ఒంటరి జీవితం భరించలేక.. | - | Sakshi
Sakshi News home page

ఒంటరి జీవితం భరించలేక..

Published Wed, Jan 24 2024 6:38 AM | Last Updated on Wed, Jan 24 2024 10:25 AM

- - Sakshi

బి.కొత్తకోట : భర్త దూరమై ఒంటరి జీవితం భరించలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున బి.కొత్తకోటలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్‌ మారుతిరెడ్డి కథనం మేరకు వివరాలు. స్థానిక కరెంట్‌ కాలనీలో నివాసం ఉంటున్న కె.లక్ష్మిదేవి, రెడ్డెప్పలు భార్యాభర్తలు. వీరికి సంతానం లేదు. భర్త రెడ్డెప్ప రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

ఇటీవల లక్ష్మిదేవి కూడా అనారోగ్యానికి గురైంది. భర్త దూరం కావడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించారు. మృతురాలి అక్క కుమార్తె రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement