
సాక్షి, అమరాతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు. ఇక 4,135 మంది థర్డ్జెండర్లు, 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.