
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల అంశాలతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయ 9.20 గంటలకు సెన్సెక్స్ 292 పాయింట్లు నష్టపోయి 66166 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 19647 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతి సుజికీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డిస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాటా స్టీల్, హిందాల్కో, హీరోమోటో కార్పొరేషన్, లార్సెన్, దివీస్ ల్యాబ్స్,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..