Niramala Sitharaman
-
వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ 2025-26
-
కేంద్ర బడ్టెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం... నిధులు సాధించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం
-
ఏపీకి గుండు సున్నా
-
ఉద్యోగులకు శుభవార్త.. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. వరుసగా ఆరోసారి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 21వ వార్షిక ర్యాంకింగ్స్లో ఈ ఏడాది నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచారు.ప్రతీ ఏడాది వినోద, వ్యాపార, రాజకీయ, దాతృత్వం, తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రభావాన్ని చూపిస్తున్న మహిళా వ్యాపారవేత్తలు, ఎంటర్టైనర్లు, రాజకీయ నాయకులు, దాతలు, విధాన రూపకర్తలతో కూడిన వార్షిక జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. నిర్మలా సీతారామన్తోపాటు, ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా 81వ స్థానంలో నిలవగా, బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో ఉన్నారు.ఇక శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం, 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలో నిలిచారు. యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వరుసగా మూడోసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , మొదటి ఐదు స్థానాల్లో కొత్తవారు మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ చోటు దక్కించుకున్నారు. -
జులైలో కేంద్ర బడ్జెట్!
ఢిల్లీ: కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం జూలై మధ్యలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 2024-25 బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వివిధ శాఖల మంత్రులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలను జూన్ 17 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్రం లేవలం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక.. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ మంత్రులను పార్లమెంట్కు పరిచయం చేయనున్నారు. -
ఉద్యోగులకు గుడ్ న్యూస్ 7 లక్షల వరకు No Tax
-
వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం
-
బడ్జెట్ 2024: మంత్రికి పెరుగు తినిపించిన రాష్ట్రపతి
మధ్యంతర బడ్జెట్ 2024-25 సమర్పణకు వెళ్లే ముందు భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పెరుగు తినిపించారు. 2024-25 ముందస్తు ఎన్నికల బడ్జెట్ను సమర్పించే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పించేందుకు అనుమతి తీసుకుంటారు. అందులో భాగంగానే మంత్రి రాష్ట్రపతిని కలిశారు. ముర్ము నిర్మలమ్మకు పెరుగు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. -
నిర్మలా సీతారామన్కు కపిల్ సిబల్ కౌంటర్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తప్పుపట్టారు. డిసెంబర్ 19న జరిగిన విపక్షాల ‘ఇండియా కూటమి’ సమావేశంలో పాల్గొన్న సీఎం స్టాలిన్పై నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయిందని ఇటువంటి సమయంలో ప్రజల మధ్య ఉండాల్సింది పోయి.. సీఎం స్టాలిన్ ‘ఇండియా కూటమి’ హాజరుకావడం ఏంటని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షం, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సీఎం స్టాలిన్ ఎందుకు సానుకూలమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ను టార్గెట్ చేయడంపై తాజాగా కపిల్ సిబల్ నిర్మలా సీతారామన్పై మండిపడ్డారు. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న దేశ అప్పులు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు, ఆకలి, పేదరికం వంటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. సీఎం స్టాలిన్పై విమర్శలకు చేయడానికి బదులు దేశంలో ఉన్న ఈ సమస్యలపై దృష్టి సారించాలని కపిల్ సిబాల్ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గతేడాది మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికకైన విషయం తెలిసిందే. చదవండి: వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావాలి: మోదీ -
అప్పులు కావవి విష ప్రచారం..ఇదీ నిజం!
సాక్షి, అమరావతి: అప్పులు అప్పులు అంటూ ఆంధ్రప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన వారికి కేంద్రం ప్రటించిన నివేదిక చెంపపెట్టుగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తమిళనాడు అత్యధిక రుణ బకాయిలున్న రాష్ట్రంగా నిలిచింది. 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర (స్టేట్ డెవలప్మెంట్ లోన్- ఎస్డీఎల్) బకాయిలు రూ.7.54 లక్షల కోట్లుగా ఉండగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అప్పు రూ.7.10 లక్షల కోట్లకు చేరుకుందని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలిపారు. గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 -2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ కర్ణాటక, ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సంఖ్య రాష్ట్రం తీసుకున్న అప్పు 1 తమిళనాడు రూ.7.54 లక్షల కోట్లు 2 ఉత్తర ప్రదేశ్ రూ.7.10 లక్షల కోట్లు 3 మహారాష్ట్ర రూ.6.80 లక్షల కోట్లు 4 పశ్చిమ బెంగాల్ రూ.6.08 లక్షల కోట్లు 5 రాజస్థాన్ రూ.5.37 లక్షల కోట్లు 6 కర్ణాటక రూ.5.35 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా మారాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లేనని ఆయన వివరించారు. ఈ వాస్తవాలను విస్మరించి 10 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. లోక్సభలో ఖమ్మం బీఆర్ఎస్ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు సీతారామన్. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అప్పు ఉంటే 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలి. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లే. 10 లక్షల కోట్ల అప్పు… pic.twitter.com/t8pveEL21r — Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2023 -
ఎడతెగని వర్షాలు: ఐటీఆర్ ఫైలింగ్కు గడువు మరో నెల పొడిగింపు?
ITR filing 2023: ఆదాయపన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలుకు గడువు సమీపిస్తోంది. మరో తొమ్మిది రోజుల్లో అంటే జూలై 31 నాటికి ఈ గడువు ముగియనుంది. అలాగే డెడ్లైన్ ముగిసేలోపు, రిటర్న్స్ దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా ఇప్పటికే సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని ఇటీవల స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఏడాది గడువు పెంపు ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. గతంలో, ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించింది. అలాగే ప్రస్తుత వరదలు, అనిశ్చిత వాతారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పొడిగింపు ఉంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) మరోవైపు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ గడువును ఒక నెల పెంచాలంటూ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది. ముఖ్యంగా రాజధాని న్యూఢిల్లీలో వరదల కారణంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ సహా చాలా ఆఫీసులు పనిచేయ లేదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారిక ప్రకటన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) కాగా ఐటీఆర్ ఫైలింగ్ పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపిన సంగతి తెలిసిందే. -
G20 ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్
G20 గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్లో మూడవ జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం సోమవారం మొదలైంది. గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. VIDEO | "The state visit of PM Modi to the United States last month and his meeting with the US President have enhanced the strength and dynamism of the partnership (between India and US). The historic visit paved the way for new avenues of collaboration, propelling our… pic.twitter.com/YZLXBLdZrj — Press Trust of India (@PTI_News) July 17, 2023 ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి, 66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్ఎంసీబీజీ కాన్క్లేవ్ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్తో దరఖాస్తు ఫారమ్ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
ఎన్నిసార్లు అడిగినా ఒక్కటి కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
తెలంగాణ విషయంలో కేంద్రం చూపిస్తున్న వివక్షపై రాజ్భవన్ దృష్టి పెడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం చేసిన ట్వీట్పై ఆయన ట్విట్టర్లో స్పందించారు. వైద్య కళాశాలలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కూడా హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలపై మోసం ‘రాష్ట్రానికి కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపింది. ఒకటో ఫేజ్లో ఇస్తారనుకుంటే రెండో ఫేజ్లో కూడా ఇవ్వలేదు, మూడో ఫేజ్లో ఇస్తామని చెప్పి చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేక పోయామని అంటారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు..?’అని హరీశ్ నిలదీశారు. దేశంలోనే నం.1గా రాష్ట్రం ‘కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వకున్నా, పైసా నిధులివ్వకున్నా..సీఎం కేసీఆర్ రాష్ట్ర సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?..’అని ప్రశ్నించారు. గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీపై దృష్టి పెట్టండి తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని, తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు నిలదీయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఏపీ పునర్ విభజన చట్టం –2014 లో ఇచ్చిన0 హామీల మేరకు గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినట్టవుతుందని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్కు ఎందుకింత దుస్థితి? ‘గతంలో బీబీనగర్ ఎయిమ్స్కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి అన్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సి న బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకని గల్లీలోని మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ.1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్కు 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా?..’అని హరీశ్ నిలదీశారు. -
విశాఖపట్నంలో ‘గ్లోబల్ టెక్ సమ్మిట్’
సీతంపేట(విశాఖపట్నం): త్వరలోనే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్ర్టన్ ఎరీనాలో నిర్వహిస్తున్న గ్లోబల్ టేక్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ టెక్ సమ్మిట్లో ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాలపై చర్చ నిర్వహిస్తున్నారు. సదస్సులో వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జి–20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చెయ్యాలి, అవసరమైన నాణ్యతా ప్రమాణాలపై చర్చ జరుగుతుంది. -
టెక్నాలజీ దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) ఐకానిక్ డే వేడుకలను ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. మార్కెట్లపై డిజిటైజేషన్ ప్రభావం గణనీయంగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఎక్కడ దుర్వినియోగ మవుతున్నాయి, ఎక్కడ సడలించాలి, ఎక్కడ కఠినతరం చేయాలి అనే అంశాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) తదితర నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ సూచించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్, కార్యదర్శి రాజేశ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారదర్శక విధానాలు ఉండాలి.. సమాజాన్ని అన్ని కోణాల్లోనూ ప్రభావితం చేసే డిజిటైజేషన్కు సంబంధించిన విధానాలు సముచితంగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. డిజిటైజేషన్తో నియంత్రణ సంస్థలు, ఇతరత్రా సంస్థలు ప్రయోజనం పొందాలన్నారు. అదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్లకు రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను.. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు షాక్ అబ్జర్బర్లుగా ఉంటున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినా మార్కెట్లు పతనం కాకుండా దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంక్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు. మార్చి నెల గణాంకాల ప్రకారం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) దగ్గర యాక్టివ్గా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు కోట్లకు పెరిగింది. ఎస్ఎన్ఏతో పారదర్శక పాలన.. కార్యక్రమంలో భాగంగా నేషనల్ సీఎస్ఆర్ ఎక్సే్చంజ్ పోర్టల్ను, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడంపై స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు, వాటి వినియోగాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) డ్యాష్బోర్డును సీతారామన్ ఆవిష్కరించారు. దీనితో పాలన మరింత పారదర్శకంగా మారగలదని, రాష్ట్రాలకు కేంద్రం పంపే ప్రతీ రూపాయికి లెక్క ఉంటుందన్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రాలకు రూ. 4.46 లక్షల కోట్లు బదిలీ అవుతుంటాయని మంత్రి చెప్పారు. 75 ఏళ్లు పైబడిన వారికి క్లెయిమ్ల విషయంలో తోడ్పాటు కోసం ఐఈపీఎఫ్ఏ ప్రత్యేక విండో ప్రారంభించింది. Smt @nsitharaman launches National CSR Exchange Portal during Iconic Day celebrations of @MCA21India under the #AzadiKaAmritMahotsav. The portal is a digital initiative on CSR enabling stakeholders to list, search, interact, engage & manage their CSR projects on voluntary basis. pic.twitter.com/B6Pf495Py4 — NSitharamanOffice (@nsitharamanoffc) June 7, 2022 -
హిమ్మత్ రఖనా అంటూ కన్నుమూసిన అమ్మానాన్న, ఎల్ఐసీ నోటీసులు, నెటిజనుల స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీమా సంస్థ ఎల్ఐసీ లోన్ రికవరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ విషయం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్కు దృష్టికి చేరింది. వెంటనే దీనిపై జోక్యం చేసుకున్న ఆమె ఈ విషయాన్ని పరిశీలించి తనకు వివరాలు అందించాల్సిందిగా ఎల్ఐసీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ లోని భోపాల్కు చెందిన జితేంద్ర పాఠక్ ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ టీచరు. ఎల్ఐసీ నుంచి ఇంటి కోసం రూ.29 లక్షల రుణం తీసుకున్నారు. అయితే గత ఏడాది జితేంద్ర, ఆయన భార్య డా. సీమా పాథక్ను కూడా కరోనా పొట్టన పెట్టుకుంది. అప్పటికి వనిషా వయసు 17 సంవత్సరాలు. ఈమెకు పదకొండేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే 29 లక్షల రూపాయల లోన్ తీర్చాలంటూ వనిషా పాఠక్కు నోటీసులు పంపింది ఎల్ఐసీ. తక్షణమే లోన్ చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జూన్ 5న ఎల్ఐసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పిల్లల బంధువులు తమ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని తెలియజేశారని ఎల్ఐసీ తెలిపింది. ఇకపై ఎలాంటి నోటీసులు అందవని హామీ ఇస్తూ ఏప్రిల్లో లేఖ పంపినట్లు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బాధితుల స్పందన భిన్నంగా ఉంది. ఇదే నిజమైతే మళ్లీ నోటీసులు ఎందుకు వచ్చాయని వనిషా ప్రశ్నించింది. కాగా వనిషా పాఠక్, ఆమె సోదరుడిని ప్రస్తుతం మేనమామ సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి వనిషా 10వతరగతి సీబీఎస్ఈ పరీక్షలలో ఇంగ్లీష్, సంస్కృతం, సైన్స్, సోషల్ సైన్స్లో 100 మార్క్లు, గణితంలో 97 స్కోర్ చేయడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వనిషా పాఠక్ ఐఐటీ లేదా యూపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని భావిస్తోందట. దేశానికి సేవ చేయాలని తండ్రి కోరిక అని.. ఇపుడు అది తన డ్రీమ్ అని చెప్పింది. అలాగే అద్భుతమైన కవిత్వంతో అమ్మ నాన్నాలకు ఘనమైన నివాళి అర్పించడమే కాదు ఆ దుఃఖాన్ని, కన్నీళ్లను దిగమింగుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజనులు వనిషాకు, ఆమె తమ్ముడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎల్ఐసీ రుణాన్ని తీర్చి, ఆమె చదువు కయ్యే ఖర్చును భరించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నామని తెలిపారని పిల్లల మేనమామ చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయం చేస్తామంటూ ఫోన్లు వస్తూనే ఉన్నాయనీ ఆయన తెలిపారు. అయితే లోన్ రీపేమెంట్లో ఎల్ఐసీ నుంచి కొంత సడలింపు లభిస్తే.. అదే పెద్ద సహాయం అవుతుందన్నారు. -
శభాష్.. నిర్మలా సీతారామన్!.. నెటిజన్ల మెచ్చుకోలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోదా, ప్రోటోకాల్ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2022 మే 8 ఆదివారం న్యూఢిల్లీలో మార్కెట్ కా ఏకలవ్య పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరు పద్మజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజా చుండూరు ప్రసంగించడం ప్రారంభించారు. అయితే మార్కెట్కు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తున్న క్రమంలో ఆమెకు ఇబ్బంది కలగడంతో మధ్యలో ప్రసంగం ఆపి, మంచి నీళ్ల బాటిల్ ఇవ్వాలంటూ అక్కడున్న హోటల్ సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తున్నారు. పద్మజా చుండూడుకు ఎదురైన ఇబ్బందిని గమనించిన మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తన దగ్గరున్న బాటిల్లో నీటిని ఓ గ్లాసులో పోసి తన కుర్చీ నుంచి లేచి.. పద్మజా దగ్గకు వెళ్లింది. గ్లాసులో నీళ్లు అందించి తాగాలంటూ సూచించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఘటనతో పద్మజతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిర్మలా సీతారామన్ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values. A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8 — Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గంటల తరబడి గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం దిట్ట. అందరికీ అది అంత సులువైన విషయం కాదు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్డడంతో పాటు ఆర్మ నిర్భర్ ప్యాకేజీని సైతం ఆమె గంటల తరబడి సునిశితంగా వివరించారు. అందువల్లే మాట్లాడేప్పుడు వచ్చే ఇబ్బందిని గమనించి.. వెంటనే అక్కడ చాలా సేపుగా మాట్లాడుతున్న మహిలా ఉద్యోగి తాగేందుకు నీళ్ల బాటిల్ అందించారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్ల రాజ్యం -
మనీలాండరింగ్పై పోరుకు భారత్ కట్టుబడి ఉంది
వాషింగ్టన్: నగదు అక్రమ చెలామణీ (మనీలాండరింగ్), ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)’ పోషిస్తున్న పాత్రను ఆమె అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్ఏటీఎఫ్ మంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు (2022–24 సంవత్సరాలకు) ఆమోదం తెలిపారు. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ అంతర్ ప్రభుత్వ సంస్థగా పనిచేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్, ఇతర సమస్యలపై పోరాడటమే ఈ సంస్థ ఎజెండా. ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సీతారామన్ మద్దతు పలికారు. మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, సామూహిక హననానికి దారితీసే ఆయుధాలకు ఫైనాన్సింగ్ను అడ్డుకోవడం కోసం.. ప్రపంచకూటమిగా ఎఫ్ఏటీఎఫ్ చేస్తున్న కృషికి వనరులను సమకూరుస్తామన్నారు. అమెరికన్ కంపెనీల సీఈవోలతో భేటీ తన పర్యటనలో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలు ఫెడ్ఎక్స్, మాస్టర్కార్డ్ సీఈవోలతో భేటీ అయ్యారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో వ్యాపార అవకాశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. భారత్ మార్కెట్ పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని, నైపుణ్య శిక్షణ సహా పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికలు ఉన్నట్టు ఫెడ్ఎక్స్ ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులైన రాజ్ సుబ్రమణ్యం తెలిపారు. భారత్లో పరిశోధన అభివృద్ధి కేంద్రాలను (ఆర్అండ్డీ) ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యయాలు తగ్గించేందుకు రూ. 100 లక్షల కోట్లతో కూడిన నేషనల్ మాస్టర్ప్లాన్ను ప్రధాని గతేడాది ప్రారంభించడం గమనార్హం. యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్, మాస్టర్ కార్డ్ సీఈవో మిబాచ్ మైకేల్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్తోనూ సీతారామన్ సమావేశమయ్యారు. చదవండి👉🏼 ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు! -
క్రిప్టో కరెన్సీ అంటే అంత క్రేజ్ ఎందుకు?
డిజిటల్ ఇండియా..డిజిటల్ ఎకానమీ...డిజిటల్ రుపీ. అంతా డిజిటల్. డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ త్వరలోనే దేశీ డిజిటల్ కరెన్సీని లాంచ్ భారత్లో చేయనుంది. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టో కరెన్సికి ఎందుకంత క్రేజ్? ఇక భవిష్యత్తు అంతా క్రిప్టోకరెన్సీలదేనా? క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ రూపంలోనే కనిపించే కరెన్సీ. అంటే క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు బ్లాక్చెయిన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడున్న కరెన్సీలాగే చాలా దేశాల్లో వీటిని లావా దేవీలకు అనుమతి ఇస్తున్నారు. . బిట్కాయిన్లను మొట్టమొదటిసారి ఒక కరెన్సీగా వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించింది 2010 మే 22వ తేదీన. ఫ్లోరిడాకు చెందిన లాస్జ్లో హాన్యే అనే ప్రోగ్రామర్.. 10,000 బిట్కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు ఆ పది వేల బిట్కాయిన్ల విలువ సుమారు 47 డాలర్లు మాత్రమే. 2011 ఏప్రిల్లో 1 డాలరుగా ఉన్న బిట్కాయిన్ విలువ అదే ఏడాది జూన్ నాటికి 32 డాలర్లకు పెరిగింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా 2012 ఆగస్టు నాటికి 13.20 డాలర్లకు పెరిగింది. అయితే బిట్ కాయిన్కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో బిట్కాయిన్తో పోటీగా డిజిటల్ కరెన్సీల తయారీ మొదలైంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్లు, ట్రేడింగ్ ఫ్లాట్ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 10,000 డాలర్లకు ఎగిసిన బిట్కాయిన్ 2019లో 7,000 డాలర్లకు పడిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్షోభం, డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో 2020లో బిట్కాయిన్ మళ్లీ దూసుకుపోయింది. 2021లో 70వేల డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను ఊరించడం మొదలు పెట్టింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి బిట్కాయిన్ 16శాతం పతనమై దాదాపు సగానికి పడిపోయింది. 2022 ఫిబ్రవరి 1 తరువాత 39వేల డాలర్ల దిగువకు చేరింది. ఇంత ఒడిదుకుల మధ్య ఉన్నా .. ఆదరణ మాత్రం పెరుగుతూనే ఉంది. (Happy Birthday Shekhar Kammula: శేఖర్ కమ్ముల గెలుచుకున్నది ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?) తాజాగా కేంద్రం కూడా డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుంది. ఏప్రిల్లో ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి బ్లాక్చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీ ఏ రూపంలో జరిగినా దానిపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. అంటే భారత్లో ఇకపై క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి రూపంలో బదిలీ.. ఇలా లావాదేవీ ఏ రూపంలో ఉన్నా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దేశంలో క్రిప్టో ట్రేడింగ్కు అనుమతి ఉంటుందనేసంకేతాలందించారు. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. అనుకున్నట్టుగా ఇండియా డిజిటల్ రుపీని లాంచ్చేస్తే అది ప్రపంచ రికార్డు కానుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఈ తరహా 'ఈ-క్రోనా' వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, 2014 నుంచి చైనా పీపుల్స్ బ్యాంకు కూడా డిజిటల్కరెన్సీ వినియోగంపై కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రధాన నగరాల్లో డిజిటల్ యువాన్ను ట్రయల్ చేస్తోంది. ముఖ్యంగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు హాజరయ్యే అథ్లెట్లు, అధికారులు, జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న మూడు చెల్లింపు పద్ధతుల్లో ఇదొకటి. అయితే సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. మార్కెట్ను ఎలా నియంత్రించాలనుకుంటోంది లాంటి విషయాలపై భారత ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ తయారుచేస్తుందో చూడాలి. బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు 2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. క్రిప్టోకరెన్సీ యూజర్ల వివరాల గోప్యత, నియంత్రణ,భద్రత లాంటి అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ కరెన్సీలతో పోలిస్తే క్రిప్టో కరెన్సీలే బెటర్అని టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, అల్ గోర్, రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఇప్పటికే చెప్పారు. మనీలాండరింగ్, టెర్రరిస్టు కార్యకలాపాలు, డార్క్నెట్ నేరాలు పెరిగిపోతాయని, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ముప్పేనని వారెన్ బఫెట్, పాల్ క్రుగ్మన్, రిచర్డ్ షిల్లర్ వంటి ఆర్థికవేత్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
Budget 2022: ఇండియా@100 టార్గెట్తో..
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతకాలంలోకి ప్రవేశించిందని.. భారత్ వందేళ్లకు చేరుకునే ఈ 25 ఏళ్లు అమృతకాలమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలతో ‘ఇండియా@100’ విజన్ను ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఆ విజన్కు ప్రస్తుత బడ్జెట్లో పునాది వేస్తున్నామన్నారు. విజన్ లక్ష్యాలను సాధించడానికి మూడు మార్గాలను నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. ► అన్ని స్థాయిల్లో సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం దృష్టి ►డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ రంగాలకు ప్రోత్సాహం. ►టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పులు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరిగేలా ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వ పెట్టుబడుల పెంపు’’ ఆ మార్గాలని వివరించారు. పన్నుల వసూలు రాజధర్మం నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివరాలను ప్రారంభిస్తూ.. మహాభారతంలోని శ్లోకాన్ని ఉదహరించారు. ‘దాపయిత్వకరం ధర్యాం రాష్ట్రం నిత్యం యథావిధి అశేషాంకల్పయేంద్రజాయోగ క్షేమానతంద్రితః’ ..శాంతి పర్వంలోని 72వ అధ్యాయంలో ఉన్న ఈ 11వ శ్లోకం రాజ ధర్మం ఎలా ఉండాలో చెప్తుందని ఆమె చెప్పారు. ‘‘రాజు ధర్మానికి అనుగుణంగా రాజ్యాన్ని పాలించాలి. రాజధర్మంలో భాగమైన పన్నుల వసూలు, ప్రజల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చూపకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఆ శ్లోకం అర్థాన్ని వివరించారు. ఈ క్రమంలోనే పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆదాయ పన్ను సహా ఇతర ట్యాక్సులు వేటికి సంబంధించి కూడా ఉపశమనం కలిగించే చర్యలను నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. పన్నుల ఎగవేతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. పన్నులు పెంచలేదు.. చూడండి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పన్నుల తగ్గింపు, ఐటీ పరిమితి పెంపుపై మధ్యతరగతి వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఉపశమనం ఇవ్వలేదేమని మీడియా ప్రశ్నించగా.. ‘‘కరోనా మహమ్మారి సమయంలో పన్నులు పెంచి ప్రజలపై భారం వేయదలుచుకోలేదు. అందుకే గత రెండేళ్లుగా ఎలాంటి పన్నులు పెంచలేదు..’’ అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
సాక్షి కార్టూన్
-
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసుల మేరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్టు పార్లమెంటు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన జనవరి 31న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 11న తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు విరామం ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు, పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10 వెలువడతాయి. ఫలితాలు వచ్చాక అంటే మార్చి 14 నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడం, ఇటీవల 400 మంది పార్లమెంటు సిబ్బంది కరోనా బారిన పడడంతో పార్లమెంటు నిర్వహణకు పూర్తిస్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, పార్లమెంటులోకి రావాలనుకునే ఇతరులు రెండు టీకా డోసులు తీసుకున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్తో పాటు ఆర్టీ–పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాలి. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు షిఫ్ట్లలో నిర్వహించే అవకాశాలున్నాయి. బడ్జెట్ రోజు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. -
బంగారంతో ట్రేడింగ్.. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటులో కీలక అడుగులు
న్యూఢిల్లీ: భారత్లో గోల్డ్ ఎక్సేంజీల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటు ప్రతిపాదనను గత ఏడాది సెప్టెంబర్లో సెబీ బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గోల్డ్ ఎక్సేంజీల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్ను బాండ్గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సేంజీ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు - ఈజీఆర్ల సృష్టికి సంబంధించి డిపాజిట్ చేసిన బంగారం కోసం ఉద్దేశించిన వాల్టింగ్ సేవలను అందించడానికి సెబీ మధ్యవర్తిగా వాల్డ్ మేనేజర్ నమోదవుతారు. మేనేజర్పై సెబీ పూర్తిస్థాయి నియంత్రణ ఉంటుంది. - పసిడి డిపాజిట్లను అంగీకరించడం, బంగారం నిల్వ, భద్రపరచడం, ఈజీఆర్ల రూపకల్పన–ఉపసంహరణ, ఫిర్యాదుల పరిష్కారం, డిపాజిటరీ రికార్డులతో భౌతిక బంగారాన్ని కాలానుగుణంగా సమన్వయం చేయడం వంటి అంశాలు వాల్ట్ మేనేజర్ బాధ్యతల్లో కొన్ని. - వాల్ట్ మేనేజర్గా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలకునే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తుదారు భారతదేశానికి చెందినవారై కనీస నెట్వర్త్ రూ.50 కోట్లు కలిగిఉండాలి. - మంజూరు చేయబడిన ఏదైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ‘నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో’ సస్పెండ్ చేసే రద్దు చేసే అధికారం సెబీకి ఉంటుంది. - ఒక వాల్ట్ మేనేజర్ ఈ నిబంధనలలో నిర్దేశించిన గోల్డ్ ఎక్సేంజీ వ్యాపారంతోపాటు మరైదైనా కార్యకలాపాలను నిర్వహిస్తున్న పక్షంలో రెండు బిజినెస్ వ్యవహారాల పట్ల స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేక స్థలాలను సైతం తప్పనిసరిగా కేటాయించుకోవాలి. - వాల్ట్ మేనేజర్లు వాల్టింగ్ సేవలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డ్ చేయడానికి తగిన వ్యవస్థ (సిస్టమ్)లను కలిగి ఉండాలి. - బంగారం నిల్వ, బదిలీ, ఉపసంహరణ వివరాలు; డిపాజిట్ చేసిన బంగారం స్వచ్ఛత, పరిమాణం– బరువు, ఈజీఆర్ల సృష్టి, ట్రేడింగ్ వంటి అంశాలకు సంబంధించి పత్రాలను పారదర్శకంగా నిర్వహించాలి. ఆయా పత్రాలను కనీసం ఐదు సంవత్సరాలు వాల్డ్ మేనేజర్ భద్రపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెగ్యులేటర్ సెబీ నిర్దేశించిన నియమావళికి (కోడ్ ఆఫ్ కాండక్ట్) కట్టుబడి ఉండాలి. - వాల్ట్లలో బంగారం డిపాజిట్లకు సంబంధించి, ఈజీఆర్లను సృష్టించాలనుకునే ఎవరైనా రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ వద్ద బంగారం డిపాజిట్ కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. బంగారం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించే అధికారం వాల్డ్ మేనేజర్కు ఉంటుంది. బంగారు కడ్డీలను తూకం వేయడం, బంగారం డిపాజిట్ సమయంలో అవసరమైన డాక్యుమెంటేషన్ వంటి కార్యకలాపాల నిర్వహణ మేనేజర్ విధివిధానంలో భాగం. - వాల్ట్ మేనేజర్ లేదా ఆ సంస్థ తరపున అధికారం పొందిన వ్యక్తి ఎవరైనా.. గుర్తింపు పొందిన రిఫైనరీ లేదా నామినేటెడ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు నిర్ధారిస్తారు. - ఈజీఆర్ సృష్టి, క్యాన్సిలేషన్కు సంబంధించి డిపాజిటరీతో ప్రతి వాల్ట్ మేనేజర్ లావాదేవీ నిర్వహిస్తుంది. - డిపాజిటర్ నుండి బంగారాన్ని అంగీకరించిన తర్వాత, వాల్ట్ మేనేజర్ బెనిఫిషియల్ ఓనర్గా డిపాజిటర్ పేరు మీద ఈజీఆర్ను సృష్టిసారు. ఇందుకు అనుగుణంగా డాక్యుమెంటేషన్ జరుగుతుంది. - బంగారం ఉపసంహరణకు సంబంధించి, వాల్ట్ నుండి బంగారాన్ని విత్డ్రా చేయాలనుకునే బెనిఫిషియల్ ఓనర్ డిపాజిటరీకి ఈ మేరకు ఒక అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మొదట ఛార్జీల బకాయిలను వాల్డ్ మేనేజర్కు చెల్లించాలి. - వాల్ట్ మేనేజర్ ఖాతాలు, రికార్డులు, పత్రాలు, బంగారం డిపాజిట్ల పుస్తకాలను తనిఖీ చేసే హక్కు నియంత్రణా సంస్థ సెబీకి ఉంటుంది. సెక్యూరిటీ మార్కెట్ ప్రయోజనాలు, పారదర్శకత పరిరక్షణ సెబీ ప్రధాన ధ్యేయం. అయితే ఈ తరహా తనఖీకి 10 రోజుల ముందు వాల్డ్ మేనేజర్కు నోటీసు పంపడం జరుగుతుంది. - సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వాల్ట్ మేనేజర్స్ రూల్స్ పేరుతో జారీ అయిన కొత్త నిబంధనావళి డిసెంబర్ 31 నుండి అమలులోకి వచ్చింది. గోల్డ్ ఎక్సేంజీ, వేర్హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021–22 బడ్జెట్ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోల్డ్ ఎక్సేంజీ కోసం సెబీ నియంత్రకంగా ఉంటుందని మరియు కమోడిటీ మార్కెట్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బలోపేతం అవుతుందని చెప్పారు. కమోడిటీ మార్కెట్ పటిష్టత, పాదర్శకతలను పెంపొందించడానికి ఈ చర్య దోహదపడుతుందని ఆమె అన్నారు. చదవండి: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్లకు సెక్యూరిటీల హోదా -
సినిమాలతో చికితిపోతున్నాం.. జీఎస్టీ తీసేయండి! సినీ నిర్మాతల మండలి విజ్ఞప్తి
Movie Producers association Request Sitharaman to abolish GST on film industry: ఫిల్మ్, వినోద పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు మోషన్ పిక్చర్ నిర్మాతల మండలి (ఐఎంపీపీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రికి ఒక లేఖ రాసింది. మహమ్మారి కరోనా సవాళ్లతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ఈ రంగం పునరుద్దరణకు జీఎస్టీ మినహాయింపు కీలకమని లేఖలో వివరించింది. ఐఎంపీపీఏ ప్రెసిడెంట్ టీపీ అగర్వాత్ ఈ లేఖపై సంతకం చేశారు. ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దాదాపు 60,000 మంది సభ్యులు ఉన్న ఈ సంఘం ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమలపై విధిస్తున్న జీఎస్టీ తీవ్రంగా ఉంది. ఈ పరిశ్రమపై ఎటువంటి పెట్టుబడి పెట్టకపోగా, ఆదాయాల్లో సింహభాగం ప్రభుత్వానికి వెళుతోంది. ► ఈ పరిశ్రమలో మొత్తం పెట్టుబడిని ఇండస్ట్రీలోని వారే (నిర్మాతలే) సమకూర్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారి సవాళ్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా దెబ్బతీశాయి. పరిశ్రమలోకి కొత్త పెట్టుబడులు రావడానికి, ఈ రంగం పునరుద్దరణకు జీఎస్టీ, ఇతర అన్ని పన్నులను రద్దు చేయడం ఒకటే మార్గం. ►ప్రభుత్వం అనేక మల్టీప్లెక్స్లు, ఎగ్జిబిషన్ అవుట్లెట్లకు ‘భారీగా పన్ను మినహాయింపులు, సబ్సిడీ‘లు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపులు, సబ్సిడీలు టిక్కెట్ల అమ్మకంపై ఆధారపడి ఉంటాయి. మహమ్మారి కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సందర్భంలో ఈ సబ్సిడీలు, మినహాయింపుల వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఫిల్మ్, వినోద రంగాలకు భారీ సబ్సిడీల ద్వారానే వేలాది మంది జీవితాల్లో వెలుగులు ఉంటాయి. ► కరోనా మహమ్మారి సవాళ్లకుతోడు కేంద్ర, రాష్ట్రాల భారీ పన్ను వసూళ్లతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొని ఉంది. కనీసం ఐదు శాతం తక్కువ రేటుకు జీఎస్టీని అమలు చేయాలి. అలాగే పన్ను విధానాల్లో ఏకీకరణను ఆవిష్కరించాలి చదవండి:పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
ప్రపంచ దేశాలన్ని భారత్ను ప్రశంసిస్తున్నాయి
-
Nirmala Sitha Raman: థర్డ్ వేవ్ ఎఫెక్ట్.... పిల్లలపై కేంద్రం ఫోకస్
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో ఎమర్జెన్సీ హెల్త్ సిస్టమ్ ప్రాజెక్ట్ని కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మల సీతారామన్, అనురాగ్ ఠాకూర్లు ప్రకటించారు. ఈ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 23,220 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్పై ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపువచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏరియా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పిల్లల వార్డుల ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పిల్లల వార్డులో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం వంటి చర్యలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టనున్నారు. మౌలిక సదుపాయలకు నిధులు ఈ నిధులతో 7929 కోవిడ్ హెల్త్ సెంటర్లు, 9954 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రస్తుతం కోవిడ్ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ఆస్పత్రుల సంఖ్యను 25 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 7.5 రెట్లు, ఐసోలేటెడ్ బెడ్ల సంఖ్య 42 రెట్లు, ఐసీయూ బెడ్లు 45 రెట్లు పెంచబోతున్నారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయి వరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు. వైద్య విద్యార్థుల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అంబులెన్సుల కొనుగోలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కొరత తీర్చడంతో పాటు కొత్తగా అంబులెన్సుల కొనుగోలు, టెలి మెడికేషన్, కోవిడ్ టెస్టుల పెంపు తదితర చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. చదవండి : 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ -
పెట్రోధరలపై స్పందించిన నిర్మలా సీతారామన్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి 'ధర్మసంకట్'(పెద్ద సందిగ్ధత)గా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు ఆమె అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. అంతకు ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని అని అన్నారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం" అని శక్తికాంత దాస్ అన్నారు. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! జియో ల్యాప్టాప్లు రాబోతున్నాయి! -
‘నిధులు కేంద్రానివి.. గొప్పలు రాష్ట్రానివి’
న్యూఢిల్లీ : కేంద్ర నిధులతోనే తెలంగాణ గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠదామాలు నిర్మిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆమె ఢిల్లీలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర పథకాల అమలు కోసం రాష్ట్రానికి రావల్సిన నిధులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే రైతులను రెచ్చగొడుతూ అనవసర రాద్దాంతం చేస్తున్నాయని డీకే అరుణ అగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎనలేని కృషిచేస్తుందని అరుణ పేర్కొన్నారు. -
వ్యాక్సిన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా కోసం దేశమంతా ఎదురు చేస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె గురువారం వెల్లడించారు. (భారత్ చేరుకున్న రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్) వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కోవిడ్ సురక్షా మిషన్ పేరుతో ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి ఈ నిధులను అందించినట్టు చెప్పారు. రూ .2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపనలో ఇవి భాగమని తెలిపారు. కాగా ఇప్పటికే భారతదేశంలో పలు వ్యాక్సిన్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి. ఈ పరిశోధనల పురోగతిని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షా సమావేశాన్ని కూడా ఇటీవల నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో ఆరోగ్యమంత్రి హర్ష్ వర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నదన్న అంచనాల అనంతరం ఈ నిధుల ప్రకటన రావడం విశేషం. మరోవైపు టీకా ఉత్పత్తిలో భారతదేశం పాత్రను డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రశంసించిన సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : ఫైజర్ పురోగతి) Namaste, Prime Minister @narendramodi, for a very productive call on how to strengthen our collaboration & advance access to knowledge, research and training in traditional medicine globally. @WHO welcomes India's 🇮🇳 leading role in global health, & to universal health coverage. — Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 11, 2020 -
అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై ఫైర్ అయ్యారు. పంజాబ్లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాజకీయ స్వార్థంతోనే రాహుల్, ప్రియాంక గాంధీ అత్యాచార ఘటనలను రాజకీయం చేస్తున్నారన్నారు. ఎంపిక చేసుకున్న ఘటనల పై మాత్రమే వారు మాట్లాడుతున్నారన్నారు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ అండగా నిలబడుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోదరులపై గతంలో రేప్ కేసులు ఉన్నాయని, అందుకే వారు ఈ ఘటనపై మాట్లాడటం లేదని నిర్మల సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీడియాపై దాడులు జరుగుతున్నాయని, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ,వామపక్ష మేధావులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మేము ఏమి చేస్తామో మేనిఫెస్టోలో చెప్పే హక్కు మాకు ఉంది. కరోనా ఫ్రీ వ్యాక్సిన్ అంశం పై మాట్లాడుతూ, ఇది రాష్ట్ర జాబితాలోని అంశమని తెలిపారు. చదవండి: లాలూకి బెయిల్.. నితీష్కు ఫేర్వల్ -
అర్ధరాత్రి ఒప్పందంతో చంద్రబాబు ద్రోహం
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా కేంద్రంతో అర్ధరాత్రి ఒప్పందం చేసుకొని పోలవరం ప్రాజెక్టుకు ద్రోహం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నీ రికార్డుల్లో ఉన్నాయని, నాడు జరిగినవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. ‘విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఏదైనా మంచి జరిగింది అంటే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడమే. దురదృష్టవశాత్తూ విభజన తరువాత అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరించారు. కేంద్రం విధించిన షరతులకు ఒప్పుకున్నారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం పనుల్లో నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరించారు’అని పేర్కొన్నారు. 2017లో అంచనాలు సవరించాలని నిర్ణయించిన తర్వాత కూడా 2014 ధరల ప్రకారం చెల్లించాలని ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. పునరావాసం, భూసేకరణను వదిలిపెట్టడం తదితరాలన్నీ రికార్డుల్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు బుగ్గన తెలిపారు. ఖర్చు చేసిన నిధులు షరతులు లేకుండా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. సమావేశం వివరాలను సీఎం జగన్కు నివేదించి ఆయన సూచనల మేరకు మరోసారి కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఢిల్లీలో లేనందున కలుసుకోలేకపోయినట్లు తెలిపారు. -
'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించాం'
ఢిల్లీ : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడారు.' పోలవరంకు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, వివిధ పథకాలకు సంబంధించిన నిధులపై చర్చించాము. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ , పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరాము. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ మరోసారి ప్రస్తావించాం. రాష్ట్రానికి రూ. మూడు వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన కూడా ఈ అంశాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం బకాయిలను కేంద్రం త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది. మేం ప్రతిపాధించిన అన్ని అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. బకాయిల చెల్లింపు లు అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంటుంది.' అంటూ తెలిపారు. కాగా బుగ్గన వెంట ఎంపీలు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్ , సలహాదారు అజయ్ కల్లం తదితరులు ఉన్నారు. -
మాకు ఇవ్వాల్సింది 1,434 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి హైదరాబాద్కు రావా ల్సిన రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన రూ.315.75 కోట్లు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ. 650.20 కోట్లు కలిపి మొత్తం రూ.1,434 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి శనివారం కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్సింగ్ పూరికి కూడా పంపించారు. కేటాయించారు...విడుదల చేయట్లేదు 10 లక్షలకు పైగా జనాభా గల నగరాల కేటగిరిలో ఉన్న హైదరాబాద్కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.421 కోట్లను 15వ ఆర్థిక సంఘం కేటాయించినా, ఇప్పటి వరకు విడుదల చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నిధుల కేటాయింపులను కేంద్రం అంగీకరించిందని, లోక్సభలో సైతం యాక్షన్ టేకెన్ రిపోర్టును ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. హైదరాబాద్కు రావాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి విడుదల కాలేదని, మిగిలిన నగరాలకు సంబంధించి రూ.106 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయన్నారు. కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నాయని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని, వీటికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలను కొనసాగించడం ఇబ్బందిగా మారిందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.2,714 కోట్ల బేసిక్ గ్రాంట్స్కు గాను కేంద్రం రూ. 2,502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, రూ. 212 కోట్లు బకాయిపడిందన్నారు. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి మొత్తం రూ.650 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఈ నిధులను పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. -
'రూ. 3,805 కోట్లు వెంటనే విడుదల చేయాలి'
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగాఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. వెంటనే పోలవరంకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్ధిక మంత్రితో బకాయిల చెల్లింపులపై చర్చలు జరుపుతున్నామన్నారు. కాగ్ సర్టిఫికేషన్ వల్ల నిధుల విడుదల ఆలస్యమైందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం బకాయిలను విడుదలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.(చదవండి : పోలవరం.. మీ సహకారంతో సాకారం) -
‘టీడీపీ ఓడిపోవడంతో బీజేపీలో చేరారు’
సాక్షి, అమరావతి: బీజేపీలో చేరిన టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. తప్పుడు సమాచారంపై జాగ్రత్త వహించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తులు టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ పంచన చేరారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) మీరు ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తి సంక్షోభవంలోకి నెట్టేసిందన్నారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని ఆదుకునేందుకు రూ.17,904 కోట్లను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ పెంచలేదని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ కో లాంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. -
ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక సూచన చేశారు. ఆర్బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన తమ కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. తమ డ్యూటీ చేసుకోమని మొహమాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని కోరాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు చిదంబరం శనివారం సూచించారు. డిమాండ్ పడిపోతోందనీ, 2020-21లో వృద్ధి ప్రతికూలతవైపు మళ్లుతోందని చెబుతున్న శక్తికాంత దాస్ ఎక్కువ ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. (పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం) మరోవైపు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై కేంద్రంపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మండిపడ్డారు. జీడీపీ క్షీణిస్తోందని స్వయంగా ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నా, జీడీపీలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వం ప్రగల్భాలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్ఎస్ఎస్ సిగ్గుడాలని వ్యాఖ్యానించారు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతుందని ప్రభుత్వం ప్రతినిధి, లేదా సెంట్రల్ బ్యాంక్కు చెందిన కీలక వ్యక్తులు ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా కరోనా వైరస్, లాక్డౌన్ ఆందోళనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది నెగిటివ్ జోన్లోకి జారిపోతోంది. దీంతో శుక్రవారం నాటి పాలసీ రివ్యూలో రెపో రేటును 4.0 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. Governor @DasShaktikanta says demand has collapsed, growth in 2020-21 headed toward negative territory. Why is he then infusing more liquidity? He should bluntly tell the government ‘Do your duty, take fiscal measures’. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2020 -
ఆర్థిక ప్యాకేజీ ప్రకటనకు కేంద్రం సిద్ధం!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ( మంగళవారం ) మధ్యాహ్నం 2 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేయనున్నారు. చట్టబద్దమైన, నియంత్రణ చర్యలతో ఆర్థిక మంత్రి దేశ ప్రజలకు ఆర్థికంగా ఊరట కల్పించనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. లాభాల్లోఉన్నప్పటికీ, తీవ్ర ఒడిదుడుకుల మద్య సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ అంచనాలతో భారీగా పుంజుకున్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తిపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈరోజు రాత్రి 8గంటలకు జాతినుద్దేశించిన ప్రసంగించనున్నారు. కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజలకు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలివ్వడం, లాక్డౌన్లను సీరియస్గా తీసుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 500 మార్క్ ను తాకగా, మృతుల సంఖ్య 10కి చేరింది. Even as we are readying an economic package to help us through the Corona lockdown (on priority, to be announced soon) I will address the media at 2pm today, specifically on statutory and regulatory compliance matters. Via video conference. @FinMinIndia @PIB_India @ANI @PTI_News — Nirmala Sitharaman (@nsitharaman) March 24, 2020 -
ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికం(క్యూ3)లో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) జూలై–సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2019 ఏప్రిల్–జూన్)లో వృద్ధి రేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి సవరించింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2018–19) డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. తయారీ రంగంలో ఉత్పత్తి క్షీణించడం వృద్ధి రేటు తగ్గేందుకు దారితీసినట్టు ఎన్ఎస్వో తెలిపింది. వృద్ధి గణాంకాలు ఇవీ... ►డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.7 శాతం వృద్ధి రేటు 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 4.3 శాతం తర్వాత తక్కువ స్థాయి. ►2019 ఏప్రిల్–డిసెంబర్ వరకు తొమ్మిది నెలలకు జీడీపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.3 శాతంగా ఉంది. ►తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 5.2 శాతం వృద్ధి చెందగా, తాజా ఇది 0.2 శాతం మేర తగ్గింది. ►వ్యవసాయ రంగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం నుంచి 3.5 శాతానికి పుంజుకుంది. ►నిర్మాణ రంగంలో జీవీఏ 6.6 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. మైనింగ్ రంగంలోనూ జీవీఏ 4.4 శాతం నుంచి 3.2 శాతానికి దిగొచ్చింది. ►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలోనూ జీవీఏ 0.7 శాతం మేర తగ్గింది. ►వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ విభాగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7.8 శాతం నుంచి 5.9 శాతానికి పరిమితమైంది. ►ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం 2019–20లో రూ.1,34,432గా ఉంటుంది. 2018–19లో ఉన్న తలసరి ఆదాయం రూ.1,26,521తో పోలిస్తే 6.3 శాతం అధికం. ద్రవ్యలోటు... 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును రూ.7,66,846 కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, జనవరి చివరికే (10 నెలల కాలం) రూ.9,85,472 కోట్లకు ( 128.5 శాతం) చేరింది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. క్షీణత ఇక ముగిసినట్టే: ఆర్థిక శాఖ దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్టాన్ని చూసేసిందని (బోటమ్డ్ అవుట్) కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని అకనమిక్ అఫైర్స్ విభాగం కార్యదర్శి అతాను చక్రవర్తి ప్రకటించారు. కీలక పారిశ్రామిక రంగాల్లో వృద్ధి డిసెంబర్, జనవరి నెలల్లో పుంజుకున్నట్టు చెప్పారు. -
మెప్పించని విన్యాసం
ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, మందగమనంతో అది అందరినీ భయపెడుతున్న వేళ... వృద్ధి రేటు పల్టీలు కొడుతూ, ద్రవ్యోల్బణం పైపైకి పోతున్న వేళ బడ్జెట్ విన్యాసం కత్తి మీది సాము. ఖజానా రాబడి తగ్గుతూ ఎంచుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన నిధుల సమీకరణకు సమస్యలెదురైనప్పుడు అందరినీ మెప్పించేలా బడ్జెట్ ప్రతిపాదనలుండటం అసాధ్యం. మెప్పిం చడం మాట అటుంచి ఇప్పుడున్న సంక్షోభం పేట్రేగకుండా చూస్తే అదే పదివేలు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి పాదనలు అందుకనుగుణంగా ఉన్నట్టు తోచదు. వినిమయాన్ని పెంచడానికి మధ్యతరగతి చేతుల్లో డబ్బులుండేలా చూడాలి. ఉపాధి అవకాశాలు పెరిగితే వారికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం పన్నుల రూపంలో పెద్దగా పోనప్పుడు వారు తమ అవసరాల కోసం ఖర్చు పెట్ట గలుగుతారు. అయితే ఈ క్రమంలో ఖజానా పెద్దగా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను వసూళ్లు తగ్గకుండావున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రజల కొనుగోలు శక్తి పెంచి విని మయం బాగుండేలా తీసుకునే చర్యలకూ, ఖజానా దండిగా నిండటానికి చేసే ప్రయత్నాలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది. దీన్నెంత ఒడుపుగా చేయగలుగుతారన్న దాన్నిబట్టే ఆర్థికమంత్రి చాకచక్యం వెల్లడవుతుంది. మిగిలినవాటి మాటెలావున్నా ప్రతి బడ్జెట్కు ముందూ మధ్యతరగతి ఆశగా ఎదురు చూసేది ఆదాయం పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థికమంత్రి కనికరించి గడిచిన సంవత్సరంకన్నా పన్ను భారం మరింత తగ్గిస్తే బాగుండునని మధ్యతరగతి జీవులు ఆశిస్తారు. ఆ విషయంలో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఈసారి నిర్మలా సీతారామన్ ఆదాయం పన్ను వసూలుకు సంబం ధించి రెండు రకాల విధానాలు ప్రతిపాదించారు. ఇప్పుడున్న మూడు శ్లాబ్లను యధాతథంగా కొనసాగిస్తూ, దాంతోపాటు ఏడు కొత్త శ్లాబ్లు ప్రకటించారు. కొత్త శ్లాబుల్ని ఎంచుకుంటే కొన్ని మినహాయింపులు ఎగిరిపోతాయని ఆమె చావు కబురు చల్లగా చెప్పడంతో అందరూ నీరసపడ్డారు. ఇంతకూ కేంద్ర ఆర్థికమంత్రి చేసిందల్లా ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ వేతన జీవులకివ్వడమే. రెండూ కత్తులే. ఏ కత్తి మెత్తగా తెగుతుందో ఎవరికి వారు తేల్చుకోవాల్సివుంటుంది. నిపుణులు చెబు తున్నదాన్నిబట్టి ఈ చర్య వల్ల ఆదాయం పన్ను గణన, రిటర్న్ల దాఖలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. కొత్త శ్లాబుల్లోకి మారదల్చుకున్నవారికి నిరాకరిస్తున్న మినహాయింపులు హేతుబద్ధంగా అనిపించడం లేదు. రూ. 15 లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి పాత విధానంలో రూ. 2,73,000 ఆదాయం పన్ను చెల్లించాల్సివస్తే... కొత్త విధానం ప్రకారం రూ. 1,95,000 చెల్లిస్తే సరిపోతుంది. అంటే కొత్త విధానంలో రూ. 78,000 మిగులుతుంది. కానీ అదే సమయంలో వారు గృహ రుణంపై చెల్లించే వడ్డీ, బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకయ్యే ఫీజులు, పీపీఎఫ్ వంటివాటిపై ఇప్పు డున్న మినహాయింపులన్నీ కోల్పోతారు. ఇవే కాదు... 80జీ కింద విరాళాలపై ఉండే మినహాయింపు, 80 జీజీ కింద నెలకు రూ. 5,000 వరకూ ఉండే మినహాయింపు మాయమవుతాయి. ఇలా దాదాపు 70కి పైగా మినహాయింపులను తొలగించారు. అయితే మున్ముందు సమీక్షించి మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంగతలా వుంచితే... గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వర్త మానంలో ఇలా మినహాయింపులు తొలగించడం ఆ రంగానికి చేటు కలిగించదా? అలాగే బీమా ప్రీమియంలు చెల్లించేవారికిచ్చే మినహాయింపులు కూడా కొత్త విధానంలో కనుమరుగయ్యాయి. ఆదాయం పన్ను మినహాయింపు కోసం అధిక శాతంమంది ఆశ్రయించేది బీమా ప్రీమియంలు చెల్లించడం. ఆ మినహాయింపు కాస్తా ఎత్తేస్తే, ఎవరైనా బీమా జోలికి వెళ్తారా? అది ఆ వ్యాపారంపై ప్రభావం చూపదా? ఉన్నంతలో సాగురంగానికీ, గ్రామీణ రంగానికీ కేటాయింపులు మెరుగ్గానే ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచడం మంచి చర్యే. జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రానికి ఎల్ఐసీలో పది శాతం వాటావుంది. ఇందులో ఏమేరకు విక్ర యిస్తారో చూడాలి. దండిగా లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసీలో ప్రైవేటీకరణకు వీలుకల్పించే ఈ చర్య అమలు అంత సులభం కాదు. దీన్ని ప్రతిఘటిస్తామని బీమా ఉద్యోగులు హెచ్చరించారు. కేంద్రం నిధులు సమకూరిస్తే తప్ప నడిచే అవకాశం లేని సంస్థలను వదిలిపెట్టి నిక్షేపంలా ఉండే సంస్థలను ప్రైవేటు పరం చేయడమేమిటన్నది వారి ప్రశ్న. ఎల్ఐసీ ఏ రోజూ ఆర్థికంగా ఇబ్బందుల్లోపడలేదు. ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. సరిగదా... నష్టాల్లో మునిగిన అనేక పబ్లిక్ రంగ సంస్థల్ని బతికిం చడానికి దాని నిధులే అక్కరకొస్తున్నాయి. బీమా రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా, ప్రజలు ఎల్ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఆ సంస్థే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో కేంద్రం పునరాలోచించడం ఉత్తమం. వివిధ మౌలిక సదుపాయ రంగ ప్రాజెక్టులకు అవస రమైన నిధులు సమీకరిస్తూనే, ద్రవ్యలోటు రాకుండా చూడటానికి ఎల్ఐసీలోనూ, ఐడీబీఐలోనూ ఉన్న వాటాలను కేంద్రం విక్రయించదల్చుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఏమేరకు సాధ్యమో చూడాల్సివుంది. అయితే ద్రవ్య లోటును నిర్దేశించిన పరిమితికి లోబడివుండేలా చూడాలన్న లక్ష్యంలో సంక్షేమ పథకాలకు కోత పడకుండా చూడటం ముఖ్యం. బడ్జెట్ గణాంకాలు గమనిస్తే ముగుస్తున్న సంవత్సరంలో ఆహార సబ్సిడీలో రూ. 75,532 కోట్లు, గ్రామీణ ఉపాధిలో రూ. 9,502 కోట్లు కోతపడ్డాయి. ప్రజల్లో వినిమయాన్ని పెంచి, డిమాండ్ పెరిగేలా చేసినప్పుడే తయారీ రంగం కోలుకుంటుంది. అందు కవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటేనే వృద్ధి రేటు నిర్మలా సీతారామన్ ఆశించినట్టు 10 శాతానికి చేరుతుంది. -
పెళ్లీడు పెరుగుతుందా?
న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ నరేంద్రమోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమానికి, షెడ్యూల్ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమం, సంస్కృతి మరియు పర్యాటకం, పర్యావరణం మరియు వాతావరణ మార్పు అనే మూడు విభాగాలుగా సమాజ సంక్షేమాన్ని విభాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు థీమ్స్కు అనుగుణంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. మహిళల వివాహానికి కనీస వయసును పునఃసమీక్షించేందుకు ఒక టాస్క్ఫోర్స్ను నియమిస్తున్నామని, ఈ టాస్క్ఫోర్స్ ఆరునెలల్లో నివేదిక అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బలహీన వర్గాలు, స్త్రీ, శిశు సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధులు పెంచామని తెలిపారు. స్త్రీ, శిశు.. సాంఘిక సంక్షేమం.. బేటీ బచావో– బేటీ పడావో పథకం బాగా విజయవంతమైందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్థూల బాలికల నమోదు గణాంకాలు(94.32 శాతం) బాలుర గణాంకాల(89. 28 శాతం)కన్నా మెరుగయ్యాయని చెప్పారు. పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల పౌష్టికత మెరుగుదలకు ప్రారంభించిన పోషన్ అభియాన్ కింద ఆరు లక్షల అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్స్ అందించామని, వీటితో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు పౌష్టికత అప్డేట్స్ అంది స్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి, మాన్యువల్ స్కావెం జింగ్ అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో సాంకేతికతను వినియోగిస్తామని వివరించారు. బడ్జెట్లో సంక్షేమ కేటాయింపులు.. ►పౌష్టికాహార కార్యక్రమాల కోసం రూ. 35,600 కోట్లు, స్త్రీ సంక్షేమ పథకాలకు రూ. 28,600 కోట్లు కేటాయించారు. ►షెడ్యూల్ కులాల సంక్షే మం, ఓబీసీల సంక్షేమానికి రూ. 85 వేల కోట్లను, షెడ్యూల్ తెగల కోసం రూ. 53700 కోట్లను కేటాయించారు. ►దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ. 9,500 కోట్లు అందించనున్నారు. ►సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ. 10,103.57 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ. 8,885 కోట్లు. ►మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ►బాలల కోసం కేటాయింపులు గత బడ్జెట్తో పోలిస్తే 0.13 శాతం తగ్గాయి. -
మహిళల ప్రగతి.. శిశువుల వికాసం
న్యూఢిల్లీ: మహిళల అభ్యున్నతి, శిశువుల వికాసానికి 2020–21 బడ్జెట్లో కేంద్రం నిధుల కేటాయింపులను పెంచింది. గత ఏడాది కంటే ఈ పెంపు ఏకంగా 14 శాతం అధికం. 2019–20లో కేటాయింపులు రూ.26,184.50 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.30,007.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.20,532.38 కోట్లను అంగన్వాడీ సేవలకే వినియోగించనున్నారు. ►నేషనల్ న్యూట్రిషన్ మిషన్కు(పోషణ్ అభియాన్) కేటాయింపులను రూ.3,400 కోట్ల నుంచి రూ.3,700 కోట్లకు పెంచారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా.. ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న ఆరేళ్ల లోపు చిన్నారుల సంఖ్యను 2022 నాటికి 38.4 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ►సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో(ఐసీడీఎస్) భాగంగా శిశువుల రక్షణకు నిధుల కేటాయింపులను రూ.1,350 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచారు. ►వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల పథకానికి నిధుల కేటాయింపులను రూ.45 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు పెంచేశారు. మహిళల అక్రమ రవాణా నియంత్రణ, సహాయ పునరావాసానికి ఉద్దేశించిన ఉజ్వల పథకానికి కేటాయింపులను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచారు. ►నేషనల్ క్రెష్ స్కీమ్కు కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద.. ఉద్యోగులైన మహిళలు పని వేళల్లో తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించవచ్చు. ►లైంగిక వేధింపులు, హింస బారినపడే బాధిత మహిళలకు వైద్య సహాయం, న్యాయ, పోలీసు సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఉద్దేశించిన ‘వన్ స్టాప్ సెంటర్’కు కేటాయింపులను రూ.204 కోట్ల నుంచి రూ.385 కోట్లకు పెంచారు. ►ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) పథకానికి 2019–20లో రూ.2,300 కోట్లు కేటాయించగా, 2020–21లో రూ.2,500 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద గర్భిణికి/పాలిచ్చే తల్లికి రూ.6,000 అందజేస్తారు. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో.. బేటీ పడావో’కార్యక్రమానికి రూ.220 కోట్లు కేటాయించారు. ►మహిళా శక్తి కేంద్రాలకు రూ.100 కోట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చింది రూ.50 కోట్లే. అంటే కేటాయింపులను ఈసారి రెట్టింపు చేశారు. ►మహిళ రక్షణ, సాధికారత మిషన్కు గత ఏడాది రూ.961 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,163 కోట్లు కేటాయించారు. -
చేనుకు పోదాం.. చలో!
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం 16 అంశాలతో కూడిన ప్రణాళికలను సిద్ధం చేశామని, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపడం, ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా తగిన మౌలిక సదుపాయాలు కలి్పంచడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది తమ ఉద్దేశమని వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రూ.15 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అందులో వ్యవసాయ రంగానికి రూ.1.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది రుణ పరిమితి రూ.12 లక్షల కోట్లు మాత్రమే కాగా.. ఈ ఏడాది లక్ష్యం రూ.13.5 లక్షల కోట్లు. వ్యవసాయ, అనుబంధ, సాగునీటి వ్యవస్థల కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారని, గ్రామీణాభివృద్ధి కోసం మరో రూ.1.23 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాలివీ.. ‘రైతులను విద్యుదుత్పత్తిదారులుగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కార్యక్రమం కింద 20 లక్షల మంది రైతులు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తాం. మరో 15 లక్షల మంది రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ పంపుసెట్ల నుంచి నెట్మీటరింగ్ పద్ధతి ద్వారా జాతీయ గ్రిడ్కు విద్యుత్తు సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా రైతులు కొంత అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా.. బీడు భూముల్లో, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుదుత్పత్తి చేసుకునేందుకూ రైతులకు అవకాశం కలి్పస్తాం’అని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ భూమి లీజింగ్, మార్కెటింగ్, కాంట్రాక్ట్ ఫారి్మంగ్ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సాగునీటి లభ్యతపై ఒత్తిడి ఉన్న వంద జిల్లాలను గుర్తించి సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. సాగుకు తక్కువ నీరు, ఎరువులు, రసాయనాలను వాడేలా రైతులను ప్రోత్సహిస్తామని తద్వారా రాయితీల కోసం విచ్చలవిడిగా కృత్రిమ రసాయనాలను వాడే పరిస్థితి తొలగుతుందని మంత్రి చెప్పారు. పీఎం–కిసాన్ యోజనకు తగ్గిన కేటాయింపులు రైతులకు ఏటా మూడు దశలుగా మొత్తం రూ.6 వేలు చెల్లించేందుకు ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకం కోసం దాదాపు రూ.75 వేల కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం అమల్లో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా బడ్జెట్లో రూ.54,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే కేటాయింపులు తగ్గినా రానున్న ఆర్థిక సంవత్సరపు అంచనాలను మాత్రం రూ.75 వేల కోట్లుగానే పెట్టడం గమనార్హం. గతేడాది ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 8 కోట్ల మంది రైతులకు రూ.43,000 కోట్లు పంపిణీ చేయగా.. పశి్చమ బెంగాల్లో ఈ పథకాన్ని అమలు చేయలేదు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి సరైన సమాచారం లేదని, ఫలితంగా ఈ ఏడాది ఈ పథకం సవరించిన అంచనాలను కూడా కేంద్రం తగ్గించింది. ఈ పథకం లబి్ధదారుల సంఖ్య గతంలో 14.5 కోట్లు కాగా.. తాజా అంచనాల ప్రకారం 14 కోట్ల మందికి మాత్రమే లబ్ధి చేకూరనుంది. మత్స్య ఉత్పత్తులపైనా ప్రత్యేక శ్రద్ధ.. 2020 – 23 మధ్యకాలంలో మత్స్య ఉత్పత్తులను 200 లక్షల టన్నులకు పెంచేందుకు, 2024–25 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన మత్స్య సంపదను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా నాచు, సముద్రపు కలుపు, ప్రత్యేక నిర్మాణాల్లో చేపల పెంపకాలకూ ఊతమిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 3,477 మంది సాగర్ మిత్రలు, 500 ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లను ఏర్పాటు చేస్తామని, తద్వారా సముద్ర, జల ఉత్పత్తుల సమర్థ మార్కెటింగ్, గ్రామీణ యువతకు ఉపాధికల్పన సాధ్యమవుతుందని వివరించారు. సముద్ర మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు, పరిరక్షించేందుకు, నియంత్రించేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను సిద్ధం చేస్తోందని తెలిపారు. పాడిపశువులకు వచ్చే గాలికుంటుతో పాటు గొర్రెలు, మేకలకు వచ్చే పీపీఆర్ వంటి వ్యాధులను 2025కల్లా దేశంలో లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పశుగ్రాసం పెంపకం పనులకూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు ‘ధాన్యలక్ష్మి గ్రామీణ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల నిల్వకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కలి్పస్తామని, తద్వారా మహిళలను ధనలకు‡్ష్మలుగా మాత్రమే కాకుండా ధాన్యలకు‡్ష్మలుగానూ గుర్తిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్రా, నాబార్డ్ సంస్థల ద్వారా శీతల గిడ్డంగుల ఏర్పాటుకు రుణాలు అందజేస్తామని తెలిపారు. జాతీయ గిడ్డంగుల సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న భూముల్లో గిడ్డంగుల నిర్మాణం చేపడతామని, నాబార్డ్తో 162 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగులను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తామని వెల్లడించారు. విమానాల ద్వారా పంట ఉత్పత్తులను దూర ప్రాంతాలకు చేరవేసేందుకు ‘కృషి ఉడాన్’పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో శీతలీకరణ వ్యవస్థలున్న ‘కిసాన్ రైళ్ల’ను నిర్మించి తొందరగా పాడైపోయే ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. ఉద్యానవన పంటల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకూ ప్రయతి్నస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రాల్లో ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’అన్న భావనను పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తగినంత వ్యవ‘సాయం’ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాటి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మధ్యతరగతి మహిళలకు ఈ బడ్జెట్ ఊరటనిస్తుందని, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించిందని తోమర్ తెలిపారు. వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
సీతారామన్...సుదీర్ఘ ప్రసంగం!
న్యూఢిల్లీ: కశ్మీరీ కవిత, తమిళ కవుల పలుకులు ఉటంకిస్తూ, సింధు నాగరికతను గుర్తు చేసుకుం టూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో రికార్డు బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. శనివారం పార్లమెంట్లో నిర్మల దాదాపు 2 గంటల 42 నిమిషాల మేర బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో గతంలో ఆమె పేరునే ఉన్న సుదీర్ఘ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. చివరలో కొంచెం అస్థత్వత కలగడంతో చివరి పేజీ లను చదవకుండా వదిలేశారు. లేదంటే నిర్మలమ్మ ప్రసంగం మూడు గంటలు దాటి ఉండేదే! గతేడాది జూలైలో నిర్మల తన తొలి బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. తిరిగి ఈ రోజు ఆమే తన రికార్డు బ్రేక్ చేశారు. గతంలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ దాదాపు 2గంటల 13 నిమిషాల ప్రసంగం చేశారు. అంతకుముందు 1991లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ చేసిన ప్రసంగం కూడా సుదీర్ఘమైనదే! తాజా ప్రసంగంలో కశ్మీర్కు చెందిన కవితను అటు కశ్మీరీ, ఇటు హిందీలో ఆమె ఉటంకిం చారు. దీనికితోడు కాళిదాస విరచిత రఘువంశంలోని శ్లోకాన్ని, ప్రముఖ తమిళకవి తిరువళ్లువర్ రచనలను ఆమె తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా అధికారపక్ష సభ్యులు బల్లలు చరిచి ఆమెను ప్రశంసించారు. బేటీ బచావో పథకం ప్రస్తావనతో పాటు పలు అంశాల వద్ద ప్రతిపక్షాలు ఆమె ప్రసంగానికి అడ్డుతగిలాయి. సుదీర్ఘ ప్రసంగం చివరలో అలసిన ఆమె తన మిగతా ప్రసంగం పూర్తయినట్లు భావిం చాలని స్పీకర్ను కోరి కూర్చుండిపోయారు. సీతారామన్ షుగర్ లెవల్స్ పడిపోవడంతో పక్కనే కూర్చున్న మంత్రి గడ్కరీ ఆమెకు చాక్లెట్ ఇచ్చారు. కాగా, ఆరోగ్యం, సంతోషం, సంపద, ఉత్పత్తి, భద్రత.. ఈ ఐదు ఒక దేశ అందమైన ఆభరణాలు’ అని ప్రఖ్యాత తమిళ కవి తిరువళ్లువార్ కవితా పం క్తులను ఆమె ఉటంకించారు. ప్రసంగం అనంతరం మోదీ నిర్మలను ప్రశంసించడం కనిపించింది. -
పన్ను పోటు తగ్గినట్టేనా?
పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 7 శ్లాబులుగా మారుస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ప్రతిపాదించారు. కొత్తగా ప్రతిపాదించిన 7 శ్లాబుల విధానంలో పన్ను రేట్లు మునుపటికన్నా తగ్గుతాయి. కాకపోతే మునుపటి మాదిరి ట్యూషన్ ఫీజు, హెచ్ఆర్ఏ, గృహ రుణంపై వడ్డీ, స్టాండర్డ్ డిడక్షన్, బీమా పాలసీలకు చెల్లించే మొత్తం, పీఎఫ్ వంటి మినహాయింపులేవీ ఈ విధానంలో ఉండవు. తగ్గించిన రేట్ల ప్రకారం నేరుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాత విధానం ప్రకారం పన్ను చెల్లించాలా? కొత్త విధానానికి మారాలా? అన్నది పూర్తిగా పన్ను చెల్లింపుదారు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి కొత్త విధానం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది పన్ను నిపుణులు చెబుతున్న మాట!!. -
మోదీ.. అర్జునుడేనా..?
దారుణంగా పడిపోయిన వృద్ధిరేటు.. నన్నెలా ఛేదిస్తారో చూస్తానంటూ సైంధవుడిలా సవాలు విసురుతోంది!!. ఎన్ని చర్యలు తీసుకున్నా దారికి రాని మందగమనం.. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ లాంటి కురువీరులను గుర్తుకుతెస్తోంది. ఎంత ప్రయత్నించినా కట్టడికాని ద్రవ్యలోటు... ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడి వంటి చక్రవ్యూహ సూత్రధారుల్ని స్ఫురణకు తెస్తోంది. వెరసి.. అభేద్యమైన పద్మవ్యూహం లాంటి బంధంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కు పోయింది. 5 శాతానికి పతనమైన వృద్ధిరేటు.. 7శాతానికి ఎగసిన ద్రవ్యోల్బణం.. మందగించిన అమ్మకాలు.. ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఎత్తిపోతున్న బ్యాంకులు.. 10 లక్షల కోట్ల మేర పేరుకున్న బకాయిలు.. దివాలా తీస్తున్న కార్పొరేట్లు.. విస్తరిస్తున్న కరోనా వైరస్... వీటిలో ఏవీ చిన్న సమస్యలు కావు. పద్మవ్యూహానికి కాపుకాసిన రథ, గజ, తురగ, పదాతి దళాల్లాంటివే. బడ్జెట్ సాక్షిగా ఈ వ్యూహాన్ని ఛేదించ బోయారు మోదీ. కానీ!! వినియోగం పెంచాలంటే పన్నులు తగ్గాలి. అలా చేస్తే రాబడి తగ్గి లోటు పెరుగు తుంది. లోటు పెరిగితే రేటింగ్ తగ్గి అప్పులు పుట్టవు. ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థికవ్యవస్థ అతలాకుతలం. మరెలా? అందుకే ఎల్ఐసీపై ఎనలేని నమ్మకం పెట్టుకున్నారు మోదీ. దాన్లో వాటా విక్రయించి.. లోటు పెరగకుండా ఖజానా నింపి.. ఈ బంధం నుంచి భారత్ను బయటకు తేవాలనుకుంటున్నారు. గతేడాది కూడా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకున్నా.. సాధించలేకపోయారు. ఈ సారి అనుకున్నవి అర్జునుడిలా ఛేదిస్తే.. ఎకానమీ గాడిన పడుతుంది. అభిమన్యుడిలా విఫలమైతే మాత్రం.. మరిన్ని విపరిణామాలు చూడాల్సిందే!!. బడ్జెట్ హైలైట్స్.. ►ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబుల్లో భారీ మార్పులు. బ్యాంకులు దివాలాతీస్తే డిపాజిట్లపై బీమా కవరేజీ ఇప్పుడున్న రూ.1 లక్ష – రూ.5 లక్షల వరకూ పెంపు. ►ఆధార్ ప్రాతిపదికన పాన్ నంబరు కేటాయింపు. ►పబ్లిక్ ఇష్యూతో ఎల్ఐసీలో వాటా విక్రయానికి ఓకే. ►డిజిన్వెస్ట్మెంట్(ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా అమ్మకం) ద్వారా 2020–21లో నిధుల సమీకరణ లక్ష్యం రూ.1.2 లక్షల కోట్లు. 2019–20లో ఈ లక్ష్యం రూ.65,000 కోట్లు మాత్రమే. ►రక్షణ రంగానికి కేటాయింపులు గతేడాది రూ.3.16 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు పెంపు. ►వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల నిధుల కేటాయింపు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ స్కీమ్ను మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయం. ►మహిళలకు సరైన పెళ్లి వయస్సును సూచించేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదన. ►షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రూ.85,000 కోట్ల కేటాయింపు. షెడ్యూల్డ్ తెగలకు కేటాయింపు రూ.53,700 కోట్లు. ►ప్రస్తుత ద్రవ్యలోటును గత అంచనా 3.3%–3.8 శాతానికి సవరణ. వచ్చే ఏడాదికి 3.5 శాతానికి పెంపు. ►ఆరోగ్య రంగానికి రూ.69,000 కోట్లు, స్వచ్ఛ భారత్కు రూ.12,300 కోట్ల చొప్పున నిధుల కేటాయింపు. ►త్వరలో కొత్తగా జాతీయ విద్యా విధానానికి రూపకల్పన. -
మోదీ సర్కారు ‘వృద్ధి’ మంత్రం!
న్యూఢిల్లీ: భయపెడుతున్న ద్రవ్యలోటు ఒకవైపు... అంతకంతకూ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ మరో వైపు... ఇలాంటి సంకట పరిస్థితుల్లో కీలకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన మోదీ సర్కారు వృద్ధిరేటుకే తన ఓటు వేసింది. ఆదాయపు పన్ను(ఐటీ) రేట్లలో కోత ద్వారా వేతనజీవులకు ఊరటతో పాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) భారం నుంచి కంపెనీలకు పూర్తిగా ఉపశమనం కల్పించి అటు కార్పొరేట్లను మెప్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ వ్యయాన్ని కూడా భారీగానే పెంచుతూ ఎడాపెడా కేటా యింపులు చేశారు. ముఖ్యంగా వ్యవసా యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యా లను కూడా పెంచేశారు. లోటును పూడ్చుకోవడానికి ‘ఎల్ఐసీ’ని తురుపు ముక్కగా ఆమె ప్రయోగించారు. మొత్తం మీద 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను శనివారం సీతా రామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారీస్థాయిలో మెరుపులేవీలేనప్పటికీ... అత్యంత తీవ్రం గా నిరాశపరిచే అంశాలు కూడా లేవనేది విశ్లేషకుల మాట!! వేతనజీవులకు ఊరట... మధ్య, ఎగువ మధ్య తరగతి వేతనజీవులకు ఊర టనిచ్చేందుకు ఐటీ రేట్లు, శ్లాబుల్లో కీలక మార్పు లకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. రూ.10 లక్షల పైబడి వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి గత పన్ను చెల్లింపుదారులకు దీనివల్ల సుమారుగా ఒక ఏడాదిలో రూ.1,820 నుంచి రూ.20,300 ఆదా అవుతుందని అంచనా. అయితే, ఇప్పుడున్న రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్తో పాటు బీమా ప్రీ మియం, భవిష్య నిధి, పిల్లల స్కూలు ఫీజులు, ఇతరత్రా అనేక మినహాయింపులన్నింటినీ వదు లుకుంటేనే ఈ కొత్త రేట్ల ప్రకారం పన్ను ప్రయో జనం లభిస్తుంది. కొత్త విధానం వద్దనుకునేవారికి పాత శ్లాబులు, రేట్లను కొనసాగించుకునే వెసులు బాటును కూడా బడ్జెట్లో సీతారామన్ కల్పించడం విశేషం. అయితే, పన్ను విధానాన్ని సరళీకరిస్తున్నా మంటూనే.. మరింత గందరగోళంగా మార్చారం టూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్యలోటు లక్ష్యానికి తిలోదకాలు... వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా పలు రంగాలకు భారీగా కేటాయింపులు జరపాల్సిన తరుణంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యాలకు కేంద్రం పూర్తిగా నీళ్లొదిలేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించిన ప్రభుత్వం... ఇప్పుడు దీన్ని 3.8 శాతానికి సడలించింది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూ డా గతంలో 3 శాతంగా అంచనావేయగా... దీన్ని ఇప్పుడు 3.5 శాతానికి పెంచేసింది. దీనివల్ల మార్కెట్ నుంచి 2020–21లో ఏకంగా రూ.5.36 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 –20) రుణ సమీకరణను కూడా రూ.4.99 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. మార్కెట్లు ‘బేర్’... ద్రవ్యలోటు లక్ష్యాలను పూర్తిగా గాలికొదిలే యడం.. ఇన్వెస్టర్లను మెప్పించే చర్యలను(దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను–ఎల్టీసీజీ తొలగిం చాలన్నది మార్కెట్ వర్గాల ప్రధాన డిమాండ్) విస్మరించడం... వృద్ధికి ఊతమిచ్చేలా నిర్దుష్ట చర్యలేవీ ప్రకటించకపోవడం వంటి కారణా లతో స్టాక్ మార్కెట్లు బడ్జెట్ పట్ల తీవ్రం గా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లు కుప్ప కూలింది. దాదా పు దశాబ్దకాలంలో ఒక్క రోజులో ఇం త భారీ నష్టాన్ని చవిచూడటం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 300 పాయింట్లు క్షీణించింది. బ్యాంకు డిపాజిట్లపై ఇకపై రూ.5 లక్షల బీమా రక్షణ! బ్యాంకులేవైనా దివాలాతీస్తే ఇప్పటి వరకూ డిపాజిట్దారులకు రూ.లక్ష వరకూ మాత్రమే బీమా రక్షణ ఉంది. దీన్ని ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లకు.. అంటే రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతేడాది మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డిపాజిటర్లు గగ్గోలు పెట్టడం తెలిసిందే. ఈ పరిణామం నేపథ్యంలోనే డిపాజిట్లపై బీమా రక్షణను భారీగా పెంచుతున్నట్లు మోదీ సర్కారు ప్రకటించడం గమనార్హం. ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపే లక్ష్యం వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్... దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తిని పెంచడమే లక్ష్యంగా 2020–21 బడ్జెట్లో కీలక చర్యలను ప్రకటిం చామని ఆమె స్పష్టం చేశారు. దేశీయంగా తయారీని ప్రోత్స హించేందుకు వీలుగా వంట సామగ్రి నుంచి ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్, స్టేషనరీ, ఆటబొమ్మలు ఇలా అనేక ఉత్పత్తుల దిగుమతులపై సుంకాన్ని పెంచారు. మరోపక్క, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో వ్యవసాయం... గ్రామీణాభివృద్ధికి ఏకంగా రూ.2.83 లక్షల కోట్ల ను కేటాయించారు. రైతు రుణాల లక్ష్యాన్ని 2020–21లో రూ.15 లక్షల కోట్లకు పెంచారు. రూ.1.7 లక్షల కోట్లను రవాణా మౌలిక సదుపా యాల కల్పనకు వెచ్చిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. కీలకమైన ఇంధన రంగానికి కూడా రూ.40,750 కోట్లు కుమ్మరించడం విశేషం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కొన్ని స్కీములకు కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని 2020–21లో 13 శాతం మేర పెంచేలా సీతారామన్ చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఉన్న తీవ్ర మందగమనానికి ఐటీ ఊరట, వ్యయాల పెంపు వంటి ఈ అరకొర చర్యలు సరిపోవని.. భారీ ఉద్దీపనలు అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్లకు రూ.25,000 కోట్ల తాయిలం గతేడాది సెప్టెంబర్లో కార్పొరేట్ పన్నును 30 శాతం స్థాయి నుంచి ఏకంగా 22 శాతానికి తగ్గి స్తూ.. కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసు కుంది. కొత్తగా ప్లాంట్లు నెలకొల్పే కంపెనీలకైతే 15 శాతం పన్నునే వర్తింపజేస్తామని కూడా ప్రకటిం చారు. ఇప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) భారం నుంచి కూడా కార్పొరేట్లకు ఉపశ మనం కలిగించి.. మందగమనంలో ఉన్న పరిశ్ర మలకు ఊరటనిచ్చే చర్యలను కేంద్రం తీసుకుంది. డీడీటీని ఇకపై నిర్దేశిత శ్లాబులను అనుసరించి డివిడెండ్ పొందినవారే చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా ప్రతిపాదనతో ప్రభుత్వ ఖజానాకు రూ.25,000 కోట్లు చిల్లుపడుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాం కులకు ‘ఇంద్రధనుష్’ పథకంలో భాగంగా ఇప్పటికే దండిగా మూలధనం అందిం చడం.. పలు బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నేప థ్యంలో బడ్జెట్లో ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. స్టార్టప్లకు దన్ను... స్టార్టప్లకు ఊతమిచ్చే లా సీతారామన్ కీలక చర్యలు తీసుకున్నా రు. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్స్)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ‘ఎసాప్స్కి సంబం ధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుం డా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా (ఏది ముందైతే అది) ట్యాక్స్ హాలిడే వర్తిస్తుంది‘ అని మంత్రి పేర్కొన్నారు. శైశవ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలు నిపుణులైన సిబ్బందిని ఆకర్షించేందుకు, సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోకుండా అట్టే పెట్టు కునేందుకు ఈ ఎసాప్స్ ఉపయోగపడతాయి. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా(దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు) ఎదిగిందని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ పేర్కొన్నారు. 2014 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 52.2 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణాలు... 2019 మార్చినాటికి 48.7 శాతానికి దిగొచ్చాయని చెప్పారు. అంతేకాదు... 2014–19 మధ్యలో సగటు జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైందని... ద్రవ్యోల్బణాన్ని సగటున 4.5 శాతానికి కట్టడి చేశామని కూడా ఆర్థిక మంత్రి వివరించారు. కాగా, 2024 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలసిందే. ఆర్థిక క్రమశిక్షణకు సవాళ్లు: మూడీస్ భారత్లో జీడీపీ వృద్ధి మందగమనం ప్రభు త్వం చెబుతున్నదానికంటే చాలా ఎక్కువ కాలమే కొనసాగే అవకాశం ఉందని... దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు తీవ్ర మైన సవాళ్లు పొంచిఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ప్రస్తుతం భారత్ సార్వభౌమ (సావ రీన్) రేటింగ్పై తమ ప్రతికూల దృక్పథాన్ని (నెగటివ్ అవుట్లుక్) ఈ రిస్కులు ప్రతిబిం బిస్తున్నాయని కూడా అభిప్రాయపడింది. ప్రస్తు తం భారత్కు మూడీస్ ‘బీఏఏ2 (ప్రతికూల అవుట్లుక్)ను కొనసాగిస్తోంది. ఈ స్థాయి రేటింగ్ ఉన్న దేశాలతో పోలిస్తే.. భారత్ రుణ భారం చాలా ఎక్కువగా ఉందని కూడా మూడీ స్ స్పష్టం చేసింది. ‘బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను 3.8 శాతం(2019–20 ఏడాదికి), 3.5 శాతాలకు(2020–21 సంవత్సరానికి) సడ లించడం, బలహీన వృద్ధి, పన్నుల కోతలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం స్థూల ఆదాయ లక్ష్యాలను సాధించడం కష్ట సాధ్యమే’ అని రేటింగ్ దిగ్గజం కుండబద్దలు కొట్టింది. బంగారుబాతు.. ఎల్ఐసీ! ద్రవ్యలోటును పూడ్చుకోవ డానికి మోదీ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో ప్రతిపాదనల్లోనే ఉన్న ‘ఎల్ఐసీ’ వాటా విక్రయం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. దీనిలో కొంత వాటాను పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా విక్రయించడం ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) ప్రక్రియలో ఎల్ఐసీ నుంచే (షేర్లను కొనిపించడం ద్వారా) ప్రభుత్వం నిధులను లాగేస్తూ వస్తోంది. ఇప్పుడు నేరుగా ఎల్ఐసీలోనే వాటాను అమ్మడం అంటే... ‘బంగారు బాతు’ సామెతను తలపిస్తోందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అంచనాలు అందుకోగలమా?
తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకోదగ్గ భారీ చర్యలేమీ ప్రకటించలేదు. అందుకు బదులు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను కొత్త విధానంతో బుజ్జగించే పనికి పూనుకున్నారు. అయితే ఈ విధానం ఆచరణలో ఎలావుం టుందో, దీనివల్ల కలిగే మేలేమిటో ఇంకా చూడాల్సేవుంది. మరోపక్క భారీయెత్తున పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ద్రవ్య లోటును అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు మందగించిన పర్యవసానంగా ఏర్పడ్డ లోటును సహేతుకమైన 3.8 శాతానికి కట్టడి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. నిరుటి బడ్జె ట్లో పెట్టుకున్న లక్ష్యంకన్నా ఇది 0.5 శాతం మాత్రమే ఎక్కువ. కానీ ఇది ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించు కోవడం వల్ల (పీఎం కిసాన్ యోజన, మరికొన్ని ఇతర కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేయకపోవడంద్వారా), రిజర్వ్ బ్యాంకు తన దగ్గరున్న ‘మిగులు నిధులు’ బదిలీ చేయడం, జాతీయ పొదుపు నిధులనుంచి రూ. 2.4 లక్షల కోట్లు రుణం తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. దీంతో మొత్తంగా గత సంవత్సరం స్థూల రుణాలు రూ. 7.4 లక్షల కోట్లకు పరిమితం చేయడం సాధ్యమైంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10 శాతం వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. కానీ పన్ను వసూళ్ల ఆదాయం ప్రాతిపదికగా ఈ అంచనా వేయడం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉదాహరణకు రాగల సంవత్సరంలో స్థూలంగా పన్ను ఆదాయం రూ. 24.23 లక్షల కోట్లు ఉండొచ్చని కేంద్రం ఆశలు పెట్టుకుంది. గడిచిన సంవత్సరం ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. చూడటానికిది సహేతుకంగానే కనిపిస్తుంది. నిరుడు పెట్టుకున్న లక్ష్యం 18 శాతాన్ని చేరడం కష్ట మైన నేపథ్యంలో, వచ్చే ఏడాది 12 శాతం పెంపుదల లక్ష్యాన్ని అందుకోవడం కూడా కష్టమే. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సరిచేయడానికి ఈ బడ్జెట్లో తీసుకున్న అతి పెద్ద చర్య పన్నులు తగ్గే అవకాశంవున్న నూతన ఆదాయం పన్ను వ్యవస్థను ప్రకటించడమే. ఈ కొత్త విధానం వల్ల రూ. 40,000 కోట్ల మేర ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ఈ మిగులును వినియోగదారులు ఖర్చు చేస్తే డిమాండ్ పునరుద్ధరణ సాధ్యమవుతుందన్న విశ్వాసం ప్రభు త్వానికి ఉన్నట్టుంది. కానీ అలాగే జరగొచ్చునని చెప్పడం తొందర పాటవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు చేసిన కేటాయింపులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వ్యవ సాయం, గ్రామీణాభివృద్ధి కూడా కలిసి వున్న గ్రామీణ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు కేటాయించారు. ఇది ముగు స్తున్న సంవత్సరం కన్నా 5.5 శాతం అధికం. అలాగే విద్యా శాఖ కేటాయిం పులు కూడా ఇతోధికంగా పెరిగాయి. కానీ ఇచ్చిన సొమ్మును ఖర్చు చేయక పోవడంలో ఆ శాఖ ఆరితేరింది. ఈసారి ద్రవ్య లోటు లక్ష్యం 3.5 శాతం సందేహాస్పదమైనదే. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం అత్యాశలా కన బడుతోంది. ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను అమ్మడం ద్వారా రూ. 2.1 లక్షల కోట్లు రాబట్టవచ్చునని సర్కారు ఆశిస్తోంది. ఇందులో రూ. 90,000 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభిస్తాయని అంచనా. అయితే ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొనక తప్పదు. పన్నేతర వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం 2.16 లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. నిజానికి నిరుడు టెలికాం సంస్థల నుంచి రూ. 59,000 కోట్లు ఆదాయం రాగా, ఈసారి అది రూ. 1,33,000 కోట్లు ఉండొచ్చ న్నది అంచనా. ఇంత భారీ మొత్తం అదనంగా వస్తుందని ప్రభు త్వం భావించడానికి కారణం ఉంది. సవరించిన స్థూల రెవెన్యూ బకాయిలు చెల్లించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వచ్చిపడే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ అంచనాకొచ్చినట్టు కనబడుతోంది. కానీ అలా చెల్లించాల్సివస్తే అది తమకు చావు బాజా మోగించినట్టేనని టెలికాం సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. గత సెప్టెంబర్లో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం పేరిట ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించింది. దీంతో కార్పొరేట్ సంస్థలకు కలిసొచ్చిన మొత్తం రూ. 1,50,000 కోట్లు. కానీ వృద్ధి రేటుకు తోడ్పడిందేమీ లేదు. బడ్జెట్ ముగింపులో ఆమె వినియోగ, పారిశ్రామిక వస్తువు లపై పన్నుల మోత మోగించారు (మొత్తం 22 వస్తువులపై 2.5 నుంచి 70 శాతం వరకూ ఈ పెంపుదలలున్నాయి). వీటన్నిటి ద్వారా ఎక్సైజ్ సుంకాల రూపంలో ప్రభుత్వానికి రూ. 20,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇది తప్పుడు సంకేతం పంపు తుందా? అదే జరిగే అవకాశంవుంది. అయితే ప్రభుత్వం లెక్క చేస్తుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి అటు ప్రైవేటు మదు పునుగానీ, ఇటు వినిమయాన్నిగానీ భారీగా పెంచే నిర్దిష్టమైన చర్యలు ఈ బడ్జెట్లో లేవు. ఏతావాతా దేశ ఆర్థిక వ్యవస్థ మదుపు భారాన్ని తానే మోసే పాత్రను ప్రభుత్వం కొనసాగించకతప్పదని దీన్ని చూస్తే అర్ధమవుతుంది. (‘ది వైర్’ సౌజన్యంతో) అనూజ్ శ్రీనివాస్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల నిపుణుడు -
ఇకపై ఆ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఇక నుంచి నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు రాబోయే రోజుల్లో ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు గానూ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ఈ ఏజెన్సీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడుతున్న నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలను గుర్తిస్తూ.. వాటిని సమన్వయం చేసుకుంటూ అన్నింటికీ ఒకటే పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన విధానం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు రకరకాల పరీక్షలు రాయాల్సి వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలకు కలిపి ఒకటే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. (స్వచ్ఛమైన గాలి కోసం భారీగా కేటాయింపు) -
రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?
సాక్షి, న్యూఢిల్లీ : 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం 2020వ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రధానాంశం. అందుకోసం సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫామింగ్) చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు పైసా ఖర్చు లేకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్) ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి (ఐదు శాతానికి) చేరుకున్న నేటి పరిస్థితుల్లో అందులో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధి రేటు కేవలం 2.8 శాతానికి పరిమితం అయినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? దేశంలో దాదాపు 60 కోట్ల మంది వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నప్పటికీ జీడీపీలో వ్యవసాయం వాటా 18 శాతానికి మించనప్పుడు మరెలా సాధ్యం? దేశంలోని సాధారణ రైతులకు ఎరువులపై, విత్తనాలపై గత ప్రభుత్వాలు సబ్సిడీలు మంజూరు చేయగా, ఆ సబ్సిడీలు ఆశించిన రీతిలో రైతులకు చేరడం లేదని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం డీబీటీ పథకం కింద రైతులకు హెక్టార్కు ఐదువేల రూపాయల చొప్పున నేరుగా నగదు బదిలీ చేస్తూ వస్తోంది. అలాగే ఐదెకరాలు భూమి మించని రైతులకు ఏటా ఆరు వేల రూపాయల నగదు బహుమతిని గత ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత భూమి పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన చేసింది. ఈ నగదు బహుమతి వల్ల వ్యవసాయ భూమి కలిగిన రైతులు లాభపడ్డారుగానీ, కౌలుదారులెవరికీ నయా పైసా లాభం చేకూరలేదు. పదెకరాలలోపు వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. దేశంలో ఎంత మంది కౌలుదారులున్నారో లెక్కించేందుకు దేశంలో ఇంత వరకు ఏ కసరత్తు జరగతేదు కనుక వారి సంఖ్యను చెప్పలేం. సేంద్రీయ వ్యవసాయదారులను కూడా ప్రోత్సాహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారంటే సాధారణ రైతులకు హెక్టారుకు ఐదువేల రూపాయల నగదును బదిలీ చేసినట్లే వారికి కూడా ఆ నగదును బదిలీ చేస్తారని ఆశించవచ్చు. ఎందుకంటే ఇంతవరకు వారికి అలాంటి సాయం చేయడం లేదు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రకృతిపరంగా చేసే వ్యవసాయాన్ని కూడా ప్రోత్సాహిస్తామని చెప్పారు. అదెలాగో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తేగానీ తెలియదు. ఇదే బీజేపీ ప్రభుత్వం హయాంలో 2018లో పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలు లభించక దేశంలోని రైతులు పలుసార్లు ఆందోళనలు, ఆ ఏడాది నవంబర్ నెల ఆఖరి వారం రోజుల్లో ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాలకు రైతులు భారీ ప్రదర్శనలు జరిపారు. వారు నిరసనగా కూరగాయలను, పాలను రోడ్ల మీద పారబోసారు. ఆ నేపథ్యంలో 2019 వార్షిక బడ్జెట్లో పైసా ఖర్చులేకుండా ప్రకతిబద్ధంగా వ్యవసాయం చేసే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయం అనేది రాజ్యాంగపరంగా ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశం. రైతులకు సంబంధించి ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నా కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండాలి. అందుకు పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే ముందుగా వారికి గిట్టుబాటు ధర అందేలా చూడాలి. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల రైతులకు సరైన న్యాయం చేయలేక పోతున్నామని భావించిన మోదీ ప్రభుత్వం ‘ఎన్ఏఎం (నామ్)’ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ను తీసుకొచ్చింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్’ కమిటీలను నామ్లో విలీనం చేయాల్సిందిగా మోదీ ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2,500 కమిటీలు ఉండగా 2019, నవంబర్ 12వ తేదీ నాటికి వాటిలో 16 రాష్ట్రాల్లోని 585 కమిటీలు మాత్రమే కేంద్ర కమిటీలో విలీనమయ్యాయి. కేంద్ర కమిటీ ఏర్పడినప్పటికీ దాని ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, వాటికి అనుగుణంగా శీతల గిడ్డంగి కేంద్రాలు విస్తరించాలి. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు శీతల వాహనాలను ప్రవేశపెట్టాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలతో నాణ్యమైన ఎరువుల అందేలా చూడాలి. ఇలా ఎన్నో చర్యలు అవసరం. నగదు బదిలీ వల్ల తమకు లాభం చేకూరడం లేదని, ఇంటి అవసరాలకు వాటిని వాడుకోవడం వల్ల విత్తనాలు, ఎరువులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, ఆ స్కీమ్ను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్’ 2019, అక్టోబర్లో నిర్వహించిన ఓ సర్వేలో రైతులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు రైతులకు వస్తోన్న ఆదాయం ‘జీరో’ కనుక వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే మరో జీరో చేర్చడం కాదుకదా! ఆ దిశగా నిజంగా చర్యలు తీసుకోవాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
బడ్జెట్పై రాహుల్ ఏమన్నారంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ బడ్జెట్లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని పెదవి విరిచారు. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. (చదవండి : బడ్జెట్ నిరుత్సాహ పరిచింది: విజయసాయి రెడ్డి) పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేస్తామని చెప్పిన ప్రభుత్వం... రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసిందని మండిపడ్డారు.‘దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్తో తెలిసిపోయింది’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. (చదవండి : బడ్జెట్లో ఈ రంగాల ఊసే లేదు) కాగా 2020-21బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. లోక్సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. చదవండి : డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ డిగ్రీ స్థాయిలోనే ఆన్లైన్ కోర్సులు కొత్తగా 5 స్మార్ట్ నగరాలు -
డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. డిపాజిట్ దారులకు ఇచ్చే బీమాను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి బడ్జెట్లో రూ.3,50లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రసంగిస్తూ...బ్యాంకింగ్ రంగంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణ పునరుద్ధరణ గడువును 2021వరకు పొడగించినట్లు ప్రకటించారు. దీని ద్వారా 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వేధింపులను కేంద్రం ఉపేక్షించదు స్వచ్ఛమైన, అవినీతరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్షమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పన్నుల పేరుతో వేధింపులను కేంద్రం ఉపేక్షించదన్నారు. ‘అవినీతి రహిత భారత్’ తమ ప్రభుత్వ నినాదమని మంత్రి తెలిపారు. పారిస్ పర్యావరణ ఒడంబికకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నగరాల్లో పరిశుభ్రతమైన గాలి కోసం రూ.4400 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు. చదవండి : విద్యారంగానికి భారీ కేటాయింపు డీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం కొత్తగా 5 స్మార్ట్ నగరాలు.. -
ఉద్యోగుల గుండెల్లో ప్రైవేట్ రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైలు ప్రైవేటు పట్టాలెక్కేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే ఐఆర్సీటీసీ రైళ్ల పరుగు మొదలవడం ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా విశాఖ నుంచి, విశాఖ మీదుగా కూడా ప్రైవేట్ రైళ్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనలు సిద్ధమవుతుండటంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి పూర్తిగా అమల్లోకి వస్తే సామాన్యుడికి రైలు ప్రయాణం దూరమవుతుందని, దీన్ని మొదట్లోనే బ్రేక్ వెయ్యకపోతే రైల్వే ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వేల నిర్వహణను ప్రైవేటుకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేలను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు చేసిన ప్రకటన కూడా గుబులు రేపుతోంది. తేజస్తో శ్రీకారం ఇప్పటికే తేజస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఏసీ బోగీలు, విలాసవంతమైన సౌకర్యాలతో నడిచే ఈ రైళ్లను ఆయా జోన్లలో ప్రారంభించేందుకు ఐఆర్సీటీసీ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 100 మార్గాలను తొలిదశలో ఎంపిక చేసిన రైల్వే బోర్డు.. విశాఖ మీదుగా 9 ప్రైవేట్ రైలు సర్వీసులను ప్రతిపాదించింది. ఇందులో రెండు రైళ్లు విశాఖపట్నం నుంచి విజయవాడ, తిరుపతిలకు పరుగులు తియ్యనున్నాయి. మరో ఏడు రైళ్లు ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లనున్నాయి. ప్రైవేట్ రైలు సర్వీసులకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ ఒక క్లస్టర్గా విభజించారు. సగటున 65 కిమీ వేగంతో గంటకు 200 నుంచి 300 కిమీ వేగంతో ప్రయాణించేలా ఈ ప్రైవేటు రైళ్లు రానున్నాయి. విశాఖ–విజయవాడ, విశాఖ–తిరుపతి, చర్లపల్లి–శ్రీకాకుళం తదితర సర్వీసులు రానున్న రెండు మూడేళ్లలో ప్రారంభం కానున్నాయి. చదవండి: ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్సీటీసీ 2015లోనే బీజం... రైల్వేల్లో సంస్కరణల పేరుతో 2015లో ప్రైవేటు ఆలోచనకు బీజం పడింది. క్రమంగా ఒక్కో అవరోధాన్ని తొలగించుకుంటూ తేజస్ రైలును ఇటీవలే పట్టాలెక్కించారు. రైల్వేలు ప్రయాణికులనే కాకుండా సరకు రవాణా చేస్తుంటాయి. అలాంటి రైల్వేలు ప్రైవేటు పరమైతే ఛార్జీల మోత మోగిపోతుంది. సామాన్యుడికి దూరం కానున్న ప్రయాణం 166 ఏళ్లుగా భారత ప్రజలకు సేవలందిస్తున్న భారతీయ రైల్వే వ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే సామాన్యుడికి రైలు ప్రయాణం దూరం కానుందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. సాధారణంగా ఒక రైలులో రెండు నుంచి నాలుగు జనరల్ బోగీలుంటాయి. దీనికితోడు స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. ప్రతి రైలులోనూ జనరల్ బోగీలు కిక్కిరిసి ఉంటాయి. ఒక బోగీలో 72 మంది ప్రయాణించే సౌకర్యం మాత్రమే ఉన్నా.. 150 మంది వరకూ వెళ్తుంటారు. కానీ తేజస్ రైలులో స్లీపర్ క్లాస్ గానీ, జనరల్ బోగీ గానీ కనిపించవు. అంటే ఇవి సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండవన్నది స్పష్టం. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని.. ఈ నేపథ్యంలో రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తే సహించేందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చదవండి: పట్టాలెక్కనున్న మరో తేజాస్ ట్రైన్ ఇది దురదృష్టకరం రైల్వే వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం చాలా దురదృష్టకరం. తమకు నచ్చిన ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను పెంచిపోషించేందుకు చేస్తున్న ప్రయత్నమిది. దీని వల్ల ఉద్యోగ భద్రత ఉండదు. చాలా మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆదాయం వస్తున్నా.. రైల్వేలను ప్రైవేటుపరం చెయ్యడం సరికాదు. దీనిపై కేంద్రం పునరాలోచించుకోవాలి. – డా.పి రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ -
మౌలిక రంగంపై దృష్టి
ఆర్థిక మాంద్యం ముసురుకొని సాధారణ పౌరులకు ఊపిరాడని వేళ కేంద్ర ప్రభుత్వం మంగళ వారం చేసిన ప్రకటన కాస్తంత ఊరటనిస్తుంది. వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో 102 లక్షల కోట్లమేర పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించడం ఆ ప్రకటన సారాంశం. ఇంధనం, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, ఇరిగేషన్, పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యం, హౌసింగ్, రవాణా, పౌర సదుపా యాలు వంటి సామాజిక రంగ ప్రాజెక్టుల్లో కూడా ఈ పెట్టుబడులుంటాయి. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 39 శాతం చొప్పున, మిగిలిన 22 శాతం మేర ప్రైవేటు సంస్థలు పెట్టు బడులు పెట్టవలసివుంది. గత సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి మన జీడీపీ 4.5 శాతం మాత్రమే ఉన్నదని, ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడైంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి మాత్రమే కాదు... వరసగా ఆరో ఏడాది నమోదైన క్షీణత. నిరుడు ఫిబ్రవరి మొదలుకొని రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తోంది. అది రెపో రేటు తగ్గించినా అందుకు తగ్గట్టుగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించలేదు. కనుకనే ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెరగలేదు. కేవలం ఇదొక్కటే కారణమని కూడా చెప్పలేం. ఇప్పుడున్న వాతావరణంలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకూ సురక్షితమో తేల్చుకోలేని స్థితిలో తయారీ రంగ దిగ్గజా లున్నాయన్నది కూడా వాస్తవం. అనుకున్నంతగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఉన్న అవకాశాలు కూడా నానాటికీ కుంచించుకుపోవడం పర్యవసానంగా వినిమయం క్షీణ దశలోవుంది. కనుకనే ఆర్థిక రంగం పతనావస్థలోనే తప్ప పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న దాఖలా కనబడటం లేదు. 2017–18లో నిరుద్యోగిత 6.1 శాతంగా వున్నదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించగా, సగటు వినిమయం 2011–12, 2017–18 మధ్య కాలంలో గణనీయంగా తగ్గిందని జాతీయ గణాంక విభాగం చెబుతోంది. తయారీ రంగం తొలి త్రైమాసికంలో 0.6 శాతంవుంటే అదిప్పుడు –1.0 శాతానికి పడిపోయింది. 2017–18 తొలి త్రైమాసికంలో కూడా ఇంచుమించు ఇదే స్థితి వుంది. అప్పట్లో అది –1.7 శాతంగా నమోదై అందరినీ కలవరపెట్టింది. తాము అధికారంలోకొస్తే వృద్ధి రేటు మరింత పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుం టామని, సమ్మిళితవృద్ధి సాధిస్తామని బీజేపీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే జరిగిందంతా అందుకు విరుద్ధం. ఆర్థికరంగం ఎదుర్కొంటున్న కష్టాలు ఒక్క మన దేశానికే పరిమితం కాదన్నది నిజమే. ప్రపంచమంతటా కొంత హెచ్చుతగ్గులతో అదే స్థితివుంది. కానీ 2016లో చలామణిలోవున్న కరెన్సీలో 86 శాతం వాటావున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పర్యవసానంగా ఆ కష్టాలు మన దేశానికి మరింత ఎక్కువయ్యాయన్నది వాస్తవం. ఆ నిర్ణయం తర్వాత చిన్నతరహా పరిశ్రమలు పెద్దయెత్తున మూతబడ్డాయి. లక్షలమంది కార్మికుల ఉపాధి దెబ్బతింది. ఆ త్రైమాసికంలో సైతం మన జీడీపీ 7 శాతంగా నమోదైంది. కానీ ఉన్నకొద్దీ అది మరింత కుంగటం మొద లైంది. ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత ఆరేళ్లలో మౌలిక సదుపాయాల రంగంపై మొత్తం రూ. 51 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అంటే సగటున ఏటా 8.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్టు లెక్క. తాజాగా వచ్చే అయిదేళ్లలో రూ. 102 లక్షల కోట్లు వ్యయం చేస్తామని ఆమె ప్రకటించారు. అంటే ఏడాదికి సగటున 20 లక్షల కోట్లకు మించి వ్యయం చేయాల్సివుంటుంది. రూ. 8.5 లక్షల కోట్ల నుంచి ఒక్కసారిగా ఈ స్థాయికి ఎగబాకటం సిద్ధపడటం సాధ్యమేనా? ఇందులో కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగం కూడా వుంటాయని చెప్పడం బాగానే వున్నా ఒకేసారి రూ. 20 లక్షల కోట్ల మేరకు పెంచడం కుదు రుతుందా? ఆ మేరకు ఆదాయ వనరులు పెరగాలంటే అందుకు తగ్గ అవకాశాలున్నాయా? ఒక పక్క ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆదాయ వనరుల్ని ఎక్కడనుంచి పెంచుకోవాలి? వాటి సంగతలావుంచి వేర్వేరు ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వార్షిక వ్యయం...కేంద్ర ప్రభుత్వం వాటాతో పోలిస్తే చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సగటున రూ. 3.3 లక్షల కోట్లు వ్యయం చేస్తుంటే కేంద్రం చేసేది రూ. 2.38 లక్షల కోట్లు. తాజా నిర్ణయం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు చెరో 39 శాతం మేర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యయం చేయాలంటే ఇప్పుడు పెడుతున్న వ్యయాన్ని అవి ఎన్ని రెట్లు పెంచుకోవాలో సులభంగానే బోధపడుతుంది. ఆ స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ఈ ప్రాజెక్టులకు ప్రైవేటు రంగం సంపూర్ణ సహకారం ఇవ్వదల్చుకుంటే అది 22 శాతం వ్యయం చేయాల్సివుంటుంది. వ్యాపారవేత్తలెవరైనా తమకు లాభాలొచ్చే అవకాశం వుందా లేదా అనేది గీటురాయిగా తీసుకుంటారు తప్ప, ప్రభుత్వం కోరిందన్న కారణంతో పెట్టుబడులు పెట్టలేరు. ప్రజల వినిమయం పెరుగుతుందన్న విశ్వాసం వున్నప్పుడే, తమ ఉత్పత్తులు అమ్ముడవుతాయన్న నమ్మకం కుదిరినప్పుడే వారు ఉత్సాహంగా మదుపు చేస్తారు. అంతేకాదు... ఏ దేశంలోనైనా రాజకీయ సుస్థిరత వున్నప్పుడు, సామాజికంగా శాంతియుత వాతావరణం నెలకొన్నప్పుడు, ప్రభుత్వాలు ఆర్థిక రంగానికి సంబంధించి సాహసోపేతమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంసిద్ధంగా వున్నప్పుడు మాత్రమే పెట్టుబడులు పుష్కలంగా వస్తాయి. ఇప్పుడు మౌలిక సదు పాయాల రంగంలో భారీయెత్తున పెట్టుబడులు పెట్టడానికి చేసిన పథక రచన విజయవంతంగా అమలు కావాలంటే ఇతరత్రా అంశాలన్నీ పటిష్టంగా వుండాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటున్నదన్న విశ్వాసం అందరిలోనూ కలగాలి. అది ఏమేరకు ఏర్పడుతుందో చూడాల్సివుంది. -
నిర్మలా సీతారామన్ భర్త సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి భరోసా ఇస్తోంటే..ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఇందుకు భిన్నంగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులపై మండిపడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మాంద్య పరిస్థితిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదన ఒప్పుకోవడానికి విముఖత చూపుతోందంటూ ‘ ది హిందూ’లో ప్రచురించిన ఒక కాలమ్లో ఆయన బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం.. ఒకదాని తరువాత ఒకటి పలు సెక్టార్లు తీవ్రమైన సవాళ్లును ఎదుర్కొంటుండగా, బీజేపీ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్న కారణాలను విశ్లేషించలేకపోతోందన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాత్మక దృష్టి ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయంలో పార్టీ థింక్ ట్యాంక్ కూడా విఫలమైందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించే ఒక చిన్న మార్గాన్ని కూడా ప్రభుత్వం చూపలేకపోతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక మందగమనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖంగా లేదన్నారు. ప్రభుత్వం తిరస్కరణ మోడ్లో ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు "నెహ్రూ సోషలిజాన్ని విమర్శించటానికి" బదులుగా, ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు మార్గం సుగమం చేసిన రావు-సింగ్ ఆర్థిక నమూనాను బీజేపీ అవలంబించాలని సూచించారు. ఆ ఇద్దరు ప్రధానులూ (పీవీ నరసింహారావు, మన్ మోహన్ సింగ్) పాటించిన విధానాలు ఆర్ధిక సరళీకరణకు దోహదం చేశాయనీ, ఈ విషయాన్ని గుర్తించి వాటిని పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు. సీతారామన్ స్పందన దీనిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించినప్పుడు 2014 నుండి 2019 వరకు ప్రాథమిక సంస్కరణలు అనేకం చేసామని జవాబిచ్చారు. జీఎస్టీ, ఆధార్, గ్యాస్ పంపిణీ లాంటి ఇతర ప్రజా ప్రయోజన పథకాలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమాలు ఎకానమీ వృద్దికి దోహదపడడం లేదా అని ఆమె ప్రశ్నించారు. దీంతోపాటు ఆర్ధిక వృద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. -
జనరంజకం నిర్మల బడ్జెట్
భారత్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభు త్వం బడ్జెట్ ను రూపొందించింది. ఆ మేరకు విధానపరమైన చర్యలను కూడా తీసుకుంది. ఇదంతా కార్పొరేట్లకు సంబంధించిన వ్యవహారం అని, తమకేమీ సంబంధం లేదని చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అనుకుంటుంటారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్థికాభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్, పారిశ్రామిక అభివృద్ధి అన్నంతవరకే పరిమితం కాలేదు. దానికి నిదర్శనమే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్. అందులో పేర్కొన్నట్లుగా.. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగానికి చేరుకుంది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి ఇచ్చిన చేయూత. ఆరు వేల పెట్టుబడి మద్దతును రైతులందరికీ అందిస్తామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంప్రదాయ, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది దుకాణదారులు, వాటిలో పనిచేసే వారికి మేలు చేకూర్చేలా పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని బడ్జెట్లో ప్రకటించటం అందరూ స్వాగతించాలి. ఆదాయపు పన్ను, జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం అధికంగా అంచనా వేసి చూపించిందని, అంత సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను 23.25 శాతం, జీఎస్టీ 44.98 శాతం చొప్పున పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఆయన లెక్కలు వేశారు. కానీ, ఈ లెక్కలకు ఆధారం ఏం టి? ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేశారు? అని నిర్మల రాజ్యసభలో ప్రశ్నిస్తే.. సరిగ్గా ఆమె మాట్లాడే రోజు చిదంబరం సభకు హాజరు కాలేదు. వాస్తవానికి ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఇతర పన్నులన్నీ కలిపితే ఆదాయపు పన్నుగా లెక్కిస్తారు. బహుశా చిదంబరం కార్పొరేట్, ఇతర పన్ను ల్ని తీసేసి ఆదాయపు పన్ను ఒక్కదానినే లెక్కించి అంత రాబడి అసాధ్యం అని చెప్పి ఉండొచ్చు అని నిర్మలా సీతారామన్ బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలోనూ చిదంబరం వేసినవి కాకిలెక్కలేనని పార్లమెంటులోనే నిర్మలా సీతారామన్ తూర్పారబట్టారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బ్యాంకుల నెత్తిన పెట్టిన మొండి బాకీల స్థాయి ఎక్కడికి చేరిందంటే.. ప్రభుత్వ రంగ, జాతీయస్థాయి బ్యాంకులు అసలు కొనసాగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యా యి. రిజర్వ్ బ్యాంకు ఈ మొండి బాకీలపై ఒక నివే దిక వెలువరించింది. మొండి బాకీలకు కారణం ప్రభుత్వ, బ్యాంకు విధానాల్లోని లోపాలు కూడా కారణమని తెలిపింది. అలాంటి విధాన లోపాలను గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం సవరించింది. బడ్జెట్ అంటే ఒకప్పుడు పైపై మెరుగులు, ఆయా వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు కేటాయింపులు ప్రకటించి శభాష్ అనిపించుకోవడాలు మాత్రమే అన్నట్లుగా ఒక తంతుగా జరిగేది.అలాం టి కాస్మొటిక్ వ్యవహారాలకు మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కాగా, రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేవని, పోలవరం లాంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు, ఎంపీలు అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ నిధులు ఇస్తోంది. పోలవరం సహా ఆయా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. వీటికి ఆయా శాఖల ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ప్రత్యేకంగా బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నది నిజమే. కానీ, అలా ప్రత్యేకంగా ఏ ఒక్క ప్రాజెక్టు, రాష్ట్రం గురించి కూడా మంత్రి ప్రసంగంలో చోటివ్వలేదన్నది కూడా నిజం. ఎందుకంటే ఇది దేశాభివృద్ధికి రూపొందించిన బడ్జెట్ కాబట్టి. పైగా, ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కొనసాగింపుగా పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్. దానికి తోడు ప్రస్తుత ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. కొత్త ఆర్థిక సంఘం నివేదిక ఈ ఏడాది నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. అంటే.. అందులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సైతం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధుల వస్తాయని పేర్కొన్నది. ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే నిధుల కేటాయించడం, రాష్ట్రం లోని గుళ్లకు చరిత్రలో తొలిసారి బడ్జెట్ కేటాయింపులు చేయడం స్వాగతించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడులాగా కేటాయింపులు చేసి వదిలేయటం కాకుండా వాస్తవంగా ఆ కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసి జగన్ మడమతిప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలి. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త -
మేడమ్స్ బడ్జెట్ 2019
-
కన్నడలో ఓట్లు అడగండి
బొమ్మనహళ్లి : కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బెంగళూరు నగరంలో బెంగళూరు దక్షిణ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఆమె మహిళల వద్దకు వెళ్లి ‘పీజ్ ఓట్ ఫర్ బీజేపీ, సపోర్ట్ తేజస్వీ సూర్య’ అంటూ ప్రచారం చేస్తుండగా కొందరు మహిళలు కన్నడలో మాట్లాడితే ఓట్లు వేస్తామని చెప్పడంతో ఆమె నిర్ఘంతపోయారు. తనకు కన్నడ రాదని చెప్పడంతో నేర్చుకోండి అంటూ సలహా ఇచ్చారు. మరికొందరు నిర్మలా సీతారామన్తో సెల్ఫీలు తీసుకున్నారు. -
#మీటూ ఎఫెక్ట్: రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు. మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్లను బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి మేనకగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. -
నిర్మలా సీతారామన్ను టార్గెట్ చేసిన స్వామి
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో సైన్యం కాల్పులు..సామాన్య ప్రజలు మరణించిన ఘటనలో మేజర్ ఆదిత్యకుమార్పై చట్టపరమైన చర్యలపై సుప్రీంకోర్టు మద్యంతర స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తాజా వ్యాఖ్యల అనంతరం ఆమె రాజీనామా చేయాలని కోరాలన్నారు. కాల్పులు జరిగిన సమయంలో తన కొడుకు (ఆదిత్య) ఘటనాస్థలంలో లేడని..అతనిపై నమోదైన కేసును కొట్టివేయాలని మేజర్ ఆదిత్యా తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్వీర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీం కేసు విచారణఫై సోమవారం మధ్యంతరం స్టే విధించింది. సైన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తుందని ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో తమ వైఖరి వెల్లడించాల్సిందిగా, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్నికోరింది. రెండు వారాల్లో తమ స్పందన తెలియచేయాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టులో విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఎఫ్ఐఆర్పై విచారణను ఆపివేయడం తోపాటు.. కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకున్న మేజర్ ఆదిత్య చర్యపై కేంద్ర ప్రభుత్వం లేదా జమ్మూకశ్మీర్ పోలీసులు యాక్షన్ తీసుకోలేవని కోర్టు పేర్కొందని చెప్పారు. మరోవైపు ఇది ఆర్మీకి సానుకూలమైన ప్రోత్సాహకరమైన రోజంటూ కరమ్ంసింగ్ న్యాయవాది ఐశ్వర్య భాటి సంతోషం వ్యక్తం చేశారు. పిటీషన్ కాపీని భారత అటార్నీ జనరల్ కార్యాలయానికి అందించాలని తమను కోరిందని చెప్పారు. కాగా జనవరిలో షోపియాన్లో ఆందోళనకారులపై కాల్పులు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మేజర్ ఆదిత్యాకుమార్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. : Nirmala Sitaraman should be asked to resign after SC’s remarks on the FIR — Subramanian Swamy (@Swamy39) February 12, 2018 -
నేవీ చీఫ్ లేఖపై కేంద్రంలో కదలిక
సాక్షి,న్యూఢిల్లీ: అమర జవాన్ల పిల్లల విద్యపై వెచ్చించిన మొత్తం రీఎంబర్స్మెంట్పై పరిమితిని సమీక్షించాలని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సైనికుల పిల్లల విద్యపై నెలకు రూ 10,000 వరకూ మాత్రమే గరిష్టంగా రీఎంబర్స్మెంట్ కోరేందుకు పరిమితి విధించారు. ఈ ఏడాది జులైలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వంపై త్రివిధ దళాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడవ వేతన సంఘ సిఫార్సుల్లో భాగంగా ప్రభుత్వం రీఎంబర్స్మెంట్పై పరిమితి విధించింది. అంతకుముందు అమర జవాన్లు, వికలాంగులైన సైనికుల పిల్లల ట్యూషన్ ఫీజును స్కూళ్లు, కాలేజీలు సహా వృత్తి విద్యా సంస్ధల్లో పూర్తిగా మాఫీ చేసేవారు. ఈ అంశాన్ని నేవీ చీఫ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో తన నిర్ణయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సమీక్షించే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం సాయుధ బలగాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
ఆర్మీలో అన్యాయం.. సుప్రీంకు అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ ఆర్మీలో తమకు అన్యాయం జరుగుతోందంటూ వంద మందికి పైగా లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ ర్యాంకు స్థాయి అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వీస్ కార్ప్స్లోని ఉద్యోగుల ప్రమోషన్లలో వివక్ష చూపడంతో తగిన అర్హత ఉన్నా తాము కింది స్థాయికే పరిమితం అవుతున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి దుస్థితి కలగటం ఆర్మీ ఉద్యోగులపైనే కాక దేశ రక్షణపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు. లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ ర్యాంకు స్థాయి ఉద్యోగులు అన్యాయం జరుగుతోందని సుప్రీం కోర్టుకు వెళ్లడం కొత్తగా రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్కు సవాలుగా మారనుంది. ప్రమోషన్లు ఇవ్వకపోతే తమను ఆపరేషనల్ ఏరియాల్లో ఆయుధాలు ఇచ్చి విధులకు పంపకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును పిటిషనర్లు అభ్యర్థించారు. కంబాట్ ఆర్మ్స్ కార్ప్స్ అధికారుల్లానే సర్వీస్ కార్ప్స్ ఉద్యోగులను కూడా కల్లోల ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని ఆర్మీ కోరుతున్నప్పుడు.. ప్రమోషన్ల విషయంలో మాత్రం వివక్ష ఎందుకు చూపాలని పిటిషనర్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి ప్రశ్నించారు. భారతీయ ఆర్మీలో గల మిగిలిన కార్ప్స్ను ఆపరేషనల్గా పరిగణిస్తూ.. కేవలం సర్వీస్ కార్ప్స్ను నాన్ ఆపరేషనల్గా చూస్తూ 'ఆపరేషనల్' పనులకు వినియోగించడం సరికాదని అన్నారు. సర్వీస్ కార్ప్స్ను కూడా ఆర్మీలోని మిగిలిన విభాగాల్లా ఆపరేషనల్గా గుర్తించి, ప్రమోషన్లలో వివక్ష లేకుండా చూసేలా ప్రభుత్వాన్ని, భారతీయ ఆర్మీని ఆదేశించాలని పిటిషన్లో అధికారులు కోరారు.