How To Apply For Mahila Samman Savings Scheme Post Offices; Here More Details - Sakshi
Sakshi News home page

మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?

Published Tue, Apr 4 2023 11:04 AM

How to apply for Mahila Samman Savings scheme Post Offices details - Sakshi

సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా  ప్రకటించిన  2023-24 కేంద్ర బడ్జెట్‌లో  ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌   మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్  స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి  పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్‌ న్యూస్‌: యాపిల్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు)

మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి  రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం  2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. 

మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ ప్రయోజనాలు:
మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు.
మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌
రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ
త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ

ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్‌ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు  రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట.

ఎలా  నమోదు చేయాలి
స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్‌ తీసుకోవాలి
దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి  వివరాలను నమోదు చేయాలి
అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి
నగదు లేదా చెక్‌ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్  చేయాలి
ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ​ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ మీ చేతికి వస్తుంది
డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది
ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ  మెచ్యూరిటీకి ముందు,  బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు.

చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో  మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

(ఇదీ చదవండి: స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్)

Advertisement
Advertisement