమే లక్ష్యంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెటింగ్ శాఖ నుంచి ఏడువేల టన్నుల శనగలు తీసుకునేందుకు టీటీడీ ముందుకొచ్చిందని చెప్పారు. -
ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవ్’
సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి రాష్ట్రంలో ‘వాణిజ్య ఉత్సవ్–2021’ పేరిట ఈనెల 21, 22 తేదీల్లో విజయవాడలో భారీ వాణిజ్య సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వాణిజ్య ఉత్సవ్–2021 కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే ఈ సదస్సులో విదేశీ రాయబారులతోపాటు 100 మందికిపైగా ఎగుమతిదారులు పాల్గొంటారని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రం దేశ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పోర్టులు, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా రాష్ట్ర ఎగుమతుల విలువను రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి వాటి ఎగుమతులు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు తొలుత రాష్ట్రస్థాయిలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందని, 24 నుంచి 26 వరకు జిల్లాల వారీగా కలెక్టర్ నేతృత్వంలో సదస్సులు జరుగుతాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటంతో వీరికి అధికాదాయం అందించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్తు తెలిపారు. వాణిజ్య ఉత్సవ్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతుల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం రూ.2,900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి మేకపాటి వాణిజ్య ఉత్సవ్ లోగోను ఆవిష్కరించగా మంత్రి కన్నబాబు ఈవెంట్కి సంబంధించిన ఫ్లయర్ను విడుదల చేశారు. వాణిజ్య ఉత్సవంలో పాల్గొనేవారు నమోదు చేసుకోవడానికి సంబంధించిన ప్రత్యేక వెబ్ పేజీని మంత్రులు ప్రారంభించారు. వాణిజ్య ఉత్సవ్లో పాల్గొనేవారు https:// apindustries. gov.in/ vanijyautsavam/ అనే వెబ్లింక్లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఎంఎస్ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పాలసీ: ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు ఓకే..
10,000 ఎకరాలు.. 25,000 కోట్ల పెట్టుబడులు 3.70 లక్షల మందికి ఉపాధి రాష్ట్రంలో తొలిదశ కింద ఒక్కొక్కటీ 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం ఉండే 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తారు. 2024-25 నాటికి మొత్తంగా 10 వేల ఎకరాలకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను విస్తరిస్తారు. రైస్మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తారు. విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేసే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. జోన్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సేకరించి, మౌలిక వసతులను అభివృద్ధి చేసి కేటాయిస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో యూనిట్లు ఏర్పాటు చేసేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలను ఆమోదించింది. దీనితోపాటు రాష్ట్రంలో భారీగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలని తీర్మానించింది. పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలకు తోడుగా ఉండేలా ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి కూడా ఓకే చెప్పింది. బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. వ్యవసాయ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘‘వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా, అనేక కష్టాల కోర్చి నిర్మించిన ప్రాజెక్టులతో నదీ జలాలను చెరువులు, కుంటలు, బీడు భూములకు తరలించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తేవడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలతో గత ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే గ్రామాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున.. ధాన్యం నిల్వ, మార్కెటింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది..’’ అని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుత వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సేద్యం జరిగే అవకాశం ఉందని.. వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో సాగవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని.. కొత్తగా రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులు స్థాపించేందుకు పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రైతులకు సమగ్ర శిక్షణ కోసం అవసరమయ్యే సౌకర్యాలను కల్పించి, నిరంతర శిక్షణ కొనసాగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యానవన శాఖను క్రియాశీలకంగా మార్చేందుకు అధికారులు, నిపుణుల సహకారం తీసుకుని రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించింది. పౌర సరఫరాల శాఖతో పాటు వ్యవసాయ శాఖలోనూ ఉద్యోగాల ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఫుడ్ ప్రాసెసింగ్లో భాగంగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్న చోటికి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. కొత్తగా ముందుకొచ్చే అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని తీర్మానించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున.. నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు తొలి ఏడాది రూ.26 వేలు, రెండో ఏడాది రూ.5 వేలు, మూడో ఏడాది రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించింది. అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సాయంతో ఆయిల్ పామ్ నర్సరీలు పెంచాలని ఆదేశించింది. ఆయిల్ పామ్ సాగు విధానం గురించి లోతుగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన బృందం కోస్టారికా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తుందని తెలిపింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ‘రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఔత్సాహికులకు ప్రోత్సాహం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్’ల నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించింది. ‘ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ మార్గదర్శకాలివీ.. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి ఆమోద ముద్ర వేసింది. ఉత్పత్తిదారులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామీణ పారిశ్రామిక వ్యవస్థను సృష్టించడం సాధ్యమవుతుందని.. తద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను ఓకే చేసింది. రూ.25 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, 70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యం పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల విధానాన్ని అమలు చేయాలి. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ జోన్లలో స్థాపించే యూనిట్లకు వివిధ రూపాల్లో రాయితీలు ఇస్తారు. కరెంటు ప్రతి యూనిట్కు రూ. రెండు సబ్సిడీని ఐదేళ్లపాటు అందజేస్తారు. పెట్టుబడి కోసం తీసుకున్న లోన్పై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం (గరిష్టంగా రూ.2 కోట్లు) రీయింబర్స్ చేస్తారు. ఏడేళ్ల పాటు మార్కెట్ కమిటీ ఫీజును వంద శాతం రీయింబర్స్ చేస్తారు. ఆహార ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీకి తరలించడం లాంటి లాజిస్టిక్స్కు తోడ్పాటు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 15 శాతం మూలధనం (రూ.20 లక్షలకు మించకుండా) సాయం చేస్తారు. జోన్లలో భూమి కొనుగోలు ధర మీద రూ.20లక్షలకు మించకుండా 33శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ 500 మీటర్లను బఫర్ జోన్గా గుర్తించి జనావాసాలు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు. ఫుడ్ ప్రాసెసింగ్పై ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లాజిస్టిక్స్ పార్కులు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ని కూడా కేబినెట్ బుధవారం ఆమోదించింది. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశ వినియోగదారులకు చేర్చేదిశగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని అభిప్రాయపడింది. ఈ దిశగా దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ఈ రంగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా వేసింది. ఈ విధానం కింద కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 1400 ఎకరాల్లో భారీ డ్రైపోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో సనత్ నగర్లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటైనర్ డిపో (ఐసీడీ)లను స్థాపిస్తారు. బాటసింగారంలో ఉన్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తారు. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందిస్తారు. -
వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాన్ని పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందు లో భాగంగా కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వ్యవసా య అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డం ద్వారా రాష్ట్రంలో సాగు ఉత్పత్తులు భారీగా పెరిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన పంట వరితోపాటు ఆయిల్పామ్ వంటి నూతన పంటల భవిష్యత్ ప్రాసెసింగ్ అవసరాలను కూడా ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు’ఏర్పాటులో పరిగణనలోకి తీసుకుంటామ న్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తోపాటు పరిశ్రమలు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే ఆర్థిక పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు ద్వారా సాగు ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో పాటు దీర్ఘకాలంలో లాభసాటి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్నారు. పెరిగిన వరి ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సుమారు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎఫ్సీఐకి అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా కొత్త పాలసీ రూపొందించాలన్నారు. మిల్లింగ్ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో.. తొలి విడతలో హైదరాబాద్ మినహా పూర్వ ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో కనీసం 225 ఎకరాల విస్తీర్ణంలో స్పెషల్ ఫుడ్ ప్రాసిసెంగ్ జోన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగు తోంది. ఈ జోన్లలో విద్యుత్, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు తదితర మౌలిక వసతులన్నీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో అంతర్భాగంగా ఉంటాయి. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మిరప, పసుపు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజీ, మార్కెటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జోన్లలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 350 దరఖాస్తులు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబం ధించి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే 350 దరఖాస్తులు అందగా, మరిన్ని కం పెనీలను భాగస్వాములను చేసేందుకు గడువు పెంచాలని కేటీఆర్ ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ, ఇతర అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. హరిత విప్లవంతోపాటు మాంసం, పాలు, మత్య్స రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సం సిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. -
వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాన్ని పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందు లో భాగంగా కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వ్యవసా య అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డం ద్వారా రాష్ట్రంలో సాగు ఉత్పత్తులు భారీగా పెరిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన పంట వరితోపాటు ఆయిల్పామ్ వంటి నూతన పంటల భవిష్యత్ ప్రాసెసింగ్ అవసరాలను కూడా ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు’ఏర్పాటులో పరిగణనలోకి తీసుకుంటామ న్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తోపాటు పరిశ్రమలు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే ఆర్థిక పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు ద్వారా సాగు ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో పాటు దీర్ఘకాలంలో లాభసాటి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్నారు. పెరిగిన వరి ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సుమారు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎఫ్సీఐకి అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా కొత్త పాలసీ రూపొందించాలన్నారు. మిల్లింగ్ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో.. తొలి విడతలో హైదరాబాద్ మినహా పూర్వ ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో కనీసం 225 ఎకరాల విస్తీర్ణంలో స్పెషల్ ఫుడ్ ప్రాసిసెంగ్ జోన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగు తోంది. ఈ జోన్లలో విద్యుత్, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు తదితర మౌలిక వసతులన్నీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో అంతర్భాగంగా ఉంటాయి. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మిరప, పసుపు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజీ, మార్కెటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జోన్లలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 350 దరఖాస్తులు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబం ధించి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే 350 దరఖాస్తులు అందగా, మరిన్ని కం పెనీలను భాగస్వాములను చేసేందుకు గడువు పెంచాలని కేటీఆర్ ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ, ఇతర అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. హరిత విప్లవంతోపాటు మాంసం, పాలు, మత్య్స రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సం సిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులకు మేలు
నూజివీడు: రైతులకు మేలు చేయడానికి రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ.2,600 కోట్ల వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ యూనిట్ల వల్ల పంటలకు మద్దతు ధర లభిస్తుందన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటికి అనుబంధంగా కస్టమర్ హైరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా గోడౌన్లను సైతం నిర్మిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన పరికరాలను రైతులకు తక్కువ ధరకే అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం
నూజివీడు: రాష్ట్రంలో ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. నూజివీడు ఆటోనగర్లో ఉన్న గోర్మే పాప్కార్నిక ప్రాసెసింగ్ కంపెనీని బుధవారం ఆమె పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మొక్కజొన్న, మామిడి, మిర్చి, నిమ్మ, అరటి, టమోట, జీడిపప్పు తదితర వాటికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పినట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ప్రతి రైతుభరోసా కేంద్రం వద్ద ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తుందని తెలిపారు. వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ వీడీవీ కృపాదాస్, కృష్ణా జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టి.మోహన్రావు, ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్, నూజివీడు ఏడీఏ కవిత తదితరులు పాల్గొన్నారు. -
చైనాలో గ్యాస్ లీక్: ఏడుగురు మృతి
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో టాక్సిక్ గ్యాస్ లీకైనది. ఈ విష వాయువు పీల్చుకుని ఏడుగురు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యిబిన్ నగరంలోని చాంగ్నింగ్ కౌంటీలోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో మరమ్మత్తు పనులు జరిగే సమయంలో ఈ గ్యాస్ లీకైనట్లు జిన్హువా కౌంటీ అధికారులు తెలిపారు. విషవాయువు పీల్చుకుని బాధితులు మొదట స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లారు. వారికి వైద్య చికిత్స అందించడానికి ఆస్పతికి తరలించగా మార్గమధ్యలోనే మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. (చదవండి: తగ్గుతున్న కరోనా: 2 లక్షల దిగువకు కొత్త కేసులు) -
25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
సాక్షి, అమరావతి: పండించినచోటే పంటను ప్రాసెస్ చేసి మార్కెట్కు తీసుకొచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్లో రూ.186 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్థానికంగా లభించే పంట ఉత్పత్తుల ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం గుంటూరు ఏపీఐఐసీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో అన్నదాతలకు అదనపు ఆదాయం లభించడమేగాక లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మార్కెట్కు అనుగుణంగా వ్యవసాయ సలహా మండళ్ల సూచనలతో త్వరలో క్రాప్ ప్లానింగ్ అమలు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలపై దృష్టిపెట్టేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. రైతుల అవసరాల మేరకు పచ్చిరొట్ట విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. వేరుశనగ రాయితీ విత్తన పంపిణీని జూన్ 17 నాటికి పూర్తిచేయాలన్నారు. ఈనెల 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి జూన్ 1వ తేదీ నుంచి వరి విత్తనాల పంపిణీ ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో మరో లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొన్నిప్రాంతాల్లో ఉద్యాన పంటలు , పట్టు సాగు ఈ క్రాప్ పరిధిలోకి రాలేదని చెప్పారు. సాగయ్యే ప్రతిపంట ఈ క్రాప్ పరిధిలోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. కోకో, కొబ్బరి, ఆయిల్పామ్ వంటి లాభసాటి పంటల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలన్నారు. సుబాబుల్, పొగాకు, మెట్ట వరి పంటల సాగు తగ్గించాలని, వాటిస్థానంలో ఉద్యాన, ఇతర లాభసాటి పంటల సాగువైపు రైతులను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టమాటా ధరల విషయంలో రైతులు నష్టపోకుండా చూడాలని ఆయన చెప్పారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు హెచ్.అరుణ్కుమార్, డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డి.శేఖర్బాబు, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
రైతు మోములో ‘ధర’హాసం నింపేలా
సాక్షి, అమరావతి: రైతు వద్ద టమాటా కిలో ధర రూ.5. అదే ప్రాసెస్ చేసి సాస్ రూపంలో అమ్మితే లీటర్ బాటిల్ ధర రూ.99 నుంచి 160. మొక్కజొన్న కిలో రూ.14. అదే ప్రాసెస్ చేసి అమ్మితే కిలో రూ.90. మామిడి పండ్లు కిలో రూ.30. అదే జ్యూస్ రూపంలో అమ్మితే కిలో రూ.70.. జెల్లీ రూపంలో అమ్మితే రూ.300 పైమాటే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పంట విషయంలోనూ రైతుకు లభించేది మార్కెట్ ధరలో 5 నుంచి 10 శాతమే. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయడం ద్వారా.. ఆ ఉత్పత్తులకు విలువను జోడించి రైతులకు మంచి ఆదాయం సమకూర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా.. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం నెలకొల్పుతోంది. ఇక్కడ ప్రాసెస్ చేసినా అమ్ముడు కాని పంటను.. సెకండరీ ప్రాసెసింగ్ చేసి మార్కెట్లోకి తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతోంది. ఈ క్లస్టర్లలో వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను లీజు ప్రాతిపదికన బహుళ జాతి కంపెనీలకు అప్పగిస్తారు. సదరు కంపెనీలు విధిగా తొలుత స్థానికంగాను, ఆ తర్వాత రాష్ట్ర పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ఆ కంపెనీలే మార్కెటింగ్ చేస్తాయి. 43 యూనిట్ల గుర్తింపు ఇప్పటికే స్థానికంగా లభించే పంట ఉత్పత్తుల ఆధారంగా 43 యూనిట్లను గుర్తించారు. ఒక్కో యూనిట్కు కనీసం 20 నుంచి 30 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. మరో 10 చోట్ల ఆక్వా ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఏడాదిలోగా వీటి ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రాష్ట్రంలో ఏటా 1.69 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 11.87 లక్షల టన్నుల అపరాలు, 8.96 లక్షల టన్నుల నూనె గింజలు, 1.75 కోట్ల టన్నుల పండ్లు, 77.30 లక్షల టన్నుల కూరగాయలు మిర్చి, పసుపు, అల్లం, తదితర సుగంధ ద్రవ్య పంటల ఉత్పత్తులు 16.69 లక్షల టన్నులు కాగా.. 42 లక్షల టన్నుల చేపలు, 1.30 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవికాకుండా రాష్ట్రంలో 2.31 కోట్ల మేకలు, గొర్రెలున్నాయి. వీటికి సరైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వంపై భారం పడుతోంది. పైగా వీటిని నెలల తరబడి నిల్వ చేసి టెండర్ల ద్వారా విక్రయించడం వల్ల నాణ్యత తగ్గి నష్టం కలుగుతోంది. ఇలా గత ఏడాది సుమారు రూ.600 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతులు పండించిన పంటకు విలువను జోడించి మంచి ధర వచ్చేలా చూడటంతోపాటు ప్రభుత్వానికి కూడా నష్టాలు తప్పుతాయి. దేశంలోనే ఓ గొప్ప ప్రయోగం పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేయడమనేది దేశంలోనే తొలి ప్రయోగం. వీటివల్ల పంటలకు కనీస మద్దతు ధర రాదేమో అనే బెంగ రైతులకు ఉండదు. ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా వందలాది పరిశ్రమలు వస్తాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – భరత్కుమార్ తోట, కన్సల్టెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రైతుకు నిజంగా ఎంతో మేలు పండించిన పంటను ప్రాసెసింగ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించే పంటను ప్రాసెస్ చేసే కంపెనీలు రూ.కోట్ల లాభాలను ఆర్జిస్తుంటే రైతులకు దక్కేది అంతంత మాత్రమే. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలా రైతుల కోసం పరితపించే ముఖ్యమంత్రి మరొకరు ఉండరు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు, ఏపీ అగ్రిమిషన్ పండిన చోటే ప్రాసెస్ పంట పండించిన చోటే ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, డెయిరీ, ఆక్వా ఉత్పత్తులు వృథా కాకుండా వాటినుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నది ప్రభుత్వ సంకల్పం. కనీస మద్దతు ధరతో పాటు వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే లాభాల్లో రైతులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. వీటి ఏర్పాటు ద్వారా కనీసం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాం. – ఎల్.శ్రీధర్రెడ్డి, సీఈవో,ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
సాక్షి, అమరావతి: రైతులకు అధిక ఆదాయం, స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్(ఆహార శుద్ధి పరిశ్రమ) యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. సుమారు రూ.2,900 కోట్ల పెట్టుబడి అంచనాతో ప్రతి పార్లమెంటు పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంక్యుబేషన్ సెంటర్, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు పెట్టనుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కన్సల్టెన్సీగా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ను నియమిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక, మౌలిక వసతుల కల్పన, డీపీఆర్ తయారీ, బిడ్లు పిలవడం, కంపెనీలను ఎంపిక చేయడం, రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం తదితర కార్యకలాపాలను ‘ఏపీ అర్బన్ ఇన్ఫ్రా’ నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సేవలకు గానూ ఫీజు చెల్లించనున్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేలా.. ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేసే ఈ యూనిట్లను నిర్వహించే కంపెనీ.. ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి లీజు రూపంలో అద్దె చెల్లిస్తుంది. వీటికి అవసరమైన ముడి సరుకును నేరుగా రైతుల నుంచి సేకరించి రైతు భరోసా కేంద్రాలు, మార్క్ఫెడ్ల ద్వారా సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, డైరీ, ఆక్వా, ఇతర వ్యవసాయ పంట ఉత్పత్తులు వృథా కాకుండా.. వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పంటలను సకాలంలో పూర్తిగా విక్రయించుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ఈ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కంపెనీ ఎంపిక వంటి పూర్తిస్థాయి సేవలను ‘ఏపీ అర్బన్ ఇన్ఫ్రా’ అందిస్తుందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్లో యూఏఈ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: భారత్లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆసక్తిగా ఉంది. దాదాపు రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా సుమారు 2,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి యూఏఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు(ఏపీ ఈడీబీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యూఏఈ ప్రతినిధులతో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలో మెగా ఫుడ్ పార్కులు, లాజిస్టిక్స్, శీతల గిడ్డంగులు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటి తదితరాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు యూఏఈ అంబాసిడర్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్ రహమాన్ అల్బానా, యూఏఈ–ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ షరాఫుద్దీన్ షరాఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు జుల్ఫీ రవ్జీ, రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో జె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో వివరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 150కిపైగా కంపెనీలు పాల్గొనగా.. 70 కంపెనీలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిని చూపాయి. 1,663 టన్నుల పండ్లు ఎగుమతి.. రాష్ట్రం నుంచి ఏటా సుమారు రూ.10,000 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులను యూఏఈ దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రంగాల ఉత్పత్తులను యూఏఈ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్లు ఏపీ ఈడీబీ తేల్చింది. ఇందులో పండ్లు, పప్పు దినుసులదే అత్యధిక వాటా. ఏటా మన రాష్ట్రం నుంచి యూఏఈకి 1,663 టన్నుల పండ్లు, పప్పు దినుసులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో రెడీ టూ ఈట్ లేదా శుద్ధి చేసిన ఆహార పదార్థాల విలువ రూ.45 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దీని తర్వాత అత్యధికంగా 10,945 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే 177 టన్నుల కూరగాయలు, 421 టన్నుల చిరుధాన్యాలు, 19 లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతున్నాయి. -
ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్కు రూ.3,766 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2021–22లో ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.3,766.25 కోట్ల రుణాలు అందించాలని నాబార్డు అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా 6.2 శాతం అధికమని తెలిపింది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలతో పాటు ఆక్వా, డెయిరీ, విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల పరిధిలోనే మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాల్లో డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ–మార్కెటింగ్, జనతా బజార్లు తదితర సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే 13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లపై తాము కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు నాబార్డు ఆ ఫోకస్ పత్రంలో పేర్కొంది. -
ఫుడ్ ప్రాసెసింగ్కు రూ.10,900 కోట్లు
న్యూఢిల్లీ: ఆహారశుద్ధి పరిశ్రమ (ఫుడ్ ప్రాసెసింగ్) కు ఉత్పత్తి ఆధారిత పథకాన్ని (పీఎల్ఐ స్కీమ్) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్కు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలను ఆరేళ్ల పాటు 2026–27 నాటి వరకు అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల 2026–27 నాటికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని.. అదే విధంగా ఎగుమతులు పెరుగుతాయని.. ఈ రంగం మరింత విస్తరించి రూ.33,494 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిర్ణయం రైతులకు ఇచ్చే గౌరవమని మంత్రి పీయూష్ గోయల్ సమావేశం అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. భారత రెడీటుఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్న) ఉత్పత్తులకు, సహజసిద్ధ ఆహార ఉత్పాదనలకు, శుద్ధి చేసిన పండ్లు, కూరగాయలు, మత్స్య ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండడంతో.. దేశ ఆహార శుద్ధి పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని మంత్రి చెప్పారు. నిర్దేశిత కనీస పెట్టుబడులు పెట్టడంతోపాటు, నిర్దేశిత విక్రయాలను నమోదు చేసే ఆహార శుద్ధి, ఉత్పత్తుల తయారీ సంస్థలకు ఈ పథకం రూపంలో మద్దతు అందించనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాల కోసం ఆసక్తి వ్యక్తీకరణలకు ఏప్రిల్ చివరి నాటికి ఆహ్వానం పలకనున్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి పుష్ఫ సుబ్రమణ్యం తెలిపారు. దీనికింద కంపెనీలు కనీస పెట్టుబడులు పెట్టడంతోపాటు కనీస అదనపు విక్రయాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. -
2900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు: కన్నబాబు
సాక్షి, అమరావతి: రైతులకు వ్యవసాయ రుణాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌలు రైతులకు బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదని గుర్తించామని పేర్కొన్నారు. సున్నవడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమాను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. 4,700 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని.. ప్రభుత్వానికి నష్టం వచ్చినా, రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.1300 కోట్ల నాబార్డ్ రుణాన్ని తీసుకుంటున్నామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం -
దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్
సాక్షి, అమరావతి: దుబాయ్లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్–2021 ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు జరిగే ఈ గల్ఫ్ ఫుడ్–2021 ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడారు. ఏపీలో ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈ స్టాల్లో ఏపీలో ఉన్న వనరులు, పంట ఉత్పత్తుల వివరాలు, పెట్టుబడిదారులకున్న అవకాశాలను చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ సీఈవో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: పాస్పోర్ట్కూ ‘డిజి లాకర్’.. ఒరిజినల్ డాక్యుమెంట్లను వెంట తీసుకురానక్కర్లేదు తగ్గుతున్న నిరుద్యోగిత.. రికార్డుస్థాయిలో ఉద్యోగాలు -
అటు పని..ఇటు మనీ!
సాక్షి, సిద్దిపేట: ఒక ఐడియా.. రైతులకు మనీ, మహిళలకు పని కల్పించింది. పంటను అమ్ముకోవడానికి పడిన కష్టం.. డబ్బులు చేతికొచ్చే సమయంలో కొర్రీలను చూసిన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతుల కుటుంబాల్లోని మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ ఆలోచనకు వచ్చారు. పప్పుమిల్లులు కొనుగోలు చేసి ముందుగా తమ ఇళ్లలో ఉన్న కందులను పప్పుగా మార్చి విక్రయాలు మొదలుపెట్టారు. మిట్టపల్లి ఇప్పుడు రెడ్గ్రామ్కు చిరునామాగా మారింది. ఆలోచన పుట్టిందిలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని ఓ రోజు మహిళాసంఘాల సభ్యులు మిట్టపల్లి గ్రామపెద్దలను కోరారు. కందులు అమ్ముడు పోవట్లేదని, కావాలంటే వాటిని పప్పుగా మార్చి అమ్ముకోవాలని పలువురు రైతులు సూచించారు. ఈ సలహాలనే ఆచరణ రూపం దాల్చింది. వెంటనే మహిళా సంఘం సభ్యులు 20 మంది రూ.2 లక్షలు జమ చేశారు. సర్పంచ్ వంగ లక్ష్మి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. మంత్రి హరీశ్రావు బ్యాంకర్లతో మాట్లాడి రూ.10 లక్షల రుణం ఇప్పించారు. ఇలా మొత్తం రూ.13 లక్షల్లో ముందుగా రూ.3 లక్షలు పెట్టి కందులను పప్పుగా మార్చే మిషన్లు, ప్యాకింగ్ కవర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బుతో గ్రామంలోని రైతుల వద్ద కందులను క్వింటాల్కు రూ.5,800 చెల్లించి కొనుగోలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కందులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. మంత్రి హరీశ్ మార్క్ఫెడ్ వారితో మాట్లాడి క్వింటాల్కు రూ.4,100 చొప్పున సబ్సిడీపై కందులు ఇప్పించారు. ఇలా గతేడాదిలో మొత్తం రూ.21 లక్షల విలువ చేసే 40 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేశారు. ఈ కందులను మిల్లింగ్ చేయగా 28 టన్నుల పప్పు వచ్చింది. ఈ పప్పును ముందుగా కిలో రూ.80కి విక్రయించగా.. తర్వాత డిమాండ్ పెరగడంతో రూ.100కు పెంచారు. ఇలా మొత్తం రూ.26 లక్షల మేర డబ్బు వచ్చిందని మహిళలు తెలిపారు. ఈ ఏడాది 50 మెట్రిక్ టన్నుల కందులు అధికంగా కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వీళ్ల పప్పులకు.. వాళ్ల చిరుధాన్యాలు మిట్లపల్లి శ్రీవల్లి మహిళా సమాఖ్య తయారు చేసిన పప్పులకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కల్తీ లేని పప్పు తక్కువ ధరకు అమ్మడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, నాచారం ప్రాంతాలకు కందిపప్పు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చిరుధాన్యాలు తెచ్చి సిద్దిపేటలో అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లాలో 17 వేల మహిళాసంఘాలు ఉండగా.. వాటిలో 1.8 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రతి ఒక్కరికీ నెలకు ఒక కిలో చొప్పున కంది పప్పు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నారు. మెచ్చుకున్న సీఎం కేసీఆర్.. డిసెంబర్ 10న మిట్టపల్లిలో రైతు వేదిక సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహిళలు కందులను పప్పుగా మార్చి అమ్మకాలు చేస్తున్న విషయాన్ని మంత్రి హరీశ్ సీఎంకు తెలపగా వారిని మెచ్చుకున్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులను పిలిచి రూ.3 కోట్లతో పప్పుతోపాటు పసుపు, కారం, వెల్లుల్లి మిశ్రమం, చిరుధాన్యాలు, నూనెల తయారీని ప్రోత్సహించాలని ఆదేశించారు. చేతి నిండా పని దొరికింది ‘మా గ్రామంలో వ్యవసాయం చేసుకుని బతికేవారు ఎక్కువ. కందులను పప్పుగా మార్చి అమ్మా లనే ఆలోచన కలిగింది. మంత్రి హరీశ్రావు సహకారంతో పనిమొదలు పెట్టాం. చేతి నిండా పని దొరికింది’. – లక్ష్మి, శ్రీవల్లి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సమష్టిగా పని చేసుకుంటున్నారు ‘రైతులు పండించిన కందులను మార్కెట్కు తీసుకెళ్లకుండా మా గ్రామంలోనే మహిళలు పప్పుగా తయారు చేసి అమ్ముతున్నారు. సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాల వారు కూడా ఈ పప్పులను కొంటున్నారు. మార్కెట్లో దొరికే పప్పుకన్నా రుచిగా ఉంటోంది.’ – వంగ లక్ష్మి, సర్పంచ్, మిట్టపల్లి మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు ప్రోత్సాహమిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని మిట్టపల్లి మహిళలు రుజువు చేశారు. పొదుపు డబ్బులతో నా దగ్గరకు వచ్చినప్పుడే వారిలో పట్టు దల కనిపించింది. ఇలా ప్రతి సం ఘం స్వయం సమృద్ధి సాధించాలి.’ – హరీశ్రావు, ఆర్థిక మంత్రి -
రూ.10,235 కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ సహా మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. 2021 మార్చిలో ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్బీకేలు, ఫుడ్ ప్రాసెసింగ్, అమూల్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జెడ్బిఎన్ఎఫ్ అడ్వైజర్ అండ్ వైస్ ఛైర్మన్ టి విజయకుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్కుమార్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, ఏపీ డెయిరీ డవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఏ, ఏపీ ఆగ్రోస్ ఎండీ ఎల్ శ్రీకేష్ బాలాజీరావు, సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ ఏ.సూర్యకుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘ఫుడ్ ప్రాససింగ్ సహా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లకోసం మొత్తంగా రూ. 10,235 కోట్లు అవుతుందని అంచనా. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో గొడౌన్లు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, కలెక్షన్ సెంటర్లు, కోల్డు రూంలు, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, అసైయింగ్ ఎక్విప్మెంట్ పుడ్ ప్రాససింగ్ ఇన్ఫ్రా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆక్వా ఇన్ఫ్రా, పశుసంవర్ధక ఇన్ఫ్రా, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, జనతాబజార్లు, ఇ– మార్కెటింగ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయాలని’’ సీఎం ఆదేశించారు.. సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ►నాణ్యమైన ఇన్పుట్స్ను ఇవ్వడమే కాదు, సకాలానికే వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడమన్నది చాలా ముఖ్యం ►రైతు ఆర్డర్ చేయగానే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని ఎప్పటిలోగా అందిస్తామనే విషయాలను చెప్పాలి ►ఎప్పటిలోగా వాటిని ఇస్తామన్న విషయాన్ని చెప్తూ ఆర్బీకేలో డిస్ప్లే చేయాలి ►ఆర్డర్చేసినా నాకు టైంకు అందలేదనే మాట ఎక్కడా రాకూడదు ►ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుని, అధికారులను నియమించుకోవాలి ►నాణ్యమైన ఆక్వాఫీడ్, ఆక్వా సీడ్ ఆర్బీకేల ద్వారా అందించాలి ►వీటి నాణ్యతను నిర్ధారించేందుకు నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేసే ల్యాబులను ఆర్బీకేలతో అనుసంధానం చేయాలి ►సేంద్రియ, సహజ పద్ధతులకు పెద్దపీట వేసేలా సంబంధిత ఉత్పత్తులను ఆర్బీకేలపరిధిలోకి తీసుకురావాలి ►వీటికి పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించాలి ►ఏలూరు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి ►ఆర్గానిక్ వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రచారం, ప్రోత్సాహం ఇవ్వాలి ►బయోపెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసే యూనిట్లను గ్రామాల స్థాయిలో ప్రోత్సహించాలి ►ఆర్బీకేల భాగస్వామ్యంతో కనీసం ప్రతి గ్రామానికీ 3 యూనిట్లు ఉండేలా చూడాలి ►దీనివల్ల కల్లీ లేకుండా, నాణ్యమైన సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయి విత్తనం నుంచి విక్రయం వరకూ.. ►విత్తనం నుంచి విక్రయం వరకూ.. అనే నినాదం ఆర్బీకేల విధులు కావాలి: ►విత్తనం నుంచి విక్రయం వరకూ మధ్యనున్న కార్యకలాపాల్లో రైతులకు చేదోడు, వాదోడుగా ఆర్బీకేలు నిలబడతాయి: ►ఆర్బీకేల కార్యకలాపాలు, వాటిని మరింత సమర్థవంతంగా నడిచేలా వ్యవసాయ వర్శిటీ తన కార్యాచరణ రూపొందించుకోవాలి: ►ఆర్బీకే కార్యకలాపాలను కేటగిరీలుగా విభజించాలి: ►మార్కెటింగ్, పంటలకు ముందు, పంటల తర్వాత తదితర అంశాలపైన అగ్రి వర్శిటీ పాఠ్యప్రణాళిక రూపొందించాలి ►తర్వాత వారు అప్రెంటిస్లో భాగంగా వీటిపై పట్టు సాధించాలి. దీనివల్ల వారికి ఈ అంశాల్లో సమర్థత పెరుగుతుంది: ►రైతు బజార్ల నిర్మాణంకూడా నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేసేలా దృష్టిపెట్టాలన్న సీఎం మార్కెట్ యార్డుల్లో నాడు –నేడు ►ఇప్పుడున్న మార్కెట్ యార్డుల్లో నాడు –నేడుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం ►దాదాపు రూ.212 కోట్లతో నాడు – నేడు కింద పనులు చేపట్టాలని ప్రతిపాదనలు ►రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ఆధునీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశం ►ఈ సందర్భంగా ఆర్బీకేల పై సీఎంకు వివరించిన అధికారులు ►రాష్ట్రంలో 10,641 ఆర్బీకేలతోపాటు కొత్తగా 125 అదనపు అర్బన్ ఆర్బీకేలు ఏర్పాటు ►మొత్తంగా రాష్ట్రంలో 10,766 ఆర్బీకేలు ►ఆర్బీకే హబ్లలో వాహనాల సంఖ్య 65 నుంచి 154కు పెంపు ►ప్రతి ఆర్బీకేల్లోనూ కంప్యూటర్, ప్రింటర్లు, యూపీఎస్, బయోమెట్రిక్ డివైజ్లు ►మార్చి 31 నుంచి 147 నియోజకవర్గాల స్థాయి ల్యాబులు పని ప్రారంభిస్తాయని వెల్లడించిన అధికారులు ►13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబులు జూన్ 30 కల్లా ఏర్పాటవుతాయన్న అధికారులు -
ఫుడ్ ప్రాసెసింగ్@రూ.10వేల కోట్లు
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమికంగా ఆహార ఉత్పత్తుల శుద్ధి, రెండో దశ ప్రాసెసింగ్ తదితరాల కోసం దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నందున యూనిట్లన్నీ అత్యంత నైపుణ్యంతో ప్రొఫెషనల్ విధానంలో పనిచేస్తూ రైతులకు అండగా నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రాసెసింగ్ అనంతరం మార్కెటింగ్ కోసం ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లపై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అదనపు విలువ జోడించాలి... రైతులకు మంచి ధరలు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. నిర్దేశిత ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే రైతులకు తెలియచేస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించడం ముఖ్యం. ఇందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ప్రాసెసింగ్ యూనిట్లకు ముడి పదార్థాలు అందించేలా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ సంస్థలకు అప్పగించాలి. ఆధునిక విధానంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? అందుకు అనుగుణంగా ఎక్కడెక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు కార్యాచరణ రూపొందించాలి. రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడే సామర్థ్యంతో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలి. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాల్యూ యాడ్తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక విభాగం కృషి చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఒక మెగా ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. 25 యూనిట్లకు రూ.2,900 కోట్లు... రాష్ట్రంలో 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కార్యాచరణపై సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి వీటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, అరటి, టమాటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడిపై వివరాలు తెలియచేస్తూ ప్రాసెసింగ్ యూనిట్లకు దాదాపు రూ.2,900 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. -
అదే మా లక్ష్యం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు మంచి ధరలు అందించాలన్నదే లక్ష్యమని.. దీని కోసం అనేక చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఫుడ్ ప్రాససింగ్ క్లస్టర్లపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి, ఆ మేరకు ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఫుడ్ ప్రాససింగ్ రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు, వాటి వల్ల ఉపయోగాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రాసెసింగ్ చేసిన తర్వాత మార్కెటింగ్ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామని అధికారులు తెలిపారు. (చదవండి: ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్) మొక్కజొన్న, చిరుధాన్యాలు (మిల్లెట్స్), కందులు, అరటి, టమోటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాససింగ్ ప్లాంట్లపై అధికారులు ప్రతిపాదనలు వివరించారు. ప్రాససింగ్ యూనిట్లకు దాదాపు రూ.2900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటును అధికారులు ప్రతిపాదించారు. సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే మనం రైతులకు చెప్తున్నామని పేర్కొన్నారు. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందన్నారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ (వాల్యూ ఎడిషన్) జోడించడం చాలా ముఖ్యమని, దీని కోసం ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. వ్యవసాయ మార్కెటింగ్ విభాగం, ప్రాససింగ్ యూనిట్లకు ముడి పదార్థాలను అందించేలా ఉండాలని, ప్రాసస్ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్లో వివిధ సంస్థలకు అప్పగించాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? దానికి సరిపడా ఎక్కడెక్కడ ప్రాససింగ్ ప్లాంట్లను పెట్టాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు!) ‘‘రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సరి పడే సామర్థ్యంతో ఈ ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాససింగ్, వాల్యూ యాడ్తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలి. దీనిపై మరింతగా పరిశీలన, అధ్యయనం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాససింగ్, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక వింగ్ పని చేయాలి. ఫుడ్ ప్రాససింగ్ రంగంలో ఒక మెగా ప్లాంట్ అవసరం ఉందన్న అధికారులు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి. అలాగే రెండో దశ ప్రాససింగ్, మొత్తం ఈ కార్యక్రమాల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లపై పెద్ద ఉత్తున డబ్బు వెచ్చిస్తున్నందున యూనిట్లన్నీ కూడా అత్యంత ప్రొఫెషనల్ విధానంలో నడవాలని, రైతులకు అండగా నిలవాలి. వాటి నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రాససింగ్ యూనిట్లు బలోపేతంగా, సమర్థవంతంగా నడపడం వల్ల రైతులకు అండగా నిలిచినట్టు అవుతుంది. ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఏపీ ఆత్మనిర్భర్ లక్ష్యం రూ.20,860 కోట్లు
సాక్షి, అమరావతి : దిగుమతులపై కాకుండా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి దశలో కనీసం రూ.20,000 కోట్ల పై చిలుకు కేంద్ర నిధులతో భారీ ప్రాజెక్టులను చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. కోవిడ్-19 తర్వాత భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా సొంత అవసరాలతో పాటు ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆరు రంగాల్లో సుమారు రూ.20,860 కోట్ల కేంద్ర నిధులతో ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.6,000 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్వై) కింద రూ.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెగా ఫుడ్ పార్కులు, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనుంది. ఈఎంసీ-2 కోసం 3,760 కోట్లు మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు 90 శాతం చైనా నుంచే దిగుమతి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీపై దృష్టి సారించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్ల కోసం ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-2 (ఈఎంసీ-2) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,760 కోట్ల వరకు కేంద్ర నిధులను వినియోగించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీని ఏర్పాటు చేస్తోంది. దీనికి అదనంగా చిత్తూరు జిల్లా పాదిరేడు అరణ్యం వద్ద మరో ఈఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి అదనంగా ఐటీ రంగంలో పార్కుల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.100 కోట్ల నిధులు రాబట్టడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.1,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ దేశీయ ఫార్మా అవసరాలకు తగ్గట్టుగా కనీసం మూడు బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఒక్కో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. దీన్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలతో గట్టిగా పోటీపడుతోంది. రూ.5,000 కోట్లతో మౌలిక వసతులు సరుకు రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక రైల్వే కారిడార్లు, పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టులను కలిపే విధంగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీనికి కింద కనీసం రూ.5,000 కోట్లకు తక్కువ కాకుండా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టే అవకాశముందని అంచనా. రూ.5,000 కోట్లతో పారిశ్రామిక ఇన్ఫ్రా దేశంలో పారిశ్రామిక రంగ మౌలిక వసతులను పెంచడానికి కేంద్రం ప్రత్యేకంగా పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్డిట్)ను ఏర్పాటు చేసి నిధులను విడుదల చేస్తోంది. రాష్ట్రం మీదుగా వెళుతున్న మూడు పారిశ్రామిక కారిడారల్లో తొలి దశ కింద వివిధ క్లస్టర్లను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. -
రత్నమ్మ.. రియల్ ఫుడ్ హీరో!
అనేక ఆహార పంటలను పండించడమే కాదు, వాటిని శుద్ధి చేసి నేరుగా వినియోగదారులకు అందిస్తూ ఇతర మహిళా రైతులకు కూడా అండగా ఉంటున్నారు ఫుడ్ హీరో కె. రత్నమ్మ (55). రత్నమ్మది అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలపూరు గ్రామం. 15 ఏళ్ల క్రితమే భర్త ఇల్వు వదలి ఎటో వెళ్లిపోయినా మనోధైర్యంతో నిలబడి ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశారు. మూడెకరాల మెట్ట, నీటి వసతి ఉన్న రెండెకరాల భూమిలో కొర్రలు, సామలు, కందులు, అరికెలు, ఊదలు, వేరుశనగ వంటి పంటలను ఆమె సాగు చేస్తున్నారు. అంతేకాదు ఆమె మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాని (ఎఫ్.పి.ఓ.)కి ఆమె అధ్యక్షురాలు కూడా. 4 పంచాయతీల్లోని 270 మంది మహిళా రైతులు ఆ ఎఫ్.పి.ఓ.లో సభ్యులు. వీరికి విత్తనాలు ఇచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించేందుకు తోడ్పడటం, ఆ పంటను ఎఫ్.పి.ఓ. ద్వారా కొనుగోలు చేసి.. శుద్ధి చేయించి విక్రయించటం.. సభ్యులకు లాభాలు పంచటం.. ఇదంతా సమర్థవంతంగా చేస్తున్న నిజమైన ఫుడ్ హీరో రత్నమ్మ. ‘బుచ్చి పద్ధతి’లో మిక్సీలతో ఇంటిపట్టునే సిరిధాన్యాల పొట్టు తీసి బియ్యం తయారు చేస్తున్న రత్నమ్మ కొర్రలు, సామలను డా.ఖాదర్ వలి సూచించిన ‘బుచ్చి పద్ధతి’లో మిక్సీలతో ఇంటిపట్టునే పొట్టు తీసి బియ్యం తయారు చేసి గ్రామంలోని వారికి, ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తూ ఈ ఎఫ్.పి.ఓ. సభ్యులు మంచి ఆదాయం పొందుతుండటం విశేషం. తమ గ్రామాల్లో 79 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారిని ఎంపిక చేసి వారికి నెలనెలా ప్రత్యేకంగా తయారు చేసిన సిరిధాన్యాల కిట్ను అందిస్తుండటం రత్నమ్మ చేయిస్తున్న మరో మంచి పని. ‘రెడ్స్’ సంస్థ వ్యవస్థాపకులు భానుజ (9440017188) తోడ్పాటుతో రత్నమ్మ తన జీవితాన్ని చక్కదిద్దుకోవడంతో పాటు ఎఫ్.పి.ఓ.లోని ఇతర మహిళా రైతులకు మెరుగైన జీవనానికి బాటలు వేస్తున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ ఫుడ్ హీరోలందరికీ జేజేలు!రత్నమ్మ -
ఫుడ్ ప్రాసెసింగ్పై 8 ఒప్పందాలు
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై దృష్టి పెట్టాం. అరటి, టమాటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్పై పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాం. తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. నైపుణ్యాభివృద్ధి కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న కాలేజీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలి. జిల్లాల్లో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ ల్యాబుల్లో అంతర్భాగంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. సాక్షి, అమరావతి: రైతులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏడెనిమిది ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్పై శుక్రవారం సీఎం సమక్షంలో క్యాంపు కార్యాలయంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం, వివిధ సంస్థలు, కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్పై సీఎం జగన్ సమీక్షిస్తూ మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్లో పెద్ద పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమని, ఇలాంటి అంశాల్లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనేది ప్రధాన అంశమని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్వా ఉత్పత్తులకు తగిన ధరలు లభించేలా అడుగులు వేస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్పై రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు చూపుతున్న నెదర్లాండ్స్ కంపెనీ ప్రతినిధి కొర్నీలియా. చిత్రంలో సీఎం వైఎస్ జగన్, మంత్రి కన్నబాబు, అధికారులు అవగాహన ఒప్పందాలు ► అరటి పంటకు సంబంధించి ఎన్ఆర్సీ బనానా తిరుచ్చితో ఒప్పందం చేసుకున్నారు. కొత్త మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోషన్తో పాటు క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలపై వారు పని చేస్తారు. ఎన్ఆర్సీతో ఒప్పందంపై ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శివ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ సంతకాలు చేశారు. డ్రై చేసిన అరటి ఉప ఉత్పత్తిని వారు సీఎంకు చూపించారు. ► అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్పై పుణెకు చెందిన ఫ్యూచర్టెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ సీఈవో అజిత్ సోమన్ ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం (వాక్యూమ్ టెక్నాలజీ)పై సీఎం జగన్కు వివరాలు అందించారు. ► టమాటా, అరటి ప్రాసెసింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై బిగ్ బాస్కెట్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ జోనల్ హెడ్ కె.రామచంద్ర కిరణ్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ► మామిడి, చీనీ, మిరప వంటి పంటల ప్రాసెసింగ్పై ఐటీసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి.కృష్ణకుమార్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ► లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ (లీప్) కంపెనీ సీఈవో విజయ రాఘవన్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉల్లి ప్రాసెసింగ్పై దృష్టి పెట్టనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ► ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్లో అత్యంత కీలకమైన ఇంటీరియర్ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్ ప్రభుత్వంతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్లో న్యూఢిల్లీ నుంచి భారత్లో నెదర్లాండ్స్ అంబాసిడర్ మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెదర్లాండ్స్ ప్రతినిధి శాన్నీ గీర్డినా క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు. ► రొయ్యలు, చేపల పెంపకంలో టెక్నాలజీ, మార్కెటింగ్ తదితర అంశాలపై ఐఎఫ్బీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. ► రొయ్యలు, చేపల ఎగుమతి, రిటైల్ మార్కెటింగ్పై అంపైర్ కంపెనీతో ఎంవోయూ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ ఫుడ్ కార్పొరేషన్ సీఈవో శ్రీధర్రెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు సంతకాలు చేశారు. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశాయ్ ఫ్రూట్స్ కంపెనీ నుంచి అజిత్ దేశాయ్, తిరుచ్చి ఎన్ఆర్సీబీ నుంచి డాక్టర్ ఉమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైతులకు మేలు జరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఫుడ్ ప్రాసెసింగ్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్లో పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమని, లేని పక్షంలో మార్కెటింగ్ సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి అంశాల్లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ చాలా ముఖ్యం అన్న ఆయన, దీని కోసం కంపెనీలతో అనుసంధానం చేసిన తర్వాతనే ముందడుగు వేయాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని నిర్దేశించారు. జిల్లాల్లో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ ల్యాబుల్లో అంతర్భాగంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటు చేయాలని సూచించారు. (చదవండి: ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్) రైతులు తరచుగా ఇబ్బందులు పడుతున్న 7, 8 ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని, ఆ ప్రాసెసింగ్ సెంటర్లలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఆక్వా రంగం రైతులకూ మేలు జరగాలని, వారి ఉత్పత్తులకు తగిన ధరలు లభించాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎమ్వీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. (చదవండి: సీఎం జగన్ కృషితో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్..) ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు.. సమీక్షా సమావేశం అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్పై నెదర్లాండ్ ప్రభుత్వం, 8 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అరటి, టమోటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్పై పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నూతన టెక్నాలజీ, కొత్త ఉత్పత్తుల తయారీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. పంట చేతికి వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధానాలు, అందులో టెక్నాలజీ అంశాలను కంపెనీలు వివరించారు. ♦అరటికి సంబంధించి ఎన్ఆర్సీ బనానా తిరుచ్చితో ఒప్పందం జరిగింది. కొత్త మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోషన్తో పాటు క్వాలిటీ టెస్టింగ్ ల్యాబరేటరీలపై వారు పని చేస్తారు. ఎన్ఆర్సితో ఒప్పందంపై ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శివ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సురేష్కుమార్ సంతకాలు చేశారు. డ్రై చేసిన అరటి ఉప ఉత్పత్తిని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దాని తయారీ విధానంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానంపై సమావేశంలో సమగ్రంగా వివరించారు. ♦అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్పై పుణెకు చెందిన ఫ్యూచర్టెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై సీఎం వైఎస్ జగన్కు కంపెనీ సీఈఓ అజిత్ సోమన్ వివరాలు అందించారు. వాక్యూమ్ టెక్నాలజీ ఉపయోగాలను ఆయన వివరించారు. ♦టమోటా, అరటి ప్రాసెసింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై బిగ్ బాస్కెట్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ జోనల్ హెడ్ కె.రామచంద్ర కిరణ్ ఆ ఎంఓయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అనంతపురంలో ప్రాసెసింగ్ చేస్తున్నామన్న ఆయన, కలెక్షన్ సెంటర్లపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. ♦మామిడి, చీనీ, మిరప వంటి పంటల ప్రాసెసింగ్పై ఐటీసీతోనూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి.కృష్ణకుమార్ ఆ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ (లీప్) కంపెనీ సీఈఓ విజయ రాఘవన్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉల్లి ప్రాసెసింగ్పై దృష్టి పెట్టనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ♦ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్లో అత్యంత కీలకమైన ఇంటీరియర్ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్ ప్రభుత్వంతో, ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్లో న్యూఢిల్లీనుంచి భారత్లో నెదర్లాండ్స్ అంబాసిడర్ మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెదర్లాండ్స్ ప్రతినిధి శాన్నీ గీర్డినా క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు. ♦రొయ్యలు, చేపల పెంపకంలో టెక్నాలజీ, మార్కెటింగ్ తదితర అంశాలపై ఐఎఫ్బీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. రొయ్యలు, చేపలు ఎగుమతి, రిటైల్ మార్కెటింగ్పై అంపైర్ కంపెనీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ ఫుడ్ కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్రెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆయా ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశాయ్ ఫ్రూట్స్ కంపెనీ నుంచి అజిత్ దేశాయ్, తిరుచ్చి ఎన్ఆర్సీబీ నుంచి డాక్టర్ ఉమ పాల్గొన్నారు. -
ఆర్బీకేల్లో ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ప్రాథమిక స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి) చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్బీకేల వద్ద గోడౌన్లు, గ్రేడింగ్ ఎక్విప్మెంట్, సార్టింగ్ పరికరాలను అందుబాటులోకి తెచ్చి వీటి ద్వారా ప్రైమరీ ప్రాసెసింగ్ (ప్రాథమిక స్థాయిలో శుద్ధి) చేయాలన్నారు. జనతా బజార్ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఆర్బీకేలలో ప్రాథమికంగా ప్రాసెస్.. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రాథమికంగా ప్రాసెస్ చేయాలి. తర్వాత దశల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలి. ప్రతి మండలానికి కోల్డు స్టోరేజీ సదుపాయం కల్పించాలి. గిరిజన ప్రాంతాల్లో కూడా గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీ లాంటి సదుపాయాలు ఉండాలి. నియోజకవర్గానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి. రైతులు భరోసాగా ఉండగలగాలి.. పంటలు అమ్ముకోలేక పోయామంటూ భవిష్యత్తులో రైతులు ఎక్కడా ఆందోళన చెందే పరిస్థితి రాకూడదు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి, వేరుశనగ, కందులు, మొక్కజొన్న, మినుములు, శనగలు, జొన్న తదితర పంటలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాటి మార్కెటింగ్తోపాటు ఫుడ్ ప్రాసెసింగ్పైనా దృష్టి పెట్టాలి. అప్పుడే ఆలోచించాం.. నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం. టమాటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆర్బీకేల గురించి ఆలోచన వచ్చినప్పుడే వీటన్నిటిపై దృష్టి పెట్టాం. వ్యవసాయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం. జనం కోసం జనతా బజార్లు.. రైతులు పండించిన ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా ప్రత్యేక ఫ్లాట్ఫాం కూడా తెస్తున్నాం. గ్రామాల్లో జనతా బజార్లను తెచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలు జరుగుతుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా గిడ్డంగుల నిర్మాణం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల నిర్మాణం చేపట్టాలి. ప్రతిపాదనల రూపకల్పన సమయంలోనే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి వేగంగా శీతలీకరించేందుకు ఐక్యూఎఫ్లను ఏర్పాటు చేయాలి. అక్క చెల్లెమ్మలను ఆదుకుంటున్నాం.. ► చేయూత, ఆసరా పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటున్నాం. ► అమూల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. పాడి పశువుల పెంపకం ద్వారా జీవనోపాధి మార్గాలను పెంచుతున్నాం. పాల సేకరణకు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాల విషయంలో సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. నిధుల సమీకరణ ప్రణాళికనూ ఖరారు చేయాలి. కొన్ని సమస్యలున్నా.. ► ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయే పరిస్థితిపై దృష్టి పెట్టాం. అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ► సీఎం సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నతో, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మారుతున్న పంటల సరళిని దృష్టిలో పెట్టుకుని ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ప్రగతిభవన్లో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా ఆహారశుద్ధి రంగంలో చిన్న యూనిట్లతోపాటు గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఆహార ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో జల విప్లవం ఫలితంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతోపాటు నీలి విప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) అభివృద్ధి చెందుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో క్రాప్ మ్యాపింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తితో పాటు గొర్రెలు, చేపల పెంపకం కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. భవిష్యత్తులో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలను నూతన పాలసీలో ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ, యువత, మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని వివరించారు. బాల్కొండ నియోజకవర్గంలోని స్పైస్ పార్క్లో పసుపు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని, ఆర్మూర్ నియోజకవర్గంలోని లక్కంపల్లి సెజ్లో సోయా, మక్కల ఆహారశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలని మంత్రులు కేటీఆర్ను కోరగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు చేసిన సూచనలివే.. పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ఆయా రంగాల్లో యాంత్రీకరణ ప్రోత్సహించాలి. గిరిజన ప్రాంతాల్లో చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు దళిత, మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు దక్కేలా చూడాలి. తెలంగాణ బ్రాండ్ పేరిట నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూడటంతో పాటు, ఆహార కల్తీని అరికట్టాలి. పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. నూనె గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహం ఇవ్వాలి. పళ్లు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా వృ«థా తగ్గి రైతులకు లాభం జరుగుతుంది. -
రైతులకు అండగా వాల్మార్ట్ ఫౌండేషన్
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్మార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచింది. చింతపల్లి ఏరియాలో పండించే పసుపు పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, ఇక్కడ పండే పసుపులో మందుల తయరీకి ఉపయోగించే కర్కుమిన్ 5 నుంచి 7 శాతం ఉండటంతో గిరాకీ అధికంగా ఉంటుంది. అయితే లాక్డౌన్ సమయంలో ఈ పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండటంతో టెక్నో సెర్వ్ అనే లాభాపేక్ష లేని సంస్థ సహకారంతో వాల్మార్ట్ ఫౌండేషన్ ఈ పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల 2,500 మంది చిన్న,సన్నకారు రైతులు లబ్ధిపొందినట్లు వాల్మార్ట్.ఆర్గ్, డైరెక్టర్ (స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్) షెర్రీ-లీ సింగ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. ►రైతులు తమ పంటను అమ్ముకోవడమే కాకుండా ఈ వ్యవసాయ సీజన్లో మరో పంటను వేసుకోవడానికి వీలుగా వారి చేతికి నగదు అందుతోంది. ►ఇప్పటి వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా 15కు పైగా రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా 17,000 మంది రైతులకు ప్రయోజనం లభించింది. ► ఈ లాక్డౌన్ సమయంలో పసుపుతో పాటు, జీడిపప్పు, మిరియాలు కూడా కొనుగోలు చేసినట్లు టెక్నోసెర్వ్ ఇండియా కంట్రీ హెడ్ పునీత్ గుప్తా తెలిపారు. -
పంటల అమ్మకం కష్టం కాకూడదు
పంటలకు తగిన మార్కెటింగ్ లేక, కనీస గిట్టుబాటు ధరలు రాక ఏటా అరటి, చీని,టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, మిర్చి తదితర పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు అమ్ముకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయా పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలి. మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడకూడదని, వారు ఎక్కడా రోడ్డెక్కే పరిస్థితి కనిపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని పంటలకు మార్కెటింగ్ లేక కనీస గిట్టుబాటు ధరలు రాని అంశాన్ని స్వయంగా ఆయనే ప్రస్తావించారు. ఈ సీజన్ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలని, దీని కోసం ఎంత ఖర్చు అయినా పర్వా లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కావాలి ► రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఏ పంట, ఎంత వరకు కొనుగోలు చేయాలి? ఎంత మేర ఫుడ్ ప్రాసెసింగ్కు తర లించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. ► పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో పాటు, వాటి మార్కెటింగ్లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. అవసరమైతే ధరల స్థిరీకరణ నిధి ఉపయోగిస్తుంది. ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్లు వ్యయం చేశాం. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవస్థీకృతంగా సిద్ధం కావాలి. ► వచ్చే సీజన్ కల్లా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా మార్కెటింగ్ లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులకు ప్రధానంగా ఇబ్బందులు తెస్తున్న ఏడెనిమిది పంటలను గుర్తించాలి. వాటి ప్రాసెసింగ్తో పాటు, వాల్యూ ఎడిషన్ ఏం చేయగలమో ఆలోచించాలి. వీటి కోసం మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. ► ప్రాథమికంగా ఆర్బీకే స్థాయిలో, ఆ తర్వాత మండల, నియోజకవర్గ స్థాయిల్లో అంచనాలు తయారు చేయాలి. ► వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలి
-
రైతులు కష్టాలు పడకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కష్ట పడకూడదని, సంబంధిత పంటల విషయంలో ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీని కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. వచ్చే సీజన్ కల్లా ఫుడ్ ప్రాసెసింగ్కు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో ఫుడ్ ప్రాసెసింగ్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘అరటి, చీనీ, టమోటా రైతులు ప్రతి ఏటా ఆందోళన చెందుతున్నారు. కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఎంత మేర కొనుగోలు చేయాలి, ఎంత మేర ఫుడ్ప్రాససింగ్కు తరలించాలన్నదానిపై అధికారులు దృష్టిపెట్టాలని’’ సీఎం పేర్కొన్నారు. దీని కోసం ఖర్చు ఎంత అయినా పర్వాలేదు.. కాని సమస్యకు పరిష్కారం ఉండాలని సీఎం జగన్ సూచించారు. (రాయలసీమలో నవశకం) ‘‘ప్రతి ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మలాంటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. మళ్లీ ఇలాంటి కథనాలు కనిపించకూడదు. ప్రతి ఏటా ఇలాంటివి పునరావృతం కాకూడదు. మిల్లెట్స్ ప్రాససింగ్పైన కూడా దృష్టిపెట్టండి. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రఖ్యాత కంపెనీలతో టై అప్ చేసుకోవాలి. ఇబ్బందులు వస్తున్న 7–8 పంటలను గుర్తించండి. వాటిని ప్రాసెసింగ్ చేసి... వాల్యూ ఎడిషన్ ఏం చేయగలమో ఆలోచనలు చేయండి. ఈ పంటల ప్రాసెసింగ్ చేయడానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తనకు నివేదించాలని’’ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నెలరోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తికావాలన్నారు. అవసరమైన చోట్ల ఆర్బీకేల స్థాయిలోనే ప్రాథమిక స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అంచనాలు తయారు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
పెట్టుబడులతో రండి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతుందని, తద్వారా వ్యవసాయ రంగంతో పాటు పాలు, మాంసం, చేపల ఉత్పత్తికి భవిష్యత్తులో భారీ అవకాశాలు ఏర్పడతాయని, పెద్ద మొత్తంలో ఫుడ్ప్రాసెసింగ్, వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రంగాల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సోమవారం ఏర్పాటు చేసిన వెబినార్లో కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు దీనికి హాజరయ్యారు. రెడీ టు ఈట్, బేవరేజెస్, కాయగూరలు, పండ్లు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వీరు ఆసక్తి చూపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత సౌకర్యవంతమైన విషయమని కేటీఆర్ వారికి వివరించారు. పెట్టుబడులకు బడా సంస్థల ఆసక్తి ఇప్పటికే తెలంగాణ అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలను ఆకర్షించిందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక పెద్దసంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రారంభించిన నూతన ప్రాజెక్టులతో భారీగా సాగునీటి వనరులు పెరుగుతాయని, తద్వారా వ్యవసాయ రంగంలో విభిన్న రకాలైన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించేందుకు వీలుగా రాష్ట్రం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉందన్నారు. రాష్ట్రంలో అపారంగా ప్రభుత్వ భూముల లభ్యత ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను సైతం ఏర్పాటు చేయనున్నామన్నారు. రైతులను సంఘటిత పరిచే రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వానికి లేదా పరిశ్రమ వర్గాలకు సులువవుతుందన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు లేదా ఇతర వర్గాలతో కలిసి వ్యాపారం నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిరుద్యోగ యువత, రైతులకు తక్కువ ధరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక చేయూత, మార్కెటింగ్ సేవలను అందించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ స్టార్టప్ అవర్ ఫుడ్ సిద్ధమైంది. ఈ మేరకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)తో ఒప్పందం చేసుకుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో 3 వేల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అవర్ ఫుడ్ సీఈఓ వీ బాలా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ స్థానిక బ్యాంక్లతో ఒప్పందం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ఫుడ్ పార్కుల్లో పెట్టుబడుల వేట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ద్వారానే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం సాధ్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరిగే అవకాశముందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రైతులకు భరోసాతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులతో దేశంలోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం పరిశ్రమల శాఖ సిద్ధం చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై కసరత్తు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పాలసీ’విధి విధానాలపై పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలను 21 క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో సాగయ్యే ప్రధాన, ఇతర పంటల వివరాలను సేకరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే పంటల వివరాలతో ‘స్టేట్ ఫుడ్ మ్యాప్’కూడా సిద్ధం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణలో ఇతర రాష్ట్రాల నుంచి ఎదురయ్యే పోటీకి సంబంధించిన నివేదికలు కూడా పరిశ్రమల శాఖ గతంలో రూపొందించింది. రాష్ట్రంలో నాలుగు మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు గతంలో కేంద్రం ఆమోదం తెలిపింది. నిజామాబాద్లో రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ప్రైవేటు మెగా ఫుడ్పార్కుకు 2018లో శంకుస్థాపన జరగ్గా, పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే రూ.14 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతో పాటు 50 వేల మంది యువతకు ఉపాధి దక్కడమే కాకుండా సుమారు లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఫుడ్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్లో ఫుడ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. బుగ్గపాడులో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుగ్గపాడు సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)లో డ్రైవేర్ హౌజ్, డీప్ ఫ్రీజ్, సబ్ జీరో కోల్డ్ స్టోరేజీ ఛాంబర్ తదితరాల నిర్మాణం పూర్తయింది. బుగ్గపాడు సీపీసీకి అనుబంధంగా వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మంలో టీఎస్ఐఐసీ ద్వారా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల (సీపీసీ) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ శివారులోని దండు మల్కాపూర్ పారిశ్రామిక పార్కుకు అనుబంధంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణపై పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. రాష్ట్రం వైపు భారీ పరిశ్రమల చూపు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయి. మనోహరాబాద్లో ఐటీసీ రూ.800 కోట్లు, బండ తిమ్మాపూర్లో ఆర్పీఎస్జీ సంస్థ రూ.200 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించాయి. సంగారెడ్డి జిల్లా గోవింద్పూర్లో రూ.207 కోట్ల పెట్టుబడితో హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ ప్లాంటు అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది. దీంతో పాటు డీఎక్స్ఎన్, కోకాకోలా, లులు గ్రూప్ తదితర సంస్థలు కూడా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని బుగ్గపాడు, బండ మైలారం, బండ తిమ్మాపూర్ తదితర ఫుడ్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలతో త్వరలో సమావేశం అయ్యేందుకు పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
పరిశ్రమలు 11,000 పెట్టుబడులు 1.73 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రూపొందించిన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానంగా చెబుతున్న టీఎస్ఐపాస్ ద్వారా ఐదేళ్లలో రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులతో 11 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటవగా 13 లక్షల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమలశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమల అనుమతుల్లో పారదర్శక, సరళమైన, అవినీతిరహిత విధానం రూపొందిన టీఎస్ ఐపాస్కు 2014 నవంబర్ 27న చట్టబద్ధత కల్పించింది. జిల్లాలవారీగా వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు 14 ప్రాధాన్యతా రంగాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని ఐపాస్లో లక్ష్యంగా నిర్దేశించింది. 3 కేటగిరీల్లో అవార్డులు.. నూతన పారిశ్రామిక విధానంగా పేర్కొనే టీఎస్ ఐపాస్కు చట్టబద్ధత కల్పించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావుతోపాటు మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి తదితరులు ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చట్టం అమల్లో ప్రతిభ చూపిన 33 జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఒక్కో కేటగిరీలో మూడేసి జిల్లాలకు బుధవారం అవార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, రెండో కేటగిరీలో సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మూడో కేటగిరీలో జగిత్యాల, మహబూబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల తరఫున ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకోనున్నారు. ప్రభుత్వ విభాగాల కేటగిరీలో ఉత్తర, దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థలు, భూగర్భ జలవనరులు, రెవెన్యూ విభాగాలకు అవార్డులు అందించనున్నారు. టీఎస్ ఐపాస్ను సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు ఈవీ నర్సింహారెడ్డి (టీఎస్ఐఐసీ), అర్వింద్ కుమార్ (మెట్రోపాలిటన్ కమిషనర్), టీకే శ్రీదేవి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్), కె. విద్యాధర్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), నీతూకుమారి ప్రసాద్ (పీసీబీ సభ్య కార్యదర్శి), అహ్మద్ నదీమ్ (లేబర్, ఇండస్ట్రీస్ కమిషనర్) అవార్డులు అందుకోనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, వ్యవసాయాధార, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాల పరిశ్రమలు టీఎస్ఐపాస్లో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఈ విధానం వల్లే దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా వాటిలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఐపాస్ మూలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జాతీయస్థాయిలో తొలి 2 స్థానాల్లో కొనసాగుతోంది. రాజధాని పరిసరాల్లోనే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా గ్రామాలకు విస్తరించే లక్ష్యంతో ఐపాస్లో భాగంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐపాస్ అమలుతో ఐదేళ్లలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో 70 శాతానికిపైగా వృద్ధి సాధించినట్లు పరిశ్రమలశాఖ నివేదిక వెల్లడిస్తోంది ఐపాస్ ప్రత్యేకతలివే పారిశ్రామిక అనుమతులు పొందడాన్ని హక్కుగా చేస్తూ దరఖాస్తుదారుడు ఆన్లైన్లో వివరాలు సమర్పించేలా టీఎస్ఐపాస్ చట్టం–2014 రూపొందించారు. 27 ప్రభుత్వ విభాగాల పరిధిలో 35 అంశాలకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వాటన్నింటినీ ఐపాస్ గొడుగు కిందకు తెచ్చారు. పారిశ్రామిక అనుమతులకు 110 రకాలైన పత్రాలను సమర్పించాల్సి ఉండగా వాటి సంఖ్యను పదికి కుదించారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా అనుమతి లభించని పక్షంలో అనుమతి లభించినట్లుగానే భావించాల్సి ఉంటుందనే నిబంధనకు చోటు కల్పించారు. రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడితో వచ్చే భారీ పరిశ్రమలకు అనుమతులను 15 రోజుల్లోనే ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ప్రక్రియను పర్యవేక్షించేం దుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ‘టీ స్విప్ట్’బోర్డుతోపాటు సీఎం నేతృత్వంలో ‘ఇండస్ట్రియల్ చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు దరఖాస్తు రుసుము చెల్లింపునూ ఇదే విధానం లో చేయాలని చట్టంలో స్పష్టం చేయడంతో భారీ ఫలితాలు సాధించినట్లు పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి.