Union Budget 2023-24
-
కేంద్రం పన్నుపోటు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంచనాలు తలకిందులు
న్యూఢిల్లీ: అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా ఉత్పత్తులకు ఏమంత డిమాండ్ కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5,00,000కు మించి ఉంటే పన్ను చెల్లించాలంటూ నిబంధనలను బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. కాకపోతే మార్చి 31 వరకు కొనుగోలు చేసే పాలసీలకు ఈ నిబంధన వర్తించదు. దీంతో అధిక ప్రీమియం ప్లాన్లను మార్చి ఆఖరులోపు కంపెనీలు పెద్ద ఎత్తున విక్రయిస్తాయని నిపుణులు భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అనుకున్న విధంగా వీటి విక్రయాలు ఏమీ పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ.5,00,000కు పైగా ప్రీమియం చెల్లించే ప్లాన్లకు సంబంధించి గడువు తీరిన తర్వాత అందే మొత్తం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా ప్రకటించారు. అధిక పన్ను పరిధిలోని వారు ఈ ప్లాన్లను తీసుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం సెక్షన్ 10(10డి) కింద ఉంది. బడ్జెట్లో ప్రకటన తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు అధిక ప్రీమియంతో కూడిన నాన్ పార్టిసిపేటరీ గ్యారంటీడ్ ఉత్పత్తులకు ఫిబ్రవరి, మార్చిలో అనూహ్య డిమాండ్ ఉంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ అవకాశం లేనందున చాలా మంది ముందుకు వస్తారని భావించాయి. సాధారణ అమ్మకాలే.. ఫిబ్రవరి నెలలో అధిక ప్రీమియం బీమా ఉత్పత్తుల అమ్మకాలు పెద్దగా పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో పెద్ద ఎత్తున అమ్ముడుపోవచ్చని బీమా కంపెనీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్తో దరఖాస్తు ఫారమ్ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
టాప్ గేర్లో మౌలికాభివృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్: ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫీషియెన్సీ విత్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అనే అంశంపై వర్చువల్గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి. మౌలికాభివృద్ధి టాప్గేర్లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం. ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు. రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం ‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు. ప్రగతి పథంలో భారత్ బిల్గేట్స్ ప్రశంసల వర్షం ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్పవిషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్గేట్స్ ట్వీట్చేశారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు. -
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్నాథ్కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
బడ్జెట్ ప్రకటనలపై ప్రధాని మోదీ వెబినార్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రకటించిన పలు నిర్ణయాలపై భాగస్వాములతో ప్రధాని వెబినార్లు నిర్వహించనున్నారు. గురువారం గ్రీన్ గ్రోత్ పై తొలి వెబినార్ జరగనుంది. ఇందులో వ్యవసాయం, కోపరేటివ్ రంగాల భాగస్వాములతో ప్రధాని మాట్లాడనున్నారు. బడ్జెట్ తర్వాత ప్రధాని 12 వెబినార్లను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 11 వరకు ఇవి జరుగుతాయని తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల రంగం, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు, మహిళా సాధికారత, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) అంశాలపై ఈ వెబినార్లు నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన సప్షర్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, భాగస్వాములు అందరి మధ్య సమన్వయం, ఏకతాటిపైకి తీసుకురావడంలో భాగంగా ఈ వెబినార్ల నిర్వహణకు ప్రధాని ఆమోదం తెలిపినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. -
ధరల స్పీడ్ను నిలువరిస్తున్నాం..
జైపూర్: ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. ఉదాహరణకు, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశలో పప్పుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే స్థానిక లభ్యతను మెరుగుపరచడానికి కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. వివిధ వర్గాలతో 2023 బడ్జెట్ తదుపరి చర్చాగోష్టి నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన ఆర్థిక మంత్రి విలేకరులతో ఇంకా ఏమన్నారంటే.. ‘‘గత మూడేళ్లుగా వంట నూనెల దిగుమతిపై దాదాపు పన్ను విధించడంలేదు. దీని కారణంగా పామ్ క్రూడ్, పామ్ రిఫైన్డ్ ఆయిల్ అందుబాటులో విఘాతం కలగడం లేదు. వంట నూనెల సరఫరా సులభతరం కావడంతోపాటు, డిమాండ్ను దేశం తేలిగ్గా ఎదుర్కొనగలుగుతోంది. ధరల స్పీడ్ ఇదీ... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూ వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న వినియోగ ధలర సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపది క అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4% గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4న మొదటిసారి 0.40% పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అర శాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. దీనితో రెపో మొత్తంగా 6.5 శాతానికి చేరింది. జనవరి రిటైల్ ధరల స్పీడ్ నేపథ్యంలో ఏప్రిల్లో జరిగే పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఎన్పీఎస్ నిధులు బదిలీ చేయలేం కాగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కోసం డిపాజిట్ అయిన నిధులను ప్రస్తుత చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించలేమని అటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో పాటు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కూడా స్పష్టం చేశారు. ‘‘ఏదైనా రాష్ట్రం ఎన్పీఎస్ కోసం డిపాజిట్ చేసిన నిధులను వారికి తిరిగి ఇవ్వవచ్చని ఆశించినట్లయితే అది అసాధ్యం’’ అని వారు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ఇటీవల భారీ పతనాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉటంకిస్తూ, జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) పెట్టుబడి పెట్టే షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వదిలివేయలేని పేర్కొన్నారు. ఎన్పీఎస్లో డిపాజిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను రాష్ట్రాలకు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు నిధులను బదిలీ చేయకపోతే రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ సీనియర్ అధికారి నుంచి వచ్చిన ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పాత పెన్షన్ స్కీమ్కు తిరిగి వెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ పుంజుకోవడం మంచి పరిణామం కాదని ఆర్థిక కార్యదర్శి జోషి ఈ సందర్భంఆ స్పష్టం చేశారు. ‘‘కొత్త పెన్షన్ పథకంలోని డబ్బు ఉద్యోగులకు సంబంధించినది. ఇది ఉద్యోగి– ఎన్పీఎస్ ట్రస్ట్కు మధ్య ఒప్పందం. ఉద్యోగి మెచ్యూరిటీకి ముందు లేదా పదవీ విరమణ వయస్సు రాకముందే నిష్క్రమిస్తే, అప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి’’ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. అనంతరం బీఆర్ఎస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు. విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. -
బడ్జెట్లు మనుషుల కోసం కాదా?
కేంద్ర బడ్జెట్లో పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తువుల ప్రస్తావనే అత్యధికం. ఈ ‘అమృత్ కాల్’ బడ్జెట్లో అమృతం ఉంది. అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు పార్లమెంటులో ఉంచే ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... పాత విధనాల సమీక్ష, కొత్త పథకాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగా నైనా ఉండేవి. 2015–16 నుంచి ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. ‘‘గత సంవత్సరం వందేళ్ళ భారత్’ పేరుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పునాదుల మీద ఆధారపడి ఈ ఏడాది బడ్జెట్ రూపొందింది. అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలు, అందరు పౌరులకు ప్రత్యేకించి యువత, మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు అందిస్తూ సంపన్న సమ్మిళిత పురోగతిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.’’ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్న మాటలివి. ఇవి మాటలే. బడ్జెట్ ప్రసంగం మొదటి పేరాలోని పలుకులివి. మిగతా ప్రసంగంలో ఎక్కడా ఆ మాటలకు సంబంధించిన ప్రస్తావనా లేదు; నిధుల కేటాయింపు అంతకన్నా లేదు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ భాగం పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తు వుల ప్రస్తావనే అత్యధికం. ‘అమృత్ కాల్’ బడ్జెట్ అని పేరుపెట్టుకున్న ఈ బడ్జెట్లో అమృతం చాలా ఉంది. అయితే అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. అంటే ప్రాణంలేని వస్తువులకు నిరుపయోగ, నిష్ఫలామృతం. ప్రభుత్వాలుగానీ, సంస్థలుగానీ, ఏదైనా బడ్జెట్ తయారు చేసు కునేటప్పుడు ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, భవిష్యత్ బాగుకోసం పథకాలు రాసుకుంటారు. మనవాళ్ళు కూడా గతంలో ఆ సాంప్రదాయాన్ని పాటించారు. దానికే ‘ఎకనామిక్ సర్వే’ అని పేరుపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు దీనిని పార్లమెంటు ముందుంచుతారు. ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. అయితే 2014 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న సర్వే ఫార్మాట్ వేరు. ఆ తర్వాత దాని దారే వేరు. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... ప్రగతి, పాత విధనాల సమీక్ష, కొత్త పథ కాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగానైనా ఉండేవి. ఆశ్చర్యమేమి టంటే, 2015–16 నుంచి భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. దీనిని చాలా మంది ఆర్థిక వేత్తలు, బడ్జెట్ విశ్లేషకులు, ప్రతిపక్షాల పెద్దలతో సహా ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అందరూ ఏదో లోకంలో ఉన్నారు. ‘అమృత్ కాల్’లో తేలియాడుతున్నారు. ఇది కేవలం అధ్యాయం గల్లంతు కావడం కాదు, ఆలోచనా సరళిలో లోపం. అందుకే ఈ బడ్జెట్లో గానీ, 2022 ఎకనామిక్ సర్వేలో గానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, సమాజ స్థితిగతులు పట్టినట్టు కనిపించదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దృష్టి కోణం భిన్నమైనది. సైద్ధాంతికంగానే వీళ్ళు ఈ దేశంలో కులమనే ఒక వ్యవస్థ ఉన్నట్టుగానీ, దానివల్ల ఏర్పడిన, కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అణచివేత ఉన్నట్టుగానీ భావించరు. అందరూ హిందువులే అనే భావన వారికి. అందుకే ఎస్సీ, బీసీల ఉనికి, వారి గురించిన ప్రత్యేక సామాజిక స్థితిగతులు వాళ్ల ఎన్నికల ప్రణాళికల్లో, బడ్జెట్లో అంతగా ప్రస్తావనకు రావు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలా లేదు. ప్రస్తుతం ఉన్న పథకాలను చాలా వాటిని నిర్వీర్యపరిచే పనికి కూడా పూనుకున్నారు. కేంద్రంలో ఎస్సీలు, బీసీలు, అనాథలు, దివ్యాంగుల కోసం కలిపి ఇప్పటికే ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది. చాలామంది ప్రస్తుతం ఉన్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖను ఎస్సీల కోసమే ననుకుంటున్నారు. అది నిజం కాదు. అది ఎస్సీ, బీసీలకు కూడా. ఈ రెండు వర్గాలు కలిస్తే దాదాపు 65 శాతానికిపైగా ఉన్న సంగతిని కూడా ప్రభుత్వాలు మరచిపోయాయి. ఎస్సీ, బీసీలు కూడా మరిచి పోయారు. ఎస్సీ, బీసీలు కలిసి ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోసం ఇప్పటి వరకు బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2015–16లో మొత్తం బడ్జెట్ 16 లక్షల 63 వేల కోట్లు కాగా, అందులో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 5,380 కోట్లు. అంటే ఇది 0.32 శాతం మాత్రమే. అదేవిధంగా 2016–17లో 17 లక్షల 90 వేల కోట్ల మొత్తం బడ్జెట్లో కేటాయించింది 5,752 కోట్లు మాత్రమే. ఇది కూడా 0.32 శాతం దాటలేదు. అట్లా 2017–18లో 0.33 శాతం, 2018–19లో 0.31 శాతం. అదేవిధంగా 2020–21లో 35 లక్షల 90æవేల కోట్ల బడ్జెట్లో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 8,065 కోట్లు. ఇది 0.23 శాతం. ప్రతి సంవత్సరం పెరగాల్సింది. కానీ దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాది ఆ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ దేశ బడ్జెట్ పెరుగుదలలో దానిశాతం పెరుగుతున్న దాఖలా లేదు. రాజ్యాంగం అందించిన హక్కు ప్రకారం ప్రారంభించిన– ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వినియోగం కూడా దారుణంగా ఉంది. గతంలో దీనిని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్గా పిలిచే వాళ్ళు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ను తొలగించి, దాని స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పరిచారు. బడ్జెట్లో కూడా ప్లాన్, నాన్ ప్లాన్ పేర్లను తొలగించి రెవెన్యూ, క్యాపిటల్ అనే పదాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీల కోసం ప్లాన్ నిధుల నుంచి కేటాయించాల్సిన వాటిని ఎస్సీ కాంపోనెంట్గా, ఎస్టీ కాంపో నెంట్గా పిలుస్తున్నారు. అయితే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులను కేటాయించాలి. వాటి వివరాలను చూస్తే కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ఆదివాసీ వ్యతిరేకత అర్థం కాగలదు. గత ఎనిమిదేళ్ళలో ఎస్సీ కాంపోనెంట్ కింది కేటాయించిన నిధులు సగానికి పైగా దారి మళ్ళినట్టు వారి లెక్కల్లోనే కనిపిస్తున్నది. ఇప్పటికే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను బాధిస్తున్నాయి. పేదరికం, ఆరోగ్యం, విద్య విషయంలో మిగతా సమాజానికీ ఎస్సీ, ఎస్టీలకూ మధ్య అగా«థం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, యాంత్రీకరణ, ఆధునికీకరణ విధా నాలు ఈ వర్గాలను మొత్తంగానే సమాజ ప్రగతి నుంచి దూరం నెడు తున్నాయి. ఈ బడ్జెట్లో కొత్తదేమీ లేదుకానీ, కోట్లాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈ నైపుణ్యాల శిక్షణ గురించిన గత అనుభవాలు అంత మంచి ఫలితాలను ఇచ్చినట్టు లేవు. సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలతో కూడిన విద్యలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఇందులోకి ఎస్సీ, ఎస్టీ యువత వెళ్ళలేరు. ఎందుకంటే, అందులో రిజర్వేషన్లు లేవు. అందుకే బడ్జెట్లో భారత దేశ సమాజం కనిపించాలి. దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి పూనుకోవాలి. కానీ ఆ ప్రయ త్నాలను ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. మొదట్లో చెప్పినట్లు దీనిని వాళ్లు అసలు సమస్యగానే చూడడం లేదు. ఇప్పుడు తమను తాము తరచి చూసుకోవాల్సింది ఆయా వర్గాలే. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోతే, ప్రజలు ఎందుకు ప్రభుత్వా లను పట్టించుకోవాలి? ఇదే ఇప్పుడు అందరూ ప్రశ్నించుకోవాల్సిన కీలకమైన సందర్భం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
కోరమ్ లేక వాయిదా
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన తర్వాత సభలో కోరమ్ లేదన్న విషయాన్ని అదే పార్టీ ఎంపీ దయానిధి మారన్ లేవనెత్తారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. కోరమ్ బెల్లు మోగించాలని సిబ్బందికి సూచించారు. తగిన సంఖ్యలో సభ్యులను సమీకరించడంలో ప్రభుత్వ ఫ్లోర్ మేనేజర్లు విఫలమయ్యారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కోరమ్ అంటే? లోక్సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు సభలో ఉండాలి. దీన్నే కోరమ్ అంటారు. -
ఏనాడో గాడితప్పిన కేంద్ర బడ్జెట్లు!
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి ప్రభాకర్ అంటించిన చురక జ్ఞాపకం వచ్చింది. దేశ ప్రజాబాహుళ్యం స్థితిగతుల్ని పాలకులు పరిశీలించకపోబట్టే శ్రమ విలువను 75 ఏళ్లుగా గణించలేకపోయారు. ప్రణాళికలకూ, ఆచరణలో అమలు చేయని అతిశయోక్తులకూ మాత్రం తక్కువేమీ లేదు! భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కాస్తా నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. దేశ తొలి ప్రధానమంత్రి పదవిలోకి రాక ముందు, దేశానికి స్వాతంత్య్రమనేది ఏ పరిస్థితుల్లో ‘నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదో’ ఇలా స్పష్టం చేశారు: ‘‘ప్రత్యేక హక్కులనూ, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ తమ హక్కుల్ని తాముగా వదులుకున్నట్టు చరిత్రకు దాఖలాల్లేవు. సాంఘిక మార్పులు రావా లంటే ఒత్తిడి, లేదా బల ప్రయోగం అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం, ఈ స్వార్థ ప్రయోజనాలకు భరతవాక్యం పలకడమనే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదు’’. ఇంతకన్నా మరో గొప్ప సత్యాన్ని 1992లో సుప్రసిద్ధ అమెరికన్ పత్రిక ‘టైమ్’ ప్రకటించింది: ‘‘కమ్యూనిజం పతనం కావొచ్చు. కానీ క్యాపిటలిజమూ, ప్రజాస్వామ్యమూ శాశ్వతంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ జయప్రదం కాగలగవన్న గ్యారంటీ ఏమీ లేదు’’! ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పెరిగి పెద్ద మహమ్మారి రూపం దాల్చిన అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ‘చిట్కా వైద్యాల’తో ఉపశమింప జేసుకోవడమే గానీ ఆ సంక్షోభ లక్షణాలు ఈ రోజుకీ సమసిపోలేదు. కనుకనే అమెరికా ఆశీర్వాదాలతోనే నెలకొన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అత్యున్నత స్థాయి అధికారిగా, సలహాదారుగా ఈ సంస్థలను విశ్వసించి రంగంలోకి దిగి ఎలాంటి దారుణానుభవం చూడవలసి వచ్చిందో వివరించారు డేవిసన్ బుధూ. ఇప్పటికీ అమెరికా, ప్రపంచబ్యాంకు సంస్థలను నమ్ముతున్న భారత నాయకులు డేవిసన్ బుధూ అనుభవాల నుంచి గుణపాఠం తీసుకోలేక పోతున్నారు. చివరికి ఆంగ్లో – అమెరికన్ సంస్థలే భారత ఆర్థిక వ్యవస్థను పాలకులు నిర్వహిస్తున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నా ‘మనసూ, చర్మం’ మందబారిపోయి దులిపేసుకునే దశలో ఉన్నారు. ఆసియా, ఆఫ్రికాలలో తన దారుణానుభవాలను డేవిసన్ ఇలా గుండె బరువుతో ప్రపంచం కళ్లముందుంచారు (బుధూ 1988లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కామ్డెసెస్కు రాసిన సుదీర్ఘ రాజీనామా): ‘‘మీరు లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలకూ, ప్రజలకూ అందించమని నా చేతికి అందించిన వరల్డ్ బ్యాంక్ – ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల ఔష ధాన్నీ, రకరకాల చిట్కాలనూ (బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్) సంవత్సరాల తర బడిగా అందజేస్తూనే వచ్చాను. కానీ ఏళ్ల తరబడిగా ఈ దేశాల్లో గడించిన అనుభవం దృష్ట్యా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందు కంటే, ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్ల సామాన్య ప్రజల రక్తంతో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. మలినమై పోయిన ఈ నా చేతుల్ని కడుక్కోవడానికి నేను తీసు కున్న మంచి నిర్ణయమే ఈ రాజీ నామా. అయ్యా! కామ్డెసెస్ గారూ! ఈ దేశాల్లో మనం చేస్తున్న పనుల వల్ల పేదల రక్తం నదులై పారుతోంది. ఒక్కోసారి నాలో నేననుకుంటాను – ఐఎంఎఫ్ బ్యాంకుల తరఫున మీ పేరిట, మీకు ముందు పని చేసిన అధిపతుల పేరిట లేదా మీ అధికార ముద్రల చాటున నేను చేయ వలసి వచ్చిన పాపాలను కడిగేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో దొరికే సబ్బులు కూడా ఏ మూలకూ చాలవని.’’ (ఎనఫ్ ఈజ్ ఎనఫ్: 1988). కాగా, కడిగి పారేసిన ఆ ‘సబ్బుల్ని’ ఇండియాలో మొదటగా పీవీ నరసింహారావు హయాంలో అందుకుంటే, వాటిని ఆంధ్రప్రదేశ్లో వాడి ప్రజలకు ‘టోపీ’ పెట్టడానికి ప్రయత్నించినవాడు ప్రపంచ బ్యాంక్ ‘పెంపుడు బిడ్డ’ చంద్రబాబు! ఇక భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది బీజేపీ పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. ఆ పథకం కింద కేటాయింపులన్నీ దారి మళ్లుతున్నాయి. పైగా 2023 బడ్జెట్ ఏడాది కాలపరిమితికి మించకపోయినా, దేశ స్వాతంత్య్రం వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అంటే 2047 నాటి ‘లక్ష్యాల దిశగా ఈ బడ్జెట్ ఉంద’ని స్వయంగా ప్రధానమంత్రి ‘కోత’ కోయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇండియా లాంటి వర్ధమాన దేశాలలోని కారుచౌక కూలీరేట్ల ఫలితంగా విదేశీ కంపెనీలు పోటీ మీద ఇండియాలో ప్రవేశించి, ఉద్యోగుల్ని తొలగించడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోగా ఆ విధానాలనే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఎసరు పెట్టడంలో పాలకులు అనుసరిస్తూ, ప్రైవేటు వారికి ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు. దీన్ని ఎవరో కాదు, స్వయానా ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ డైరెక్టర్ సి.ఫ్రెడ్ బెర్గ్స్టెన్ ఎదురు తన్నిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ బ్యాక్లాష్) అని వర్ణించాల్సి వచ్చింది. ‘వ్యవస్థాగతమైన సర్దుబాట్లు అంటే, ‘ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగాల నుంచి పౌరుల్ని తొలగించేయడమేనని బెర్గ్స్టెన్ స్పష్టం చేశాడు. స్విస్ బ్యాంకులు, తదితర విదేశీ బ్యాంకుల్లోకి దొంగ చాటుగా ప్రవేశించిన డబ్బును తిరిగి దేశంలోకి తెచ్చి దేశ ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచుతామన్న పాల కులు ఆచరణలో మొండి చేయి చూపించడం మరపురాని అనుభవంగా మిగిలి పోయింది. ‘కోవిడ్’ వల్ల ప్రజా బాహుళ్యానికి కల్గిన నష్టం కన్నా దాని పేరిట జరిగిన మిలాఖత్ వ్యాపార లావాదేవీల వల్ల ప్రజ లకు వాటిల్లిన నష్టం ఎక్కువ. పోతన భాగవత కథల్లో ‘రహూగణుడ’నే ఒక అహంకారి ఉంటాడు. అతడెక్కిన పల్లకీ ఈ దేహమే. కానీ, దాన్ని మోసే బోయీలు ‘ఓంకారాన్ని’ వల్లిస్తూ నడుస్తారు, అలసట తెలియకుండా ఉండటం కోసం. పల్లకీలో కూర్చున్నవాడి ప్రయాణం మాత్రం సుఖంగానే సాగుతుంది. నేడు మన దేశ ప్రజల్ని పాలకులు పల్లకీ బోయీలుగా మార్చారు. నేటి దేశ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఆంత్రోపాలజిస్ట్ గ్లెన్ డేవిస్స్టోన్ వెల్లడించాడు: ‘‘పాలకులు వ్యవసాయం పేరిట వెచ్చిస్తున్న డబ్బంతా రైతాంగ శ్రేయస్సుకు కాదు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుతున్న పారిశ్రామిక వేత్తల శ్రేయస్సు కోసం’’.క్రీ.పూ. 2100 సంవత్సరంలోనే సుమేరియా ఏలికలు ఆర్థిక వ్యవస్థను ప్రజాపరం చేసి ఎలా ప్రజా బాహుళ్యాన్ని కరువు కాటకాలు లేకుండా కాపాడుతూ వచ్చిందీ చరిత్ర నమోదు చేసింది. బాబిలో నియా, ఈజిప్టులలో సహితం రాచరిక పాలనల్లోనూ ప్రజలు సుఖంగా జీవించారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత ప్రజలకు మసకబారని ఉషోదయాన్ని 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పాలకులు ప్రసాదించగల స్థితిలో లేకపోవడం విషాదకరం. కరెన్సీ సంక్షోభం వల్లనే దేశ పరిస్థితులు ఒడుదొడుకుల్లో పడ్డా యని పాలకులు చెప్పే మాటలు విని సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ గతంలో ఓ కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్లో ఉన్న పేద లంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ‘ఇది మనం పుట్టినప్పటి నుంచీ నోరు మూసుకుని అనుభవిస్తున్నదే కదరా’ అనుకుంటారు. ఆ తంతే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతూండటం సిగ్గుచేటు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
టైర్–2, 3 నగరాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ‘దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు’.. బుధవారం కేంద్రం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇది. దేశంలోని నగరాలను మహా నగరాలు, మెట్రో నగరాలు, మెగా సిటీలు, చిన్న సిటీలు అంటూ రకరకాలుగా పిలుస్తుంటాం. వీటిలో ఈ టైర్ 1, 2, 3.. ఇలా విభజన ఏమిటి?.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ. అదేమిటో మనమూ ఓసారి చూద్దాం.. దేశంలో మహా నగరాలు, నగరాలు, పట్టణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏవి టైర్ 1, ఏవి టైర్ 2, టైర్ 3? వీటిని ఎలా విభజన చేస్తారన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ ‘టైర్’ విధానం మొదట రియల్ ఎస్టేట్ రంగంలో 2007లో మొదలైంది. పది లక్షలు మించిన జనాభా ఉన్న నగరాలను టైర్ 1 గా, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్ 2 సిటీలుగా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని టైర్ 3 గా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ సైతం 5 వేల నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాలను ఆరు విభాగాలు (టైర్)గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో టైర్ 1 విభాగంలో 8 నగరాలు ఉన్నాయి. టైర్ 2 విభాగంలో 104 నగరాలు చేరాయి. మిగిలినవి టైర్ 3 కేటగిరీలో ఉన్నాయి. టైర్ 2, 3 నగరాల అభివృద్ధిపై దృష్టి కరోనా సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రం హోం విధానంలోని ప్రయోజనాలను పరిశ్రమలు గ్రహించాయి. టైర్ 1 సిటీలుకంటే తమ పెట్టుబడులకు టైర్ 2 సిటీలు మేలని, వీటిలో జీవన వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వర్క్–లైఫ్ మధ్య సమతుల్యత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించాయి. పైగా, అనువైన ధరల్లో అద్దె ఇళ్లు లభ్యమవడం, ఖర్చులు కూడా బడ్జెట్లో ఉండటంతో ఈ సిటీలపై ఆసక్తి చూపుతున్నాయి. దాంతో టైర్ 2 సిటీల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టైర్ 2 సిటీలైన విశాఖపట్నం, నెల్లూరులో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తమ వ్యాపారాలకు కేంద్రంగా ఎంచుకున్నాయి. టైర్ 2, 3 నగరాల్లో ప్రాధాన్యత రంగాలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండే ఈ ఫండ్ను పట్టణ మౌలిక సదుపాయాల కోసం స్థానిక పట్టణ సంస్థలు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్ 2 మున్సిపాలిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. టైర్ 1 నగరాలివీ.. అధిక జనాభా, ఆధునిక వసతులతో ఉన్నవి టైర్ 1 (జెడ్ కేటగిరీ) విభాగంలోకి వస్తాయి. వీటిని మెట్రోపాలిటన్ నగరాలుగా పిలుస్తారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, పూణే టైర్ 1 విభాగంలో ఉన్నాయి. ఈ నగరాల్లో అధిక జనసాంధ్రతతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరిశ్రమలు, టాప్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్య, పరిశోధన సంస్థలు ఉంటాయి. ఈ నగరాల్లో జీవన వ్యయమూ అధికంగా ఉంటుంది. వీటిని బాగా అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పవచ్చు. టైర్ 2 సిటీలు భారతదేశంలో 104 నగరాలు టైర్ 2 విభాగంలో ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. అయితే, టైర్ 1, టైర్ 2 నగరాల మధ్య పెద్దగా తేడా లేదని అర్బన్ ప్లానర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నగరాల్లో జీవన శైలి, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, జీవన వ్యయం మాత్రం టైర్ 1 సిటీలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనా. పెట్టుబడులకు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు ఈ నగరాలు అనువైనవిగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు టైర్ 2 సిటీలుగా ఉన్నాయి. టైర్ 3 నగరాలు అంటే.. టైర్ 2 ఉన్నవి తప్ప మిగిలిన నగరాలు, పట్టణాలను టైర్ 3 విభాగంలో చేర్చారు. ఒకవిధంగా చెప్పాలంటే గ్రేడ్ 2, 3 మున్సిపాలిటీలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ పట్టణాల్లో వసతులను మెరుగుపచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
కారుణ్య బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్ సకల జనుల బడ్జెట్గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్ భారత్ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి. 2023–24 కేంద్ర బడ్జెట్ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్ కాల్ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్ మ్యాప్ని అందించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్ సకల జనుల బడ్జెట్గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్ అనే ఈ డాక్యుమెంట్ 2047లో భారత్ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్ 100 (వందేళ్ల భారత్) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్ చర్య లను ప్రతిపాదించింది. సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ (పీఎమ్–వికాస్) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్ ఆక్సిలేటర్ ఫండ్ కల్పన, ‘దేఖో అప్నా దేశ్ ఇనిషి యేటివ్’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా, అమృత్ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్’ గుండా మార్కెటింగ్ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం. అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్ ఎకానమీ వంటి క్రాస్ కటింగ్ థీమ్లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్ మ్యాప్లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం. అదేవిధంగా ‘పంచామృత్’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా నూతన ప్లాంట్లను నెలకొల్పే గోవర్ధన్ స్కీమ్ (10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్లో నొక్కి చెప్పడమైనది. సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్ సపోర్ట్ మిషన్ ద్వారా నీతి ఆయోగ్ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 500 బ్లాక్ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది వేస్తాయి. సుమన్ బెరీ వ్యాసకర్త నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
సీతమ్మా.. దయ ఏదమ్మా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు దండిగా నిధులు వస్తాయనే ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. రైల్వే కేటాయింపులపై శుక్రవారం రాత్రికి కానీ స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ఈ బడ్జెట్లో మోక్షం లభించలేదు. కొన్నింటిని అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. కీలకమైన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కనీసం నాలుగైదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారని ఆశ పడ్డారు. 22 ఏళ్ల క్రితం రూ.645 కోట్లతో మొదలైన ఈ రైల్వే లైన్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,892 కోట్లకు పెరిగింది. దీనికి తగినట్టుగా కేటాయింపులు లేవని కోనసీమ వాసులు పెదవి విరుస్తున్నారు. కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని, 57 కిలోమీటర్ల రైల్వే లైను కోసం గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలపై నిర్మాణంలో ఉన్న మూడు వంతెనల పనులు వేగం అందుకుంటాయని అందరూ ఆశించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేస్తే వైనతేయపై బోడసకుర్రు – పాశర్లపూడి మధ్య మందకొడిగా జరుగుతున్న తొమ్మిది పిల్లర్ల పనులు ఊపందుకునేవని అంటున్నారు. పెండింగ్లో ఉన్న 528 ఎకరాల భూసేకరణకు కూడా ఈ కేటాయింపులు సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న కాకినాడ – పిఠాపురం మెయిన్ లైన్ ఊసే బడ్జెట్లో లేకుండా పోయింది. ఈ రైల్వే లైను కోసం నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనికరించ లేదు. కాకినాడ మెయిన్ లైన్ నిర్మాణానికి రూ.40 కోట్లతో 22 ఏళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ లభించింది. కాకినాడ పోర్టు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం వస్తున్నా మెయిన్ లైన్ నిర్మాణం అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని పలువురు అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు రాములోరి సన్నిధికి వెళ్లేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 151 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ ప్రాజెక్టును 2012–13లో రూ.1,445 కోట్లతో ఆమోదించారు. అనంతరం అంచనాలు రూ.2,154.83 కోట్లకు చేరాయి. దీనికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైళ్లకు హాల్టులు సహా పలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్లో ఎటువంటి స్పష్టతా కనిపించలేదు. -
సాక్షి కార్టూన్ 03-02-2023
-
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
వామ్మో..రికార్డు స్థాయికి బంగారం ధర, కారణాలేంటో తెలుసా?
సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను, బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్లతో సమానంగా సిల్వర్ డోర్, బార్లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది. -
కేంద్ర బడ్జెట్: చదివింపులు 1.12 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు కావడం గమనార్హం. పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించగా ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1,04,277.72 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలు ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లుగా ఉన్నాయి. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా కలను సాకారం చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి మూడు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలు అత్యున్నత విద్యాసంస్థల్లో ఏర్పాటు కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో మెరుగైన సేవలు అందించేలా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో వంద ల్యాబ్లు ఏర్పాటవుతాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీని నెలకొల్పి నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ 2020) చిత్తశుద్ధితో అమలు చేసే లక్ష్యంతో కేంద్ర పరిధిలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు ఈసారి రూ.4,235.74 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 12.8 శాతం నిధులు అదనంగా కేటాయించారు. యూజీసీకి గ్రాంట్లను రూ.459 కోట్లు పెంచారు. సెంట్రల్ యూనివర్సిటీలకు 17.66 శాతం, డీమ్డ్ యూనివర్సిటీలకు 27 శాతం గ్రాంట్లు పెరిగాయి. గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఐఐటీలకు 14 శాతం, ఎన్ఐటీలకు 10.5 శాతం పెరిగాయి. మెరుగ్గా ఉపాధ్యాయ శిక్షణ వినూత్నంగా పెడగాగి అంశాలు, కరిక్యులమ్లో మార్పులు, నిరంతర నైపుణ్యాల అభివృద్ధి తదితరాలతో ‘డైట్’కేంద్రాలను సరికొత్తగా ఆవిష్కరించి టీచర్ శిక్షణను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నియామకాలు చేపట్టనున్నారు. ఏకలవ్య రెసిడెన్సియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.5,943 కోట్లు కేటాయించారు. వజ్రాల తయారీ రీసెర్చ్కు గ్రాంట్ ల్యాబ్ల్లో వజ్రాల తయారీ (ఎల్జీడీ) టెక్నాలజీకి ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓ ఐఐటీకి ఐదేళ్ల పాటు రీసెర్చ్ గ్రాంట్ అందచేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 విద్యా రంగంలో డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పెద్దపీట వేయటాన్ని ఎడ్టెక్ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డిజిటల్ విప్లవం దిశగా దీన్ని కీలక చర్యగా అభివర్ణిస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ఎడ్టెక్ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని జడ్ఏఎంటీ సంస్థ వ్యవస్థాపకుడు ఆరుల్ మాలవీయ పేర్కొన్నారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతకు బడ్జెట్లో గుర్తింపు లభించిందని చెప్పారు. ఎడ్టెక్ కంపెనీలు, స్టార్టప్లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు తాజా చర్యలు దోహదం చేస్తాయన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ వనరులపై నిధులు వెచ్చించాల్సిన అవసరాన్ని బడ్జెట్ చాటి చెప్పిందని కూ ఇండియా, కీ బ్రిడ్జి గ్లోబల్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు అమోద్ దని చెప్పారు. నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు కృషి చేస్తాయని ఫిజిక్స్వాలా కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయం న్యూఢిల్లీ: కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.25,448.75 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.267 కోట్లు అధికం కావడం విశేషం. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. 2022–23లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్’ను ప్రతిపాదించారు. దీనికింద పొదుపు చేసిన మొత్తంపై రెండేళ్ల కాలానికి రూ.7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తారు. మహిళ లేదా ఆడ శిశువు పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. పాక్షికంగా ఉపసంహరించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇదొక చిన్న తరహా పొదుపు పథకం. మహిళ ఆర్థిక సాధికారత కోసం ‘దీన్దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఒక్కో సంఘంలో వేలాది మంది మహిళలు ఉంటారని తెలిపారు. ఉత్పాదక సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంఘాల లక్ష్యమని వివరించారు. మహిళా రైతులకు రూ.54,000 కోట్ల లబ్ధి పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు రూ.2.25 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో 3 కోట్ల మంది మహిళా రైతులు రూ.54,000 కోట్ల మేర లబ్ధి పొందుతారని తెలియజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో రూ.25,448.75 కోట్లు కేటాయించగా, ఇందులో సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు రూ.20,554.31 కోట్లు, మిషన్ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మిషన్ శక్తికి రూ.3,143 కోట్లు కేటాయించారు. అలాగే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(సీఏఆర్ఏ), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలకు రూ.168 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది రూ.4 కోట్లు అధికం. పెట్టుబడి పరిమితి రెట్టింపు సీనియర్ సిటిజెన్ సేవింగ్ పథకం(ఎస్సీఎస్ఎస్)లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండగా, ఈ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సింగిల్ అకౌంట్లో ఇకపై గరిష్టంగా రూ.9 లక్షలు (ప్రస్తుతం రూ.4.5 లక్షలు) పెట్టుబడి పెట్టొచ్చని అన్నారు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చని సూచించారు. ఇవి పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ అందించే పథకాలు. -
సోషల్ మీడియాను ముంచెత్తిన బడ్జెట్ మీమ్స్
2023–24 బడ్జెట్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టు చేసిన మీమ్స్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్, వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి, సిగరెట్లపై వా రు చేసిన మీమ్స్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్గా ని లిచాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టే ముందే మొదలైన మీమ్స్ హడావుడి... మధ్యతరగతికి ఆదాయపరిమితి పెంపు ప్రతిపాదనతో పతాక స్థాయికి చేరాయి. అలాగే సిగరెట్లపై 16% పన్ను పెంపు ప్రతిపాదనతో నిరాశ చెందిన పొగరాయుళ్లు పెట్టి న మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఐటీ పరిమితి పెంపు కొత్త పన్ను విధానానికి వర్తిస్తుందని నిర్మల ప్రకటించడంపై చాలా మంది నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. ఈ పన్ను విధానంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూ మీమ్స్ పెట్టగా మరికొందరు మాత్రం తమకు ఏమీ అర్థం కాలేదన్న సంకేతాన్ని మీమ్స్ రూపంలో పోస్టు చేశారు. -
బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..!
కేంద్ర బడ్జెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్టైన్మెంట్ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఉద్యోగి కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్లకి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకి 50శాతం కన్సెషన్ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు. సొంతిల్లు సొంతిల్లు అనేది మధ్య తరగతికి కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు. మహిళ ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్ కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం బడ్జెట్లో గల్లంతైంది. గోల్డ్ బార్స్ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్ తగిలినట్టైంది. విద్యార్థి కోవిడ్–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది. బడిముఖం చూడకుండా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. నిరుద్యోగి ఇది లే ఆఫ్ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్ స్లిప్ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖర్చైపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది. -
‘ఇంటి’పై ఎల్టీసీజీ పరిమితి రూ.10 కోట్లే
ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ అసెట్స్ కొనుగోలు చేసి విక్రయించగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపునకు ఆర్థిక మంత్రి సీతారామన్ పరిమితి తీసుకొచ్చారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద గరిష్టంగా 10 కోట్ల మొత్తానికే పన్ను మినహాయింపు పరిమితం చేశారు. అంటే ఒక ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని, మరో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పన్ను లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఈ మూలధన లాభం రూ.10కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంపై ఇక మీదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఖరీదైన ఆస్తుల కొనుగోలుపై పన్ను మినహాయింపులు తగ్గించేందుకే ఇలా చేశారు. పన్నుల్లో రాయితీలు, మినహాయింపులను మరింత మెరుగ్గా మార్చే లక్ష్యంతో రూ.10 కోట్లకు పరిమితం చేసినట్టు మంత్రి చెప్పారు. ఇందులో సెక్షన్ 54 అన్నది ఒక ఇంటిని అమ్మగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని తీసుకెళ్లి మరో ఇంటి కొనుగోలు చేయడం ద్వారా మినహాయింపునకు సంబంధించినది. చదవండి: డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్! -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్పై లాభం వస్తుండగా, డీజిల్పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్!
‘ఈ జగమంతా రామమయం’ అన్నాడు ఆనాటి రామదాసు! ఈ నాటి నిర్మలా సీతారామమ్మ బడ్జెట్ పాట కూడా ఇదే. కాకపోతే.. జగము స్థానంలో భారత్ అని.. రాముడికి బదులు డిజిటల్ అని మార్చుకోవాలి! కేంద్ర ప్రభుత్వం ఏళ్ల క్రితం మొదలుపెట్టిన డిజిటలీకరణకు ఈ ఏడాది బడ్జెట్లోనూ మంచి మద్దతు లభించింది. దేశ పురోగతికి కృత్రిమ మేధను వాడుకోవడం మొదలు.. రైతన్న సమస్యలన్నింటికీ ఒక్క చోటే పరిష్కారాలు దక్కేలా చేయడం వరకూ పలు ప్రతిష్టాత్మక డిజిటల్ కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం.. వ్యవసాయానికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ ఏడాది బడ్జెట్లో ‘వ్యవసాయం’కోసం డిజిటల్ రూపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన ఇన్పుట్స్ (విత్తనాలు, ఎరువులు తదితరాలు) రైతులకు లభించేందుకు మాత్రమే కాకుండా... పండిన పంటకు జరిగే నష్టాలను నివారించేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. తగిన సమాచారం అందుబాటులో లేని కారణంగా రుణాలిచ్చేందుకు తటపటాయించే బ్యాంకులు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధారంగా రైతులకు అవసరమైనంత స్థాయిలో రుణా లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పంటల ఆరోగ్యంపై, ఇన్పుట్ల ఖర్చు, నేల సారం, ధరలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అనేక అంశాల సమాచారం ఈ ప్లాట్ఫామ్ ద్వారా బ్యాంకర్లకు అందుతుందని అంచనా. వీటి ద్వారా రైతుల రుణ అర్హతలనూ నిర్ణయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జన్ధన్ ఖాతాలు, డిజిటల్ పేమెంట్ల కారణంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేరుగా నగదు రూపంలోనే సాయం అందిస్తున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. రైతులకు ఉపయోగపడే అనేక ప్లాట్ఫామ్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాయి. ఐటీసీ ‘ఈ–చౌపాల్’ ‘దేహాత్’, ‘ఆర్య’, ‘రేష మండి’, ‘అనిమాల్.ఇన్’, ‘ఆక్వా–కనెక్ట్’’ వంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. కేంద్రం వీటిలోని మేలి అంశాల మేళవింపుగా కొత్త ప్లాట్ఫామ్ను రూపొందించవచ్చు. డిజిటల్ లైబ్రరీ పుస్తకం హస్తభూషణమన్న పాత పాటకు పాతరేసి.. పుస్తకాలను ఇప్పుడు డిజిటల్ రూపంలో అందించేందుకు ప్రయత్నం మొదలైంది. జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో, ప్రాంతాల్లో స్థాయిల్లోనూ యువతీ యువకులకు, బాలబాలికలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన పుస్తకాలను ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా అందించనున్నారు. కోవిడ్ కారణంగా చదువుల్లో డిజిటల్ టెక్నాలజీ అవసరం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ లైబ్రరీ ఏర్పాటు కానుండటం విశేషం. స్మార్ట్ ఫోన్లు మొదలుకొని, డెస్్కటాప్ల వరకూ అన్నింటి ద్వారా ఈ లైబ్రరీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రాల్లో పంచాయితీల స్థాయి లో భౌతిక గ్రంథాలయాల ఏర్పాటునూ ప్రోత్సహిస్తామని వాటిల్లోనే డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక అంశాల్లో అక్షరాస్యత కల్పించేందుకు, పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ఈ ల్రైబరీలు ఉపయోగపడతాయి.’’అని సీతారామన్ తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమాలను కూడా స్వచ్ఛంద సంస్థల సాయంతో ఈ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుసంధానిస్తామన్నారు. దేశం కోసం.. దేశంలోనే.. కృత్రిమ మేధ కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో మూడు అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మూడింటిలో వీటి ఏర్పాటు జరుగుతంది. వ్యవసాయం, ఆరోగ్యం, సస్టెయినబుల్ సిటీస్ రంగాల్లో పరిశోధనలు తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు తోడ్పాటునందిస్తాయి. ‘‘కృత్రిమ మేధ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు, దేశంలో సమర్థమైన కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యేందుకు’ఈ మూడు కేంద్రాలు ఉపకరిస్తాయి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ మంది కృత్రిమ మేధ కోర్సులకు మొగ్గు చూపుతారని, దేశ అభివృద్ధికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగూల్కు చెందిన ‘ఇండియ రీసెర్చ్ ల్యాబ్ కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల సాయంతో ఆరోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా.. ప్రజా ఆరోగ్య రంగం, వన్యప్రాణి సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అనేక అంశాల్లో కృత్రిమ మేధను వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5జీ కోసం వంద ల్యాబ్లు.. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం గత ఏడాది దేశంలో 5జీ సర్వీసులను మొదలుపెట్టింది. వేగవంతమైన నెట్వర్క్తోపాటు అనేక ఇతర లాభాలు తెచ్చిపెట్టగల ఈ 5జీ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునేందుకు దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్లు, ప్రిసిషన్ ఫారి్మంగ్, తెలివైన రవాణా వ్యవస్థలతోపాటు ఆరోగ్య రంగంలో ఉపయోగపడే అప్లికేషన్లను తయారు చేయడం వీటి లక్ష్యం. బ్యాంకులు, వివిధ నియంత్రణ సంస్థలు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ ల్యాబ్ కార్యకలాపాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు 225 ప్రాంతాల్లో ఈ 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 5జీ టెక్నాలజీలపై పరిశోధనలకు గాను ఈ ఏడాది రూ. 5.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.7.74 కోట్లు. టెలి కమ్యూనికేషన్స్, 5జీ టెక్నాలజీల్లో గత ఏడాది డిమాండ్ 33.7 శాతం వరకూ పెరిగింది. 2022–23లోనే ఈ రంగాల్లో 1.3 లక్షల ఉద్యోగాలకు డిమాండ్ ఉండగా.. ఏటికేడాదీ ఇది పెరుగుతోంది. 5జీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే ల్యాబ్ల వల్ల యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ఊపందుకుంటాయి. మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. నైపుణ్యాల వృద్ధికి భారీ ఊతం రేపటి తరం కొత్త టెక్నాలజీల్లో దేశ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది బడ్టెట్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందులో భాగంగా వివిధ రకాల నైపుణ్యాలను అందించనున్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణ పొందిన వారిని, కంపెనీలను ఒకచోటకు చేర్చడమూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకూ ప్రాధాన్యం లభించనుంది. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు నేరుగా ఆన్లైన్ పద్ధతిలో స్టైఫండ్ అందించనున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0లో భాగంగా కోడింగ్, కృత్రిమ మేధ, మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్ డ్రోన్స్ ఇతర సాఫ్ట్ స్కిల్స్ను అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశం మొత్తమ్మీద 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది. స్కిల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0 పేరుతో 2015లో మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్కిల్ ఇండియాలో భాగంగా పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని మరింత ఆధునికీకరించడం కూడా చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 2017లో, మూడో దఫా 2021లోనూ మొదలయ్యాయి. నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ఆర్థిక రంగ సంస్థలకు భారీగా ఉపయోగపడేలా కేంద్రం ఈ ఏడాది నేషనల్ డేటా గవర్నెన్స్ విధానం ఒకదాన్ని తీసుకు రానుంది. ఈ విధానం వల్ల స్టార్టప్ కంపెనీల్లో మరింత అధిక సంఖ్యలో సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయని, విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకూ అందుబాటులో లేని సమాచారం డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా నిర్దిష్ట సంస్థలకు అందుబాటులోకి వస్తుందని, వివిధ సంస్థలు ‘నో యువర్ కస్టమర్’లేదా కేవైసీ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవైసీలో భాగంగా అందరూ ఆధార్ వంటి వివరాలు మాత్రమే అడుగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు, బ్యాంకులు తమకు ఎదురయ్యే రిస్క్ ఆధారంగా ఇతర డాక్యుమెంట్లను కూడా కోరవచ్చు లేదా డిజిలాకర్ నుంచి తీసుకోవచ్చు. వ్యక్తులు డిజిలాకర్లో ఉంచుకున్న డాక్యుమెంట్లను కూడా అవసరాలకు తగ్గట్టుగా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలకు అందుబాటులోకి తేనున్నారు. డిజిలాకర్లో ప్రస్తుతం మనం పలు రకాల డాక్యుమెంట్లను స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఆధార్, పర్మనెంట్ అకౌంట్ నెంబరు (పాన్)లతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతల డాక్యుమెంట్లను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిని చూడగలిగే అవకాశం కొన్ని సంస్థలకు మాత్రమే ఉండగా.. కొత్త డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా మరిన్ని ఎక్కువ సంస్థలు అవసరాన్ని బట్టి చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. డిజిటల్ కేటాయింపుల తగ్గింపు? ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు మొత్తం రూ.4,785 కోట్లు కేటాయించారు. అయితే ఇది గత ఏడాది కేటాయింపుతో పోలిస్తే 37 శాతం తక్కువ. గత ఏడాది మొత్తం రూ.7603.5 కోట్ల కేటాయింపులు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జరిగింది. ముందుగా రూ.10,676 కోట్ల కేటాయింపులు జరిగినా సవరణల తరువాత ఈ మొత్తం తగ్గింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ఇండియా కార్యకలాపాలను చేపడుతుందన్న విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు రావడం, జీవితాంతం పనిచేసే ఐడెంటిటీ (ఆధార్, యూపీఐ, పాన్ వంటివి) అందించడం ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగం. అలాగే.. ప్రభుత్వ సేవలను డిజిటల్ టెక్నాలజీల సాయంతో అందివ్వడం, అన్ని భాషల్లోనూ ఈ టెక్నాలజీ ఫలాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారు. మౌలికం.. పెట్టుబడితో.. దేశ అభివృద్ధి వేగం పుంజుకునేలా భారీగా పెట్టుబడులు పెడతామని.. రోడ్లు, రైల్వే, విమాన, నౌకా రవాణా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడతామని నిర్మల తెలిపారు. బడ్జెట్లో మూలధన పెట్టుబడులకు కేటాయింపులను 10 లక్షల కోట్లకు (గతం కంటే 33% అదనం) పెంచుతున్నామని, ఇది దేశ జీడీపీలో 3.3% శాతానికి సమానమని పేర్కొన్నారు. -
ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: విదేశాల్లో పూర్తిగా తయారై (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్/సీబీయూ) భారత్లోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లు సహా అన్ని రకాల కార్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. విదేశాల్లో పూర్తిగా తయారైన వాటిని ‘సీబీయూ’లుగా చెబుతారు. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర (ఇన్వాయిస్ వ్యాల్యూ) ఉన్నవి లేదంటే ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ కార్లపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. ఎలక్ట్రిక్ కార్లు 40,000 డాలర్లకు పైన ధర ఉంటే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. సెమీ నాక్డ్ డౌన్ (ఎస్కేడీ/పాక్షికంగా తయారైన) కార్లపై (ఎలక్ట్రిక్ సహా) కస్టమ్స్ డ్యూటీని 30% నుంచి 35%కి పెంచారు. ప్రస్తుతం విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లు 40,000 డాలర్లు లేదా ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ మించిన∙డీజిల్ కార్లపై 100% కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2 శాతం వరకు పెరగనున్న ధరలు ప్రభుత్వం కస్టమ్స్ సుంకం పెంపు ప్రతిపాదనలతో కార్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ బెంజ్, లెక్సస్ ప్రకటించాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వం సవరించడంతో, ఎస్ క్లాస్ మేబ్యాచ్, జీఎల్బీ, ఈక్యూబీ ధరలపై ప్రభావం పడుతుందని మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్లోనే ఎక్కువ తయారీ చేస్తున్నందున 95 శాతం మోడళ్ల ధరలపై ప్రభావం ఉండదని చెప్పారు. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
Union Budget 2023-24: ఎంఎస్ఎంఈలకు చేయూత..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల కోసం డిజిలాకర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్లైన్లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉపశమనం.. ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్ ఇనక్మ్ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు. అంటే తమ వార్షిక టర్నోవర్లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్ స్కీమ్ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్లో 8 శాతం కింద (నాన్ డిజిటల్ రిసీప్ట్స్) లాభంగాను, డిజిటల్ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. -
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు రూ.37,828.15 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.37,828.15 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో సవరించిన అంచనా(రూ.27,547.47 కోట్లు)తో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ శాఖ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు బడ్జెట్లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. తాజా బడ్జెట్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ)కి రూ.35,777.35 కోట్లు కేటాయించారు. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కి రూ.2,050.80 కోట్లు కేటాయించారు. ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయడానికి ఐఆర్ఈడీఏ 1987లో ఏర్పాటయ్యింది. నేషనల్ సోలార్ మిషన్(ఎన్ఎస్ఎం) అమలు, ఈ రంగంలో లక్ష్యాల సాధన కోసం ఎస్ఈసీఐని 2011లో నెలకొల్పారు. -
అప్పటిదాకా స్టార్టప్లకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంకురసంస్థలకు కేంద్రం మరోసారి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే అంకురసంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. 2024 మార్చి నెలలోపు స్థాపించబడిన స్టార్టప్ సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు. ‘నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఫార్వార్డ్ చేసే వెసులుబాటును ప్రస్తుతమున్న ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నాం. 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31వ తేదీదాకా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2016–17 ఆర్థికసంవత్సర అంచనాలకు ముందు చెరకు రైతులకు ఇచ్చేసిన చెల్లింపులను చక్కెర సహకార సంఘాలు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. దీంతో చక్కెర సహకార సంఘాలకు రూ.10,000 కోట్లమేర లబ్ధిచేకూరనుంది. ‘కొత్త కోపరేటివ్లకూ 15 శాతం పన్ను లబ్ధి దక్కుతుంది. ల్యాబ్లలో తయారయ్యే డైమండ్ల కోసం వినియోగించే ముడి సరకుపై కస్టమ్ సుంకాలను సైతం తగ్గించే యోచనలో ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు తీసుకునే రుణం/ డిపాజిట్ చేసే మొత్తానికి రూ.2,00,000ను గరిష్ట పరిమితిగా విధించాలని భావిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. -
అమృత్కాల్ అంటే..
న్యూఢిల్లీ: అమృత్కాల్లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్ ఇదేనంటూ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్ వేసిన పునాదులపై నిర్మించబడిన బడ్జెట్ ఇది. పాతికేళ్లలో వందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్న భారత్కు బ్లూప్రింట్ ఈ పద్దు’ అని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి పలు మార్లు ప్రస్తావించిన ‘అమృత్కాల్’పై చర్చ మొదలైంది. అమృత్కాల్ ప్రత్యేకత ఏంటి అనేది ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 2021వ సంవత్సరంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తొలిసారిగా ‘అమృత్కాల్’ అనే భావనను తెరమీదకు తెచ్చారు. ‘దేశం 75 స్వేచ్ఛా స్వాతంత్ర వసంతాలు పూర్తిచేసుకుంది. మరో 25 సంవత్సరాల్లో దేశం శత వసంతాలు పూర్తిచేసుకోబోతోంది. అంటే 2021వ ఏడాది నుంచి వచ్చే 25 సంవత్సరాలు దేశానికి అమృతకాలంతో సమానం. ఈ 25 సంవత్సరాల్లోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరించాలి. ఇందుకు అనుగుణంగా పల్లెలు, పట్టణాలకు మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను చెరిపేయాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో డిజిటలైజేషన్ పాత్ర పెంచి ప్రజాజీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవాలి. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలి. ప్రతీ కుటుంబానికి బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, అర్హుడైన పౌరులకు ఆరోగ్య బీమా ఉండాలి. అందరి సమష్టి కృషి, అంకితభావం, త్యాగాల ఫలితంగానే ఇదంతా సాధ్యం. వందల ఏళ్లు బానిసత్వాన్ని చవిచూసిన భారతీయ సమాజం.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు మనకు మనం నిర్దేశించుకున్న పాతికేళ్ల లక్ష్యమిది’ అని ఆనాడు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అమృత్కాల్ అనే పదం మన వేదాల్లో ప్రస్తావించబడింది. కష్టాల కడలిని దాటి విజయతీరాలకు చేరుకునే కాలం. కొత్త పని మొదలుపెట్టేందుకు అత్యంత శుభసూచకమైన సమయంగా అమృత్కాల్ను భావిస్తారు. -
కోతలు.. కొత్త పథకాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు కోత పెట్టింది. ప్రధాన పథకాలన్నింటికీ కేటాయింపులను తగ్గించి వేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్య రంగానికి మాత్రం కాస్త నిధులు ఇచ్చింది. భారీగా తగ్గిన కేటాయింపులు 202223 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,51,521 కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్లో 5% తక్కువగా రూ. 1,44,214 కోట్లకు మాత్రమే ప్రతిపాదించారు.మొత్తంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు శాతాన్ని చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది 3.84% ఇవ్వగా, ఈసారి 3.20 శాతానికి తగ్గి పోయింది. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్, కృషి వికాస్ యోజన పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడేలా అమల్లోకి తెచ్చిన ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’కు, పంటలకు మద్దతు ధర లభించేందుకు తెచ్చిన ‘పీఎం–ఆశ’ పథకాలను కేంద్రం పక్కన పెట్టేసింది. వ్యవసాయానికి రుణ సాయం.. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, తక్కువ వడ్డీతో మరిన్ని రుణాలు అందేలా చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గత ఏడాది (రూ.18 లక్షల కోట్లు) కన్నా 11 శాతం అధికంగా ఈసారి రూ.20 లక్షల కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు పంట రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తాయని.. కేంద్రం అందులో 2 శాతాన్ని భరిస్తుండటంతో రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.6 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ► ఎక్కువ పొడవు పింజ ఉండే పత్తి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని నిర్మల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు వ్యాల్యూ చైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య రంగానికి ఊపు కోసం.. ► దేశంలో చేపల ఉత్పత్తి, రవాణాను మెరుగుపర్చేందుకు ‘ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రొయ్యల దాణా దిగుమతిపై కస్టమ్స్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. ► దేశంలో సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (ఎరువులు), పురుగు మందులను పంపిణీ చేసేందుకు 10వేల ‘బయో–ఇన్పుట్ రీసోర్స్ సెంటర్’లతో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామన్నారు. ► పశు, వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు ‘గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రీసోర్సెస్ ధన్)’ పథకం కింద రూ.10 వేల కోట్లతో కొత్తగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహజవాయువును విక్రయించే అన్ని సంస్థలు తప్పనిసరిగా 5శాతం బయో కంప్రెస్డ్ బయోగ్యాస్ను అందులో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. భూమిని కాపాడేందుకు ‘పీఎం–ప్రణామ్’! ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (పీఎం–ప్రణామ్)’ పథకాన్ని చేపడుతున్నట్టు నిర్మల తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ► ఉద్యాన పంటల కోసం.. తెగుళ్లు సోకని, నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ► గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు ‘అగ్రి స్టార్టప్స్’ను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు ‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ► వ్యవసాయ రంగంలో రైతు ఆధారిత, సమ్మిళిత పరిష్కారాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ► ‘మిష్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచనున్నట్టు తెలిపారు. ‘శ్రీ అన్న’తో తృణధాన్యాల హబ్గా.. దేశాన్ని తృణధాన్యాల హబ్గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హైదరాబాద్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను దీనికి వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఇది తృణధాన్యాల ఉత్పత్తి, పరిశోధన, సాంకేతిక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తుందని వివరించారు. తృణధాన్యాల వినియోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఎందరో చిన్న రైతులు వీటిని పండించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఐఎంఆర్ ఏంటి? దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం హైదరాబాద్లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)’ను ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలో ఇది పనిచేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాల పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఐఐఎంఆర్ దేశ విదేశాలకు చెందిన తృణధాన్యాల సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా. పల్లెకు నిధులు కట్! గ్రామీణాభివృద్ధికి తగ్గిన కేటాయింపులు ఉపాధి హామీపై చిన్నచూపు ఇళ్లు, తాగునీటికి మాత్రం ఊరట.. మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటూ భారీగా పెట్టుబడి నిధులను కేటాయించిన మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధి విషయంలో ఈసారి కాస్త చిన్నచూపు చూసింది. ప్రధానమైన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (ఫ్లాగ్షిప్) నిధుల కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు (సవరించిన అంచనా) రూ. 1,81,121 కోట్లు కాగా, 2023–24 బడ్జెట్లో కేటాయింపులను 13 శాతం మేర తగ్గించి రూ.1,57,545 కోట్లకు పరిమితం చేసింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భారీగా కోత పెట్టడం గమనార్హం. ఉపాధి ‘హామీ’కి కోత... గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేటాయింపుల్లో భారీగా కోత పడింది. 2022–23లో కేటాయింపుల సవరించిన అంచనా రూ.89,400 కోట్లతో పోలిస్తే 32 శాతం మేర తగ్గించేశారు. కాగా, 2022 జూలై–నవంబర్ కాలంలో ఈ స్కీమ్ కింద పనులు చేసేందుకు ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య కోవిడ్ ముందస్తు స్థాయిలకు చేరినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. గ్రామీణ రోడ్లు.. జోరు తగ్గింది (పీఎంజీఎస్వై) గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత మెరు గుపరిచేందుకు రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు వెచ్చి స్తోంది. అయితే, తాజా బడ్జెట్లో ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్కు కేటాయింపులను మాత్రం పెంచలేదు. 2023–24లో 38,000 కిలోమీటర్ల మేర పక్కా రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటికి ఓకే... (పీఎంఏవై) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో కొంత మెరుగ్గానే కేటాయింపులు జరిపారు. ప్రధానంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ తరహాలోనే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ను నెలకొల్పుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ఏటా రూ.10,000 కోట్లను ఈ ఫండ్కు ఖర్చు చేస్తామని, దీన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు 2023–24లో 57.33 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్... దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ పథకానికి మాత్రం తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో 2023–24లో 13,500 కమ్యూనిటీ/పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, 3 లక్షల గ్రామాలను ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీరు నిర్వహణ కిందికి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం. తాగునీటికి నిధుల పెంపు... స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించారు. దీనిలో భాగంగా 2023–24లో 4 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచారు. భారత్ నెట్... భారత్ నెట్ కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగా 2023–24లో 17,000 గ్రామ పంచాయితీలను కొత్తగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 78,750 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,50,000 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు కూడా ఇవ్వాలనేది లక్ష్యం. రహదారులపై ప్రగతి పయనం ఎన్హెచ్ఏఐకు 2022–23 బడ్జెట్లో కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులను రూ.20,000 కోట్లు(13.90 శాతం) పెంచింది. జాతీయ రహదారుల రంగానికి 2022–23లో రూ.1.99 లక్షల కోట్లు కేటాయించగా, దీన్ని తర్వాత రూ.2.17 లక్షల కోట్లుగా సవరించింది. తాజా బడ్జెట్లో ఈ రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. -
పొదుపు కాదు ఖర్చు చేసుకో!
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి పొదుపు కంటే ఖర్చులను ప్రోత్సహించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పొదుపు చేసే వారికంటే ఖర్చు చేసే వారికే పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సెక్షన్ 80సీ, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు, హెచ్ఆర్ఏ వంటి పన్ను మినహాయింపులు కోరని వారికి కనీస ఆదాయ పరిమితి పెంచడంతో పాటు ట్యాక్స్ రిబేట్ పరిమితిని పెంచారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరకుండా మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించే నూతన పన్నుల విధానంలో బేసిక్ లిమిట్ను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. పాత పన్నుల విధానంలో బేసిక్ లిమిట్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదేవిధంగా నూతన పన్నుల విధానంలో సెక్షన్ 87ఏ కింద ఎటువంటి పన్ను చెల్లించాల్సినక్కర్లేని ట్యాక్స్ రిబేట్ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) నుంచి రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పాత పన్నుల విధానంలో ఈ రిబేట్ను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరని వారికి తక్కువ పన్ను రేట్లతో ఆరు శ్లాబులతో కొత్త పన్నుల విధానాన్ని 2020–21లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు పాత పన్నుల విధానాన్నే ఎంచుకోవడంతో వీరిని కొత్త పన్నుల విధానంలోకి మా ర్చడానికి ఆర్థిక మంత్రి ఈ నిర్ణ యాలు తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు ట్యాక్స్ శ్లాబులను కొత్త పన్నుల విధానంలో ఐదుకు పరిమితం చేయడమే కాకుండా వీరికి రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ను వర్తింపచేస్తున్ననట్లు తెలిపారు. ఫ్యామిలీ పెన్షన్ తీసు కునే వారికి ఈ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 15,000గా నిర్ణయించారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పరిగణనలోకి తీసుకుంటే రూ. 7.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ తీసుకొనేవారికి రూ.7.15 లక్షల ఆదాయం వరకూ పన్ను ఉండదు. డిఫాల్ట్గా కొత్త పన్నుల విధానం ఇప్పటివరకు రెండు పన్నుల విధానాల్లో దేన్నీ ఎంచుకోకపోతే డిఫాల్ట్గా పాత పన్నుల విధానాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్నుల విధానాన్ని డిఫాల్ట్ విధానంగా పరిగణించనున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాత పన్నుల విధానంలో రిటర్న్లు దాఖలు చేసేవారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. ఆర్థిక మంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల కొత్త పన్ను చెల్లింపుదారుల్లో రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ.33,800 వరకు ప్రయోజన కలగనుండగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.23,400, రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.49,400 వరకు ప్రయోజనం చేకూరుతుందని ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల రూ.15.5 లక్షల ఆదాయం దాటిన వారికి కనీసం రూ.52,500 వరకు ప్రయోజనం దక్కనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని మినహాయింపుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలితే రూ.9.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అధిక ఆదాయం ఉన్నవారిపై కరుణ రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న వారిపై మోదీ ప్రభుత్వం కరుణ చూపించింది. రూ.2 కోట్ల వార్షికాదాయం దాటిన వారిపై విధించే సర్చార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రూ.5.5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు అధికాదాయం ఉన్న వారిపై ప్రపంచంలోనే అత్యధికంగా 42.7 శాతం పన్నురేటు ఉండేదని, సర్చార్జీ తగ్గించడం వల్ల ఈ రేటు 39 శాతానికి పరిమితమైనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎర్న్డ్ లీవులను నగదుగా మార్చుకుంటే పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం ఉన్న లీవ్ ఎన్క్యాష్మెంట్పై రూ.3 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.5 లక్షలకు పైబడి చెల్లించే అధిక మొత్తం ఉండే బీమా పాలసీలకు వర్తించే పన్ను మినహాయింపులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం నుంచి యూనిట్ లింక్డ్ (యులిప్) పాలసీలను మినహాయించారు. -
పోలవరాన్ని వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం జాతీయ ప్రాజెక్టును ఇప్పటికీ చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయి. బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లోనూ పోలవరానికి కేంద్రం నిధులను కేటాయించకపోవడానికి బాబు చేసిన పాపాలే కారణమని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్లో సరిపడా నిధులను కేటాయిస్తే సత్వరమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో రూ.20,118.69 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.6,280.08 కోట్లు కేటాయించింది. కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించింది. కెన్–బెట్వా అనుసంధానం తొలి దశ పనులకు 2022–23 బడ్జెట్లో రూ.1400 కోట్లు కేటాయించిన కేంద్రం... 2023–24 బడ్జెట్లో రూ.3,500 కోట్లు కేటాయించింది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు 2016లో నిర్మాణ బాధ్యతలు తీసుకోకుంటే అప్పర్ భద్ర తరహాలోనే పోలవరానికి భారీ ఎత్తున కేంద్రం నిధులు కేటాయించేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదిలోనే పోలవరాన్ని నిర్వీర్యం చేసిన బాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 మే 28న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు చేపడతామని అప్పటి టీడీపీ సర్కారుకు సూచించింది. పోలవరానికి 2014–15 బడ్జెట్లో రూ.250 కోట్లు, 2015–16 బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించింది. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తుండటంతో 2016–17 బడ్జెట్లో కేవలం రూ.వంద కోట్లే కేటాయించింది. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా దాటవేస్తూ వచ్చిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో పార్లమెంట్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. దాంతో 2016 సెప్టెంబరు 7 అర్ధరాత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో కేంద్రం పెట్టిన షరతులకూ బాబు తలొగ్గారు. దాంతో 2017–18 నుంచి బడ్జెట్లో పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించడం లేదు. -
హోదా ప్రస్తావనేదీ?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించినంత వరకు నిరాశ ఎదురైందన్నారు. బుధవారం పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన హామీలను ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘‘పోలవరం నిధుల ఊసూ లేదు.ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల్లోనూ ప్రగతి లేదు. రైల్వే కారిడార్, స్టీల్ ప్లాంట్కు చేస్తామన్న సాయాన్నీ ప్రస్తావించలేదు. వీటన్నిటిపైనా కేంద్రాన్ని నిలదీస్తాం. బడ్జెట్పై జరిగే చర్చలో కూడా లేవనెత్తుతాం. నర్సింగ్ కాలేజీలు, ఏకలవ్య పాఠశాలలు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు గరిష్ట ప్రయోజనం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు కేంద్రానికి స్వయంగా విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం నిధుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఉచిత బియ్యం, పీఎంఏవై ఇళ్ల కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది’ అని మిథున్రెడ్డి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏ రంగానికి ఎంత బడ్జెట్ సమకూరుస్తుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎంపీ మోపిదేవి వెంకట రమణ చెప్పారు. ప్రత్యేక హోదా సాధన అనేది వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా అని, దీని కోసం చివరి వరకు పోరాడతామని అన్నారు. స్వార్థపూరిత విధానాలతో ఆనాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కేంద్రం సహకారం పొందే విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ, ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారని, మార్చిలో విశాఖలో జరిగే ఈ భారీ సదస్సుకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్టంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే కేంద్రం మూడింటికే నిధులిస్తామని చెప్పిందన్నారు. అన్ని కాలేజీలకు నిధులివ్వాలని కోరుతున్నామన్నారు. రైల్వే పరంగా విశాఖపట్నం–విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. కొవ్వూరు–భద్రాచలం లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందని, ఈ లైను వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్లకు 70 కి.మీ దూరం తగ్గి ప్రయాణికులకు భారం తగ్గుతుందన్నారు. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, బెంగళూరు – హైదరాబాద్ కారిడార్లకు నిధులిస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇండియ¯న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ను హైదరాబాద్కు ఇచ్చారని, రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యూటర్న్ తీసుకోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. మచిలీపట్నంలో వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డెప్ప, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమృత’ ప్రగతికి... సప్తరుషి మంత్రం
న్యూఢిల్లీ: వేతన జీవుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేటు పరిమితి పెంపు. మధ్య తరగతి, మహిళలు, పెన్షనర్ల కోసం పలు ప్రోత్సాహకాలు. మూలధన వ్యయంతో పాటు వృద్ధికి దోహదపడే రంగాలకు కేటాయింపుల్లో భారీ పెంపు. కీలకమైన వ్యవసాయానికి తగ్గింపు. ఆరోగ్య, విద్యా రంగాలకు అంతంతమాత్రం. రోడ్లు, మౌలిక తదితర రంగాలకు ఊపు. స్థూలంగా ఇవీ ‘అమృత్కాల్’బడ్జెట్ విశేషాలు. ద్రవ్యోల్బణం, మాంద్యం వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన ఆవశ్యకతకు, లోక్సభ ఎన్నికల వేళ ఓటరును సంతృప్తి పరచాల్సిన అనివార్యతకు మధ్య సమ తూకం సాధించేందుకు విత్త మంత్రి శాయశక్తులా ప్రయత్నించారు. అదే సమయంలో వీలున్నంత వరకూ ‘వృద్ధి బాట’నే సాగారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లో వేసిన పునాదులపై ముందుకు సాగుతూ ‘వందేళ్ల భారత్’బ్లూప్రింట్లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తోడ్పడేలా పద్దును రూపొందించినట్టు వెల్లడించారు. రానున్న పాతికేళ్ల అమృత కాలంలో ఆశించిన ప్రగతి లక్ష్యాల సాధనకు మంత్రి సప్తర్షి మంత్రం జపించారు. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం... ఇలా వృద్ధి ఏడు విభాగాలుగా అభివృద్ధి బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. భారత్ను ప్రపంచ ఆర్థిక రంగంపై ‘తళుకులీనుతున్న తార’గా అభివర్ణించారు. ‘‘మన ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉంది. వృద్ధి బాటన అది శరవేగంగా పరుగులు తీస్తున్న వైనాన్ని ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది’’అంటూ భరోసా ఇచ్చారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని అతి త్వరలో సాధిస్తామని ధీమా వెలిబుచ్చారు. తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు తదితరాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. తలసరి ఆదాయం రెట్టింపై ప్రజలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. ‘అందరికీ తోడు, అందరి అభివృద్ధి’లక్ష్యంతో సాగుతున్నామన్నారు. వ చ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. 2024లో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లనుంది. డిజిటల్ బాటన వడివడిగా... సుపరిపాలనే దేశ ప్రగతికి మూలమంత్రమన్న విత్త మంత్రి, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సామాన్యుడి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉటంకించారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలో ప్రపంచ స్థాయి డిజిటల్ వ్యవస్థ సాకారమైందని చెప్పారు. ఆధార్, కొవిన్, యూపీఐ, డిజి లాకర్స్ తదితరాలన్నీ ఇందుకు నిదర్శనమేనన్నారు. కృత్రిమ మేధలో లోతైన పరిశోధనల నిమిత్తం మూడు అత్యున్నత విద్యా సంస్థల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తేనున్నట్టు చెప్పారు. 5జీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. అదే సమయంలో పేదలు, దిగువ తరగతి సంక్షేమానికీ పెద్ద పీట వేశామని చెప్పారు. ‘‘కరోనా వేళ దేశంలో ఎవరూ ఆకలి బాధ పడకుండా చూడగలిగాం. 80 శాతం మంది పేదలకు ఆహార ధాన్యాలందించాం. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రూ.2 లక్షల కోట్లతో పేదలకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేశాం. వంద కోట్ల పై చిలుకు మందికి వ్యాక్సిన్లిచ్చాం. వాటిని పంపి ఎన్నో ప్రపంచ దేశాలను ఆదుకున్నాం’’అన్నారు. పెద్ద దేశాల్లో మనమే టాప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఏకంగా 7 శాతంగా మంత్రి అంచనా వేశారు. ‘‘పెద్ద దేశాలన్నింట్లోనూ ఇదే అత్యధికం. అంతర్జాతీయంగా తీవ్ర మాంద్యం, కరోనా కల్లోలం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి గడ్డు సమస్యలను తట్టుకుంటూ ఇంతటి ఘనత సాధించనుండటం గొప్ప ఘనత’’అని చెప్పారు. ప్రస్తుతం 6.4గా ఉన్న ద్రవ్య లోటును 2023–24లో 5.9 శాతానికి పరిమితం చేయడమే లక్ష్యమన్నారు. ఐటీ పరిమితి 7 లక్షలకు... కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదా రులు పాత విధానం నుంచి మారేలా ప్రోత్సహించేందుకు మంత్రి ప్రయతి్నంచారు. గరిష్ట ఆదాయ పన్ను రేటును 42.7 శాతం నుంచి 39 శాతానికి, సర్చార్జిని 37 నుంచి 27 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు కూడా గరిష్ట పొదుపు పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.30 లక్షలకు పెంచారు. మొబైల్ ఫోన్ విడి భాగాలు, టీవీలు తదితరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ద్వారా మధ్య, దిగువ తరగతికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే వెండి ప్రియం కానుండటం మహిళలకు దుర్వార్తే. మౌలికంపై మరింత దృష్టి... మౌలిక సదుపాయాలు తదితరాలపై ఈసారి మరింత దృష్టి పెడుతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కలి్పంచే పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులను రూ.79 వేల కోట్లకు (ఏకంగా 66 శాతం) పెంచారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధిని ప్రకటించారు. ఇక దేశానికి జీవనాడి అయిన రైల్వేలకు ఇప్పటిదాకా అత్యధికంగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక పోర్టులు, పరిశ్రమలకు అనుసంధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ఏకంగా రూ.77 వేల కోట్లతో కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు. ఇందులో రూ.15 వేల కోట్లను ప్రైవేట్ రంగం నుంచి సేకరించనున్నారు. హరిత నినాదం కాలుష్యకారక శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా పూర్తిస్థాయిలో కాలుష్యరహిత స్వచ్ఛ ఇంధనానికి మారే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. బయో వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా సంపద సృష్టికి గోబర్ధన్ పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. సాగు, భవనాలు, పరికరాలు తదితరాలన్నింటినీ హరితమయం చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. పీఎం కిసాన్ పథకానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు. పశుగణాభివృద్ధి, మత్స్య విభాగాలపై ఫోకస్ పెంచారు. ప్రధాని బాగా ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారు. మహిళలకు మరింత సాధికారత మహిళా సాధికారత దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 81 లక్షల పై చిలుకు స్వయం సహాయ బృందాలను స్టార్టప్ల తరహాలో తీర్చిదిద్దడం ద్వారా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నట్టు ప్రకటించారు. పర్యాటక రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలిస్తామన్నారు. మధ్య తరగతి దర్శనీయ ప్రాంతాల్లో పర్యటించేందుకు పథకం ప్రకటించారు. జి–20 సారథ్యం.. గొప్ప అవకాశం ‘‘జి–20 సదస్సుకు ఈ ఏడాది భారత్ సారథ్యం వహించనుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు గొప్ప అవకాశం. వసుధైక కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) నినాదంతో ఈ దిశగా ముందుకెళ్తున్నాం’’అని నిర్మల తెలిపారు. బడ్జెట్ సైడ్లైట్స్... ఈసారి 87 నిమిషాలే... బడ్జెట్ ప్రసంగాన్ని విత్త మంత్రి ఈసారి 8,000 పై చిలుకు పదాల్లో, కేవలం 87 నిమిషాల్లోనే ముగించారు. 2020 బడ్జెట్ సమరి్పంచినప్పుడు ఆమె ఏకంగా 162 నిమిషాలు మాట్లాడటం విశేషం! బడ్జెట్ ప్రసంగాల్లో అతి సుదీర్ఘమైనదిగా అది చరిత్రకెక్కింది కూడా. ఆ తర్వాత క్రమంగా నిడివి తగ్గతూ వస్తోంది. నిర్మల 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో 2021లో తొలి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆమెదే. క్షమాపణలతో నవ్వులు పూయించి... ►కాలం చెల్లిన పాత వాహనాలను పక్కన పెట్టే పథకానికి నిధులు ప్రకటించే క్రమంలో ఆర్థిక మంత్రి కాస్త తడబడి ‘ఓల్డ్ పొలిటికల్ వెహికిల్స్’అనడంతో సభ్యులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నిర్మల వెంటనే సర్దుకుంటూ ‘ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్. సరేనా? అయాం సారీ’అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. ►అధికార సభ్యుల స్వాగతం నడుమ లోక్సభలోకి ప్రవేశించిన నిర్మల, ఎరుపు రంగు బహీ ఖాతా నుంచి బయటికి తీసిన ట్యాబ్లెట్ పీసీ సాయంతో పద్దును ప్రవేశపెట్టారు. ఆమె కూతురు, బంధువులు స్పీకర్ గ్యాలరీ నుంచి వీక్షించారు. ►కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రసంగం ముగిశాక ప్రధాని ఆమె దగ్గరికి వెళ్లి అభినందించారు. మంత్రివర్గ సభ్యులతో పాటు కొందరు విపక్ష సభ్యులు కూడా ఆమెను చుట్టుముట్టారు. ►ఆమె ప్రసంగం పొడవునా అధికార సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా ఐటీ రాయితీలు ప్రకటిస్తుండగా మోదీ, మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చిరుధాన్యాల ప్రస్తావన రాగానే ప్రధాని మోదీ బల్లపై చరుస్తూ హర్షం వెలిబుచ్చారు. అప్పుడప్పుడూ విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. ►బడ్జెట్ ప్రసంగం మొదలైన కాసేపటికి సభలోకి అడుగు పెట్టిన రాహుల్గాం«దీని కాంగ్రెస్ సభ్యులు ‘జోడో జోడో. భారత్ జోడో’అని నినదిస్తూ స్వాగతించారు. అప్పుడప్పుడూ ‘అదానీ, అదానీ’నినాదాలూ విన్పించాయి. ►మామూలుగా నినాదాలు, నిరసనలతో హోరెత్తించే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రసంగాన్ని నిశ్శబ్దంగా వింటూ కని్పంచారు. ఆర్థిక వృద్ధి అవసరాలు, ప్రజాకాంక్షల మధ్య చక్కని సమతౌల్యం కుదిరిన బడ్జెట్ ఇది. పెట్టుబడి వ్యయ పద్దు తొలిసారి రూ.10 లక్షల కోట్లను తాకింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను వ్యవస్థలోనూ మధ్యతరగతికి లబ్ధి చేకూర్చేలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఆ దాయ పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయం చేయడం దీని ఉద్దేశం. మహిళా సాధికారతకూ మరింత పెద్దపీట వేశాం. కస్టమ్స్ సుంకాలనూ హేతుబద్దీకరించే ప్రయత్నం చేశాం. -
సాక్షి కార్టూన్ 02-02-2023
-
కేంద్రపన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపన్నుల్లో రాష్ట్రవాటా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ. 21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్ పన్ను రూ.6,872.08 కోట్లు, ఆదాయపు పన్ను రూ.6,685.61 కోట్లు, సంపద పన్ను రూ.–0.18 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,942.66 కోట్లు, కస్టమ్స్ రూ.681.10 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.285.26 కోట్లు, సరీ్వస్ ట్యాక్స్ రూ.4.31 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, గత బడ్జెట్లో కేంద్రపన్నుల రూ పంలో తెలంగాణకు రూ.17,165.98 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి రానున్న పన్నుల వాటా రూ.4,305 కోట్లు అధికం. రాష్ట్ర సంస్థలకు కేటాయింపులు ఇవే... ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీకి రూ.300 కోట్లు, సింగరేణి కాలరీస్కు రూ.1,650 కోట్లు, హైదరాబాద్సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ.550 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.392.79 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కు రూ.115 కోట్లు, ఇన్కాయిస్కు రూ.27 కోట్లు, హైదరాబాద్సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.39.77 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.19 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల(పెన్షన్లు)కు రూ.653.08 కోట్లు, తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37.67 కోట్లు, హైదరాబాద్సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ. 270 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీసహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు మొత్తం రూ.442.17 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సంస్థకు రూ.30.50 కోట్లు, మణుగూరుసహా కోట(రాజస్తాన్)లోని భారజల ప్లాంట్లకు రూ.1,473.43 కోట్లు, బీబీనగర్, మంగళగిరిసహా దేశంలో 22 కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి రూ.6,835 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. -
Union Budget 2023: మురిసి ‘పడిన’ మార్కెట్!
బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఊరటనిచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ను అంతా స్వాగతించారు. కానీ, ఊహించని పరిణామాలతో మార్కెట్ లాభాలన్నీ ఆవిరైపోయాయి. అదానీ షేర్లు బేర్ గుప్పిట్లో చిక్కుకోవడంతో మార్కెట్ రోలర్ కోస్టర్ను తలపించింది. ముంబై: వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్ లాభాలను నిలుపుకోవడంలో స్టాక్ మార్కెట్ విఫలమైంది. కేంద్రమంత్రి ప్రసంగం ఆసాంతం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్లో 1,958 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 158 పాయింట్లు లాభంతో 59,708 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 619 పాయింట్ల రేంజ్లో ట్రేడైంది. ఆఖరికి 46 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద నిలిచింది. ద్వితీయార్థంలో నెలకొన్న అమ్మకాల సునామీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ప్రథమార్థంలో భారీ లాభాలు బడ్జెట్పై ఆశలతో ఉదయం సూచీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 451 పాయింట్ల లాభంతో 60001 వద్ద, నిఫ్టీ 17,812 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు, మూలధన వ్యయం భారీ పెంపు, ఎల్టీసీజీ పన్ను జోలికెళ్లకపోవడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ప్రథమార్థంలో సెన్సెక్స్ 1,223 పాయింట్లు ఎగసి 60,773 వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు దూసుకెళ్లి 17,662 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మిడ్సెషన్ నుంచి లాభాల స్వీకరణ కేంద్ర మంత్రి ప్రసంగం ఆసాంతం అనూహ్యమైన ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకు ఆ జోరును నిలుపుకోలేకపోయాయి. ట్రేడింగ్ ద్వితీయార్థంలో అదానీ గ్రూప్ షేర్లలో అనూహ్య అమ్మకాలు తలెత్తాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత చోటు చేసుకుంది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,773) నుంచి 1,958 పాయింట్లు పతనమై 58,817 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గరిష్టం(17,972)నుంచి 619 పాయింట్లు క్షీణించి 17,353 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగొచ్చింది. అదానీ గ్రూప్ షేర్లు విలవిల... అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడి నేపథ్యంలో క్రెడిట్ సూయిజ్ షాక్ ఇచ్చింది. అదానీ కంపెనీల రుణాల బాండ్లను స్వీకరించడం నిలిపివేసింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ గ్రూప్నకు చెందిన పది కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 26%, అదానీ పోర్ట్స్ 18%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అంబుజా సిమెంట్స్ 17%, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 6% క్షీణించాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% లోయర్ సర్క్యూట్ తాకాయి. బుధవారం ఒక్కరోజే ఈ గ్రూప్ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకుపైన జీవిత బీమా పాలసీలపై పన్ను విధింపుతో బీమా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్ఐసీ 4%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 7%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 6%, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రూ.10 లక్షల కోట్ల నిధుల కేటాయింపు మౌలిక సదుపాయాల కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగానికి చెందిన సైమన్స్ 4%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 3%, ఎల్అండ్టీ 1.50%, అశోక బిల్డ్కాన్ 1.21% చొప్పున లాభపడ్డాయి. ► సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో గోడ్ఫ్రే ఫిలిప్స్, ఎన్టీసీ ఇండస్ట్రీస్, వీటీఎస్ ఇండస్ట్రీస్ షేర్లు 6%, 3.50%, మూడుశాతం నష్టపోయాయి. మరోవైపు గోల్డెన్ టొబాకో 4.58%, ఐటీసీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రియల్టీ, రైల్వే రంగ షేర్లు ప్రథమార్థంలో భారీగా ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్ పతనంలో భాగంగా ఈ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతం, రైల్వే షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి తాజా బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో సిమెంట్ రంగ షేర్లు బలపడ్డాయి. ఇండియా సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, శ్రీరాం సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 4–1% చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ బడ్జెట్పై లేవు. వినియోగ ప్రాధాన్యత, మూలధన వ్యయం పెంపుతో తొలి దశలో ఆశావాదంతో ట్రేడయ్యాయి. బుల్స్ మెచ్చిన బడ్జెట్ ఇది. అయితే అదానీ గ్రూప్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడికి అప్రమత్తత సెంటిమెంట్ను పూర్తిగా దెబ్బతీశాయి. – ఎస్ రంగనాథన్, ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ -
Harish Rao: తెలంగాణకు మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: అందమైన మాటల మాటున నిధుల కేటాయింపులో డొల్లతనాన్ని కప్పిపుచ్చుతూ అన్ని రంగాలను గాలికి వదిలేసి దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణకు ఈ బడ్జెట్ మరోమారు అన్యాయం చేసిందని, రాష్ట్రానికి మొండిచేయి చూపెట్టిందని ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని, ఇదో భ్రమల బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై హరీశ్ స్పందన ఈ విధంగా ఉంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్కమాటలేదు.. ‘తెలంగాణకు మరోమారు అన్యాయం చేశారు. తొమ్మిదేళ్లుగా అడుగుతున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్కమాట లేదు. గిరిజన యూనివర్సిటీకి ఇచి్చన నిధులు అంతంత మాత్రమే. ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. జీఎస్టీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు లేవు. తెలంగాణకు ఒక్క కొత్త పారిశ్రామికవాడ కూడా లేదు. గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. ఆర్థిక సంఘాల సిఫారసులను అమలు చేస్తామని చెప్పలేదు. సింగరేణి కారి్మకులకిచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా లేవు. ఉద్యోగులను భ్రమల్లో పెట్టారు. సెస్సులభారం తగ్గించలేదు. పన్నులభారం నుంచి ప్రజలకు ఉపశమనం లేదు. గత బడ్జెట్లో రూ.89,400 కోట్లు ఉపాధి హామీకి పెట్టిన కేంద్రం ఈసారి ఆ బడ్జెట్ను రూ.60 వేల కోట్లకు తగ్గించింది. గతేడాది బడ్జెట్లో 33 శాతం తగ్గించి ఉపాధి హామీ కూలీల ఉసురు తీసుకునే చర్యలకు ఉపక్రమించింది. ఆహారభద్రత నిధుల్లో భారీగా కోత పెట్టారు. గతేడాది 2.87 లక్షల కోట్లు కేటాయించి ఈసారి 1.97 లక్షల కోట్లకు తగ్గించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా లేదు. గతంలో మెడికల్ కాలేజీలు ఇచి్చన ప్రాంతాలకే ఇప్పుడు నర్సింగ్ కాలేజీలు ఇస్తున్నట్టు ప్రకటించి మరోమారు తీవ్ర అన్యాయం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు. రూ.5,300 కోట్లు కేటాయించి కర్ణాటక పట్ల పక్షపాతం కర్ణాటకలో ఎన్నికలున్నాయన్న కారణంతో ఆ రాష్ట్రానికి రూ.5,300 కోట్లు కేటాయించి కేంద్ర పాలకులు పక్షపాత వైఖరి చూపారు. ఎరువుల సబ్సిడీ నిధులను రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.1.75 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం కోత పెట్టారు. పత్తి మద్దతుధరకు కేవలం రూ.లక్ష రూపాయలు కేటాయించి తీవ్ర నష్టం చేశారు. రాష్రీ్టయ కృషి వికాస్ యోజన కింద గత బడ్జెట్లో రూ.5,020 కోట్లు చూపెట్టి ఈసారి రూ.3,097 కోట్లకు కుదించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం అమలు చేస్తామని షరతు పెట్టారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.6 వేల కోట్ల నష్టం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేశారు. అప్పులను మూలధన వ్యయం కోసం కాకుండా, అప్పులో 48.7 శాతాన్ని రోజువారీ ఖర్చుల కోసం ప్రతిపాదించడం ఆర్థిక వ్యవస్థకే చేటుతెస్తుంది. రెవెన్యూ లోటు పెంపు ఎఫ్ఆర్బీఎం చట్టానికి విరుద్ధం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద కేవలం 30.4 శాతం మత్రమే ఇస్తున్నారు. కానీ 41 శాతం ఇవ్వాలి. పన్నుల్లో వాటా పెంచామని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాలవాటాను పెంచి, కేంద్ర కేటాయింపులను కుదించడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా నష్టపోతుంది. అన్ని రంగాలనూ గాలికొదిలారు. రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్. తెలంగాణకు మరోమారు అన్యాయం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు. గతం కంటే 22 శాతం తగ్గుదల కేంద్రంలో రైతువ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి గతేడాది కంటే 22 శాతం కేటాయింపులు తగ్గించారు. గత బడ్జెట్లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.1.75 లక్షల కోట్లకు కుదించారు. మెల్లగా కేంద్రం ఎరువుల సబ్సిడీకి మంగళం పాడుతోంది. రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్ పథకానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి -
తెలంగాణ ఆశలు అడియాసలు
నిధులివ్వలేదు.. గ్యారెంటీ లేదు.. ప్రాజెక్టుల ఊసు లేదు.. ఏ గ్రాంటు కిందా కేటాయింపులు లేవు.. రెండు మూడు రాష్ట్రాలతో కలిపి కొన్ని అంశాల్లో డబ్బులిస్తామని చెప్పడానికే కేంద్ర బడ్జెట్ పరిమితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో వాటాను పెంచకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సెస్సులు, సర్చార్జీలు తగ్గించుకోవాలని, లేదంటే వాటిలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినా కేంద్రం కనికరించలేదు. మొత్తానికి తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు ఉత్తచేయి చూపారని బీజేపీయేతర పార్టీల నేతలు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పట్టించుకోలేదు... ఆర్థిక సంఘం సిఫారసు చేసే నిధులకు గ్యారంటీ ఇవ్వలేదు... ఫార్మాసిటీ, డిఫెన్స్ కారిడార్, నిమ్స్ ఏర్పాటు, జాతీయస్థాయి చేనేత పరిశోధన కేంద్రం లాంటి ప్రాజెక్టులకు నిధులడిగినా కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ నిధులివ్వలేదు. అలాగే, ఏ ప్రాజెక్టు, ఏ పథకం, ఏ గ్రాంటు కింద కూడా తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చూపలేదు. నలుగురిలో నారాయణ అన్న చందంగా రెండు, మూడు చోట్ల ఇతర రాష్ట్రాలతో కలిపి డబ్బులిస్తామని చెప్పడానికి మాత్రమే కేంద్రం పరిమితమైంది. స్థూలంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హామీలను పట్టించుకోకుండా, రాష్ట్ర మంత్రులు చేసిన అభ్యర్థనలను వినకుండానే తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ 2023–24 బడ్జెట్ను బుధవారం లోక్సభలో ప్రకటించారు. విభజన హామీలైన రైల్కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం లాంటి ప్రాజెక్టుల ఊసెత్తకుండానే... కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల పెంపు, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు లాంటి ఊరట కలిగించే అంశాలేవీ లేకుండానే ఈ ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం. వాదనలు, అభ్యర్థనలు పట్టించుకోలేదు... అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను అన్ని రాష్ట్రాల గాటన కట్టవద్దని, పురోగమన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలన్న రాష్ట్ర వాదనను కేంద్రం ఈసారి కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆర్థికశాఖ వర్గాలు చెప్పాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితుల కారణంగా అప్పుల్లో కోత, 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం ఇవ్వాలన్న నిధులు... ఇలా రూ.లక్ష కోట్లకు పైగా నష్టం జరిగిందని తెలంగాణ చెబుతున్నా.. కేంద్రం వీటిలో ఏ ఒక్క విషయంలోనూ ఉపశమనం కలిగించలేదు. త్వరలోనే ఎన్నికలున్న కర్ణాటకకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో రూ.5వేల కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు గత మూడేళ్ల నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఎందుకు ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గతంలో ప్రతిపాదించిన 157 మెడికల్ కళాశాలల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వకపోవడం, ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలలిచ్చిన చోటనే నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ రంగంతోపాటు ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు తగ్గించడంతో రాష్ట్రంలోని గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రత్యక్ష నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రావాల్సిన నిధుల్లో కోత కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధుల్లో వాటాను పెంచకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సెస్సులు, సర్చార్జీలు తగ్గించుకోవాలని, లేదంటే వాటిలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినా కేంద్రం కనికరించకపోవడం గమనార్హం. ఇక, ఎఫ్ఆర్బీఎం పరిమితుల మేరకు రుణాలపై ఆంక్షల విషయంలోనూ కేంద్రం అదే వైఖరి చూపింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే జీఎస్డీపీలో అదనంగా 0.5 శాతం రుణాలకు అంగీకరిస్తామన్న నిబంధనను కొనసాగించడంతో మరోమారు రూ.6వేల కోట్ల అప్పులకు కోత పడుతుందని ఆర్థిక శాఖ అంటోంది. రుణ పరిమితులపై ఆంక్షలు కొనసాగించడం, గ్రాంట్లు ప్రత్యేకంగా కేటాయించకపోవడం, అప్పుల్లో కోతల నిబంధనలను యథాతథంగా ఉంచడంతో ఈసారి కూడా నిధులకు కటకట తప్పదని చెబుతోంది. స్పష్టత లేని ప్రతిపాదనలు గుడ్డిలో మెల్లలా 50 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించే విధంగా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల కింద రూ.13.7 లక్షల కోట్లు కేంద్రం కేటాయించినా, అందులో మన రాష్ట్రానికి ఎంత వస్తుంది... ఏ ప్రాతిపదికన ఆ నిధులిస్తారన్న దాంట్లో స్పష్టత లేదు. గతంతో పోలిస్తే ఈ రుణపరపతిని భారీగానే పెంచినా రాష్ట్రానికి ఇచ్చే సమయానికి ఆంక్షలు విధిస్తే నష్టపోతామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కేటాయింపులను చూస్తే ములుగు వర్సిటీతోపాటు ఏపీలోని మరో వర్సిటీకి కలిపి రూ.37 కోట్లు బడ్జెట్లో చూపెట్టారు. అదేవిధంగా దేశంలోని మూడు భారజల కేంద్రాలకు చూపెట్టిన రూ.1,473 కోట్లలోనే మణుగూరు భార జల కేంద్రానికి నిధులు రావాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ రాష్ట్రం ఆశించిన విధంగా లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు అన్ని రాష్ట్రాలతో కలిపి చేసిన కేటాయింపులే తప్ప ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని, బకాయిలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని అంటున్నారు. బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచింది. ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్. ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణకు ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేవు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీలను విస్మరించారు. పునరి్వభజన చట్టంలో ఇచి్చన హామీల గురించి కూడా ప్రస్తావన లేదు. హైదరాబాద్లో మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యత ఉంది. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారు. – ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు... కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేకుండా రూపొందించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఊసేలేదు. విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ జుమ్లా బాజీ బడ్జెట్... బడ్జెట్ పూర్తిగా జుమ్లా బాజీ. ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన లేదు. తెలంగాణకు సంబంధించి మాట రాలేదు. ఏ స్కీములోనూ తెలంగాణ కనిపించలేదు. రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణాలు కొత్తేమీ కాదు. బడ్జెట్లో తెలంగాణను మర్చిపోయారు. – కె.కేశవరావు, బీఆర్ఎస్ ఎంపీ రైతు, పేద ప్రజలకు వ్యతిరేకం.. ఇది రైతు, పేదల, గ్రామీణ ప్రజల వ్యతిరేక బడ్జెట్. డిజిటల్ వ్యవసాయం అంటే అభివృద్ధి జరిగిపోదు. గత 9 ఏళ్లలో ఎన్ని డ్యాములు కట్టారు? ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తెచ్చారు?ఎంత మందికి విద్యుత్తు ఉచితంగా ఇచ్చారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇది భారతదేశ బడ్జెట్. కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే బడ్జెట్ కాదు. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు మాత్రం పూర్తి అన్యాయం చేశారు. – నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీ ఎరువులకు నిధులకోత అన్యాయం.. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. చాలా ఏళ్లుగా బీఆర్ఎస్ ఈ విషయాన్ని చెబుతోంది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని గణాంకాల ద్వారా అంగీకరించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఎరువులకు నిధుల కోత ఎక్కువగా ఉంది. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నారు. – కె.ఆర్.సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ -
ఏపీ స్ఫూర్తితో కర్షకులకు దీప్తి
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయానికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కనీసం కోటి మంది రైతులను ప్రకృతి సాగు బాట పట్టించే లక్ష్యంతో కేంద్రం అడుగులేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. వ్యవసాయ రంగం బలోపేతానికిæ ఏపీ బాటలోనే జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టబోతున్నట్టు పరోక్షంగా ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో 7.54 లక్షల ఎకరాల్లో 7.05 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో కనీసం 15 లక్షల మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పలు రాష్ట్రాలతోపాటు లాటిన్ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు సైతం ఏపీ బాటలో అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. చిరు ధాన్యాల కోసం ‘శ్రీఅన్న’ వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మిల్లెట్ పాలసీని తీసుకురాగా.. ఇదే లక్ష్యంతో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించిన కేంద్రం చిరు ధాన్యాలపై పరిశోధనలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులకు సహకారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్ల)ను మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.2,718 కోట్లతో గోదాములు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తోంది. ఇదే బాటలో కేంద్రం కూడా జాతీయ స్థాయిలో పీఏసీఎస్లను మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు రూ.2,516 కోట్లు కేటాయించింది. ఏపీ బాటలోనే పీఏసీఎస్లను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి పంచాయతీలోనూ ఎంపీసీఎస్ల ఏర్పాటుతో పాటు ప్రైమరీ ఫిషరీస్, డెయిరీ కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ‘సహకార్ సే సమృద్ధి’ పథకాన్ని ప్రకటించింది. పీఎం మత్స్య సమృద్ధి యోజన పథకం కింద దేశీయ మార్కెట్లకు చేయూతనివ్వాలని సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలో 26 ఆక్వాహబ్లు, 14 వేల ఫిష్ ఆంధ్రా అవుట్లెట్స్తో పాటు పెద్ద ఎత్తున ఫిష్ వెండర్స్, ఫిష్ కార్ట్స్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్ను విస్తృత పర్చేందుకు పెద్దఎత్తున ఆర్థిక చేయూత ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. రాష్ట్రంలో ఏటా సగటున రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తుండగా.. కేంద్రం నిర్ణయంతో ఈ ఏడాది కనీసం రూ.2.50 లక్షల కోట్లను రుణాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తగ్గనున్న మేత ధరలు మత్స్య ఉత్పత్తులు, ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం మేత ధరలపై పడి ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా కంపెనీలు మూడుసార్లు ïఫీడ్ ధరలు తగ్గించాయి. ఇటీవల తలెత్తిన ఆక్వా సంక్షోభ సమయంలో ముడి సరుకులపై విధించే దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు ప్రభుత్వపరంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఆక్వా ఫీడ్ తయారీలో ఉపయోగించే ఫిష్ మీల్, క్రిల్ మీల్, మినరల్ అండ్ విటమిన్ ప్రీమిక్స్లపై విధించే దిగుమతి సుంకం 15 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. అంతేకాకుండా ఫిష్ లిపిడ్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో ఆక్వా ఫీడ్పై టన్నుకు కనీసం రూ.5 వేలకు పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. -
Union Budget 2023-24: కార్పొరేట్ల బడ్జెట్
ఇదే కాదు... కొన్నేళ్ళుగా బడ్జెట్ల స్వరూపాలను చూస్తే ఇవి బడుగులకు బాసటగా ఉంటున్నాయా? కార్పొరేట్లకు కొమ్ముగాస్తు న్నాయా అనే సందేహా లొస్తున్నాయి. ప్రజల భవి ష్యత్, మానవ ప్రమా ణాలు, జీవన అవసరాలు నెరవేరని బడ్జెట్ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతుందనేది నిర్వివాదాంశం. సంపద సృష్టే లక్ష్యంగా దేశ బడ్జెట్ను ప్రవేశపెడితే దుష్ఫలితాలు తప్పవు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఈ వాదా నికి ఏమాత్రం తీసిపోదు. ఆదాయానికి అనుగు ణంగా పన్నులు వేయాల్సిందే. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఇది జర గాలంటే సంపాదించే వర్గం నుంచే ఆదాయాన్ని రాబట్టాలి. కానీ నూతన ఆర్థిక విధానాల తర్వాత బడ్జెట్ల స్వరూపమే మారుతోంది. అవి కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేలా ఉంటున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పరిశీలిస్తే 70 శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకునే పది శాతం ఆదాయ వర్గాల నుంచి పన్ను రాబట్టడం లేదు. ఆదాయం తక్కువగా ఉండే 90 శాతం ప్రజలే పన్నుల భారాన్ని మోస్తున్నారు. రూ. 6 కోట్ల సంపద దాటినా 30 శాతమే పన్ను వేయడం ఏమిటి? ఇదే ప్రభుత్వాలు అనుసరిస్తున్న లాజిక్. ప్రత్యక్ష పన్నుల పేరుతో 90 శాతం తక్కువ సంపద ఉన్నవారి నుంచి పీడిస్తున్నారు. దేశ ద్రవ్యోల్బణం 3 శాతం దాటకూడదు. కానీ 6 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడంలో ఏమాత్రం వెనకాడని ప్రభుత్వం, వాటి పరిరక్షణకు ఎక్కడా కేటాయింపులు చేయక పోవడం దుర్మార్గమే. జనాభాలో 60 శాతంగా ఉన్న రైతుల ఆదాయం కేవలం 11 శాతమే. అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక రకాలుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ రంగాన్ని కేంద్ర బడ్జెట్ విస్మరించడం దారుణం. డిజిటల్ టెక్నాలజీ తెస్తామనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామనే భరోసాలు రైతన్న కళ్ల నీళ్లు తుడుస్తాయా? విద్యారంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూడాలి. ఈ రంగంపై పెట్టుబడులు పెట్టబట్టే జపాన్, కొరియా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. కానీ మన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు తగ్గించారు. కోవిడ్ మనకు ఎన్నో అనుభవాలు నేర్పింది. వైద్య రంగాన్ని అతలాకుతలం చేసింది. అయినా పేదవాడి ప్రాణాలకు భరోసా ఇచ్చే రీతిలో కేటా యింపులు కన్పించడం లేదు. ప్రైవేట్ కాలేజీలు నర్సింగ్ కోర్సులు పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. లాభాలు తక్కువగా వస్తున్నాయని వెనకడుగు వేస్తున్నాయి. కాబట్టే నర్సింగ్ కాలేజీ లకు నిధులు కేటాయించారు. కానీ అందరికీ వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యలేమిటో, కేటాయించిన నిధులెంతో ప్రభుత్వం చెప్పలేదు. విద్య, వైద్యాన్ని విస్మరిస్తే పురోగతి ఎలా సాధ్య మవుతుంది? ఏదేమైనా ఈ బడ్జెట్ పేదలకు ఏ మాత్రం ప్రయోజనం చేసేది కాదు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే ఉంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తిలోదకాలిచ్చిన నేపథ్యం తాజా బడ్జెట్ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం మున్ముందు అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది. జి. హరగోపాల్ వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు -
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మోడల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో ప్రతిబింబించాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లైబ్రరీలు, పీఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటుసహా మరికొన్ని కార్యక్రమాలకు రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిగా మారాయి. ‘టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్రం ఈ బడ్జెట్లో పొందుç³రిచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అకడమిక్ ఎక్సలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంపై సమష్టిగా దృష్టి సారిస్తాయి. అయితే, రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు ద్వారా ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్ర వర్సిటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం వంటి సంస్థలన్నీ కలిపి పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లేలా దీన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధికి చర్యలు ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి యువతకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంతకుముందే దృష్టి సారించింది. దీంతోపాటు ఉన్నత విద్యామండలి ద్వారా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను ఏర్పాటు చేయించి విద్యార్థులకు పలు సబ్జెక్టు అంశాలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ల’ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువులు పూర్తయ్యే నాటికే పూర్తి నైపుణ్యాలు కలిగి ఉండేలా తీర్చిదిద్దడంతో పాటు బయటకు వచ్చిన తరువాత కూడా అప్స్కిల్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 స్కిల్ హబ్లు, 26 స్కిల్ కాలేజీలు, రెండు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయిస్తోంది. నాడు–నేడు తరహాలో.. దేశంలో కొత్తగా భారతీయ భాషా యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. స్థానిక భాషల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. కాగా, పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం జాతీయ స్థాయిలో 14,500 స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో నాడు–నేడు పథకం కింద అన్ని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.16 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. -
అమృత కాలంలో ఇదేనా వ్యవసాయం?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రూపొందించినట్లున్నా... వ్యవసాయానికి మాత్రం అన్యాయం జరిగింది. ఒకపక్క 2022–23 ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరం అని పేర్కొన్నా... బడ్జెట్లో మాత్రం పాత కేటాయింపుల కన్నా తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. ఈ రంగానికి 2022–23లో రూ. 1.24 లక్షల కోట్లు కేటాయించగా... 2023–24కు గానూ రూ. 1.15 లక్షల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు సగటు ఆదాయం దారుణంగా రూ.7 వేలకు మిం^è డం లేదు. కానీ వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగు తోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ ప్రస్తావించలేదు. భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలూ, పెరుగుతున్న పంట ఖర్చులూ వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమనీ జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. ఇదే ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2020–21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి పెరిగాయి. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2021–22లో రూ. 18.6 లక్షల కోట్లకు పెరిగాయి. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల వల్ల 2021–22 లో 315.7 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేరింది. 2021–22 నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి ఏటేటా పెరుగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గత ఐదేళ్లలో సగటున 23.8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది. మారుతున్న వాతావరణం... వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపు తోందని చెప్పిన నివేదిక ఆహార ఉత్పత్తి పెరిగిందనీ చెబుతోంది. కానీ రైతుల పరిస్థితి మీద అంచనా మాత్రం వేయలేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. రైతు సగటు ఆదాయం చాలా దారుణంగా రూ.7 వేలు మించని వైనం ప్రస్తావించలేదు. వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని ఆర్థిక సర్వే చెప్పినా, బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులను తగ్గించారు. 2022–23లో రూ. 1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24కి వచ్చేటప్పటికి రూ. 1,15,531.79 కోట్లకు తగ్గించారు. పశుగణాభివృద్ధికీ, మత్స్య రంగానికీ కలిపి రూ. 6,576.62 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం ఈ రంగాలకు ఇచ్చింది రూ. 5,956.70 కోట్లు. వ్యవసాయ పరిశో ధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. గతేడాది ఇచ్చింది రూ. 8,513.62 కోట్లు. మొత్తం మీద వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా రూ. 8,468.21 కోట్లు – దాదాపు 7 శాతం తగ్గించారన్నమాట. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం. ప్రధాన మంత్రి రైతులకు అందిస్తున్న రూ. 2 వేల నగదు సహాయం వల్ల రైతులకు నగదు సమస్య తీరిందనీ, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు వారి రోజువారీ వినియోగం, విద్య, ఆరోగ్యం ఇతర యాదృచ్ఛిక ఖర్చులను తీర్చడానికి సహాయపడిందనీ సర్వే తెలిపింది. ఏడాదికి కేవలం రూ. 2 వేలతో రైతుల సమస్య తీర్చిన ఈ గొప్ప పథకానికి బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పెరగలేదు. పైగా తగ్గాయి. మొత్తంగా రూ. 8 వేల కోట్లు తగ్గించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (రూ. 20 లక్షల కోట్ల) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 18 లక్షల కోట్లు. ఇది లక్ష్యం మాత్రమే. రైతులకు బ్యాంకుల నుంచి, సంస్థాగత రుణాలు పలు కారణాల వల్ల అందడం లేదు. ప్రతి ఏటా ప్రకటించే రుణాల లక్ష్యం ఏ మేరకు సఫలం అయ్యిందీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పదు. రూ. 2,200 కోట్ల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహిత, నాణ్యమైన మొక్కల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ కొత్త పథకానికి ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు. కృషి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టవచ్చు. మత్స్యకారులూ, చేపల వ్యాపారులూ... సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికీ, మత్స్య ఉత్పత్తుల సరఫరా సామర్థ్యాలను మెరుగుపరచడానికీ, మార్కెట్ విస్తరించడానికీ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త ఉప పథకాన్ని రూ. 6,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. కాని మత్స్య శాఖ కేటాయింపులు మొత్తం రూ. 2,250 కోట్లు దాటలేదు. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకానికి ఇచ్చిన కేటాయింపు కేవలం రూ. 2,025 కోట్లు మాత్రమే. తరువాత పెంచుతారా అనే విషయంలో స్పష్టత లేదు. వ్యవసాయ రుణాలపై ఉండే 9 శాతం వడ్డీకి, 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది రూ. 23 వేల కోట్లు. పోయిన ఏడాది సవరణ ద్వారా ఈ పథకానికి ఇచ్చింది రూ. 22 వేల కోట్లు – పెంచింది కేవలం 4.5 శాతం మాత్రమే. ఈ పథకం ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందు తున్నారు? బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ ఈ వడ్డీ రాయితీ అందడం లేదు. వడ్డీ రాయితీ నేరుగా రైతులకు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రుణదాతలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు తమ నిధుల వినియోగంపై వడ్డీ రాయితీ... ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల రీఫైనాన్సింగ్ కోసం నాబార్డ్కు ఇస్తారు. ఇదివరకు, 3 శాతం వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 3 శాతం ఇచ్చేది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇవ్వడం లేదు. రైతు మీద వడ్డీ భారం 7 నుంచి 9 వరకు ఉంటుందని మనకు అర్థమవుతోంది. స్పష్టంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయ లేదు. రుణ వ్యవస్థలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యను పెంచడానికీ, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచాలనీ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందనే ప్రకటన చూశాం. దీనికీ బడ్జెట్ కేటాయింపులకూ సంబంధం లేదు. వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగుతోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కుంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలో, ఇటు కేంద్ర బడ్జెట్లోనూ ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం, వారి సమస్య పరిష్కారానికి తగిన విధంగా స్పందించక పోవడం వ్యవసాయ ఆధారిత సమాజంలో పెను విషాదం. డా. దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
'అమృత కాల' బడ్జెట్ కాదు.. 'మిత్ర కాల' బడ్జెట్.. రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఇది అమృత కాల బడ్జెట్ కాదు.. మిత్ర కాల బడ్జెట్ అని రాహుల్ సెటైర్లు వేశారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలోని ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40శాతం సంపద ఉందని, 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. అయినా మోదీ వీటిని అసలు పట్టించుకోరని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత్ భవిష్యత్తును నిర్మించే రోడ్మ్యాప్ ప్రభుత్వం వద్ద లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు. ‘Mitr Kaal’ Budget has: NO vision to create Jobs NO plan to tackle Mehngai NO intent to stem Inequality 1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care! This Budget proves Govt has NO roadmap to build India’s future. — Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023 చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
Union Budget 2023-24: బడ్జెట్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీపీ).. కోవిడ్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పించి ఆదుకుంది. ఈ బృహత్తర పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కేటాంపులను భారీగా తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే ఈ పథకానికి కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపు రూ.89,400 కోట్లలో ఏకంగా 32 శాతం తగ్గించింది. 2022-23 బడ్జెట్లో కూడా మోదీ సర్కార్ 25 శాతం మేర కోత విధించింది. రూ.98 వేల కోట్లు అంచనా కాగా రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ ఏడాది జనవరి 6 నాటికి దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందగా 225.8కోట్ల వ్యక్తి పనిదినాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 24 నాటికి 6.49 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి కోరగా 6.48 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 5.7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలు వలసలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. గత నాలుగు బడ్జెట్లలో కేటాయింపులు ఇలా.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఎలా తగ్గిస్తోందో గత నాలుగు బడ్జెట్లలో ఈ పథకానికి చేసిన కేటాయింపులను చూస్తే అర్థమవుతుంది. 2020-21 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.61,500 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కారు 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.70 వేల కోట్ల చొప్పున కేటాయించింది. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.60వేల కోట్లు. గత నాలుగు బడ్జెట్లలో ఇదే అత్యల్ప కేటాయింపు కావడం గమనార్హం. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
Budget 2023-24: కొత్త ఇన్కం టాక్స్పై చిక్కు ప్రశ్నలు, సమాధానాలు
2023-24 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఇన్కంటాక్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన ఎంత వరకు మేలు చేస్తుందన్న దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినదాని ప్రకారం.. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఆదాయం రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శ్లాబుల్లో పన్ను ఉంటుంది. 0-3 లక్షల వరకు నిల్ 3 - 6 లక్షల వరకు 5% పన్ను 6 - 9 లక్షల వరకు 10% పన్ను 9 -12 లక్షల వరకు 15% పన్ను 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను ఇన్కంటాక్స్లో పాత, కొత్త రెండు టారిఫ్/రెజిమే ఆప్షన్లు ఉంటాయా? ప్రస్తుతం ఆదాయపుపన్నులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్ధతిలో టాక్స్ అసెస్మెంట్ చేసుకోవచ్చు లేదా కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎవరికి దేని వల్ల మేలు జరిగితే దాన్ని ఇప్పటివరకు ఎంచుకున్నారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త శ్లాబు విధానం వల్ల అందరికీ డిఫాల్ట్గా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే కావాలనుకునే వాళ్లు పాత శ్లాబు సిస్టమ్ను కూడా ఎంచుకోవచ్చు. పాత శ్లాబు సిస్టమ్ ఎవరికి మంచిది? కొత్త పద్ధతిలో రూ.7 లక్షల వరకు టాక్స్ మినహాయింపు ఉన్నా.. ఇప్పటికీ కొందరికి పాత పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. సెక్షన్ 80సి కింద లక్షన్నర రుపాయలు ఇన్వెస్ట్ చేసేవారు, NPS కింద 50 వేల రుపాయలు పెట్టుబడి పెట్టిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చుల కింద రూ.25వేలతో బీమా తీసుకున్నవారు, సేవింగ్స్ కింద రూ.4.25 లక్షలు చూపించే వారికి ఇప్పటికీ పాత శ్లాబు సిస్టమే బెటరంటున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి టాక్స్ కట్టనవసరం లేదంటున్నారు. 7 లక్షలు అన్న పరిమితిని ఎలా చూడవచ్చు? కొత్త శ్లాబు పద్ధతిలో 7 లక్షల పరిమితి ఓ ఛాలెంజింగ్ విషయమే. ఉదాహారణకు మీ ఆదాయం రూ.7లక్షల వరకు ఉంటే మీరు లాభపడ్డట్టే. అయితే మీ ఆదాయం అనుకోకుండా రూ.7లక్షల పది వేలు అయిందనుకోండి. మీరు పన్నుల కింద రూ.26వేలు, దాంతో పాటు సర్ఛార్జీ, సెస్ కట్టాల్సి ఉంటుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఏది ఎంచుకోవాలి? ఇప్పటి నుంచి పాత శ్లాబు ఎంచుకుంటే ఏడాదికి 15 లక్షల ఆదాయం పొందుతున్న వారు రూ.82,500 పన్నుగా చెల్లించాలి. కొత్త శ్లాబు ఎంచుకుంటే అదే 15లక్షల ఆదాయానికి రూ.1,50,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని బట్టి మధ్యతరగతి వేతన జీవులకు మాత్రమే కొత్త బడ్జెట్లో మేలు జరిగినట్టుగా భావించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. -
అన్నదాతలకు వరాలు: భారీ రుణాలు, కొత్త స్కీములు, కీలక ప్రకటనలు
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్గా అభివర్ణించిన ఈ బడ్జెట్లో దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న వ్యవసాయ రంగానికి, రైతులకు కొన్ని శుభవార్తలు చెప్పారు ఆర్థికమంత్రి. అలాగే భారత దేశాన్ని చిరుధాన్యాల (మిల్లెట్ క్యాపిటల్) కేంద్రంగా మారుస్తామని ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా రైతులకు అందించే రుణ లక్ష్యాన్ని గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే 11 శాతానికి పైగా పెంచారు. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం వ్యవసాయ స్టార్ట్ప్స్కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు లాంటి చర్యలతోపాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అలాగే చిరుధాన్యాల ప్రోత్సాహానికి శ్రీఅన్న పథకం, మత్స్య శాఖలోని వివిధ వర్గాల ప్రోత్సాహాకానికి పెట్టుబడులు, ఇతర కేటాయింపులను కూడా ప్రకటించారు. రూ.18 లక్షల కోట్లనుంచి రూ.20 లక్షల కోట్లకు పెంపు వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం 11 శాతం మేర పెంచినట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి డైరీ, పశు పోషణ, మత్స్య సాగు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే సేంద్రీయ వ్యవసాయానికి ఊతమిచ్చేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. అగ్రికల్చర్ స్టార్టప్లకు బడ్జెట్లో వరాలు ప్రకటించారు ప్రస్తుతం రైతులు వాడుతోన్న రసాయన, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పీఎం ప్రణామ్ కింద పది వేల బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే కనీసం కోటి మంది సేంద్రీయ సాగు చేసేలా ప్రోత్సహిస్తారు. ♦రూ.6వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా MSME పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. మత్స్య సాగు రైతులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో కొత్త సబ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. మత్స్యకారులు, చేపలు అమ్ముకునేవారితో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్ విస్తరణకోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ♦ యువ పారిశ్రామికేత్తల ద్వారా అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రికల్చర్ యాక్సిలేటర్ ఫండ్ కింద అగ్రి స్టార్టప్లకు ప్రోత్సహాన్ని అందిస్తారు. రైతులకు మేలు చేసే ఏ సృజనాత్మకతనైనా ప్రోత్సహిస్తారు. కొత్త టెక్నాలజీ అన్నదాతలకు అందుబాటులోకి తెస్తారు. ♦ అన్ని అగ్రీ సొసైటీల వివరాలను డిజిటలైజ్ చేస్తారు. దీని వల్ల రైతుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. భవిష్యత్తులో రైతులకు చేసే ఎలాంటి ప్రయోజనమైనా దీని ద్వారా జరగనుంది. ♦ రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు నిర్మించేందుకు చర్యలు ♦ పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ♦ చిరుధాన్యాల పంటలకు సహకార కోసం శ్రీ అన్న పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం ♦ మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. హైదరాబాద్లోని మిలెట్ ఇన్స్టిట్యూట్ను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. త్వరలోనే భారత్ తృణ ధాన్యాలకు గ్లోబల్ హబ్గా మారుతుందన్నారు నిర్మలా సీతారామన్. ♦ హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి సుమారు రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ♦ కర్ణాటకలోని కరువు ప్రాంతాలకు రూ.5,300 కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది -
Union Budget 2023-2024: క్రీడారంగాన్ని కరుణించిన నిర్మలమ్మ
Union Budget: 2023-2024 కేంద్ర బడ్జెట్లో క్రీడారంగానికి పెద్దపీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1) లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడారంగానికి గతేడాదితో పోలిస్తే కేటాయింపులు ఓ మోస్తరుగా పెరిగాయి. 2022-23 బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ. 3397 కోట్లకు (రూ. 334.72 కోట్ల పెరుగుదల) పెరిగింది. Sports Budget: Rs 3397.32 crore allocated to Sports in Union Budget 2023-2024 (⬆️ Rs 334.72 crore) Sports Budget Allocation 2023-24: ➡️ Khelo India: Rs 1045 Cr ➡️ SAI: 785.52 Cr ➡️ National Sports Feds: 325 Cr ➡️ NSS: 325 Cr ➡️ National Sports Development Fund: Rs 15 Cr — India_AllSports (@India_AllSports) February 1, 2023 గత ఐదేళ్ల కాలంలో కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా ఓ మోస్తరుగా నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గతేడాది మంజూరైన రూ. 3062 కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. తాజా బడ్జెట్లో నిర్మలమ్మ క్రీడలను కరుణించడంతో ఆ రికార్డు బద్ధలైంది. Sports Budget for the last 5 years: 2018-19 - ₹2197 crore 2019-20 - ₹2776 crore 2020-21 - ₹2826 crore 2021-22 - ₹2596 crore 2022-23 - ₹3062 crore This year’s budget allocation 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 - ₹𝟯𝟯𝟵𝟳 𝗰𝗿𝗼𝗿𝗲📈 — Enakshi Rajvanshi (@enakshi_r) February 1, 2023 స్పోర్ట్స్ బడ్జెట్లో ఎవరికి ఎంత..? ఖేలో ఇండియా: రూ. 1045 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్): రూ. 785.52 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్: రూ. 325 కోట్లు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎన్ఎస్): రూ. 325 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్: రూ. 15 కోట్లు -
ఇన్సూరెన్స్ కంపెనీలకు షాకిచ్చిన నిర్మలాజీ, రూ. 5 లక్షలు దాటితే బాదుడే!
సాక్షి,ముంబై: యూనియన్ బడ్జెట్లో వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన బీమా కంపెనీలకు మాత్రం భారీ షాక్ఇచ్చింది. ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీంతో బీమా కంపెనీలకు డిమాండ్ తగ్గపోతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించింది. దీంతో బుధవారం నాటి మార్కెట్లో బీమా కంపెనీల షేర్లు భారీగా పతనమైనాయి. సాంప్రదాయ బీమా ప్లాన్లపై పన్ను బాదుడుకు సీతారామన్ ప్రతిపాదించారు.పాలసీల మొత్తం ప్రీమియం ఏడాదికి 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేసే జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (ULIPలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని పేర్కొన్నారు. ప్రీమియం మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మొత్తం ప్రీమియం ఉన్న పాలసీల నుండి మాత్రమే ఆదాయం పొందాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం అంటే రూ. 5 లక్షలవరకు, 31 మార్చి, 2023 వరకు జారీ చేయబడిన బీమా పాలసీలను కూడా ప్రభావితం చేయదు. అలాగే బీమా చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు పొందే మొత్తానికి అందించే పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త ప్రతిపాదన యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై పన్నును ప్రభావితం చేయదు. ఈ ప్రకటన ఫలితంగా హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్, మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5 -11శాతం మధ్య నష్టపోయాయి. అయితే, ఇది అధిక విలువ కలిగిన సాంప్రదాయ బీమాలను కొనుగోలు చేయడానికి వ్యక్తుల ఆసక్తిని తగ్గించి, ఇది టర్మ్ ప్లాన్లు, రిస్క్ కవర్లపై దృష్టిని పెరగడమే మంచి పరిణామమే అయినప్పటికీ పూర్తిగా పెట్టుబడి ఆధారిత యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ల వైపు గణనీయమైన మార్పుకు దారితీస్తే ఆందోళనకరమని సెక్యూర్నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా చెప్పారు. అంటే, ఎండోమెంట్ ప్లాన్లు, మనీ బ్యాక్ ప్లాన్లు వంటి సాంప్రదాయ బీమా ప్లాన్లపై పాలసీదారుల ఇంట్రస్ట్ తగ్గిపోతుందన్నారు. అంతిమంగా ఇది బీమా కంపెనీలకు నష్టమని భావిస్తున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్ను 'ప్రో కార్పొరేట్గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్ షేర్ల షాక్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభాలకు పరిమితమై 59,708వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. యూనియన్ బడ్జెట్లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేసింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. -
Union Budget: తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు కేటాయింపులు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే, విభజన చట్టం హామీల విషయంలో కేంద్రం నిరాశ కలిగించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. ►తెలుగురాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు ►ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు ►ఏపీ పెట్రోలియం వర్శిటీకి రూ.168 కోట్లు ►విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు ►సింగరేణికి రూ.1650 కోట్లు ►ఐఐటీ హైదరాబాద్కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు ►మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు ►సాలర్ జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు ►మణుగూరు, కోట భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు ►కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు ►కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు చదవండి: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు ఆదాయ పన్ను విషయానికొస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. పన్ను పరిమితిని రూ.5 లక్షలనుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. -
Union Budget: కేంద్ర బడ్జెట్పై వైఎస్సార్సీపీ ఎంపీలు ఏమన్నారంటే?
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల విషయంలో నిరాశ కలిగించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మిథున్రెడ్డి స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగిందన్నారు. రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావవించలేదన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు. నిధులు కేటాయింపు ఏదీ: మోపిదేవి ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, ‘‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీని అనేక సార్లు సీఎం కోరారు. చంద్రబాబు స్వార్థంతో పోలవరం తాకట్టు పెట్టారు. ఫిషరీస్ సెక్టార్ను సీఎం అభివృద్ధి చేస్తున్నారు. ఆక్వా విషయంలో కేంద్రం ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 6 లక్షల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తికి నిధులు కేటాయింపులు చేయాలి’’ అని మోపిదేవి కోరారు. చదవండి: కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి స్పందన నిరాశ కలిగించింది: మార్గాని భరత్ ‘‘ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. వీటి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి. పోలవరం నిధులు మెన్షన్ చేయలేదు. ఈ బడ్జెట్ నుంచి ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని’’ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. -
Union Budget 2023-24: రక్షణశాఖకు ఎన్ని కోట్లంటే..?
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది రక్షణ రంగానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 69 వేల కోట్లు ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడుతూ రక్షణ రంగ కేటాయింపుల్లో రూ. 1.62 లక్షల కోట్లు మూల ధన వ్యయమని తెలిపారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ పరికరాల కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట. 2022–23 మూలధన కేటాయింపులు రూ.1.52 లక్ష కోట్లు మాత్రమే. అంచనాల సవరణ తరువాత ఇది రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది రక్షణ రంగ కేటాయింపుల్లో రూ.2.70 లక్షల కోట్లు ఆదాయ వ్యయం అంటే సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు పెట్టనున్నారు. గత ఏడాది ఈ ఖర్చుల కోసం ముందుగా 2.39 లక్షల కోట్లు కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (సివిల్) మూలధన వ్యయం రూ.8774 కోట్లు. ఫించన్ల కోసం విడిగా రూ.1.38 లక్షల కోట్లు కేటాయిపులు జరిగాయి. దీంతో రక్షణ శాఖ ఆదాయ వ్యయం మొత్తమ్మీద రూ.4.22 లక్షల కోట్లకు చేరింది. భద్రతకు పెద్దపీట దేశంలో అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు ఏకంగా రూ.1,96,034.94 కోట్లు కేటాƇుుంచడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ.1,85,776.55 కోట్లు. ఈసారి కేటాయింపులను రూ.10,258.39 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో సింహభాగం కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిఘాసమాచారం సేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోలీసు దళాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున వెచ్చించబోతున్నారు. మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాలకు గత ఏడాది రూ.1,19,070 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1,27,756 కోట్లు కేటాయించారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు 2022–23లో రూ.31,495 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.31,772 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ తదితర దళాలకు కేటాయింపులను పెంచారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ), ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రత్యేక భద్రతా విభాగం(ఎస్పీజీ)కి గణనీయమైన కేటాయింపులు లభించాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,545.03 కోట్లు, పోలీసు మౌలిక సదుపాయాల కోసం రూ.3,636.66 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణ కోసం రూ.3,750 కోట్లు కేటాయించారు. భద్రతకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2,780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్ సదుపాయాల ఆధునీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దుల్లో చెక్పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల ఆధునికీకరణ ప్రణాళిక–4 కోసం రూ.202.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంతరిక్షానికి 12,544కోట్లు అంతరిక్ష రంగానికి బడ్జెట్లో రూ.12,544 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు గత ఏడాది ఇచ్చిన రూ.13,700 కంటే 8 శాతం తక్కువ కావడం గమనార్హం. వచ్చే ఏడాది చంద్రుడు, చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనం కోసం మానవసహిత గగన్యాన్ను నిర్వహించేందుకు అంతరిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇచ్చిన కేటాయింపుల్లో అధికభాగం రూ.11,669.41 కోట్లను గగన్యాన్, శాటిలైట్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇస్తారు. థియరిటికల్ ఫిజిక్స్తోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహించే అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రూ.408.69 కోట్లు కేటాయించారు. ఈ విభాగానికి గత ఏడాది రూ.411.11 కోట్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్విండో విభాగమైన ఇన్–స్పేస్కు గత ఏడాది రూ.21 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్లో రూ.95 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది చంద్రయాన్ మిషన్ చేపడుతున్న ఇస్రో.. సూర్యుడు, శుక్రు డు, అంగారక గ్రహాలపైనా పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ అణు ఇంధన ఉత్పత్తి కెపాసిటీని పెంచేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కు గత బడ్జెట్లో కన్నా రూ. 2,859 కోట్లు ఈ బడ్జెట్లో అధికంగా ఇచ్చారు. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ నిచ్చేందుకు ఎన్పీసీఐఎల్ రూ. 9,410 కోట్లు ఈ బడ్జెట్ ద్వారా అందుకోనుంది. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా ఎన్పీసీఐఎల్ రూ. 12,863 కోట్లు సమకూర్చుకోనుంది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు రూ. 25,078.49 కోట్లు కేటాయించారు. దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. 2031 నాటికి ఈ సామర్థ్యాన్ని 15,700 మెగావాట్లకు పెంచే లక్ష్యంతో మరో 21 పవర్ జనరేషన్ యూనిట్లను స్థాపించనున్నారు. . చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
ఆర్థిక మంత్రి పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానంగా ఇందులో వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయపన్ను పరిమితిని పెంచారు. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. అలాగా సప్తరుషి పేరుతో ఏడు ప్రాధాన్యత అంశాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మలా సీతారామన్ పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏమిటి? అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని ఆమె ప్రకటించడం విశేషంగా నిలిచింది. 'అమృత్ కాల్' అనే పదాన్ని తొలిసారిగా 2021లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని (పీఎం) నరేంద్ర మోదీ ఉపయోగించారు. రాబోయే 25 సంవత్సరాల కోసం భారతదేశం కోసం కొత్త రోడ్మ్యాప్ను ఆవిష్కరించేటప్పుడు ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో, అమృత్ కాల్ ఉద్దేశ్యం భారతదేశ పౌరుల జీవితాలను మెరుగుపరచడం. గ్రామాలు, నగరాల మధ్య అభివృద్ధిలో విభజనను తగ్గించడం అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం మరియు సరికొత్త సాంకేతికతను స్వాగతించడం కూడా దీని లక్ష్యం అని ప్రకటించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిర్మలా సీతారామన్ ధరించిన చీర.. ఎవరు బహుమతి ఇచ్చారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్తో పాటు ఆమె ధరించిన చీరపై కూడా అందరి దృష్టి పడింది. ఎందుకంటే 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఈ ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడల్లా ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత చీరలతో దర్శమిస్తున్నారు. ఈ ఏడాది చేతితో నేసిన ఇక్కత్ సిల్క్ ఎర్ర చీరను ధరించి ఆమె పార్లమెంట్కు హాజరయ్యారు. ఇది భారతీయ సాంప్రదాయ వస్త్రాల పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 2023 సమావేశానికి నిర్మలా సీతారామన్ చేతితో నేసిన నవలగుండ ఎంబ్రాయిడరీ ఎరుపు రంగు ఇక్కత్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన ఈ చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే నిర్మలమ్మ దగ్గర చీరల కలెక్షన్లు ఎక్కువే! ఆమెకు చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక చీరతో దర్శమమిస్తారు. అదే క్రమంలో నలుపును దూరం పెడుతుంటారు. -
భారత్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే బడ్జెట్: మోదీ
న్యూఢిల్లీ: కేంద్రబడ్జెట్ 2023-24పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రూపొందించిన బడ్జెట్ అని ప్రశంసించారు. 'అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు బలమైన పునాదులు వేస్తుంది. పేదలు, మధ్యతరగతి, రైతుల కలలు సాకారం చేసే బడ్జెట్ ఇది' అని మోదీ చెప్పారు. దేశం కోసం సంప్రదాయబద్ధంగా తమ చేతులతో శ్రమిస్తున్న 'విశ్వకర్మ'లే ఈ దేశ సృష్టికర్తలని మోదీ వ్యాఖ్యానించారు. చరిత్రలో తొలిసారి కళాకారులకు శిక్షణ, మద్దతు కోసం ఓ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించడం వేగవంతమైన అభివృద్ధికి దోహదం చేస్తుందని మోదీ అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. చదవండి: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ -
నిర్మలా సీతారామన్ మరో రికార్డు, ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రెజెంటేషన్ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్ను కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది. వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. ► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్ను కోరారు. ►ఆ తరువాత ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ►ఇక మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. ►మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు. ► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్కు చివరి బడ్జెట్ కావడంతో పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్ శ్లాబ్స్లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా. పన్ను అనే పదాన్ని ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్కాల్ బడ్జెట్ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి స్పందన
సాక్షి, విజయవాడ: ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కేంద్ర బడ్జెట్పై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయన్నారు. చదవండి: Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే! ‘‘ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం. కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారు. 7 రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ని రూపొందించారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరాం. ఏపీ రోల్ మోడల్గా ఈ రంగంలో ఉంది. దీనిపై పాలసీ తేవాలని కోరామని, దానిని ప్రకటించారు. ఈ బడ్జెట్లో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని’’ మంత్రి బుగ్గన అన్నారు. -
కేంద్ర బడ్జెట్ 2023: ఆ వాహనాలకు చెక్.. ఇకనైనా మేల్కోవాల్సిందే!
దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించారు. గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది. -
మార్కెట్కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్లకు జోష్నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పెరుగనున్నవి... బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు బంగారం, వెండి వాహనాల టైర్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు తగ్గనున్నవి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్ని ధరలు తగ్గనున్నాయి టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు -
బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...
లోక్సభలో 2023-24 బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికరమైన పొరపాటు చేశారు. ఆమె అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యి అన్న మాటతో అక్కడ ఒక్కసారిగా లోక్సభలో నవ్వులు విరబూశాయి. వెహికల్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ ఆమే ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయిందంటే పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు అర్థం వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. అయితే ప్రతి పక్షాల సభ్యుల ముఖాలు ఎలాంలి భావాన్ని వ్యక్తం చేయాలేదు. ఐదే ఈ తప్పిదాన్ని నిర్మలమ్మ వెంటనే గమనించి చిరునవ్వుతో..ఓహ్ సారీ అంటూ సరైన వివరణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు. అంతేగాదు పాత కాలుష్య వాహనాలను మార్చడం మన ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని నిర్మలమ్మ చెప్పారు. అలాగే బడ్జెట్ 2021-22లో పేర్కొన్న వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. (చదవండి: పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ) -
వారికి గుడ్ న్యూస్ 38 వేల ఉద్యోగాలు, గిరిజనులకు ప్రత్యేక మిషన్
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ అందించారు. బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించిన నిర్మలా సీతారామన్ విద్యకు తమ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్టు తెలిపారు. ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ను రిక్రూట్ చేయనున్నారు. రానున్న మూడేళ్లలో ఈ స్కూళ్లకు 38, 800 వేల మంది టీచర్లను,ఇత సహాయక సిబ్బందిని రిక్రూట్ చేయనున్నట్లు మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజనుల పీవీటీజీ మిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు లోక్సభలో వెల్లడించారు. గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీ బీటీజీ డెవలప్మెంట్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న 3 సంవత్సరాలలో ఈ పథకం అమలుకు రూ. 15,000 కోట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Budget 2023: రైతులకు తీపి కబురు.. అందుకోసం రూ.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతాన్నామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5 వేల 300 కోట్లు కేటాయించారు. వీటితో పాటు వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
Union Budget 2023-24: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. ట్యాక్స్ స్లాబ్స్ 6 నుంచి 5 కి తగ్గింపు 0-3 లక్షల వరకు పన్నులేదు రూ. 3 - 6 లక్షల వరకు 5% పన్ను రూ. 6 - 9 లక్షల వరకు 10% పన్ను రూ. 9 -12 లక్షల వరకు 15% పన్ను రూ. 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా ట్యాక్స్ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఊరట కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు ఊరట ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. అలాగే సేవింగ్ అకౌంట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఇక ఇప్పటివరకు ఉన్న 80సి కింద మినహాయింపులు చూపించుకోవాలంటే పాత పన్ను పద్ధతిని ఎంచుకోవాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ
సాక్షి, ఢిల్లీ: దేశ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఓ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది కేంద్రం. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ పేరుతో ఆ ప్యాకేజీని తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. అమృత కాల బడ్జెట్లో భాగంగా.. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ను తీసుకొస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎంఎస్ఎంసీ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) వాల్యూ చెయిన్తో అనుసంధానం చేయడం ద్వారా.. వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం, క్షేత్రస్థాయిలో అవి వెళ్లే పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమవుతుందని, ఆ ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ ఏమేర ఉండబోనుందనేది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. PM Vishwa Karma Kaushal Samman For the first time package of assistance for traditional artisans and craftspeople has been conceptualized, which will enable them to improve the quality, scale, and reach of their products, integrating with the MSME value chain#AmritKaalBudget pic.twitter.com/u2m4k6wAls — PIB India (@PIB_India) February 1, 2023 -
యూనియన్బడ్జెట్23: రైల్వేలకు భారీ కేటాయింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో రైల్వేలకు భారీ కేటాయింపులను చేస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేల కోసం రూ. 2.4 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది దాదాపు పదేళ్లలో అత్యధికం, గత సంవత్సరం బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఆమె ఈ సందర్భంగా చెప్పనారు. అంతేకాదు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దేశాన్ని పరిపాలించిన సంవత్సరంతో పోల్చుతే ఇది 2013-14లో చేసిన వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ అంటూ ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ల కోసం ఆమె రూ. 75,000 కోట్లను కూడా ప్రకటించింది, ఇది రైల్వేలకు కూడా ప్రత్యేకంగా దాని సరుకు రవాణా వ్యాపారంలో సహాయపడే అవకాశం ఉందన్నారు. -
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
Union Budget: కర్ణాటకకు కేంద్ర బడ్జెట్లో పెద్ద పీట
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది కేంద్రం. బడ్జెట్-2023లో వరాలు జల్లు కురిపించింది. కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు రూ.5,300 కోట్ల కేటాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగించారు. భద్ర ఎగువ తీర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల గ్రాంట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుందని, చిత్రదుర్గతో సహా మధ్య కర్ణాటకలోని అనేక వర్షాధార వ్యవసాయ జిల్లాలకు వరం అవుతుందని, పైగా.. ప్రాజెక్టును త్వరగా, సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. దీనికి కొనసాగింపుగా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు వస్తాయని అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే వరాలు కురుస్తున్నాయి. -
అమృత కాల బడ్జెట్ 23: సీతారామన్ ‘సప్తఋషులు’..అవేంటంటే!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అమృత కాల్ బడ్జెట్లో అవి ఒకదానికొకటి సమన్వయంతో సప్త ఋషులుగా మార్గ నిర్దేశనం చేస్తాయని చెప్పారు. ఈ ప్రాధాన్యతలు దేశాన్ని 'అమృత్ కాల్' వైపు మళ్లిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇవి తమ ప్రభుత్వానికి ఫ్రేమ్వర్క్గా సీతారామన్ అభివర్ణించారు. సీతారామన్ ఏడు ప్రాధాన్యతలు: సమ్మిళిత అభివృద్ధి రీచింగ్ లాస్ట్ మౌలిక సదుపాయాలు ,పెట్టుబడి పొటెన్షియల్ గ్రోత్ గ్రీన్ గ్రోత్ యువశక్తి ఆర్థిక విభాగం అలాగే పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు పరిశుధ్దమైన నీరు, ఇండ్లు, రోడ్,టెలికాం వసతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం 15 వేల కోట్లు కేటాయించారు. ఈ మిషన్, వచ్చే మూడేళ్లలో వారి సంకక్షేమం కోసం కృషి చేయనున్నట్టు ఆర్థిక మంతత్రి పార్లమెంటులో వెల్లడించారు. అలాగే ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రకటించారు. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. మహిళలు, రైతుల, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అందుకోసం ప్రత్యక అవకాశాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయానికి పెద్దపీటవేయడంతోపాటు, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ఏర్పాటును ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేలా ప్రణాళిక అని చెప్పారు. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్ చేస్తామని, ఇందుకోసం రూ. 2 వేల కోట్లు కేటాయింపును ప్రకటించారు. -
కేంద్ర బడ్జెట్ 2023: గుడ్ న్యూస్.. మహిళల కోసం మరిన్ని పథకాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. -
Union Budget 2023: ‘ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్’
పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 2023-24 "ఇది ఉత్తమ బడ్జెట్. ఇది పేద, మధ్యతరగతి అనుకూల బడ్జెట్." అని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. మరో వైపు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. -
అమృతకాల బడ్జెట్: అంతర్జాతీయ సవాళ్ల మధ్య ధీటుగా భారత్
న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ 2023-24 ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కీలక విషయాలను ప్రకటించారు. ఇది అమృత కాల బడ్జెట్ అనీ,దీనికి గత బడ్జెట్ లోనే గట్టి పునాది పడిందని ఆమె అన్నారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన దేశం తలయెత్తుకొని సగర్వంగా నిల బడిందనీ, సమిష్టి ప్రగతి దిశగా దేశం పయనిస్తుందని నిర్మలా భరోసా ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అత్యంత వేగంగా ఉందన్నారు. వృద్ధి రేటును 7శాతంగా అంచనావేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, యువత, మహిళలు, రైతులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అంత్యోదయ వర్గాల వారికి సంత్సరం పాటు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం జనవరి 2023 నుంచి ఉచిత ధాన్యాల పంపిణీ స్కీంను ప్రశేపెడుతున్నాం. దీని య్యే మొత్తం ఖర్చును 2 లక్షల కోట్లు కేంద్రం భరిస్తుంది. కోవిడ్ , యుద్ధం లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా గ్లోబల్గా నెలకొన్న మాంద్యం పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థంగా దృఢంగా నిలబడింది. కోవిడ్ అడ్డుకోవడంలో చాలా వేగంగా పనిచేశాం. 102 కోట్ల మందికి వ్యాక్సన్స్ అందించాం వ్యాక్సినేషన్ డ్రైవ్ శరవేగంగా చేపట్టామని ఆమె చెప్పారు. -
ప్రతీ సెక్షన్నూ కవర్ చేశాం, ప్రజలకు మోదీ ఎపుడూ అండగా ఉంటారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ బడ్జెట్ 2023కి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూనియన్ బడ్జెట్ 2023లో 'ప్రతీ విభాగం' చేర్చామని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గాల అంచనాలను అందుకోబోతున్నాం. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు అనుకూలంగా పని చేస్తుందంటూ పేర్కొన్నారు. మరోవైపు రానున్న బడ్జెట్పై కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక సర్వే అంనాలు మరింత ఆశా జనకంగా ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా అయిదోసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. -
Union Budget 2023: ప్రత్యేక సందర్భాల్లో నిర్మలమ్మ ధరించే చీర వెనుక ఇంత కథ ఉందా!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు, ఊరటనిచ్చే అంశాలు వంటి వాటితో ఈ బడ్జెట్లో ఏముందనే ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వీటితో మరో అంశం కూడా ఉందండోయ్. ఆమె ఏ రంగు చీరతో 2023-24 బడ్జెట్ను సమర్పిస్తుందా అని అందరి దృష్టి దానిపైనే ఉంది. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం బడ్జెట్తో పాటు దానిపై కూడా ప్రత్యేక దృష్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరల సేకరణను కలిగి ఉన్నారు.నిర్మలమ్మకు చేనేత చీరలంటే ఇష్టం ఎక్కువ. జనవరి 26న, నార్త్ బ్లాక్లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. నిర్మలమ్మ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక చీరల ధరించి దర్శమమిస్తారు. అదీ కూడా ఆ రంగులు తరచుగా దేశంలోని కరెన్సీ నోట్లకి సరిపోతుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో కనిపించింది. ఈ ఏడాది బడ్జెట్ 2023 కోసం ఆమె ప్రకాశవంతమైన ఎరుపు రంగును ఎంచుకున్నారు. దీనిబట్టి ప్రజలు ఈ సారి సానుకూల బడ్జెట్ ఆశించవచ్చిన తెలుస్తోంది. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం.. ►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది. ►పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర.. ►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది ►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్పురి చీర ►మన్మోహన్ సింగ్ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర ►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర ►విలేకరుల సమావేశంలో ధరించిన జమ్దానీ చీర రూ.50 నోటుతో సరిపోతుంది. ప్రత్యేక సందర్భాలలో ఆర్థిక మంత్రి ఎరుపు రంగును ఎంచుకుంటారు, నలుపును దూరంగా పెడుతుంటారు. చదవండి: Union Budget 2023: బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? ఈ విషయాలు తెలుసా? -
బడ్జెట్ పద్దుతో మంత్రి నిర్మలమ్మ బృందం (ఫొటోలు)
-
ముందే ముగియనున్న బడ్జెట్ తొలి దఫా సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల తొలి దఫా బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 13కు బదులు 10వ తేదీనే ముగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పలు పార్టీలు కోరాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ధృవీకరించారు. ‘‘లోక్సభ సభా కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీలో స్పీకర్ వద్ద వారీ విషయాన్ని ప్రస్తావించారు. వారి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా జరగనుంది. తొలి సెషన్ ఫిబ్రవరి 13వ తేదీతో ముగియనుంది. అయితే 11-12 తేదీలు వారాంతం కావడంతో ఎంపీలు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్ ప్రకారం.. రెండో దఫా సమావేశాలు మార్చి 13వ తేదీన మొదలై.. ఏప్రిల్ 6వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి. -
ప్రీ బడ్జెట్ ర్యాలీ, ఈ జోష్ నిలబడేనా?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 512 పాయింట్లు ఎగియగా నిఫ్టీ 140 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. తద్వారా సెన్సెక్స్ 60 వేలకు, నిఫ్టీ 17800 పాయింట్ల మార్క్ను అధిగమించాయి. బడ్జెట్పై ఆశలు, అంచనాలతో ఇన్వెస్టర్లు ఆశాజనంగా ఉన్నారు. దీంతో సూచీలు ఉ త్సాహంగా ఉన్నాయి. బడ్జెట్ ప్రకటన తరువాత ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు , బబ్రిటానియా, హిందాల్కో, టాటా స్టీల్ బాగా లాభపడుతుండగా అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మ, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 81.80 వద్ద ఉంది. -
బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? మీరేం అనుకుంటున్నారు?
‘బడ్జెట్ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’ ‘బడ్జెట్ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్కు ముందు, బడ్జెట్కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది. సివిల్స్ కలలు కనే వారి నుంచి స్టార్టప్కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు... కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్ కలలు కనే యంగ్స్టర్స్కు బడ్జెట్ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్లో సివిల్స్ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్లో సక్సెస్ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక. యంగ్పీపుల్ బడ్జెట్ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో సివిల్స్లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు. ‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. కంపెనీల లే ఆఫ్లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్పై ఒక కన్ను వేస్తున్నారు. దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్ ప్రసంగం వినాల్సిందే. సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది. ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వింటున్నారు. తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష. ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్ యూనివర్శిటీ. ‘డిజిటల్ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్లో డిజిటల్ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ సెక్టార్కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష. ‘బడ్జెట్’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా! స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది.