
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్గా శ్రీకాంత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా మనీష్కుమార్ సిన్హాను నియమించింది. కొత్త జిల్లాలు, పాలన పరమైన కారణాల నేపథ్యంలో జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment