Azadi Ka Amrit Mahotsav
-
Meri Maati Mera Desh: దేశ రాజధానికి చేరుకున్న తెలుగునేల మట్టి కలశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వందలాది గ్రామాల నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని వినియోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో çఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం వారందరికీ వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేసింది. లైజన్ ఆఫీసర్ సురేశ్బాబు, ఓఎస్డీ రవిశంకర్, జీవీఆర్ మురళి పాల్గొన్నారు. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్తో దరఖాస్తు ఫారమ్ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్ప్రదేశ్లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
స్వాతంత్య్ర సంగ్రామ స్పూర్తితో.. విశాఖలో జేపీఎల్
సాక్షి, విశాఖపట్నం: క్రీడలతో సనాతన ధర్మం సందేశంలో భాగంగా సేవ్ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల స్పూర్తితో డా. గజల్ శ్రీనివాస్ ‘‘జైహింద్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)’’ నిర్వహించడం స్ఫూర్తి దాయకమని శాసన మండలి సభ్యులు పీవీ మాధవ్ అన్నారు. ఈ క్రీడలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మ, దేశ భక్తిని ప్రచారం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. జైహింద్ ప్రీమియర్ లీగ్ ఇన్విటేషన్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని పి.ఎమ్.పాలెం, బి. గ్రౌండ్స్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి గోపూజ నిర్వహించి ప్రారంభించారు. పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో షహీద్ వీర సావర్కర్ లెవెన్, షహీద్ అల్లూరి లెవెన్, షహీద్ భగత్ సింగ్ లెవెన్, షహీద్ చంద్ర శేఖర్ ఆజాద్ లెవెన్ శ్రీ బిర్సా ముండా లెవెన్ జట్లు ఆడుతున్నాయని సేవ్ టెంపుల్స్ భారత్, జైహింద్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ డా. గజల్ శ్రీనివాస్, జేపీఎల్ కన్వీనర్ శ్రీ ఫణీంద్ర తెలిపారు. భారతీయ క్రీడా సుహృద్భావం, స్వాతంత్య్ర సంగ్రామ, సనాతన ధర్మ ప్రచారాలు ముఖ్య లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అనేకమంది సాధు, సంత్ పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని జేపీల్ డైరెక్టర్స్ శ్రీ ఎ. హేమంత్ శర్మ, శ్రీ మేడికొండ శ్రీనివాస్, శ్రీ డి.ఎస్ వర్మ, సంచాలకులు శ్రీ పట్టా రమేష్ తదితరులు తెలిపారు. -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్ఘాట్, విజయ్ఘాట్లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
వైఎస్సార్ జిల్లా యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో ప్రసంగించే చాన్స్
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది. దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది. అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్లోని ఓ స్టడీ సర్కిల్లో సివిల్స్కు సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు... అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది. అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్లో ప్రసంగించనుంది. కడప విద్యార్థినికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) -
ఇకెబానా ఒహారా స్కూల్లో మినీ ఎగ్జిబిషన్.. ప్రత్యేక అతిథులు హాజరు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకెబానా (పూలు అమర్చే జపనీస్ కళ)ను నేర్పించే హైదరాబాద్లోని ఒహారా స్కూల్ కూడా ఈ ఏడాది తమ మొదటి ఈవెంట్ను దీనికే అంకితం చేసింది. ఈ సందర్భంగా ఓ మినీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. స్కూల్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా అగర్వాల్ నేతృత్వంలోని బృందం థీమ్ను రూపొందించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. శత్రువులతో పోరాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన మేజర్ పద్మపణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య ఈ మినీ ఎగ్జిబిషన్కు అతిథిగా హాజరయ్యారు. సైన్యంలో వైద్య సేవలందించిన లెఫ్టినెంట్ కల్నల్, పీడియాట్రిషన్ ఉమ రామచంద్రన్ కూడా పాల్గొన్నారు. ఆర్మీ స్కూల్స్లో టీచర్గా పనిచేసిన శ్యామల ఖన్నా అతిథిగా వచ్చారు. ఈమె 'కౌ ఇన్ కార్గిల్', 'ది లాహోర్ కనెక్షన్' వంటి పుస్తకాలు కూడా రాశారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలకపాత్ర
వాషింగ్టన్: వచ్చే పాతికేళ్ల భారత అభివృద్ధి పయనంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా పార్లమెంట్లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు.. ఇరు దేశాల మైత్రీబంధంలో మైలురాయిగా నిలిచిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. వాషింగ్టన్లోని యూఎస్ క్యాపిటల్లో ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయ సంతతి అమెరికన్లకు ప్రధాని మోదీ సందేశం పంపారు. ప్రధాని సందేశంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లో.. ‘ భారత్ అనే పదం వినగానే ఎన్నో అంశాలు స్ఫురిస్తాయి. అధునాతన ప్రజాస్వామ్య దేశం, భిన్నజాతులు, ప్రాచీన నాగరికతల ఇండియాను ప్రపంచం గుర్తుచేసుకుంటుంది. ఇదే రీతిలో భిన్న అంశాల్లో గ్లోబల్ ఇండియన్తో భారత్ మమేకమైంది. వచ్చే పాతికేళ్ల అమృతకాలంలో భారత సుస్థిరాభివృద్ధికి అమెరికా ఎంతగానో సాయపడనుందని భావిస్తున్నా. అమెరికాలో మీరంతా భారత్ తరఫున అత్యద్భుతమైన ప్రతినిధులుగా ఉంటారని ఆశిస్తున్నా’ అని మోదీ అన్నారు. యూఎస్ ఇండియా రిలేషన్షిప్ కౌన్సిల్, సేవా ఇంటర్నేషనల్, హిందూ స్వయంసేవా సంఘ్, జీఓపీఐఓ సిలికాన్ వ్యాలీ, యూఎస్ ఇండియా ఫ్రెండ్షిప్ కౌన్సిల్, సనాతన్ సంస్కృతి సర్దార్ పటేల్ ఫండ్ తదితర 75 భారతీయ అమెరికన్ సంఘాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇదీ చదవండి: సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం -
స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి
ఉంగుటూరు (గన్నవరం): భారత స్వరాజ్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన ఆత్మత్యాగాలను తెలుసుకోవడంతోపాటు, స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతమహోత్సవ్ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 75 మంది జీవితగాథలతో రూపొందించిన శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరిచడం ఆనందంగా ఉందన్నారు. సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ఇలాంటి పుస్తకం ఆవిష్కరిచండం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్షీప్రసాద్, సత్యసాయిబాబా సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణ్రావు, సినీగేయ రచయిత భువనచంద్ర శ్రీవాణి మాసపత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకుడు శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. -
నెల్లూరు జిల్లాకు జాతీయ అవార్డు
నెల్లూరు (పొగతోట): అజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 780 జిల్లాలో120 రోజులపాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. చదవండి: (దశాబ్దాల స్వప్నం సాకారం) -
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేయాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. ‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? -
స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్లోని సబర్మతీ రివర్ఫ్రంట్ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్ భారత్(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్ భవనాన్ని ప్రారంభించారు. సబర్మతీపై అటల్ బ్రిడ్జి ప్రారంభం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్జీని గుజరాత్ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు. ► అటల్ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు. ► పాదచారులు, సైకిల్ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ► విభిన్నమైన డిజైన్, ఎల్ఈడీ లైటింగ్తో చూపరులకు కనువిందు చేస్తోంది. ► సబర్మతీ రివర్ఫ్రంట్ పశ్చిమ భాగంలోని ఫ్లవర్ గార్డెన్ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్ను అనుసంధానిస్తుంది. ► 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు ఉపయోగించి అటల్ బ్రిడ్జి నిర్మించారు. ► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన (ఇన్సెట్లో) వంతెనను ప్రారంభిస్తున మోదీ -
నేతాజీ అంగరక్షకుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్కు వెళ్లారు. బ్రిటన్– జపాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు. జపాన్తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్లోని రత్నకోసిన్ హోటల్లో కలిసి ఐఎన్ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ నేషనల్ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్పూర్ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) – డాక్టర్ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్ -
AP: 27న స్కూళ్లకు సెలవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ కె.సురేష్కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్పాత్లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్పాత్లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
అల్లు అర్జున్ హాజరైన ‘ఇండియా డే పరేడ్’కు 2 గిన్నిస్ రికార్డులు
వాషింగ్టన్: భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరిక, న్యూయార్క్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్లో ‘ఇండియా డే పరేడ్’ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్షల్గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టినట్లు అక్కడి ప్రవస భారతీయుల సంఘం ఎఫ్ఐఏ తాజాగా వెల్లడించింది. ఒకటి.. అత్యధికంగా వివిధ రకాల జెండాలను ప్రదర్శించటం, రెండోది.. పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించటంపై రికార్డులు సాధించినట్లు పేర్కొంది. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐఏ వెబ్సైట్లో 1500 మందికిపైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. గిన్నిస్ రికార్డులు సాధించటంపై గత ఆదివారం ఓ ప్రకటన చేసింది ఎఫ్ఐఏ. భారత స్వాతంత్య్రం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రికార్డ్లకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆగస్టు 15, 21 తేదీల్లో నిర్వహించి వివిధ కార్యక్రమాల కోసం 180 మంది వాలంటీర్ల బృందం అహర్నిశలు కృషి చేసిందని తెలిపింది. న్యూయార్క్లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపింది ఎఫ్ఐఏ. మాడిసన్ అవెన్యూలో పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది. భారత్ వెలుపలు దేశ స్వాతంత్య్రంపై చేపట్టిన అతిపెద్ద పరేడ్గా గుర్తింపు లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: Allu Arjun: 'భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ'.. పుష్ప డైలాగ్తో అదరగొట్టిన బన్నీ -
వైభవంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు (ఫొటోలు)
-
గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ.. నాటి అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. 'ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సి ఉంది. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశం అనుకున్నంత పురోగతి సాధించలేదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని' సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వేలాది మంది హాజరు
Azadi Ka Amrit Mahotsav in Canada: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు కెనడాలో వర్చువల్గా జరిగాయి. కానీ ఈసారి స్వాతంత్య్ర వేడుకలు కెనడాలోని టోరంటోలోని నాథన్ ఫిలిప్స్లో చాలా అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టోరంటోన్ నాథన్ ఫిలిప్స్లో జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలి వచ్చాయి. ఈ వేడుకలకు సుమారు పదివేలమందికి పైగా ఇండో కెనడియన్లు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు హాజరయ్యేవారి కోసం ఏర్పాటు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాభప్రేక్షలేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్ వైదేహి భగత్ భారత్లోని మొత్తం కవాతును ఒక చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. సుమారు 553 మీటర్ల ఎత్తైన సీఎన్ టవర్ పై త్రివర్ణ పతాక వెలుగులుతో దేదీప్యమానంగా విరజిమ్మిలా చేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందంటూ భగత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా కెనడా జాతీయ రక్షణ మంత్రి అనితా ఆనంద్ హజరయ్యారు. ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించేందకు కలిసి వచ్చిన ఇండో కెనడియన్లందరికీ ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయ కలగకుండా ఉండేలా టోరంటో పోలీసు సిబ్బంది గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా డే పరేడ్, సాంప్రదాయకంగా ఆగస్టు 15 తర్వాత ఆదివారం నిర్వహిస్తారు. అక్కడ ఉండే భారతీయలు ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా ఈ వేడుకులను ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు ఆల్బెర్టా ప్రావిన్స్లోని కాల్గరీలో నిర్వహించారు. ఈ వేడుకను 22 కమ్యూనిటి సంస్థలు నిర్వహించాయి. సుమారు ఐదు వేల మంది హాజరయ్యారు. అలాగే గురుకుల ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో దాదాపు 300 వాహనాలతో తిరంగ యాత్ర కార్ ర్యాలీని నిర్వహించింది. (చదవండి: కిలిమంజారో పర్వతంపై వైఫై.. ఎవరెస్ట్పై ఏనాడో!) -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న థామస్ జార్జ్ రూథర్ఫర్డ్ను ఆ ఏప్రిల్లో మన్యం స్పెషల్ కమిషనర్గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు
అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది. ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి) - డాక్టర్ సమ్మెట విజయ్కుమార్ సామాజిక శాస్త్రవేత్త -
భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ
1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో సిపాయి రెబెల్లియన్గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15 ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జులై 4 1946 వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో భీం ప్రాణాలని హరించింది. విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై 17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది. దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. -వేముల శ్రీకర్, ఐఆర్ఎస్, కమిషనర్, ఇన్కంటాక్స్ -
Super Vasuki: ఈ గూడ్స్కు 295 వ్యాగన్లు!
న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి నాగ్పూర్ సమీపంలోని రాజ్నంద్గావ్కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సోమవారం సూపర్ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు. కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది. -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్ -
వందేమాతరం నినాదాలతో హోరెత్తిన ‘శిరసాని హిల్స్’ పరేడ్
పుట్టపర్తి అర్బన్: ప్రతి హృదయమూ పులకించింది. దేశభక్తితో ఉప్పొంగిపోయింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన సందర్భంగా పుట్టపర్తి ‘శిరసాని హిల్స్’ పరేడ్ మైదానం వందేమాతర నినాదాలతో హోరెత్తింది. శ్రీసత్యసాయి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. చిన్నారులంతా త్రివర్ణపతాకం చేబూని దేశ భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వేదికపైన ఉన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు సహా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సుమారు గంట పాటు మైమరచిపోయి ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో గోరంట్లకు చెందిన ఉదయ్కిరణ్ పాఠశాల, శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల, వివేకానంద పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ఎస్డీజీఎస్ కళాశాల హిందూపురం, కేజీబీవీ బుక్కపట్నం, గురుకుల పాఠశాల కొడిగిన హళ్లి, మోడల్స్కూల్ పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తదితర పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మా తుజే సలాం, జయహో.., దేశ్ మేరా రంగీలా.., ఎత్తర జెండా, పోరాట యోధుల త్యాగాలు.., దేశం మనదే..,వందేమాతరం.., మేమే ఇండియన్స్ తదితర పాటలతో హోరెత్తించారు. పిరమిడ్ యోగా విన్యాసాలు, ఆదివాసీ గిరిజన నృత్యాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు. -
స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’
తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇండియన్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు. మాధురి మాటలను ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ (ఇన్సెట్లో మాధురి) -
ప్లాస్టిక్ కొనం.. అమ్మం.. ప్రోత్సహించం
సాక్షిప్రతినిధి, కాకినాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్చందంగా అమలు చేసేందుకు కాకినాడ వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తాము సైతం అంటూ నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను కాకినాడ నగరపాలక సంస్థకు స్వచ్చందంగా అప్పగించారు. తొలి ప్రయత్నంగా 35 మంది వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.7 లక్షలు విలువైన 75 మైక్రానులకన్నా తక్కువ మందం కలిగిన క్యారీబ్యాగ్లు, థర్మా కోల్ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు తదితర ప్లాస్టిక్ వస్తువులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్ రమేష్కు అప్పగించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ‘కొనేది లేదు–అమ్మేది లేదు–ప్రోత్సహించేది లేదు’ అంటూ వ్యాపారులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేసి వ్యక్తిగతంగా రూ.10 స్టాంప్ పేపర్స్పై హామీ పత్రాలు రాసి కార్పొరేషన్కు అందజేశారు. -
Azadi Ka Amrit Mahotsav: ప్రధాని పిలుపు ఆచరణీయం
న్యూఢిల్లీ: భారత్ను వచ్చే 25 ఏళ్లలో (2047 నాటికి) అభివృద్ధి చెందిన దేశంగా మారిపోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు పట్ల భారత పరిశ్రమల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం ప్రధాని ఈ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయ తయారీని పెంచే లక్ష్యాన్ని సాధించాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. అంతేకాదు, ఈ దశాబ్దం భారత్కు టెకేడ్గా ప్రధాని అభివర్ణించారు. 5జీ, సెమీకండక్టర్ల తయారీ, డిజిటల్ సేవల ద్వారా రూపాంతరం చెందడాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రధాని పిలుపు స్ఫూర్తినీయం, ఆచరణీయమంటూ పారిశ్రామిక మండళ్లు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక స్వప్నమైన ఆత్మనిర్భర భారత్ (స్వావలంబన/స్వయం సమృద్ధి భారత్) సాకారంలో భారత పరిశ్రమలు పోషించనున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ తదితరులు తమ కార్పొరేట్ కార్యాలయాల వద్ద స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని, సరికొత్త భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీఅంబానీతో కలసి పాల్గొన్నారు. టెక్నాలజీ భాగస్వామ్యం టెక్నాలజీ రంగం భవిష్యత్తును ప్రధాని కచ్చితంగా గుర్తించారు. ప్రపంచ జీడీపీపై దీని ప్రభావం 17 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. 2033 నాటికి భారత్లో ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ పరిశ్రమ 6 కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. జీడీపీలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువను కలిగి ఉంటుంది. – హరిఓమ్రాయ్, లావా ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ గర్వంగా ఉంది తన శక్తిసామర్థ్యాలను ప్రపంచం సందేహిస్తున్నా, మన దేశ నిర్మాణం తీరు పట్ల గర్వంగా ఉన్నాను. అంకుర సంస్థల (స్టార్టప్లు) నుంచి క్రీడల (స్పోర్ట్స్) వరకు, మన యువత ప్రపంచ అంచనాలను దాటి రాణిస్తోంది. వచ్చే 25 ఏళ్లలో సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా మనం అవతరించనున్నాం. సంచలనమైన సాంకేతిక టెక్నాలజీలతో త్వరలోనే మనల్ని మనం ఆత్మనిర్భర భారత్గా మలుచుకోనున్నాం. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్ ఎంతో సాధించాం భారత్కు అభివృద్ధి చెందిన దేశా హోదాను తీసుకురావడం అన్నది తక్కువేమీ కాదు. అది మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుంది. పునరుత్పాదక ఇంధనం సహా కీలకమైన ఎన్నో రంగాల్లో భారత్ స్వావలంబన సాధించేందుకు కట్టుబడి ఉంది. ప్రధాని అంచనాలకు అనుగుణంగా పరిశ్రమలు ఎదగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చే విషయంలో భారత్ వెనుకబడి ఉండరాదు. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ విద్య, ఆరోగ్యంపై దృష్టి అవసరం మార్పు దిశగా 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తిని ప్రధాని తట్టి లేపారు. ప్రధాని స్వప్నం భారత్ ః 100 అజెండా సాధనకు టెంప్లేట్ను నిర్ధేశించింది. ప్రపంచానికి యువత రూపంలో నిపుణులను అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. విద్య, ఆరోగ్యం రానున్న సంవత్సరాల్లో దృష్టి సారించాల్సిన రంగాలు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ పురోగతికి అడ్డు లేదు 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను మనం సంబరంగా చేసుకుంటున్నాం. భారత్ అనంతమైన అవకాశాలు, వేగవంతమైన వృద్ధి అంచున నిలుచుంది. మన యువత కలలు, కోరికల మద్దతుతో గొప్ప ప్రజాస్వామ్యం అసలు కథ ఇప్పుడే మొదలైంది. భారత్ పురోగతికి ఎటువంటి అడ్డే లేదు. జై హింద్. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూపు చైర్మన్ పరిశ్రమ కీలక పాత్ర ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ప్రైవేటు రంగం ప్రముఖ పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ -
సుసంపన్న భారతం.. పాతికేళ్ల లక్ష్యం.. పంచ ప్రతిజ్ఞలతో సాకారం
న్యూఢిల్లీ: అమృతోత్సవ సంబరాల్లో ఆసేతుహిమాచలం తడిసి ముద్దయింది. ఏ ఇంటిపై చూసినా త్రివర్ణ పతాక రెపరెపలే కన్పించాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. 76వ స్వాతంత్య్ర దినాన్ని సోమవారం దేశమంతా ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని, రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు సర్వత్రా మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. చిన్నా పెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని జోష్ పెంచారు. జెండాలు చేబూని ర్యాలీలు, ప్రదర్శనలతో అలరించారు. వలస పాలనను అంతం చేసేందుకు అమర వీరులు చేసిన అపూర్వ త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత నౌకా దళం ఆరు ఖండాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిపి దేశవాసుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ‘అమృతోత్సవ భారతం ఇక అతి పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలి. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సంకల్పించుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు పంచ ప్రతిజ్ఞలు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మన ఘన వారసత్వం, తిరుగులేని ఐక్యతా శక్తి, సమగ్రత పట్ల గర్వపడదాం. ప్రధాని, ముఖ్యమంత్రులు మొదలుకుని సామాన్యుల దాకా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుద్దాం. తద్వారా వందేళ్ల వేడుకల నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం’’ అని ప్రజలను కోరారు. ‘‘అవినీతి, బంధుప్రీతి జాతిని పట్టి పీడిస్తున్నాయి. వారసత్వ పోకడలు దేశం ముందున్న మరో అతి పెద్ద సవాలు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఈ అతి పెద్ద జాఢ్యాల బారినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన సమయమిదే’ అన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుర్తా, చుడీదార్, బ్లూ జాకెట్, త్రివర్ణాల మేళవింపుతో కూడిన అందమైన తలపాగా ధరించారు. అనంతరం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఏటీఏజీఎస్ శతఘ్నుల ‘21 గన్ సెల్యూట్’ నడుమ జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధానిగా పంద్రాగస్టున ఆయన పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. అనంతరం గాంధీ మొదలుకుని అల్లూరి దాకా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ పేరుపేరునా ఘన నివాళులర్పించారు. తర్వాత జాతినుద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రసంగాల్లా ఈసారి కొత్త పథకాలేవీ ప్రధాని ప్రకటించలేదు. దోచిందంతా కక్కిస్తాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్రం వాడుకుంటోందన్న విపక్షాల విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘ఒకవైపు దేశంలో కోట్లాది మందికి తలదాచుకునే నీడ లేదు. మరోవైపు కొందరు మాత్రం దాచుకోవడానికి ఎంతటి చోటూ చాలనంతగా అక్రమార్జనకు పాల్పడ్డ తీరును ప్రజలంతా ఇటీవల కళ్లారా చూశారు’ అంటూ విపక్ష నేతలు తదితరుల నివాసాలపై ఈడీ, ఐటీ దాడుల్లో భారీ నగదు బయట పడుతుండటాన్ని ప్రస్తావించారు. ‘అవినీతిని సంపూర్ణంగా ద్వేషిస్తే తప్ప ఇలాంటి ధోరణి మారదు. అవినీతిని, అవినీతిపరులను సమాజమంతా అసహ్యించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ‘గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెలికితీసి ప్రత్యక్ష పథకాల ద్వారా నగదు రూపేణా బదిలీ చేసి దేశాభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాం. బ్యాంకులను దోచి దేశం వీడి పారిపోయిన వారిని వెనక్కు రప్పించే పనిలో ఉన్నాం. వారి ఆస్తులను ఇప్పటికే జప్తు చేశాం. దేశాన్ని దోచుకున్న వాళ్లనుంచి అంతకంతా కక్కించి తీరతాం. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. వాళ్లెంత పెద్దవాళ్లయినా సరే, తప్పించుకోలేరు’’ అని హెచ్చరించారు. ‘దేశ నైపుణ్యానికి, సామర్థ్యానికి బంధుప్రీతి తీరని హాని చేస్తోంది. దేశ ఉజ్వల భవిత కోసం దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. దీన్ని నా ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన బాధ్యతగా కూడా భావిస్తా. రాజకీయాల్లో కూడా వారసత్వాలు దేశ సామర్థ్యాన్ని ఎంతగానో కుంగదీశాయి. వారసత్వ రాజకీయాలకు పాల్పడే వారికి కుటుంబ క్షేమమే పరమావధి. దేశ సంక్షేమం అసలే పట్టదు’’ అంటూ దుయ్యబట్టారు. రాజకీయాలను, వ్యవస్థలను పరిశుభ్రం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తనతో చేతులు కలపాలన్నారు. అలసత్వం అసలే వద్దు స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో ఎంతో సాధించేశామన్న అలసత్వానికి అస్సలు తావీయొద్దని ప్రధాని అన్నారు. ‘‘మన వ్యక్తిగత కలలను, ఆకాంక్షలను, సామాజిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వచ్చే పాతికేళ్ల కాలం సువర్ణావకాశం. స్వతంత్య్ర యోధుల కలలను సాకారం చేసేందుకు కంకణబద్ధులవుదాం. స్వాతంత్య్ర ఫలాలను, అధికార ప్రయోజనాలను చిట్టచివరి నిరుపేదకు కూడా సంపూర్ణంగా అందించాలన్న మహాత్ముని ఆకాంక్షను నెరవేర్చేందుకు నేను కట్టుబడ్డా’’ అని చెప్పారు. సమాఖ్య భావనకే పెద్దపీట బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరుస్తోందన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘‘కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా పని చేయాలనే సహకారాత్మక సమాఖ్య భావనను, ‘టీమిండియా’ స్ఫూర్తిని నేను సంపూర్ణంగా నమ్ముతానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా దాన్ని ఆచరణలో చూపించా’’నని చెప్పారు. దేశాన్ని కలసికట్టుగా అభివృద్ధి చేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోటీపడదామని సూచించారు. త్వరలో 5జీ సేవలు ఇది టెక్నాలజీ దశాబ్ది. ఈ రంగంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ సారథిగా ఎదుగుతున్నాం. 5జీ మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఊరూరికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కామన్ సర్వీసెస్ సెంటర్లు అందనున్నాయి. కొత్త పారిశ్రామిక వృద్ధి విప్లవం మారుమూలల్లోంచే రానుంది. విద్య, వైద్య సేవల్లో డిజిటల్ మాధ్యమం విప్లవాత్మక మార్పులు తేనుంది. పరిశోధన, నవకల్పనలే అజెండాగా ‘జై అనుసంధాన్’కు సమయమిదే. ప్రపంచ డిజిటల్ పేమెంట్లలో 40 శాతం వాటా మనదే. యూపీఐల విస్తృతే అందుకు కారణం. మిషన్ హైడ్రోజన్, సౌర శక్తిని అందిపుచ్చుకోవడం తదితరాల ద్వారా ఇంధన రంగంలో స్వావలంబన సాధిద్దాం. క్రమశిక్షణ, జవాబుదారీతనమే విజయానికి మూలసూత్రాలు. సేంద్రియ సాగుకు జై కొడదాం. రక్షణరంగం సూపర్ మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత లక్ష్యాల సాధనకు రక్షణ బలగాలు ఎంతగానో పాటుపడుతున్నాయి. ఫలితంగా బ్రహ్మోస్ వంటి సూపర్సోనిక్ క్షిపణులను దేశీయంగా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరాం. ఇందుకు మన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎలక్టాన్రిక్ వస్తువులు మొదలుకుని అత్యాధునిక క్షిపణుల దాకా తయారు చేసే హబ్గా భారత్ మారుతోంది. విదేశీ బొమ్మలొద్దని, దేశీయ ఆట బొమ్మలతోనే ఆడుకుంటామని తమ పిల్లలంటున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతుంటే విని పులకించిపోతున్నా. ఆ ఐదారేళ్ల చిన్నారులకు నా సెల్యూట్. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికిది తిరుగులేని సంకేతం. మహిళలే వృద్ధికి మూలం ప్రజాస్వామ్యాలన్నింటికీ మాతృక మన దేశమే. భిన్నత్వంలో ఏకత్వమే మన మూల బలం. అంతటి కీలకమైన ఐక్యతను సాధించాలంటే లింగ సమానత్వం అత్యంత కీలకం. మహిళలను అవమానించే ధోరణి మనలో అప్పుడప్పుడూ తొంగి చూస్తుండటం దురదృష్టకరం. ఈ జాఢ్యాన్ని మనలోంచి పూర్తిగా పారదోలుతామంటూ ప్రతినబూనుదాం. మాటల్లో గానీ, చేతల్లో గానీ మహిళల ఔన్నత్యాన్ని కించపరచొద్దు. కొడుకును, కూతురినీ సమానంగా చూడటం ద్వారా ఇందుకు ఇంట్లోనే పునాది పడాలి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. స్త్రీలను గౌరవించడం మన దేశ వృద్ధికి ముఖ్యమైన మూల స్తంభమని గుర్తుంచుకోవాలి. మెరిసిన ఎర్రకోట పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మువ్వన్నెల అలంకరణలతో ఎర్రకోట మెరిసిపోయింది. స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కోట గోడలపై కనువిందు చేశాయి. కోట ప్రాంగణం, పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కొన్ని సంగతులు...
►1947, ఆగస్ట్ 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో మునిగి ఉంటే గాంధీ మాత్రం ఆ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. బెంగాల్లో చెలరేగిన మతకలహాలకు నిరసనగా నిరహార దీక్ష చేస్తూ. ►రవీంద్రనాథ్ టాగోర్ ‘జనగణ మన’ను 1911లో రచించారు. అది జాతీయ గీతంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950, జనవరి 24 నుంచి. రవీంద్రుడే రాసిన (1905) ‘అమోర్ సోనార్ బంగ్లా’లోని మొదటి పదిలైన్లను తీసుకొని బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా పాడుకుంటోంది. అంతేకాదు శ్రీలంక జాతీయ గీతమైన ‘శ్రీలంక మాతా’ గీతానికి, స్వరకల్పనకూ రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యం, సంగీతమే స్ఫూర్తి. ►స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1973 వరకు ఆగస్ట్ 15న గవర్నర్లే ఆయా రాష్ట్రాల్లో జెండా వందనం చేసేవారు. ఈ పద్ధతిని కాదని ఆగస్ట్ 15న ముఖ్యమంత్రులే జెండా వందనం చేయాలనే కొత్త సంప్రదాయాన్ని సూచించింది ఎమ్. కరుణానిధి.. 1974లో. ►ప్రతి ఆగస్ట్ 15న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తే బాగుంటుందని.. ఈ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారట. ఆ ప్రతిపాదనను ఆమె ప్రభుత్వం ఒప్పుకుంటూ 1974 నుంచి అమల్లోకి తెచ్చింది. ►మన జాతీయ పతాకం తయారయ్యేది ఒకే ఒక్క చోట. కర్ణాటకలోని ధార్వాడ్లో ఉన్న ‘కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగసంయుక్త సంఘ (కేకేజీఎస్సెస్)’లో తయారయ్యి దేశమంతా పంపిణీ అవుతుంది. అదీ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ధారించిన ప్రమాణాల్లో. -
Independence Day 2022: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు!
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరం నాటి కొన్ని నిజాలు.. కొందరు సమర యోధులకు సంబంధించి అంతగా ప్రచారంలో లేని కొన్ని విషయాలను తెలుసుకుందాం... ►మన జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసింది 1947, ఆగస్ట్ 15న కాదు.. 1906, ఆగస్ట్ 7న కోల్కతాలోని పార్సీ బగన్ స్క్వేర్ (గ్రీన్ పార్క్)లో. ►చరిత్ర ప్రకారం భారత దేశం.. ఓ శాంతి కపోతం. గత లక్ష ఏళ్లలో ఈ దేశం ఏ దేశాన్నీ ఆక్రమించలేదట. ►మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి మన రూపాయి విలువ అమెరికన్ డాలర్తో సమానంగా ఉండేది. ఆ సమయంలో మన దగ్గర తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు. ►ఈ దేశానికి అసలు జాతీయ భాషంటూ లేదు. ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీ అధికార భాష తప్ప జాతీయ భాష కాదు. ►ది రిపబ్లిక్ కాంగో, సౌత్ కొరియా, నార్త్ కొరియా, బహ్రైన్, లిక్టన్స్టెయిన్ మొదలైన దేశాలు కూడా మనతో పాటు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ►జరుపుకుంటున్నాయి. ►ఇండియన్ బౌండరీ కమిటీస్ చైర్మన్ రాడ్క్లిఫ్ తన జీవితకాలంలో ఇండియాను సందర్శించింది లేదు. అయినా భారత దేశ విభజన రేఖ గీశాడు. ఇటు ఈ దేశానికి అటు పాకిస్తాన్కూ సరిహద్దులు నిర్ణయించాడు. తన అవగాహన లేమి నిర్ణయం వల్ల లక్షల మంది నిరాశ్రయులయ్యారన్న నిజం తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడట. ఈ విభజన రేఖ కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఇవ్వాలనుకున్న 40 వేల రూపాయల పారితోషికాన్నీ తిరస్కరించాడట. ►మన తొలి ప్రధాని.. జవహర్లాల్ నెహ్రూ నాటి స్టయిల్ ఐకాన్. ఆయన ధరించిన కోటు నెహ్రూ జాకెట్గా ఫేమస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ కోటుతో ఆయన వోగ్ మ్యాగజైన్ కవర్ మీద ప్రింట్ అయ్యాడనే విషయం తెలుసా! అప్పటి నుంచి పాశ్చాత్య దేశాల్లో ఆ నెహ్రూ జాకెట్ ఫ్యాషన్ ట్రెండ్గా నిలిచిందట. ►విప్లవ వీరుడు భగత్ సింగ్ బహుభాషా కోవిదుడు. పంజాబీ, హిందీతోపాటు ఫ్రెంచ్, స్వీడిష్, ఇంగ్లిష్, అరబిక్ భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. ►సర్దార్ వల్భ్ భాయ్ పటేల్ పుట్టిన రోజును అక్టోబర్ 31న జరుపుకుంటున్నాం కదా! నిజానికి అది ఆయన నిజమైన బర్త్డే కాదట. ఏదో పరీక్ష రాసే సమయంలో ఆయన పుట్టిన తేదీ అడిగారట పరీక్ష నిర్వాహకులు. అప్పటికప్పుడు తట్టిన అక్టోబర్ 31 అని చెప్పేశాడట. అదే రికార్డ్ అయ్యి.. స్థిరపడిపోయింది. చదవండి: 75 ఏళ్ల స్వాతంత్రమే కాదు.. మరో మైలు రాయి కూడా! అర్ధశతాబ్దపు ‘పిన్’ గురించి ఈ విషయాలు తెలుసా? -
ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్థన
భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబురాలు మిన్నంటిన వేళ.. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్త షమీతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న జహాన్.. దేశం పేరు మార్చాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను అభ్యర్ధిస్తూ ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by hasin jahan (@hasinjahanofficial) వాడుకలో ఉన్న ఇండియా పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని, అంచేత దేశం పేరును ఇండియా అని కాకుండా ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని సంబోదించేలా తగు సవరణలు చేపట్టాలని మోదీ, షాలను కోరింది. జహాన్ నిన్న (ఆగస్ట్ 14) ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మన దేశం పేరు ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని పెట్టండి. వీటితో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..’ అని రాసుకొచ్చింది. వీడియోలో జహాన్ మరో ఇద్దరితో కలిసి ప్రముఖ బాలీవుడ్ గీతం ‘దేశ్ రంగీలా’ పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తుంది. జహాన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. జహాన్ చేసిన ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. దేశం డైమండ్ జూబ్లీ స్వాతంత్రోత్సవ సంబురాలు చేసుకుంటున్న వేళ ఈ ప్రతిపాదన రావడం అందరిని ఆకర్షిస్తోంది. కాగా, జహాన్.. మహ్మద్ షమీపై లైంగిక వేధింపులతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. చదవండి: Independence Day: భారతీయుడినైనందుకు గర్విస్తున్నా.. జై హింద్: కోహ్లి -
ఇండియా@75: ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా
మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్న ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్ పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర మహిళా సభలోను, ఆరు గంటలకి ఆంధ్ర మహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు చేసిన స్వాతంత్య్ర రథం కార్యక్రమంలోను ఒకే రోజున అన్ని లైవ్లు పాడాను. ఊరంతా పండగలా అలంకరించారు. దేశమంతా వంద దీపావళులలాగ సంబరాలు చేసుకున్నారు. అలంకరించారు. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకారం అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్ క్రియేట్ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి; ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్ రిబ్బన్లు పొడవుగా కట్చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్కి కూడా బోర్డర్ వేసుకున్నాను. టైలర్ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్కూడా హిట్అయ్యింది. – కీ. శే. వింజమూరి అనసూయ, గాయని -
చిన్నవాణ్ణని వదిలేశారు
జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి. మా ఇంట్లో ఉండేవారు ‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు. సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు. ఎడ్ల బాధ చూడలేక నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది. గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది. లాఠీ దెబ్బలే దెబ్బలు మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే. మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు. నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నెహ్రూ టు నరేంద్ర
భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు. 1947–1977 ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. భారత్కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది. అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు. అలా కాంగ్రెస్కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు. 1977–1980 ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన. వరసగా పది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది. 1984–1996 ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు. రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్తో వీపీ సింగ్కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది. సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది. 1996–2004 ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది. 1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2004–2022 2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది. – డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’ (చదవండి: మహాత్మా మన్నించు..) -
నిజాం రాజ్యంలో నిశ్శబ్దం!
సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. కానీ.. ఆ రోజు హైదరాబాద్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు. శుక్రవారమూ ఓ కారణమే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు. దక్కన్ రేడియో మూగనోము... అప్పటికి హైదరాబాద్లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు. ‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం ) -
భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: చరిత్ర విస్మరించిన స్వాతంత్ర్య యోధులను ఇవాళ భారత దేశం గౌరవించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. సోమవారం ఉదయం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. 76th Independence Day ఇవాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం. మన ముందు ఉన్న మార్గం కఠినమైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి వచ్చే 25 ఏళ్లులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి 3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి 4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి 5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి #WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National) https://t.co/7b8DAjlkxC — ANI (@ANI) August 15, 2022 -
ఏపీ పోలీసులకు పతకాల పంట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్కు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్ బార్ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వి.నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ)లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. -
ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరణ
Independence Day celebrations ఢిల్లీ అప్డేట్స్ ►వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ ►1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ►2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి ►3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి ►4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి ►5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి ►మనదేశం టెక్నాలజీ హబ్గా మారుతోంది ►జై జైవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్తో పాటు జై అనుసంధాన్ ►ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్ లక్ష్యం ►డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ►వాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ►సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ►ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. ►భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ► స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి. ► దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ సంబురాలు జరుగుతున్నాయి. ► ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ #WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/VmOUDyf7Ho — ANI (@ANI) August 15, 2022 ►ఎర్రకోట వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎర్రకోటలో ఇంటర్ సర్వీసెస్, పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్ను ప్రధాని నరేంద్ర మోదీ తనిఖీ చేశారు. Delhi | PM Modi inspects the inter-services and police Guard of Honour at Red Fort pic.twitter.com/IxySt0G0r4 — ANI (@ANI) August 15, 2022 ► ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆయన ఎర్రకోట ప్రాకారం వైపు వెళ్తున్నారు. ► 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR — ANI (@ANI) August 15, 2022 ► భారత స్వాతంత్రం 1947 సంవత్సరపు మొదటి వేడుకలను కలిపి చూసుకున్నా.. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది 76వ ఏడాది వేడుకలు. ► 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ద్వారా గుర్తించబడుతున్నాయి. ► 75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IDAY2022: ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి
పంద్రాగస్టు దేశానికి పెద్ద పండుగ. కుల, మత, జాతి, వర్గాలన్నీ కలిసి చేసుకునే సందర్భం. స్కూల్ పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరినీ.. ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్న కొన్ని దేశభక్తి సినీ గేయాలను ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేసుకుందాం. సగటు భారతీయుడి నరనరాలను కదలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేశాలు కొన్ని సినీ గేయాలు.. -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
నీళ్ల కుండను తాకాడని .. దళిత బాలుడ్ని కొట్టి చంపిన టీచర్
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. -
Azadi Ka Amrit Mahotsav: పంజాబ్లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు
చండీగఢ్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుంది. అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్స్టర్లు అర్‡్ష డల్లా, గుర్జంత్ సింగ్లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాది అరెస్టు లఖ్నవూ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్ నదీమ్ను ఇటీవల ఏటీఎస్ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్తో పాటు పాక్, అఫ్గాన్కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది. -
Azadi ka Amrit Mahotsav: వీరుల త్యాగ ఫలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో సమర యోధులు సర్వస్వాన్ని ధారపోశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కొనియాడారు. వారి అమూల్య త్యాగాలను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్ సరైన సందర్భమన్నారు. వారి స్ఫూర్తి గాథలను యువ తరానికి వినిపించి వారిలో దేశభక్తి, సేవా భావం, త్యాగ గుణం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ఎంతగా పోరాడాల్సి వచ్చిందో ఎన్నడూ మరవకూడదన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ధన్ఖడ్ ఆదివారం ప్రజలకు సందేశమిచ్చారు. ‘‘క్రూరమైన బ్రిటిష్ వలస నుంచి దేశాన్ని విముక్తం చేసిన వీరుల ధైర్య సాహసాలు, త్యాగాలను పంద్రాగస్టు సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుని వారికి ఘనంగా నివాళులర్పిద్దాం. నేటి భారతం అంతులేని శక్తి సామర్థ్యాలను కళకళలాడుతోంది. సర్వతోముఖ వృద్ధి పథంలో వడివడిగా పరుగులు పెడుతోంది. జాతి విలువలను, రాజక్యాంగ విలువలను సమున్నతంగా నిలిపేందుకు మరోసారి ప్రతినబూనుదాం. దేశ నిర్మాణ క్రతువుకు పునరకింతం అవుదాం’’ అంటూ పిలుపునిచ్చారు. -
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
195 మంది ఖైదీలకు విముక్తి
సాక్షి, అమరావతి/కంభాలచెరువు (రాజమహేంద్రవరం)/కడప అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వీరిలో 175 మంది జీవితఖైదీలు స్టాండింగ్ కౌన్సెల్ సిఫార్సుల మేరకు.. మరో 20 మంది ఇతర శిక్షలుపడ్డ ఖైదీలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విడుదల అవుతున్నారు. ఈ మొత్తం ఖైదీలలో 13 మంది మహిళలున్నారు. వీరందరి సత్ప్రవర్తన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి 33 మంది, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి 48 మంది, రాజమండ్రి మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి 11 మంది, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి 25 మంది, ఒంగోలు జిల్లా జైల్ నుంచి ఆరుగురు, కడప సెంట్రల్ జైల్ నుంచి 31 మంది, అనంతపురం ఖైదీల వ్యవసాయ కాలనీ నుంచి 15 మంది, కడప మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి ఇద్దరు, పొనుగొండ సబ్ జైలు నుంచి ఇద్దరు.. ధర్మవరం సబ్ జైలు నుంచి ఇద్దరు విడుదల అవుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఇద్దరు, కడప సెంట్రల్ జైల్ నుంచి ముగ్గురు, అనంతపురం జిల్లా జైలు నుంచి ఒకరు విడుదల అవుతున్నారు. -
ఈరోజు పుట్టినవారికి 12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నేడు (పంద్రాగస్టు) జన్మించిన బాలబాలికలకు 12 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు నేడు(సోమవారం) బస్సులో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ఉచిత మెడికల్ చెకప్లతోపాటు 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామన్నారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని తెలిపారు. హైదారాబాద్, ఖమ్మం, నిజామాబాద్ బస్టాండ్లో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు గాంధీజీ ప్రేరణ
సాక్షి, అమరావతి/విజయవాడ సెంట్రల్: దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు మహాత్మా గాంధీ ప్రేరణగా నిలిచారని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సర్వోదయ ట్రస్ట్ నేతృత్వంలో విజయవాడలోని స్వాతంత్య్ర సమర యోధుల భవన్లో గాంధీజీ 30 అడుగుల కుడ్య చిత్రాన్ని ఆదివారం గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో ఆగస్టు 15 వరకు తమ నివాసాలపై ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఇది దేశాన్ని ఐక్యత దిశగా నడిపే ‘ఏక్ భారత్–శ్రేష్ట భారత్’దిశగా పయనింపచేస్తుందన్నారు. జాతీయ జెండా ఎగురవేస్తున్న గవర్నర్ హరిచందన్.30 అడుగుల మహాత్మాగాంధీ కుడ్య చిత్రం దేశభక్తుల భూమి ఆంధ్రా స్వాతంత్య్ర సమర వీరులు, దేశభక్తుల భూమి ఆంధ్రప్రదేశ్ అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం గాంధేయ తత్వానికి నాడీ కేంద్రంగా పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించే లక్ష్యంతో సర్వోదయ ట్రస్ట్ పనిచేస్తుండటం ముదావహమన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె లింగయ్య పేరిట గ్రంథాలయం నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, సర్వోదయ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ జీవీ మోహనప్రసాద్, కలెక్టర్ ఢిల్లీరావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, స్వాతంత్య్ర సమరయోధురాలు మనోరమ, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ ఎంసీ దాస్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
AP: సర్వం.. త్రివర్ణ శోభితం
మువ్వన్నెల పతాకాలతో రాష్ట్రం ముస్తాబైంది.. మన స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన అమర వీరులకు జోహార్.. భారత్ మాతాకు జై.. అన్న నినాదాలు అన్ని ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలపై జాతీయ జెండా గర్వంగా తలెత్తుకుని రెపరెపలాడుతోంది.. అన్ని వర్గాల ప్రజల్లో భావోద్వేగం ఉట్టిపడుతోంది. మహనీయుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రజానీకం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి నెట్వర్క్: ‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే.. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ’.. అంటూ యావత్ దేశ ప్రజానీకం మొత్తం త్రివర్ణ పతాకాన్ని చేతబట్టింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్– హర్ ఘర్ తిరంగా పిలుపునందుకుని ఊరూ వాడా నాటి త్యాగధనులను స్మరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ సంబరానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది. ప్రభుత్వ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ప్రజలు జెండాలను ఇళ్లపై ఎగురవేశారు. ఎటు చూసినా అదే వేడుక స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బందరు రోడ్డు, సీఎం క్యాంప్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తోంది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక కట్టడాలు దీప కాంతులను నింపుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో జాతీయ జెండా ఆకృతులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఉత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 195 మంది ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలవుతున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన అనేక మంది ప్రభుత్వం నుంచి పతకాలు అందుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 3 కి.మీ పొడవునా జాతీయ పతాకం ఒంగోలులో ఆదివారం ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో 600 కేజీల బరువు, మూడు మీటర్ల వెడల్పు, 3 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. నరసరావుపేటలోని ఆజాదీపార్కులో 109 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శిస్తున్న జనం ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు రాష్ట్ర స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. 300 అడుగుల ఎత్తులో జెండాను ఎగుర వేస్తున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ‘తూర్పు’లో ఆకట్టుకుంటున్న ‘కూర్పు’ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా మొక్కల కూర్పులతో ఆకట్టుకుంటున్నాయి. కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), పెద సత్యనారాయణలకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో పలు రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల జెండా పండగలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకుంటోంది. – కడియం ‘జల’ జెండా! 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద జెడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ జి.శ్రీను నీటితో జెండాను రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘జల’ జెండాను తాకి చిన్నారులు మురిసిపోతున్నారు. జెండా అమరికకు అనుగుణంగా తొలుత ఒక గొయ్యి తవ్వి, కింద హైలమ్ షీట్ అమర్చారు. ఆ గొయ్యిని 3 భాగాలుగా విభజించి, త్రివర్ణ పతాకం రంగులు వచ్చేలా నీటిని నింపారు. – రామచంద్రపురం రూరల్ -
అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. ఎవరిని కదిలించినా అమృతోత్సవ సంగతులే. ఊరూ వాడా, పల్లె పట్నం మూడు రంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. స్వాతంత్య్ర సంబరాల ముచ్చట్లతో మురిసిపోతున్నాయి. స్వాతంత్య్ర భానూదయానికి 75 ఏళ్లు పూర్తవుతుండటం ఈసారి పంద్రాగస్టు ప్రత్యేకతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో దేశమంతా త్రివర్ణ శోభితమైంది. నెలల తరబడి సాగుతున్న స్వాతంత్య్ర అమృతోత్సవాలకు అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు అన్నివిధాలా ముస్తాబైంది. గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్ దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైనా.. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను సీఎం తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు వివరించడంతో పాటు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాధించిన పురోగతిని, భవిష్యత్ కార్యక్రమాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. త్రివర్ణ శోభితమైన గోల్కొండ కోట కాగా రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు జారీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పెన్షన్ కార్డులు అందజేసే అవకాశం ఉంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఖైదీలు విడుదల కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం గోల్కొండ కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మిగతా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. త్రివర్ణ శోభితమైన చార్మినార్ చదవండి: స్వతంత్ర భారత సందేశం -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్ను, ఫస్ట్ లుక్ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్రామ్సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించనున్నారు. ఈ సిరీస్లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్లు రానున్నాయి. -
భిన్నత్వంలో ఏకత్వమే రక్ష!
నేటితో భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. సమధికోత్సాహంతో అంతటా ఉత్సవాలు సాగుతున్నాయి. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ చాలాకాలం సాగించాల్సి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరికి 1947 ఆగస్ట్ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకొనే స్థితిని సాధించాం. బ్రిటిష్ పాలకులను పంపివేసి, మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాం. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్ టాగూర్ ‘చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని వీర సావర్కర్ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్ స్వరాజ్’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. భారత్ తన సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ఒకటిగా నిలవడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది. కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయతా విభేదాలు; కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను... మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగించాలి. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్థ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తనా సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన చేసుకోవాలి. విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్థ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా... స్వాతంత్య్ర సాధన వెనక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. రండి... సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం. డా. మోహన్ భాగవత్ వ్యాసకర్త సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -
స్వతంత్ర భారత సందేశం
స్వతంత్ర భారతావనికి నేటితో డెబ్భై అయిదు వసంతాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ సాఫల్య వైఫల్యాలు అనేకం. కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నా, ఈ 75 ఏళ్లలో గణనీయమైన విజయాల విషయంలో మనం రొమ్ము విరుచుకోవచ్చు. కానీ, చేసిన పొరపాట్లతో పాటు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం. గత ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం మనలో చచ్చిపోయింది. తోటి పౌరులైన ముస్లిమ్లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. ఇవన్నీ సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! ఇవన్నీ సమీక్షించుకొని, సరిదిద్దుకొని, సమైక్యంగా ముందుకు సాగాల్సిన సందర్భం ఇది. మన భారతదేశం స్వతంత్రమై నేటితో 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఒక దేశంగా మనం సాధించిన విజయాలేమిటి? చవిచూసిన వైఫల్యాలేమిటి? అని సమీక్షించుకునేందుకు తగిన సందర్భం ఇది. అలాగే, ఇదే సందర్భంలో మనం ఏ రకమైన దేశాన్ని నిర్మించుకున్నామన్నదీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలకు ఏవో స్పష్టమైన, కచ్చితమైన సమాధానాలు లభిస్తాయని కాదు. ఒక్కొక్కరి మదిలో ఒక్కో సమాధానం కచ్చితంగా ఉంటుంది. వారికి అదే సరైనదని కూడా అనిపిస్తుంది. అదే స్ఫూర్తితో నా దృష్టిలో మన దేశ సాఫల్య వైఫల్యాలను వివరించాలని అనుకుంటున్నా. ఒకవేళ దానివల్ల ప్రత్యేకించి ప్రయోజనమేదీ లేకున్నా... అది మీలో మరిన్ని ఆలోచనలు రేకెత్తించవచ్చు. ► కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నప్పటికీ, ఈ 75 ఏళ్లలో మన సాధనల విషయంలో మనం కొంచెం గర్వంగా రొమ్ము విరుచుకోవచ్చు. ఈ తేడాలు దేశాన్ని నాశనం చేస్తాయని 1960లలో పాశ్చాత్యులు కూడా విమర్శించారు. అయినా సరే... మనం ఒక్కతాటిపై నిలిచాం. అన్నింటినీ తట్టుకుని మనగలిగాం. అత్యవసర పరిస్థితులను అధిగమించి, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఎన్నికలు సక్రమంగా జరుపుకోగలిగాం. ప్రభుత్వాలు మారాయి. ప్రజాగ్రహం శక్తిమంతమైన పరిపాలనా వ్యవస్థలను కూడా నియంత్రణలో ఉంచగలిగింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ల మాదిరిగా దేశం సైనిక పాలనను అనుభవించాల్సిన అవసరం రాలేదు. ► అక్షరాస్యత, ఆయుః ప్రమాణాల విషయానికి వస్తే 1947కూ, ప్రస్తుతానికీ అస్సలు సారూప్యతే లేదు. అక్షరాస్యత అప్పటి కన్నా నాలుగు రెట్లు పెరిగింది. అలాగే, ఆయుః ప్రమాణం రెట్టింపు అయ్యింది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నా... సాధించింది తక్కువేమీ కాదని స్పష్టంగా చెప్పవచ్చు. తిండిగింజల కోసం అంగలార్చిన దేశం ఈ రోజు వాటిని ఎగుమతి చేసే దశకు చేరిందంటే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉండదు. నౌకల్లో దిగుమతి అయితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది అప్పట్లో! ఇప్పుడు ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి మన దేశం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. బియ్యం, గోదుమల ఉత్పత్తిలో రెండో స్థానం. బియ్యం ఎగుమతి చేసే దేశాల్లోనూ తొలిస్థానం మనదే! మన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం, పదమూడు మంది ప్రపంచస్థాయి సీఈవోలను అందించిన మన ఐఐటీలు, ప్రపంచ ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్లు, సినిమా పరిశ్రమ... ఇలాంటివన్నీ తృతీయ ప్రపంచదేశాల్లో మనల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇంతటి వైవిధ్యభరితమైన దేశం మరొకటి ఉండదు. ► దురదృష్టవశాత్తూ మనం చేసిన పొరపాట్లు, మన లోటుపాట్లు, చివరకు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, వరుసగా అనేక ప్రభుత్వాలు దేశ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో విఫలమయ్యాయని స్పష్టంగా చెప్పవచ్చు. భారీ నీటి ప్రాజెక్టులు కట్టుకున్నా... ఉక్కు కర్మాగారాలను నిర్మించినా... సోషలిజానికి ఇచ్చిన ప్రాధానంతో ఒక రేటు అభివృద్ధిలోనే చిక్కుబడి, దేశ ప్రజల్లో పారిశ్రామిక స్ఫూర్తిని ఉద్దీపింపజేయలేకపోయింది. ► 1984, 2002లలో జరిగిన సంఘటనలు అహింసా వాదులమని చెప్పుకొనే మన వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతాయి. చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్లపై ఆర్థిక ఆంక్షలు ఉన్నా 1947 నాటికి వాటి జాతీయ ఆదాయం, మన దేశ జాతీయ ఆదాయం దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. డెబ్భై అయిదేళ్ళ తరువాత ఒక్కసారి ఈ దేశాల ఆదాయాలను భారత్తో పోల్చి చూసినప్పుడు మనం ఎంతో వెనుకబడ్డ విషయం స్పష్టమవుతుంది. 1990లో ఆర్థిక సంస్కరణలు ఓ మూడు దశాబ్దాల ముందే ప్రారంభమై ఉంటే భారత్ పరిస్థితి ఇంకోలా ఉండేది. ► అయితే ఏమంటారు అని అడిగితే ఒక సలహా ఇస్తా. భారతదేశం ఎంతో సాధించేసిందని మాత్రమే గట్టిగా నమ్ముతూ... ఎన్నిసార్లు దారితప్పామో మరచిపోతే అది అవివేకమే అవుతుంది. పచ్చిగా చెప్పాలంటే మనం ఎంత సాధించామో, అంతేస్థాయిలో తప్పటడుగులూ వేశాము. అలాగైతే మనమిప్పుడు ఏ రకమైన దేశంగా అవతరించామన్న ప్రశ్న వస్తుంది. పాత సమస్యలు ఇప్పటికీ చాలానే వెంటాడుతున్నాయి. దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ అత్యంత అణగారిన వర్గాలుగానే కొనసాగుతున్నారు. వారి కన్నీళ్ళు తుడవడంలో విఫలమయ్యాం. ‘అస్పశ్యత’ను చట్టం ద్వారా నిషేధించినా... సమాజంలో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఆకలి, కరవు వంటివి గత చరిత్రే కావచ్చు కానీ... దేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. వాస్తవం ఏమిటంటే... పదేళ్లుగా పేదరికం స్థాయి ఏమిటన్నది కూడా తెలుసుకోవడం మానివేశాం మనం. ► ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం కూడా! ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం చచ్చిపోయింది మనలో! మన పోకడల్లో ఆధిపత్యవాదన ఎక్కువైంది. తోటి పౌరులైన ముస్లిమ్లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. జనహనన బెదిరింపులు ఇప్పుడు బహిరంగంగానే జరిగిపోతున్నా ప్రభుత్వం చెవులు మూసుకుని ఉండేందుకే మొగ్గు చూపుతోంది. ఇవన్నీ 1940, ’50లలో ఊహించను కూడా ఊహించలేము. ఇవన్నీ మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! కానీ కొంతమంది ఇలాంటివి కొన్ని ఉన్నాయని కూడా ఒప్పుకోరు. ► సరే... మరి స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ రోజున మనం దేన్ని నొక్కి చెబుదాం? మన ఘనతల్ని మరోసారి నెమరేసుకుంటాం. తప్పులేదు. అయితే గట్టిగా చెప్పుకోలేకపోయినా, చేసిన తప్పులను కూడా ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ తప్పులన్నీ మనం నిర్దేశించుకున్న విలువలు, ఆర్థిక సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం వల్ల జరిగినవే! ఇంకోలా చెప్పాలంటే మనం రాసుకున్న రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల జరిగినవే! అందుకే ప్రమాణపూర్తిగా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి! ఈ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్భంగా మనం చేయాల్సింది అదే! కరణ్ థాపర్ వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయులు -
అమృతోత్సవ భారతం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి నిండా డెబ్బయి ఐదేళ్లు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజల్లో దేశభక్తి ప్రజ్వరిల్ల చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్ది నెలల ముందుగానే ‘హర్ ఘర్ తిరంగా’– అంటే, ‘ఇంటింటా మువ్వన్నెలు’ నినాదాన్ని హోరెత్తించడం ప్రారంభించింది. ఎలాగైతేనేం, దేశమంతటా ఊరూవాడా మువ్వన్నెల రెపరెపలతో మెరిసిపోతున్నాయి. డెబ్బయి ఐదేళ్ల కిందట సాధించుకున్న స్వాతంత్య్రం మనకు తేలికగా దక్కలేదు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్య్రం. ప్రజాపక్షపాతుల బలిదానాల ఫలితంగా దక్కిన స్వాతంత్య్రాన్ని మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలి? కష్టనష్టాలకు ఎదురీది, నెత్తురు చిందించి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు ప్రజానీకానికి అందేలా చేయడానికి ఎంతటి దీక్షాదక్షతలను చాటుకోవాలి? గడచిన డెబ్బయి ఐదేళ్లలో దేశంలోని సామాన్యుల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని ఇన్నేళ్లలో సాధించినది శూన్యం అని చెప్పడానికీ లేదు. అయితే, మనం సాధించిన పురోగతి కొంతేనని, సాధించాల్సినది ఎంతోనని నిస్సందేహంగా చెప్పవచ్చు. దేశాన్ని అట్టుడికించిన స్వాతంత్య్ర సమరంలో ఎందరెందరో కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్ దుష్పరిపాలనను ఎదిరించారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. శిక్షలు అనుభవించారు. దుర్భర దారిద్య్ర బాధలను అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చాక స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసిన రచయితలు, కవుల్లో చాలామందికి దక్కాల్సినంత గౌరవం దక్కకపోవడమే చారిత్రక విషాదం. ఇందుకు కొందరు తెలుగు ప్రముఖుల ఉదాహరణలనే చెప్పుకుందాం. స్వాతంత్య్ర సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ– మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ధిక్కారగీతం తెలుగునాట నలుచెరగులా ఊరూవాడా మార్మోగింది. జనంలోకి చొచ్చుకుపోయిన ఆ పాట తెల్లదొరలకు వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్, గరిమెళ్లను పిలిపించుకుని, ఆ పాటను ఆయన నోటనే విన్నాడు. భాష అర్థం కాకపోయినా, పాటలోని తీవ్రతను గ్రహించి, ఆయనకు ఏడాది జైలుశిక్ష విధించాడు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు ఆయనను తగినరీతిలో గౌరవించిన పాపాన పోలేదు. దుర్భర దారిద్య్రంతోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణానంతరం మన పాలకులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన పట్ల భక్తిప్రపత్తులను చాటుకున్నారు అంతే! గరిమెళ్లకు సమకాలికుడైన తొలితరం దళితకవి కుసుమ ధర్మన్న అదేకాలంలో ‘మాకొద్దీ నల్లదొరతనము’ పాట రాశారు. అప్పట్లో కాంగ్రెస్లో కొనసాగుతూనే ఆయన ఈ పాట రాశారంటే, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కొందరు ఉద్యమనేతల అవినీతి, ద్వంద్వప్రవృత్తి ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కుసుమ ధర్మన్న స్వాతంత్య్రానికి వ్యతిరేకి కాదు గాని, అణగారిన దళిత వర్గాల అభ్యున్నతిపై నిబద్ధత, చిత్తశుద్ధి లేని నాయకుల చేతికి అధికారం దక్కితే జరగబోయే అనర్థాలను ముందుగానే గుర్తించిన దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చాక కుసుమ ధర్మన్నకు కూడా ఎలాంటి గౌరవమూ దక్కలేదు. పరాయి పాలనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన తెలుగు కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అగ్రగణ్యుడు. ఆయన ‘భరతఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగదూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడుసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’ పద్యాన్ని రాశారు. ఇక్కడి సంపదను బ్రిటిష్వారు దౌర్జన్యంగా కొల్లగొట్టుకుపోతుండటంపై ఆయన సంధించిన పద్యాస్త్రం అప్పట్లో విపరీతంగా ప్రభావం చూపింది. ఇక సహాయ నిరాకరణోద్యమ సమయంలో చీరాల–పేరాల ఉద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆనాడు రగిలించిన స్ఫూర్తి తక్కువేమీ కాదు. సహజ చమత్కారి అయిన దుగ్గిరాల బ్రిటిష్ పాలనను మాత్రమే కాదు, నాటి కాంగ్రెస్ నేతల సంకుచిత స్వభావాలను ఎండగడుతూ చాటువులు రాయగలిగిన సాహసి. సహాయ నిరాకరణోద్యమంలో జైలుపాలై, విడుదలయ్యాక మద్రాసు చేరుకుని అక్కడ ఇచ్చిన ఉపన్యాసంలో ‘న యాచే రిఫారం– నవా స్టీలు ఫ్రేముం/ న కౌన్సిల్ న తు ప్రీవి కౌన్సిల్ పదం వా/ స్వరాజ్యార్తి హన్తాంగ్లరాజ్యే నియన్తా/ ఫరంగీ ఫిరంగీ దృగంగీ కరోతు’ అంటూ నాటి పరిస్థితులపై చమత్కారాస్త్రాన్ని సంధించగల చతురత దుగ్గిరాలకే చెల్లింది. చిలకమర్తి, దుగ్గిరాల– ఇద్దరూ స్వాతంత్య్రానికి ముందే కన్నుమూశారు. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు వారికి సముచిత గౌరవం కల్పించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ సందర్భంగా గరిమెళ్ల మాటలను గుర్తు చేసుకోవాలి. ‘కొందరు త్యాగము చేయవలె, కొందరు దారిద్య్రముతో నశించవలె, పూర్తిగా నాశనమైనగాని దేశమునకు స్వరాజ్యము రాదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన ఇలాంటి కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో స్ఫూర్తి రగిలించిన కవులు, రచయితల సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు ఇప్పటికైనా నడుం బిగిస్తే బాగుంటుంది. స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినా, గుర్తింపు దక్కించుకోలేకపోయిన కవులు, రచయితల కృషిని వెలుగులోకి తెచ్చేందుకు విశ్వవిద్యాలయాలు, అకాడమీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి ప్రారంభించినట్లయితే, స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సార్థకత దక్కినట్లవుతుంది. -
కారుపై 'హర్ ఘర్ తిరంగ' థీమ్తో హల్చల్ చేస్తున్న యువకుడు: వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతకాన్ని ఎగరువేయాలని భారత ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర వచ్చి ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు13 నుంచి ఆగస్టు 15 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా గుజరాత్కి చెందిన ఓ యువకుడు తాను సైతం అంటూ ఈ ప్రచారాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాడు. అందుకోసం హర్ ఘర్ తిరంగ అనే థీమ్ని సుమారు రూ. 2 లక్షలు వెచ్చించి మరీ కారు పై వేయించుకున్నాడు. అతను కూడా ఈ "హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనుకున్నాడు. ఈ మేరకు అతను రెండు రోజుల్లో తన స్వస్థలం సూరత్ నుంచి కారులో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నాడు. తాను ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు రోజుల్లో తన కారులో గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు పర్యటించానని ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #WATCH | Delhi: A youth from Gujarat spent Rs 2 lakhs to revamp his car on the theme of #HarGharTiranga “To make people aware of the campaign, I drove from Surat (Gujarat) to Delhi in my car in 2 days... we want to meet PM Modi & HM Amit Shah," said Sidharth Doshi pic.twitter.com/yC34603HaY — ANI (@ANI) August 14, 2022 (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
జీవిత ఖైదు పడ్డ 175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
విజయవాడ:సాక్షి, అమరావతి/కంభాలచెరువు (రాజమహేంద్రవరం)/కడప అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వీరిలో 175 మంది జీవితఖైదీలు స్టాండింగ్ కౌన్సెల్ సిఫార్సుల మేరకు.. మరో 20 మంది ఇతర శిక్షలుపడ్డ ఖైదీలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విడుదల అవుతున్నారు. ఈ మొత్తం ఖైదీలలో 13 మంది మహిళలున్నారు. వీరందరి సత్ప్రవర్తన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి 33 మంది, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి 48 మంది, రాజమండ్రి మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి 11 మంది, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి 25 మంది, ఒంగోలు జిల్లా జైల్ నుంచి ఆరుగురు, కడప సెంట్రల్ జైల్ నుంచి 31 మంది, అనంతపురం ఖైదీల వ్యవసాయ కాలనీ నుంచి 15 మంది, కడప మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి ఇద్దరు, పొనుగొండ సబ్ జైలు నుంచి ఇద్దరు.. ధర్మవరం సబ్ జైలు నుంచి ఇద్దరు విడుదల అవుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఇద్దరు, కడప సెంట్రల్ జైల్ నుంచి ముగ్గురు, అనంతపురం జిల్లా జైలు నుంచి ఒకరు విడుదల అవుతున్నారు. -
సమున్నత భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసలైన శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ప్రపంచానికి భారత్ తోడ్పాటును అందించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. అణగారిన వర్గాలు, పేదలు, అవసరాల్లో ఉన్నవారి పట్ల భారత్ దయార్ధ్ర హృదయంతో మెలుగుతోందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఆమె రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 17 నిమిషాలపాటు ప్రసంగించారు. భారీ ఆర్థిక సంస్కరణలతోపాటు వినూత్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు వేస్తోందన్నారు. ‘‘సమున్నతంగా ఎదుగుతున్న నూతన భారత్ను ప్రపంచం అబ్బురంగా వీక్షిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశాం ‘‘భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అంతర్జాతీయ నాయకులు, పాశ్చాత్య నిపుణులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తున్న భారత్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? అని అనుమానించారు. వారి అనుమానాలను మనం పటాపంచలు చేశాం. ఈ గడ్డపై ప్రజాస్వామ్యం కేవలం పురుడు పోసుకోవడమే కాదు, దివ్యంగా వర్థిల్లుతోంది. దినదిన ప్రవర్థమానమవుతోంది. దేశ భద్రత, ప్రగతి, సౌభాగ్యం కోసం సర్వశక్తులూ ధారపోస్తామని పౌరులంతా ప్రతిజ్ఞ చేయాల్సిన తరుణమిది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతోపాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విధాన రూపకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనా మహమ్మారిపై భారత్ సాగించిన పోరాటాన్ని ప్రపంచమంతా హర్షించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని మనం చేపట్టాం. కరోనా టీకాలను దేశీయంగానే తయారు చేసుకున్నాం. టీకా డోసుల పంపిణీలో 200 కోట్ల మార్కును గత నెలలోనే దాటేశాం. మహమ్మారిని నియంత్రించే విషయంలో అభివృద్ధి చెందిన కొన్ని దేశాల కంటే భారత్ గొప్ప విజయాలు సాధించింది. ఇందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వ్యాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కరోనా వైరస్ ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. ఈ సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాలతో ఎన్నో దేశాలు సతమతమవుతుండగా, భారత్ వేగంగా కోలుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. అప్పుడే మన మనుగడకు అర్థం భవ్యమైన భారత్ను నిర్మించుకుంటేనే మన మనుగడ మరింత అర్థవంతంగా మారుతుంది. మాతృదేశం కోసం, తోటి పౌరుల ప్రగతి కోసం త్యాగాలు చేయాలన్న పెద్దల మాటను గుర్తుంచుకోవాలి. 2047 నాటికి గొప్ప భారత్ను నిర్మించబోతున్న యువతకు ఇదే నా ప్రత్యేక విజ్ఞప్తి. ప్రజాస్వామ్యం బాగా వేళ్లూనుకున్న దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లభించేందుకు చాలాకాలం పట్టింది. అందుకోసం వారు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, గణతంత్ర భారత్లో మొదటినుంచే వయోజనులందరికీ ఓటు హక్కు లభించింది. జాతి నిర్మాణంలో వయోజనులందరికీ భాగస్వామ్యం ఉండాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆర్థిక విజయంతో జీవితాలు సులభతరం మన దేశంలో స్టార్టప్ కంపెనీలు మంచి విజయం సాధిస్తున్నాయి. యూనికార్న్ కంపెనీల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం సంతోషకరం. మన పారిశ్రామిక ప్రగతికి ఇదొక ఉదాహరణ. ఈ క్రెడిట్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, విధాన రూపకర్తలకు చెందుతుంది. మన ఆర్థిక వ్యవస్థ వెలుగులీనడానికి స్టార్టప్ కంపెనీలు దోహదపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఫిజికల్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో అనూహ్యమైన వృద్ధి నమోదవుతోంది. కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితోనే ఇది సాధ్యమవుతోంది. మనం సాధిస్తున్న అభివృద్ధి సమీకృతంగా, అసమానతలను తగ్గించేలా ఉంటుండడం ముదావహం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. విధాన నిర్ణయాలు అమలు చేయాలి. జాతీయ విద్యా విధానం కూడా ఆ కోవలోనిదే. ఆర్థిక విజయం ప్రజల జీవితాలను సులభతరం చేస్తుంది. సొంతిల్లు.. ఇక ఎంతమాత్రమూ కల కాదు పేదలకు సొంతిల్లు అనేది ఇక ఎంతమాత్రం కలగా మిగిలిపోవడం లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అది వాస్తవ రూపం దాలుస్తోంది. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి నీరందుతోంది. ప్రజలందరికీ.. ముఖ్యంగా పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక విధులను ప్రజలంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటిని త్రికరణ శుద్ధితో ఆచరిస్తే మన దేశం ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఖాయం. ‘నేషన్ ఫస్ట్’ అనే స్ఫూర్తితో పనిచేయాలి. మనం స్వేచ్ఛగా జీవించేందుకు ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారిని స్మరించుకోవాల్సిన సందర్భం వచ్చింది. వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించిన దినం కేవలం మన ఒక్కరికే పండుగ రోజు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ వేడుకే’’ అని రాష్ట్రపతి ముర్ము వివరించారు. భారత్ బహుమతులు యోగా, ఆయుర్వేదం యువత, రైతులు, మహిళలు దేశానికి కొత్త ఆశారేఖలు. ముఖ్యంగా మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో 14 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రీడాకారులు మన దేశం గర్వపడేలా రాణించారు. వారిలో చాలామంది అణగారిన వర్గాల నుంచి వచ్చినవారే. మన బిడ్డలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని మనమంతా కలిసి ప్రయాణం సాగించాలి. యోగా, ఆయుర్వేదం అనేవి ప్రపంచానికి భారత్ ఇచ్చి న విలువైన బహుమతులు. ప్రపంచమంతటా వాటికి ఆదరణ పెరుగుతోంది. -
దేశ స్వాతంత్ర వేడుకల వేళ... బయటపడ్డ 38 ఏళ్ల నాటి సైనికుడు మృతదేహం
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అజాది కా అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ.... నాటి త్యాగధనులను స్మరించుకుని ఆనంద పడుతున్న వేళ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అనే వీర సైనికుడి మృతదేహం హిమనీనాదం నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని హల్ద్వానీలో ఒక కుటుంబం నిరీక్షణకు ఫలితం దక్కి నాటి మేఘదూత ఆపరేషన్ పాల్గొన్న వీర సైనికుడి మృతదేహం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ 1984 సియోచిన గ్లేసియర్ని ఆక్రమించి పాకిస్తాన్ స్థానాలపై పట్టు సాధించేందుకు మేఘదూత ఆపరేషన్ని చేపట్టింది. అందులో భాగంగా భారత సైన్యం మే 29, 1984న19వ కుమావోన్ రెజిమెంట్ నుంచి ఒక బృందం ఈ ఆపరేషన్ కోసం బయలుదేరింది. అందులో లాన్స్ నాయక్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఐతే ఆ బృందం ఆ రోజు రాత్రి హిమనీనాదంలో చిక్కుకుపోయింది. దీంతో ఒక అధికారి సెకండ్ లెఫ్టినెంట్ పిఎస్ పుండిర్తో సహా 18 మంది భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు అని ఒక అధికారి తెలిపారు. మొత్తం 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఐతే భారత ఆర్మీ గస్తీకి వేసవినెలలో మంచు కరుగుతున్నప్పుడూ తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యతను అప్పగిస్తారు. అందులో భాగంగా గస్తీ వెతికే చర్యలు చేపట్టినప్పుడూ ఆగస్టు 13న సియాచిన్లో 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడి అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. ఆ అవశేషలపై ఉన్న ఆర్మీ నంబర్తో కూడిన డిస్క్ సాయంతో ఆ అవశేషం లాన్స్ నాయక్ చంద్రశేఖర్దిగా గుర్తించారు. చంద్రశేఖర్కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు అతని హయాంలో ఉన్న ఆర్మీ సిబ్బందితో సహా ఇతర అధికారులు, బంధువులు స్నేహితులు హల్ద్వానీకి తరలివచ్చి ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 1984లో భారత ఆర్మీ చేపట్టిన ఈ మేఘదూత ఆపరేషన్ పాకిస్తాన్పై చేపట్టిన అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్గా మిగిలింది. భారతదేశ నియంత్రణలో ఉన్న అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ తోపాటు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతాలైన షక్స్గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంటుంది. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
శతమానం భారతి: స్వర్ణశకం
అమృత మహోత్సవం ముగిసింది! స్వర్ణ శకం ప్రారంభమైంది! కొత్త సంకల్పాలతో, కొత్త సంతోషాలతో, నవయుగంలోకి ప్రవేశిస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల ప్రయాణాన్ని గతిశక్తితో, అగ్నిపథంలో ఆరంభిస్తున్నాం. ఈ స్ఫూర్తి 130 కోట్ల ప్రజల సమీకరణ, అనుసంధానం ద్వారా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను చేపట్టడంతో మొదలైంది. ఈ వేడుకల ప్రధాన స్ఫూర్తి ప్రజా భాగస్వామ్యమే. ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం ఒక జాతీయ పండుగగా మారి, స్వాతంత్య్ర సమర స్ఫూర్తి, త్యాగం, అంకిత భావం నేటి తరానికి అనుభవంలోకి వచ్చాయి. తద్వారా ఈ మహోత్సవం సనాతన భారత ఆత్మవిశ్వాసం సాక్షాత్కరించే పండుగగా రూపుదాల్చింది. అమృత మహోత్సవంలో భాగమైన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేశాన్ని సమైక్యంగా ఉంచేవి. మరికొన్ని దేశానికి పురోగతిని అందించేవి. ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్, వినియోగదారులకు సాధికారత, విద్యార్థుల ద్వారా ప్రధానికి పోస్ట్ కార్డులు రాయించడం, ఎర్రకోట వద్ద వేడుకలు.. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి, భవిష్యత్తు తరాల జాతీయ భావనకు ప్రేరణనిస్తాయి. ‘‘ఈ 21 వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొత్త అవసరాలకు అనుగుణంగా భారతదేశ ప్రజానీకంలో, యువతరంలో ఆశలు, ఆకాంక్ష పెరిగిపోతున్నాయి. వాటిని నెరవేర్చవలసిన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని వచ్చే పాతికేళ్ల కోసం సంసిద్ధం చేసుకోవాలి. అందుకు ఈ అమృత మహోత్సవాల కృషి, చిత్తశుద్ధి తోడ్పడతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. మనం ఇక కలిసికట్టుగా స్వర్ణోత్సవ స్వాతంత్య్ర భారతంలోకి పయనించవలసిన తరుణం ఆసన్నమైంది. (చదవండి: ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్లో నెత్తురు పారింది!) -
చిత్రం.. భళారే త్రివర్ణం!
అణువణువున రగిలే దేశభక్తిని కళ్లకు కట్టినట్టు చూపడం, తన ముఖం త్రివర్ణ రూపమని చాటి చెప్పడం, ఆకలివేట సాగించే పక్షి ఆతృతను ఒడిసి పట్టుకోవడం, పచ్చని పంట పొలాల్లో సైతం త్రివర్ణ రెపరెపలు కనువిందు చేయడం, సముద్రపు నీటిరాళ్లపై త్రివర్ణాలు అద్దడం.. లాంటి అద్భుతమైన చిత్రాలను కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తీసి ఆకట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో సమన్వయకర్త సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కడప నగరంలోని పాతకడప తదితర ప్రాంతాల్లో తీసిన చిత్రాలు.. భళా అనిపించేలా ఉన్నాయి. వీరి కళను ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్రెడ్డి అభినందించారు. – ఏఎఫ్యూ -
ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్లో నెత్తురు పారింది!
నేడు ‘విభజన భయానక జ్ఞాపకాల దినం’... 2021 ఆగస్టు 14న భారత ప్రధాని మోదీ ఈ ‘డే’ని ప్రకటించారు. విషాదాలను మరిచిపోకూడదని, అవి పునరావృతం కాకుండా చూసుకోడమే ఈ విభజన భయానక జ్ఞాపకాల దినం (పార్టిషన్ హారర్స్ రిమంబరెన్స్ డే) ఉద్దేశం అని ఆయన వివరించారు. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలోమీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్దులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకుని కూర్చొన్న బాలుడు, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవీ విభజన జ్ఞాపకాలు. ఇవన్నీ అప్పటి ఫొటోలలో చూసి ఉంటాం. ఇంతకు మించిన విభజన ఘోరాలు కూడా ఉన్నాయి. అవి పుస్తకాలలో అక్షరబద్ధం అయ్యాయి. మతావేశాలలో చెలరేగిన ఆ కల్లోలంలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షల మంది అని అంచనా. అపహరణకు గురైనవారు, అత్యాచారాలకు బలైనవారు.. బాలికలు, యువతుల 75 నుంచి లక్ష వరకు ఉంటారు. తమస్ (భీష్మ సహానీ), ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్ (కుష్వంత్ సింగ్), ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్ (ఊర్వశీ బుటాలియా), ఎ టైమ్ ఆఫ్ మ్యాడ్ నెస్, మిడ్నైట్ చిల్డ్రన్ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్వైట్, స్పున్నర్), ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ (ల్యారీ కోలిన్, డొమినక్ లాపిరె), మిడ్నైట్ ఫ్యూరీస్ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో; అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో విభజన విషాదం స్పష్టంగా కనిపిస్తుంది. హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం. అంతటి విషాదాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, అలాంటిది మరొకటి జరగకుండా జాగ్రత్త పడేందుకు. జాగృతం అయ్యేందుకు. -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన కార్యక్రమమే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందుగా ఈ మహోత్సవ్ ప్రారంభమైంది. నేటితో ముగుస్తోంది. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార, క్రీడా తదితర రంగాల ప్రముఖులతో అమృత్ మహోత్సవ్ జాతీయ అమలు కమిటీ ఏర్పాటైంది. డెబ్బయ్ ఐదు వారాల పాటు దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఈ కమిటీ దిగ్విజయంగా అమలు చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, ప్రజల్ని భాగస్వాములను చేసింది. దండియాత్ర జరిగిన మార్చి 12 నుంచి ఈ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం అయింది. వేడుకలను ప్రారంభించే చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఆ మేరకు ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్లోని గోల్కొండ కోట, ఐజ్వాల్లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, ఝాన్సీ కోట, జైపూర్ ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాల వద్ద వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. -
స్వతంత్ర భారత గణతంత్ర సారథులు
భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. కొన్ని సందర్భాలలో, కొందరు రాష్ట్రపతులు ప్రధానితో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ విషయంలోనే ఇది రుజువైంది. ఒక బలమైన ప్రధానితోనే ఆయన తన మనోగతాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. చదవండి: జెండా ఊంఛా రహే హమారా! రాజీవ్గాంధీ ప్రధానిగా ఉండగా నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ కొన్ని బిల్లులను వెనక్కి తిప్పి పంపారు.అందులో తపాలా బిల్లు ఒకటి. వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన ఏ అంశాన్నయినా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. ప్రణబ్కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు! స్వాతంత్య్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాత విద్యావంతులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, న్యాయ నిపుణులు రాష్ట్రపతి పదవిని అలంకరించారు. జూలైలో పదవీ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 1950లో భారత్ గణతంత్ర దేశమైన తరువాత ఆ పదవిలోకి వచ్చిన 15 మందిలో ఎనిమిది మంది రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో గెలిచినవారు. పన్నెండు మంది ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దేశంలో అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు రాష్ట్రపతులయ్యారు. వారే రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్. ఆయన అధ్యాపకుడు, న్యాయవాది. గాంధేయవాది. నెహ్రూతో సమంగా గాంధీజీతో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. రెండవసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైన రాజనీతిజ్ఞుడు రాజెన్ బాబు. ప్రథమ ప్రధాని వలెనే, తొలి రాష్ట్రపతి రాజేన్ బాబు కూడా పన్నెండేళ్ల నూట ఏడు రోజులు ఉన్నారు. ఇప్పటి వరకు అదే రికార్డు. హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో విభేదించారు. సోవ్ునాథ్ ఆలయం ప్రతిష్టకు తాను హాజరు కావడంపై నెహ్రూ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.ఆయన తత్త్వశాస్త్ర వ్యాఖ్యాత. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. యునెస్కోకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. మూడవ రాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్. ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం. అలీగఢ్ విశ్వవిద్యాలయం చాన్సలర్గా పనిచేశారు. ఆయన పదవిలో ఉండగానే కన్నుమూశారు. నాల్గవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి. కార్మికోద్యమం నుంచి వచ్చారు. ఈయన ఎన్నిక వివాదాస్పదమైన మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని నాటి ప్రధాని ఇందిర కూడా పార్టీ సమావేశంలో ఆమోదించారు. కానీ తరువాత వీవీ గిరిని అభ్యర్థిగా నిలిపారు. పార్టీ అభ్యర్థి నీలం ఓడిపోయారు. గిరి విజయం సాధించారు. ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. జకీర్ హుస్సేన్ మాదిరిగానే ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశం అత్యవసర పరిస్థితి విధింపు. ఆ ఆదేశాల మీద మారు మాట లేకుండా అర్ధరాత్రి సంతకం చేసి పంపిన రాష్ట్రపతిగా ఈయన గుర్తుండిపోయారు. ఆరో రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. దేశ చరిత్రలో ఏకగీవ్రంగా ఎన్నికైన రాష్ట్రపతి. తెలుగువారు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక తరువాత దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిన నీలం సంజీవరెడ్డి జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందారు. 42 లోక్సభ స్థానాలకు గాను, 41 కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాల స్థానం మాత్రం జనతా పార్టీ గెలిచింది. ఆ గెలుపు నీలం సంజీవరెడ్డిది. ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్. సిక్కు వర్గం నుంచి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూస్టార్ సైనిక చర్య, ఇందిరా గాంధీ హత్య, వెంటనే దేశవ్యాప్తంగా సిక్కుల మీద హత్యాకాండ ఆయన రాష్ట్రపతిగా ఉండగానే జరిగాయి. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్. ఈయన కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల తరానికి చెందినవారే. తామ్రపత్ర గ్రహీత కూడా. కె. కామరాజ్ నాడార్ మీద ఆయన రాసిన పుస్తకానికి గాను సోవియెట్ రష్యా సోవియెట్ ల్యాండ్ పురస్కారం ఇచ్చింది. తొమ్మిదో రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాళ్ శర్మ. గొప్ప న్యాయ నిపుణుడు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలకు ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ ‘లివింగ్ లెజెండ్ ఆఫ్ లా అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్’ బహూకరించింది. పదవ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. దళిత వర్గం నుంచి తొలిసారిగా ఆ పదవిని అధిరోహించిన వారు. రాష్ట్రపతి అయిన తొలి మలయాళి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ సంస్థలో విద్యాభ్యాసం చేశారు. 1980–1984 మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం. రాజకీయాలలో సంబంధం లేని వ్యక్తి. రోహిణి ఉపగ్రహాలు, అగ్ని, పృథ్వి క్షిపణులు ఆయన పర్యవేక్షణలోనే విజయవంతంగా ప్రయోగించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించారు. అలాగే పోటీ చేసిన గెలిచిన రాష్ట్రపతులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినవారు కలాం. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 1998లో జరిపిన రెండో పోఖ్రాన్ అణు పరీక్షలో కలాం కీలకపాత్ర వహించారు. పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ. సుఖోయి విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. పదమూడవ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్కుమార్ ముఖర్జీ. పద్నాల్గవ రాష్ట్రపతి రావ్ునాథ్ కోవింద్. పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ. వీవీ గిరి (1969), హిదయ్తుల్లా (1969), బసప్ప దాసప్ప జెట్టి (1977) తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు వీరు ఉపరాష్ట్రపతులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. – డా. గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ -
విశాఖ బీచ్ లో సెల్ఫీ పాయింట్లు
-
అనకాపల్లిలో జాతీయ జెండాలతో విద్యార్థుల భారీ ర్యాలీ
-
మిషన్.. స్వదేశీ
భారత స్వాతంత్య్ర పోరాటం జోరందుకుంటున్న తరుణమది. తెల్లదొరలు అడ్డగోలుగా చేసిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ 1905లో విదేశీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ ఉద్యమం పెల్లుబికింది. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు ముందుకొచ్చారు. తదనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు స్వదేశీ నినాదమే పట్టుగొమ్మగా నిలిచింది. ఈ ఉద్యమాలు అప్పటి ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్వదేశాగ్నిని రగిలించడంతో.. దేశంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పురుడుపోసుకున్నాయి. ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్లు బోలెడన్ని పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని భారతీయుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పురోభివృద్ధి సాధిస్తున్నాయి. మరికొన్ని కాలానుగుణంగా కొత్త మార్పులను సంతరించుకుని, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వావలంబన భారత్కు చేదోడుగా నిలుస్తున్నాయి. శతాబ్ది స్వాతంత్య్ర వేడుకల నాటికి ‘స్వదేశ్ 2.0’తో దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలన్నది ‘మేకిన్ ఇండియా’ లక్ష్యం. దీని సాకారానికి ‘ఆత్మనిర్భర్‘తో సమాయత్తమవుతున్న వేళ... 1947కు పూర్వం మొగ్గతొడిగిన మన స్వదేశీ వ్యాపారామృతాల్లో కొన్నింటి గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెమరువేసుకుందాం. బ్యాంకింగ్లో ‘పంజా’బ్! స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్.. దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా రావాలంటే స్వదేశీ సంస్థల ఏర్పాటుతోనే సాధ్యమని భావించారు. మన దేశ సంపదను బ్రిటిష్ బ్యాంకులు, కంపెనీలు కొల్లగొడుతున్నాయని, దీనికి అడ్డుకట్టవేయాలంటే.. మనకంటూ ఒక భారతీయ బ్యాంక్ ఉండాలనుకున్నారు. అలా ఆవిర్భవించిందే మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). 1895 ఏప్రిల్ 12న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి బ్రాంచ్లో మొదటి బ్యాంక్ అకౌంట్ను తెరిచిన వ్యక్తి లాలా లజపతి రాయ్. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి స్వరాజ్య సారథులు సైతం ఈ బ్యాంకు ఖాతాదారులుగా మారారు. భారత్లో టెల్లర్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్ (1944లో) కూడా ఇదే. దేశ విభజనను ముందే పసిగట్టిన అప్పటి పీఎన్బీ సారథి లాలా యోద్ రాజ్.. బ్యాంక్ రిజిస్టర్డ్ ఆఫీసును లాహోర్ నుంచి ఢిల్లీకి తరలించారు. విభజన తర్వాత పశ్చిమ పాకిస్థాన్లోని 92 బ్రాంచ్లను పీఎన్బీ మూసేసింది. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడంతో పీఎన్బీ ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. సంక్షోభాలు, కుంభకోణాలు ఇలా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తన స్వదేశీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇంట్లో బీరువా.. ఇంటికి తాళంకప్ప.. ఒంటికి సబ్బు! స్వదేశీ ఉద్యమ నినాదం మార్మోగుతున్న వేళ పారిశ్రామికవేత్త అర్దేశిర్ గోద్రెజ్.. సబ్బుల తయారీలో ‘స్వదేశీ‘ సత్తా ఏంటో చాటుతామని ప్రతినబూనారు. 1918లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెజిటబుల్ ఆయిల్తో స్నానపు సబ్బు ‘చావీ’ని తయారు చేసి రికార్డు సృష్టించారు. తొలుత నం. 2, తర్వాత నం.1 పేర్లతో ఈ బ్రాండ్లో సబ్బులు ప్రవేశపెట్టారు. ఈ స్వదేశీ సబ్బులకు రాజగోపాలాచారి, రవీంద్రనాథ్ టాగోర్ వంటి దిగ్గజాలు ప్రచారం చేయడం విశేషం. ఇక 1920 చివర్లో వచ్చింది గోద్రెజ్ ‘వత్నీ’! దీనికి అర్థం ‘వతన్ సే’.. అంటే ‘మాతృభూమి నుంచి’ అన్నమాట! వందేళ్ల తర్వాత కూడా నం.1 బ్రాండ్ ఉండటమే కాకుండా, ఏటా 38 కోట్లకు పైగా సబ్బులు అమ్ముడవుతున్నాయి. 1897లో సోదరుడితో కలసి గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ను స్థాపించారు అర్దేశిర్. మొదట్లో తాళాలు, సేఫ్లు, సెక్యూరిటీ పరికరాలను తయారు చేసేవారు. అంతేకాదు 1951లో జరిగిన తొలి భారత సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను తయారు చేసిందీ గోద్రెజే కావడం విశేషం. అప్పట్లో ఇంట్లో గోద్రెజ్ బీరువా, ఇంటికి గోద్రెజ్ తాళంకప్ప.. ఈ ఉత్పత్తులకు పర్యాయపదాలుగా మారాయి. ఫర్నిచర్ నుంచి కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, గృహోపకరణాలు, ఇన్ఫోటెక్, ఏరోస్పేస్.. ఇలా 15 రంగాలకు పైగా విస్తరించి ఆత్మనిర్భర్ భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది గోద్రెజ్. షర్బత్ అంటే.. రూహ్ అఫ్జా! స్వాతంత్య్రోద్యమ కాలంలో పక్కా మేడిన్ ఇండియా బ్రాండ్గా ఆవిర్భవించింది ‘హమ్దర్ద్’. 1906లో హకీమ్ హఫీజ్ అబ్దుల్ ఢిల్లీలో ఈ యునానీ ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పారు. ఆ తర్వాత అది తన విలక్షణ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ చిరపరిచితంగా మారిపోయింది. షర్బత్ అంటే ‘రూహ్ అఫ్జా’ అనేంతగా ప్రాచుర్యం సంపాదించింది. అనేక యునానీ ఔషధాలనూ ఇది విక్రయిస్తోంది. హఫీజ్ మరణానంతరం కుమారుడు హకీమ్ అబ్దుల్ హమీద్తో కలసి భార్య రబియా బేగమ్ ఈ వ్యాపారాన్ని ఏమాత్రం రుచి తగ్గకుండా కొనసాగిస్తూ.. భారతీయుల మదిలో సుస్థిర స్వదేశీ బ్రాండ్గా నిలబెట్టారు. ఉద్యమానికి స్ట్రాంగ్ ‘చాయ్!’ స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో చాలా టీ ఎస్టేట్లు ఉన్నా.. వాటిని బ్రిటిషర్లు తమ చెప్పుచేతల్లో ఉంచుకొని ఆదాయాన్ని కొల్లగొట్టేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పీసీ ఛటర్జీ.. ఈ దుస్థితిని గమనించి.. తన వ్యాపారానికి సరికొత్త స్వదేశీ ‘రుచి’ని అందించాలని నిర్ణయించారు. ఆ విధంగా కోల్కతా కేంద్రంగా 1912లో లక్ష్మీ టీ కంపెనీ ఆవిర్భవించింది. కింగ్ ఆఫ్ పంజాబ్ – రాజా సింగ్ బ్లెండ్ నుంచి.. క్వీన్ ఎలిజబెత్ బ్లెండ్ వరకూ లక్ష్మీ టీ తన ప్రతి ఉత్పత్తిలోనూ చరిత్రను పెనవేసుకునేలా చేసింది. విఖ్యాత డార్జిలింగ్ టీతో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఎస్టేట్లు లక్ష్మీ గ్రూప్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా టీ ఎగుమతులు చేయడంతో పాటు అనేక అంతర్జాతీయ టీ బ్రాండ్లకు తేయాకు సరఫరా చేసేది ఇదే. ఏటా 3 కోట్ల కేజీల టీ ఉత్పత్తి చేస్తూ.. స్వదేశీ ఘుమఘుమలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోంది. మన ‘చెప్పు’చేతల్లో...! మెట్రో షూస్.. ముంబైలోని ఒక చెప్పుల షాపులో సేల్స్మన్గా పనిచేసిన మాలిక్ తేజానీ.. దేశ విభజనలో ఆ షాపు యజమానులు పాకిస్థాన్ వెళ్లిపోవడంతో 1947లో తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి దాన్ని కొన్నారట. అప్పటి బొంబాయి నగరంలో పేరొందిన మెట్రో సినిమా దగ్గర్లో ఉండటంతో దానికి మెట్రో షూస్గా పేరు పెట్టారు. ఆయన తదనంతరం 16 ఏళ్ల వయసులో కంపెనీ పగ్గాలు చేపట్టిన ఆయన తనయుడు రఫీక్ తేజానీ.. అంచెలంచెలుగా దాన్ని దేశ ప్రజలకు ప్రియమైన పాదరక్షల బ్రాండ్గా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీకి సీఈఓగా ఉన్న మాలిక్ మనుమరాలు ఫరా మాలిక్ భాంజీ దీన్ని మెట్రో బ్రాండ్స్ పేరుతో స్టాక్ మార్కెట్లో కూడా లిస్టింగ్ చేసి, తనదైన నడకలు నేర్పుతూ ముందడుగు వేస్తున్నారు. డెనిమ్ కింగ్.. అరవింద్ దేశంలో 1897లోనే లాల్భాయ్ దల్పత్ భాయ్ సారస్పూర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరుతో అహ్మదాబాద్లో టెక్స్టైల్ మిల్లును స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆయన కుమారుడు లాల్భాయ్.. కుటుంబ సభ్యులు కస్తూర్భాయ్, నరోత్తమ్భాయ్, చిమన్భాయ్ 1931లో మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమం పిలుపుతో.. అరవింద్ మిల్స్ను అధునాతన సాంకేతికతతో నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం స్పీడు పెంచిన ఈ కంపెనీ.. 1980లో యువతకు భారతదేశపు తొలి డెనిమ్ (జీన్స్ క్లాత్) వస్త్ర బ్రాండ్ ఫ్లయింగ్ మెషిన్ను పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుగా నిలుస్తోంది. అంతేకాదు, 2015లో తొలిసారిగా ఖాదీ డెనిమ్ను తీసుకొచ్చి స్వదేశీ వారసత్వాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అరవింద్.. టెక్స్టైల్స్తో పాటు రియల్టీ, రిటైల్ తదితర రంగాల్లోకీ విస్తరించింది. అరవింద్ తయారు చేసిన ఫ్యాబ్రిక్తో భూమిని 6 సార్లు చుట్టేసి రావచ్చట!! చెదపట్టని ‘ఎస్ చంద్!’ దేశంలో విదేశీ పుస్తకాలకు బదులు.. భారతీయ రచయితలు, విద్యావేత్తలు రాసిన అచ్చమైన స్వదేశీ పుస్తకాలను ప్రచురించి, ప్రజలకు అందుబాటు ధరలో తీసుకురావాలన్న లక్ష్యంతో ఆవిర్భవించినదే.. ఎస్ చంద్. 1939లో శ్యామ్లాల్ గుప్తా ఈ పబ్లిషింగ్ సంస్థను ప్రారంభించారు. ప్రొషెసర్ బహల్ అండ్ తులి రాసిన ‘టెక్ట్స్బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ’ అనేది ఎస్ చంద్ పబ్లిష్ చేసిన తొలి టెక్ట్స్బుక్. దేశంలోని బోర్డు స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీ పరీక్షల్లో కోట్లాది విద్యార్థులకు ఎస్ చంద్ పుస్తకాలు చిరపరిచితమే. విద్యా రంగంలో పుస్తకాలకు ఎస్ చంద్ పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఏటా 5 కోట్ల టెక్ట్స్పుస్తకాలను విక్రయిస్తున్న ఈ 80 ఏళ్ల మేడిన్ ఇండియా బ్రాండ్.. పుస్తక ప్రపంచంలో ఇప్పటికీ తన స్థానానికి చెద పట్టనివ్వకుండా రెపరెపలాడుతోంది. వాహ్ తాజ్! దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెబితే పర్యాటకులకు టక్కున గుర్తొచ్చేది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్! అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం అప్పట్లో ముంబైలో ప్రసిద్ధి చెందిన వాట్సన్ లగ్జరీ హోటల్లోకి (దీని మొదటి యజమాని బ్రిటిషర్ జాన్ వాట్సన్) అడుగుపెట్టే భారతీయులను చాలా చిన్న చూపు చూసేవారట. దీంతో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా ఎలాగైనా మనకు కూడా యూరోపియన్ ప్రమాణాలకు దీటుగా ఒక లగ్జరీ హోటల్ ఉండాలనుకున్నారు. ఆ స్వదేశీ కాంక్షతోనే 1902లో ఇండియన్ హోటల్స్ కంపెనీని స్థాపించి, 1903లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కట్టారు. తాజ్ హోటల్ దెబ్బకు ప్రభ కోల్పోయిన వాట్సన్ను 1944లో ఇండియన్ హోటల్స్ కొనుగోలు చేయడం విశేషం (తర్వాత 1980లలో దీన్ని అమ్మేసింది). 1984లో లండన్లోని సెయింట్ జేమ్స్ కోర్ట్ హోటల్ను చేజిక్కించుకుని బ్రిటిష్ కోటలో పాగా వేసింది. ఇండియన్ హోటల్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా 80 నగరాల్లో 196కు పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. అది ‘అరబిక్ కడలందం’గా నిలుస్తూ వాహ్ తాజ్ అనిపిస్తోంది!! టాటాల ‘ఉప్పు’ తింటున్నాం..! 1868లో 29 ఏళ్ల జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా రూ.21,000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించిన టాటా గ్రూప్.. నేడు ఆకాశమే హద్దుగా భారత్కు వ్యాపార జగత్తులో ఖండాతర ఖ్యాతిని తీసుకొచ్చింది. 1907లో జంషెడ్పూర్లో ఆసియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా టాటా స్టీల్ను నెలకొల్పి జంషెడ్జీ టాటా కలలను సాకారం చేశారు ఆయన తనయుడు సర్ దొరాబ్జీ టాటా. కోల్కతాలోని హౌరాబ్రిడ్జి, భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టులు, కాండ్లా పోర్టు, చండీగఢ్ నగర నిర్మాణాలకు ‘స్టీలెత్తిన’ కంపెనీగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ టాప్–10 స్టీల్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న టాటా స్టీల్.. 2006లో అంగ్లో–డచ్ కంపెనీ కోరస్ను ఏకంగా 8.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటిషర్లకు స్వదేశీ ‘ఉక్కు’ సంకల్పం అంటే ఏంటో చాటిచెప్పింది. 1910లో టాటా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీగా ఆవిర్భవించిన టాటా పవర్ నేడు దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తోంది. 1929లో టాటా ఎయిర్లైన్స్ను నెలకొల్పి భారతీయుల ఆర్థిక స్వేచ్ఛా కలను వినువీధిలో విహరింపజేశారు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా. 1946లో ఎయిర్ఇండియాగా పేరుమార్చుకుని, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం చెంతకు చేరినా.. తాజాగా మళ్లీ టాటాల గూటికే వచ్చి వాలింది ఈ లోహ విహంగం! ఇక హమామ్ బ్రాండ్ సబ్బు 1931లో టాటాలు తీసుకొచ్చిందే. ‘దేశ్ కా నమక్’గా పేరొందిన టాటా సాల్ట్ తయారీ సంస్థ టాటా కెమికల్స్ 1939లో ఆవిర్భవించింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్యాకేజ్డ్ ఐయొడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టింది. 1945లో టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)గా ఆరంభమైన టాటా మోటార్స్.. 2008లో బ్రిటిష్ ఐకానిక్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్రోవర్ను చేజక్కించుకుని మన సత్తాను చాటింది. ఐటీ రంగంలో దేశానికి మణిమకుటంగా వెలుగొందుతోంది టీసీఎస్. 150 ఏళ్ల చరిత్రతో ఉప్పు.. పప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు 30కి పైగా కంపెనీలతో మిషన్ స్వదేశీకి మూలస్తంభంగా నిలుస్తోంది టాటా. టీవీ‘ఎస్!’ 1911లో టీవీ సుందరం అయ్యంగార్ స్థాపించిన టీవీఎస్ గ్రూప్.. మొదట సదరన్ రోడ్వేస్ పేరుతో బస్సులు, ట్రక్కుల ట్రాన్స్పోర్ట్ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటి 2 సీట్ల మోపెడ్ (టీవీఎస్ 50)ను తయారు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వివిధ విదేశీ ఆటోమొబైల్ కంపెనీల భాగస్వామ్యంతో ద్వి, త్రిచక్ర వాహన రంగంలో టాప్గేర్లో దూసుకెళ్లింది. ఇప్పుడిది ఆటోమొబైల్, ఏవియేషన్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ఫైనాన్స్ వంటి రంగాల్లో అనేక కంపెనీలతో స్వదేశీ బహుళజాతి కంపెనీగా ఎదిగింది. టీవీఎస్ ఎక్స్ఎల్ పేరుతో మోపెడ్ రంగంలో ఇప్పటికీ ఈ కంపెనీ.. ఒకే ఒక్కడుగా చక్రం తిప్పుతోంది. స్వరాజ్య చరిత్రను లిఖించిన మన ‘రత్నం!’ స్వాత్రంత్య్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు రక్తాన్ని చిందిస్తే.. ఆ చరిత్రను లిఖించేందుకు తన సిరాను చిందించి.. అసలు సిసలు స్వదేశీ ‘రత్నం’గా నిలిచింది మన పెన్ను! 100% స్వదేశీ సిరా పెన్ను తయారు చేయాలన్న గాంధీజీ పిలుపుతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోసూరి వెంకట రత్నం 1932లో ‘రత్నం పెన్స్’ సంస్థను స్థాపించారు. 1935లో మహాత్మా గాంధీ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు స్వయంగా తమ సంస్థలో తయారైన పెన్నును ఆయనకు బహూకరించారట. ఈ ఫౌంటెన్ పెన్నులతో దాదాపు 31 వేల ఉత్తరాలను గాంధీజీ రాశారని ఆయన వారసులు చెబుతారు. అంతేకాదు, స్వదేశీ ఉద్యమానికి తన కలం ద్వారా ఇంకు నింపినందుకు రత్నంను అభినందిస్తూ ఆ పెన్నుతో గాంధీజీ స్వయంగా రాసిన లేఖ ఇప్పటికీ కేవీ రత్నం కుటుంబీకుల వద్ద భద్రంగా ఉంది. తొలి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. వంటి మహామహులందరూ రత్నం పెన్నులకు అభిమానులే. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ సైతం రత్నం సన్స్ తయారు చేసిన పెన్నును బహూకరించి, స్వదేశీ భారత్కు చెక్కుచెదరని బ్రాండ్గా దీని గొప్పతనాన్ని వివరించడం విశేషం. ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్లా ఉండే ఈ పెన్నుల రేట్లు రూ. 300 నుంచి రూ. 35,000 స్థాయి వరకూ (స్టీల్ పాళీ నుంచి 22 క్యారెట్ల బంగారంతో తయారైన పాళీ దాకా) ఉంటాయి. ఏకంగా రూ. 2 లక్షల పైగా విలువైన ప్రత్యేకమైన గోల్డ్ పెన్ కూడా ఉంది. ఎలాంటి మార్కెటింగ్ గానీ, వెబ్సైట్ గానీ లేకుండానే కేవలం నోటిమాటే ప్రచారంగా.. ఈ పోటీ ప్రపంచంలో దాదాపు 90 ఏళ్లుగా సిసలైన రత్నంగా నిలుస్తోంది! ‘అమృతాంజనం! నొప్పొస్తే.. ‘అమ్మా కాదు.. అమృతాంజనం’ అనేంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిన బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదేమో! 129 ఏళ్ల క్రితం 1893లో వ్యాపారవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు ఇలా ఒకటేంటి.. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కాశీనాథుని నాగశ్వరరావు రూపొందించిన ఈ నొప్పి నివారణ ఔషధం.. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఎంతంటే, తలనొప్పి–అమృతాంజనం అనేంతలా! కుటుంబ సంస్థగా మొదలై.. 1936లో అమృతాంజన్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను కూడా ప్రారంభించి.. పత్రికా ప్రపంచంలో చరిత్ర సృష్టించడం విశేషం. స్వాతంత్య్రానంతరం అమృతాంజనానికి పోటీగా ఎన్ని రకాల ఔషధాలు వచ్చినా.. నేటికీ దీని స్థానం చెక్కుచెదరలేదు. అమృతాంజన్ హెల్త్కేర్గా పేరు మార్చుకుని, నాగేశ్వరరావు మనుమడు శంభు ప్రసాద్ సారథ్యంలో నేడు అమృంతాంజన్ సంస్థ ఫుడ్, సాఫ్ట్వేర్ రంగాల్లోకి కూడా విస్తరించింది. స్టాక్ మార్కెట్లో సైతం లిస్టయ్యి.. రూ. 2,400 కోట్ల మార్కెట్ విలువతో స్వదేశీ ‘బ్రాండ్’బాజా మోగిస్తోంది!! -శివరామకృష్ణ మిర్తిపాటి -
ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలు
-
సర్వజ్ఞాని కోసమే వేడుకలు ఎత్తేశారు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తప్పక నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను మోదీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రద్దుచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘సెంట్రల్ హాల్ వేడుకలు అంతర్థానమవుతున్నాయి. సర్వజ్ఞాని కీర్తి ప్రతిష్టలు పెంచడం పైనే దృష్టిపెట్టారు. ఇదంతా ఆ సర్వజ్ఞాని పుణ్యమే’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘గతంలో 25వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సెంట్రల్ హాల్లో ప్రత్యేకంగా జరిగాయి. అలాగే 50వ, 60వ వేడుకలూ కొనసాగాయి. దురదృష్టంకొద్దీ ఈ సారి బీజేపీ సర్కార్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హాల్లో రద్దుచేసింది. సర్వజ్ఞానికే పేరొచ్చేలా వ్యవహరిస్తోంది. ఆ జ్ఞాని ఎవరో అందరికీ తెలుసు’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ విధానంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవడం కొనసాగుతోంది. చీకటి కోణాన్ని దాచేందుకే.. : అఖిలేశ్ బీజేపీ తనలోని చీకటి కోణాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా హర్ ఘర్ తిరంగా అని నినదిస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ‘ స్వాతంత్య్రం సిద్ధించాకా జాతీయ జెండాను, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంగీకరించలేదు. బ్రిటిష్వారికి అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి ఆర్ఎస్ఎస్–బీజేపీ తమ చరిత్రలోని చీకటి అధ్యాయాలను వెనుక వైపు దాచేస్తూ ముందువైపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అఖిలేశ్ అన్నారు. -
Independence Day 2022:నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగం రాత్రి 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)తోపాటు, దూరదర్శన్ అన్ని చానళ్లలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమవుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయని వివరించింది. ఏఐఆర్ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ నెట్వర్క్ల ద్వారా రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుందని పేర్కొంది. ఒడిశాకు చెందిన ముర్ము జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. -
Azadi Ka Amrit Mahotsav: 10 వేల మందితో పహారా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం జరగనున్న భారత 75వ స్వాతంత్య్రదిన వేడుకలకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7 వేల మంది ఆహుతులు వస్తూ ఉంటే ఎర్ర కోట చుట్టుపక్కల 10 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. సోమవారం జాతీయ జెండాను ఆవిష్కృతం చేసేంతవరకు ఎర్రకోట చుట్టూ అయిదు కిలో మీటర్ల మేర ఎలాంటి పతంగులు ఎగరవేయకూడదని ఆంక్షలు విధించారు. డ్రోన్లతో కూడా నిరంతరం పహారా ఉంటుంది. ఎర్రకోట ప్రాంగణంలోకి లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్డ్ కారు కీస్, సిగరెట్ లైటర్స్, బ్రీఫ్కేసెస్, హ్యాండ్బ్యాగ్స్, కెమెరాలు, బైనాక్యులర్స్, గొడుగులు తీసుకురావడంపై నిషేధం విధించారు. వీవీఐపీలు వచ్చే మార్గంలో దాదాపుగా వెయ్యి హైస్పెసిఫికేషన్ కెమెరాలను అమర్చారు. 400కి పైగా కైట్ కేచర్స్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. -
Azadi Ka Amrit Mahotsav: జెండా ఎగరేస్తున్నారా.. ఇవీ గుర్తుంచుకోండి
మన జాతీయ జెండా.. కోట్లాది మంది భారతీయులు మది మదిలో నింపుకున్న సగర్వ పతాక. ఈ జాతీయ జెండా ఎగురవేయడానికి కొన్ని నిబంధనలున్నాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లో నిబంధనలు రూపొందించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 కూడా ఏమేం చేయకూడదో చెబుతోంది. ► 2002, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పారాగ్రాఫ్ 2.2 ప్రకారం ఎవరైనా వ్యక్తి, ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని రోజుల్లో జాతీయ జెండా ఎగురవేయొచ్చు. ఇటీవల పగలు, రాత్రి కూడా జెండా ఎగరవేయొచ్చంటూ నిబంధనలు సవరించారు. ► జాతీయ జెండా చిన్నదైనా, పెద్దదైనప్పటికీ పొడవు, ఎత్తు (వెడల్పు) నిష్పత్తి 3:2 ఉండాలి. జెండా దీర్ఘ చతురస్రంలోనే ఉండాలి. ► జెండాలో కాషాయం రంగు పైకి ఉండేలా ఎగురవేయాలి. ► చేతితో లేదా మిషన్పై చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ.. ఇలా వేటితోనైనా జెండాను రూపొందించవచ్చు. ► చిరిగిపోయిన, నలిగిపోయిన లేదంటే చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయకూడదు. ► జాతీయ జెండాయే ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మరే ఇతర దేశాల జెండాలు కానీ, ఇతర వస్తువులు కానీ జాతీయ జెండా కంటే ఎత్తులో ఉండకూడదు. ► జాతీయ జెండా ఎగురవేసిన స్తంభాలపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు. ► జాతీయ జెండాని ఒక డెకరేటివ్ పీస్గా వాడకూడదు. యూనిఫామ్ దుస్తుల్లా వేసుకోకూడదు. ఏ డ్రెస్ మెటీరియల్ మీద కూడా ప్రింట్ చేయకూడదు. నడుముకి కింద భాగంలో ధరించకూడదు. ► జాతీయ జెండా నేలపైన కానీ, నీళ్లల్లో కానీ పడేయకూడదు ► రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి వాహనాలపైన మాత్రమే జాతీయ జెండా ఉంటుంది. సొంత వాహనాలపై దానిని వాడకూడదు ► జాతీయ జెండాని మాటల ద్వారా లేదంటే చేతల ద్వారా ఎవరైనా అగౌరవపరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971లోని సెక్షన్ 2 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్లో జాతీయ జెండాను ఉంచింది. -
చెరువులకు చేవ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం చెరువులకు ఊపిరిపోస్తోంది. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేయడం.. అవసరమైతే కొత్తవి నిర్మించడానికి పూనుకుంది. కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ‘క్యాచ్ ది రెయిన్’ (వర్షపు నీటిని ఒడిసిపడదాం) పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని రకాల చెరువుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వాగుల మధ్య చెక్ డ్యాంలను నిర్మించి కనీసం ఎకరం విస్తీర్ణంలో నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉన్నవి మొదలుకొని మైనర్ ఇరిగేషన్ విభాగం పరిధిలో ఉండే పెద్దపెద్ద చెరువులను ఒక్కొక్క వాటర్ బాడీ (నీటిని నిల్వ ఉంచే చెరువు)గా వర్గీకరించగా.. అలాంటివి మొత్తం 1,90,726 ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ వాటర్ బాడీ ఎంత విస్తీర్ణంలో ఉందన్న సమాచారంతో పాటు రేఖాంశాలు, అక్షాంశాలతో కూడిన శాటిలైట్ గణాంకాల ప్రకారం అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. ఆ వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచారు. ఇక రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలతో పాటు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే ప్రతి ఊరిలో సరాసరి 10–14 వరకు ఈ తరహా చెరువులున్నాయి. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 50 వేల వరకు ఉండగా, అత్యల్పంగా ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో నాలుగేసి వేలకు లోపునే ఉన్నాయి. ప్రస్తుతం పురోగతిలో 74,722 పనులు ఇక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువులను సద్వినియోగం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని శాఖలకు సంబంధించి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.3,970 కోట్లతో వర్షపు నీటి నిల్వకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టలు బలోపేతం, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం వంటి 74,722 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు తెలిపారు. అమృత్ సరోవర్లలో రాష్ట్రం రెండోస్థానం.. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ‘అమృత్ సరోవర్’ పేరిట వచ్చే ఏడాది కాలంలో ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువుల చొప్పున కొత్తవి ఏర్పాటుచేయడం.. లేదా పాతవాటిని అభివృద్ధి చేయడం చేయాలని.. వీటిలో 20 శాతం మేర ఈ ఆగస్టు 15కే పూర్తిచేయాలని రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిలో ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువగా అంటే 519 చెరువులను అభివృద్ధిచేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. -
Har Ghar Tiranga: ఇంటింటా ‘తిరంగ’
ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూడు రంగుల విద్యుద్దీపాలంకరణలతో తళుకులీనుతున్నాయి. ప్రధాన కూడళ్లన్నీ జెండాలతో, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో ముస్తాబయ్యాయి... ప్రతి భారతీయుని గుండెలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఉప్పొంగుతోంది..అందరినోటా ఒకటే నినాదం.. జయహో భారత్.. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా.. జెండా ఊంఛా రహే హమారా..’ అనే గీతం వీనుల విందుగా వినిపిస్తోంది. ‘నా దేశం భగవద్గీత.. నా దేశం అగ్ని పునీత సీత.. నా దేశం కరుణాంతరంగ.. నా దేశం సంస్కార గంగ..’ అన్న డాక్టర్ సినారే మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అందరి గుండెల నిండుగా దేశ భక్తి తాండవిస్తోందని ప్రతి ఊరు, వాడ, ఇల్లు.. త్రివర్ణ శోభితమై ప్రకాశిస్తూ స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్ర భారతావనికి కారకులైన మహోన్నతులందరికీ జయహో అంటూ పౌరులు శిరస్సు వంచి నమస్కరిస్తుండటం సాక్షాత్కరిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: దేశ గౌరవం ప్రతి ఇంటిపై స్వేచ్ఛా విహంగమై త్రివర్ణ పతాకం రూపంలో రెపరెపలాడుతోంది. రాష్ట్ర ప్రజలంతా మువ్వన్నెల జాతీయ జెండాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. బానిస సంకెళ్ల నుంచి భారతావనికి విముక్తి లభించి ఈ నెల 15 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా’ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుతోంది. గవర్నర్ బంగ్లాలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుండగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఆవిష్కరించారు. సామాన్యులు మొదలు.. సీఎం వరకు ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాలపై, వ్యాపార, వాణిజ్య భవనాల సముదాయాల వద్ద.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందరిలోనూ ‘అమృత్’ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో జరుపుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వందల అడుగుల పొడవున్న జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా వ్యాస రచన, వక్తృత్వ, నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుల వేష ధారణలో పలువురు వేడుకల్లో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు లక్షకు పైగా అవగాహనా కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలు మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాలు పంచుకొనేలా నిర్వహించారు. ఎందరో వీరుల త్యాగ ఫలం మన ఈ స్వాతంత్య్రం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 278 మంది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను సన్మానించారు. మనిషి మనుగడకు మూలాధారమైన 399 చెరువులను ఆధునీకరించి అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతటా జెండా స్ఫూర్తి అమృత్ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడాలు, విగ్రహాలు, ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరింత ప్రచారం కల్పించడం కోసం మూడు లఘు చిత్రాలను నిర్మించారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన లఘు చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తితో పేదలకు జరుగుతున్న మంచిని వివరించారు. అన్ని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఈ త్రివర్ణ పతాక పండగలో మమేకం చేస్తూ, సమైక్య భావాన్ని చాటుతున్నారు. తద్వారా ప్రజల్లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యాక్రమం బాగా చొచ్చుకువెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లు.. వీధులు.. సామాజిక వేదికలు ఇలా సర్వం త్రివర్ణ శోభితమై ప్రకాశిస్తూ స్వతంత్ర భారతావనికి జయహో అంటున్నాయి. ఊరూరా సందడే సందడి కర్నూలు నగరానికి తలమానికమైన జగన్నాథగట్టుపై మొదటిసారి 10 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున్న జాతీయ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలులో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగుర వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శనివారం మువ్వన్నెలతో మెరిసింది. ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కైకలూరులో నేషనల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఒక కిలోమీటర్ పొడవున జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ర్యాలీలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా అల్లవరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కాకినాడలో మూడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో 105 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో సైతం జాతీయ జెండాలు రెపరెపలాడాయి. 3.5 కి.మీ పొడవైన జాతీయ పతాకంతో మానవహారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శనివారం మూడున్నర కిలోమీటర్ల పొడవున్న జాతీయ పతాకంతో మానవహారం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, విడదల రజని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జెండా రూపకర్త నివాసం నుంచే మొదలు 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందు.. అంటే 2021 మార్చి 12న ప్రారంభమైన ఈ సంబరాలు.. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాల్లో భాగంగా ‘‘ఇంటింటా జాతీయ జెండా’’ (హర్ ఘర్ తిరంగా) అనే కార్యక్రమాన్ని ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశమంతటా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను కోరింది. గతేడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి ఈ వేడుకలను ప్రారంభించారు. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వాతంత్య్ర సమర యోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సత్కరించడం ద్వారా రాష్ట్రంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పౌరులలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా ‘‘ఇంటింటా జాతీయ జెండా’’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ వేడుకలను ప్రజల పండుగగా నిర్వహిస్తోంది. -
స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా
రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. వారికి ఈ ఆగస్టు 15 చిరస్మరణీయం చేయండి. ప్రతి భారతీయ గుండె ఉప్పొంగే క్షణాలివి. ప్రతి కన్ను ఆనందంతో చమర్చే అనుభూతి ఇది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ మువ్వన్నెలు నిండిపోయే అపూర్వఘట్టం ఇది. మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం... అందరూ అనిర్వచనీయమైన ఉద్వేగంతో ఊగిపోయే సందర్భం ఇది. దేశమా... నీ సమున్నత కీర్తిని చూసి గర్విస్తున్నాం. దేశమా... నీ ఘన వారసత్వానికి పులకించిపోతున్నాం. దేశమా... నీ విలువల ఔన్నత్యానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. దేశమా... నీవు ఇచ్చిన ఈ పిడికెడు మట్టికి హృదయాల్ని అర్పణం చేస్తున్నాం. ‘సారే జహా సే అచ్ఛా హిందూస్తాన్ హమారా’... ప్రపంచ దేశాలలోనే అందమైన దేశం, సుందర దేశం, సమృద్ధి దేశం మన దేశం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ 75 ఏళ్ల అమృత మహోత్సవం సందర్భంగా వాగ్దానం చేయాలి. నేటి బాలల హృదిలో ఈ కొనసాగింపునకు పాదులు వేయాలి. ఎందుకంటే వారే కదా భావిపౌరులు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని నెహ్రూ అన్నది– బాలల్లో దేశభక్తిని పెంపొందించాలని సూచించినది. అందుకే ప్రతి ఇంట ఉన్న బాలబాలికలందరినీ తప్పనిసరిగా ఆగస్టు 15 ఉదయం నాటి పతాకావిష్కరణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడండి. వారి చేత వందేమాతరం, జనగణమన పాడించండి. మాట్లాడనివ్వండి రేపటి ఘట్టం మాట్లాడే ఘట్టం. పిల్లల్ని మాట్లాడించాల్సిన ఘట్టం. మీ ఇళ్లల్లో, వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో పిల్లలకు వక్తృత్వ పోటీలు పెట్టండి. ‘నేను నా దేశం’, ‘నాకు నచ్చిన మహనీయుడు’, ‘ఈ దేశానికి నేను ఏమి ఇస్తాను’, ‘దేశమంటే మట్టి కాదోయ్... మనుషులోయ్’... వంటి అంశాలు ఇచ్చి, ప్రిపేర్ అయ్యి, మాట్లాడమనండి. ఏం మాట్లాడాలో కొంత సహాయం చేయండి. ఎలా మాట్లాడాలో నేర్పించండి. గొప్ప వక్త గొప్ప నాయకుడు కాగలడు... మార్గనిర్దేశనం చేయగలడు... అని చెప్పి ప్రోత్సహించండి. బాగా మాట్లాడిన వారికి బహుమతులు ఇవ్వండి. ఆగస్టు 15న వారిలోని కొత్త ప్రతిభకు పాదు వేయండి. నేనే ఆ నాయకుణ్ణయితే పిల్లల్ని పరకాయప్రవేశం చేయించండి. మోనో యాక్షన్... ఏకపాత్రాభినయం పోటీలు పెట్టండి. దేశ నాయకులుగా వేషం కట్టి వారిలా మారి వారు ఎలా మాట్లాడతారో దేశం కోసం ఏం సందేశం ఇస్తారో ఇమ్మనమని చెప్పండి. గాంధీ, నెహ్రూ, అల్లూరి, భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్... ఒక్కొక్కరు ఒక్కో నేతలా మారనివ్వండి. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాదు సమాజం కోసం పాటుపడిన వారు కూడా దేశభక్తులే అని చెప్పి సుందరలాల్ బహుగుణ, మదర్ థెరిసా, సావిత్రిబాయ్ పూలే, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్ వంటి మహనీయుల వేషాలు వేయమనండి. దేశకీర్తిని ఇనుమడింప చేసిన చిత్రకారులు, గాయకులు, కవులు రవీంద్రనాథ్ టాగోర్, మంగళంపల్లి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్ వంటి వారి రూపంలో పిల్లల్ని వేదిక మీదకు రమ్మనండి. అద్భుతం ఆ దృశ్యం. మహనీయుల పసిరూపం. పర్వతాలు, నదులు... దేశమే చిత్రలేఖనం పోటీ పెట్టండి. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ బొమ్మలే కాదు హిమాలయాలు, గంగానది, వింధ్య పర్వతాలు, హిందూ మహాసముద్ర తీరాలు... వీటిని కూడా గీయమనండి. దేశంలోని ప్రకృతిని కాపాడటం దేశభక్తి అని చెప్పండి. రాజస్తాన్ ఎడారి, గుజరాత్ శ్వేత మైదానాలు, మధ్యప్రదేశ్ ఘోరారణ్యాలు, తెలంగాణ పీఠభూములు, ఆంధ్రప్రదేశ్ నదీ ప్రవాహాలు జాతి సంపదలేనని చాటుతూ గీయమనండి. ‘టీ షర్ట్ పెయింటింగ్’ కూడా మంచి ఆలోచన. తెల్లటి టీషర్ట్ మీద దేశభక్తిని తెలియచేసే బొమ్మ గీసి వేసుకోవడం, బహుమతిగా ఇవ్వడం చేయమనండి. జాతీయ జంతువు, పక్షి, చిహ్నం వీటిని గీయమని చెప్పండి. అంతే కాదు, వీటన్నింటికి అర్హుడయ్యేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటామని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించండి. క్విజ్లు, థీమ్ పార్టీలు స్వాతంత్య్ర పోరాటం ఒక సుదీర్ఘ ఘట్టం. దీని మీద ఎన్ని క్విజ్లైనా నిర్వహించవచ్చు. సరైన సమాధానాలు చెప్పిన పిల్లలకు మంచి బహుమతి ఇవ్వండి. అలాగే ఆ మధ్యాహ్నం లేదా సాయంత్రం థీమ్ పార్టీ చేసుకోవచ్చు. ఖాదీ బట్టలు, మూడు రంగుల బట్టలు లేదా గాంధీ టోపీ... ఇలాంటి థీమ్ పెట్టుకొని పిల్లలు స్నాక్స్ పార్టీ చేసుకోవచ్చు. ఆ సాయంత్రం ‘చరిత్ర నడక’– అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా చారిత్రక స్థలం అంటే కూడలి, దేశభక్తుని విగ్రహం, లేదా గతంలో మహనీయులు వచ్చి వెళ్లిన చోటు అక్కడి వరకు పిల్లలు పెద్దలు కలిసి వాక్ చేయవచ్చు. అలాగే ఆ సాయంత్రం అందరూ కలిసి మంచి దేశభక్తి సినిమా తిలకించవచ్చు. పాటల పోటీ, డాన్స్ పోటీలు ఎలాగూ ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలు వేసిన బొమ్మలతో సాయంత్రం ప్రదర్శన ఏర్పాటు చేయాలి. సంకల్పం దేశ స్వాతంత్య్రం ఒక్కరోజులో రాలేదని, ఎందరో త్యాగాలు చేస్తే... కష్టాలు ఎదుర్కొంటే వచ్చిందని పిల్లలకు చెప్పాలి. జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని దేశం గర్వించేలా ఎదగడమే దేశభక్తి అని కూడా వారికి చెప్పాలి. ‘నాకు జన్మనిచ్చిన దేశానికి నేను పెద్దయ్యి ఏం చేయాలి’ అనే భావన ఎప్పుడూ కలిగి ఉండాలని వారికి చెప్పాలి. భారత్ మాతా కీ జై అనే నినాదం వారి హృదయంలో సదా మార్మోగేలా పెద్దల సహకారంతో పిల్లలు ఈ అమృత మహోత్సవాన్ని జరుపుకునేలా నేడంతా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాం. సంస్కృతులకు స్వాగతం చెప్పండి సాటి సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని కూడా చెప్పండి. భిన్న సంస్కృతుల వేషధారణల పోటీ పెట్టండి. అస్సామీలు, మణిపురిలు, తమిళులు, మలయాళీలు, మహరాష్ట్రీయులు, కశ్మీరీలు... వీరంతా వేదిక మీదకు రావాలి. హిందూ ముస్లిం శిక్కు క్రైస్తవ ధర్మాలు మన దేశంలో ఉన్నాయని, అందరూ కలిసి మెలిసి జీవించాలని తెలియచేసే రూపకాలు, పాత్రలు వేయించండి. భిన్నత్వంలో ఏకత్వం... ఏకత్వంలో భిన్నత్వం బోధించండి. -
ఉద్యమ వారసత్వమే ఊపిరి
ప్రపంచ చరిత్రలో భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. వలస పాలనలో కుంగి, కృశించిన సామాన్య ప్రజానీకం ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించిన తీరు దానికి ఓ ముఖ్యమైన పార్శ్వం. అలనాటి జాతీయోద్యమ ప్రధాన వారసత్వం – దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ వారసత్వంలో చెప్పుకోదగిన మరో అంశం – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవన్నీ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. దీన్ని సరిదిద్దాలి. ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం నేటి అవసరం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యం కావాలి. ► ఒక దేశ చరిత్రలో 75 ఏళ్ళు గణింపదగ్గ కాలమే! ఇదొక ఉద్విగ్నభరిత సన్నివేశం. మన స్థితిగతులు, దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, వాటిని పక్కనబెట్టి, సంబరాలు చేసుకోవలసిన సమయం. అదేక్రమంలో మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక ఒక సుదీర్ఘ పోరాటం దాని ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. అవి అందరి ప్రశంసలూ అందుకొన్నాయి. నాయకత్వం రూపొందించిన కార్యక్రమాలు, నిర్వహించిన ఉద్యమాలు, అనుసరించిన ఎత్తుగడలు ఒక పార్శ్వం. ► కాగా, మరొకవైపు వలస పాలనలో కుంగి, కృశించి, దినదిన గండంగా కాలం వెళ్ళదీస్తున్న సామాన్య ప్రజానీకం – అక్షరం ముక్క తెలియని గ్రామీణ ప్రజలు – ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపుకూ స్పందించిన తీరు మరో ముఖ్య పార్శ్వం. బెంగాల్ విభజన, సహాయ నిరాకరణోద్యమం, బార్డోలీ రైతు సత్యాగ్రహం, క్విట్ ఇండియా – ఇలా అన్ని దశల్లోనూ, అన్ని పోరాటాల్లోనూ పురుషులతో పాటు స్త్రీలూ పాల్గొని ఉద్యమాలను నడిపించారు. పోరాటాలు, త్యాగాలు ఎందుకోసం? ఉజ్వల భవిష్యత్తు కోసం! స్వతంత్ర జాతిగా ఆత్మ గౌరవంతో బతకడం కోసం! రానున్న భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయడం కోసం! ► జాతీయోద్యమ వారసత్వం ఏమిటి? ఆ వారసత్వానికి నేడు ప్రాసంగికత (రిలవెన్స్) ఉందా? ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ముఖ్యంగా, ప్రధానంగా చెప్పుకోవాల్సింది 1857 తిరుగుబాటు. చరిత్రకారులు వర్ణించినట్లు... ఇది ‘ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం. జాతీయతాభావం ఎక్కడో మసక మసకగా అంతర్లీనంగా ఉన్నా, ఇది ప్రధానంగా ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు. హిందూ, ముస్లిం మత విభేదాలు లేకుండా, కలసికట్టుగా, అనేక సందర్భాల్లో సామాన్య ప్రజానీకంతో కలిసి జరిపిన సైనిక తిరుగుబాటు. ఇది ఫలవంతం కాకున్నా మనకు మిగిల్చిన వారసత్వం – ఆంగ్ల పాలనకు వ్యతిరేకత, స్వతంత్రత, వీటిని మించి హిందూ–ముస్లిం ఐక్యత! జాతీయోద్యమంలో ఈ ధార దాదాపు 1940వ దశకం దాకా కొనసాగింది. ► రవీంద్రుని ‘జనగణమన’ గీతం, బంకించంద్రుని ‘వందేమాతరం’, ఇక్బాల్ గేయం ‘సారే జహాసే అచ్ఛా’ – ఇవి దేశ నైసర్గిక, ప్రజా సముదాయాలను ఉద్దేశించి రాసినవే! ఈ సమైక్యతను దెబ్బతీయడానికి విదేశీ పాలకులు ‘ద్విజాతి’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రోది చేశారు. జాతీయోద్యమ ప్రధాన వారసత్వం – దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ క్రమంలో పౌరహక్కులను, ప్రజాస్వామిక భావాలను, పార్లమెంటరీ వ్యవస్థను నిర్ద్వంద్వంగా బలపరిచి, పదిలపరచి, భారత రాజ్యాంగంలో పొందుపరచగలిగిందీ జాతీయోద్యమ వారసత్వమే! ► జాతీయోద్యమం కేవలం రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిపర ప్రాథమిక హక్కుల కోసమే పాటుపడలేదు. ఆర్థికాభివృద్ధి వైపు దృష్టి సారించింది. ఆంగ్లపాలన... ఒకవైపు తాను పారిశ్రామికంగా బలపడుతూ, మరో పార్శ్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తమ దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించుకుంది. ఈ అంశాన్ని ‘సంపద తరలింపు’గా సిద్ధాంతీకరించాడు దాదాభాయ్ నౌరోజీ. జాతీయ నాయకత్వం దీన్ని గ్రహించి, అది భారతీయ ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న కీడును ప్రజలకు ఎరుకపరిచింది. వాస్తవంలో వలసపాలన ఆర్థికదోపిడీని బట్టబయలు చేసింది తొలితరం జాతీయోద్యమ నాయకులే! ఆధునిక యంత్ర పరిశ్రమల ప్రాధాన్యాన్ని గుర్తించి, అవి రాజ్య(స్టేట్) పరిధిలో ఉండి ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలని ఉద్ఘాటించారు. ► జాతీయోద్యమం ప్రారంభదశ నుండి పౌరహక్కుల సంరక్షణ కోసం పోరాడుతూ వచ్చింది. లోకమాన్య తిలక్ నిర్వహించిన ఆంగ్ల వ్యతిరేక సమీకరణలు (మహారాష్ట్రలో), ఆ తర్వాత జరిగిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రోదిచేశాయి. పౌరహక్కుల పరిరక్షణకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు జాతీయోద్యమంలో ప్రధాన భాగాలు. గాంధీజీ మాటల్లో, ‘‘సివిల్ లిబర్టీ... ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ స్వరాజ్. ఇటీజ్ వాటర్ ఆఫ్ లైఫ్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ వాటర్ బీయింగ్ డైల్యూటెడ్.’’ ► జాతీయోద్యమమనేది ప్రారంభంలో సమాజంలోని శిష్టులకే (ఎలైట్స్కే) పరిమితమైనా, ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి (1920–21) పూర్వమే విస్తృత ప్రజాపోరాటంగా రూపుదిద్దుకుంది. సహాయ నిరాకరణ, గ్రామ పునర్నిర్మాణం, మద్యపాన నిషేధం, కుటీర పరిశ్రమల పెంపుదల – ఇవన్నీ మహాత్ముడు ఆరంభించిన ప్రజా కార్యక్రమాలు. ఇవి సామాన్య ప్రజానీకాన్ని – స్త్రీ, పురుషులను ఉద్యమ భాగస్వాములుగా చేశాయి. ఈ ధోరణి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం (1942)తో పరాకాష్ఠకు చేరుకొంది. ఉద్యమాలు నాయకులు ప్రారంభించినా, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ, ఊపిరులూదిందీ సామాన్య ప్రజానీకమే! జాతీయోద్యమ వారసత్వంలో గ్రహించాల్సిన ప్రధాన అంశం ఇదే! దీనికి ప్రబల ఉదాహరణ – సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ‘బార్డోలీ రైతు సత్యాగ్రహం’. పటేల్ పిలుపునందుకొని లక్షలాది స్త్రీ, పురుషులు, రైతులు ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ప్రజలే ఉద్యమానికి ఊపిరులు! ► జాతీయోద్యమ వారసత్వంలో ప్రధానంగా చెప్పుకోదగింది – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవి ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ప్రజాఉద్యమాలు, వార్తాసాధనాలు వీటిని కాపాడుకొంటూ వస్తున్నాయి. జాతీయోద్యమ స్వప్నం భావితరాలకు అందించిన సందేశం, చూపిన దారి ఏమిటి? ఉద్యమ ఆశయాలు, కన్న కలలు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరచబడ్డాయి. ఇవి చట్టపరమైనహక్కులు. వీటికి భంగం కలగకూడదు. కానీ, ఇవి ఇటీవలి కాలంలో ప్రశ్నార్థకమవుతున్నాయి. కాగా రాజ్యాంగంలో మరో ముఖ్య అధికరణం – రాజ్యం అనుసరించదగ్గ ‘ఆదేశిక సూత్రాలు’(ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ). ప్రజా శ్రేయస్సుపరంగా ఆచరింపదగ్గవి. అయితే, ఇవి ఆశించే ఫలితాలు చేకూరతాయా? ఈ ప్రశ్నకు సమాధానం – విశాల భారతీయ సమాజం స్పందించి, చేపట్టే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. ► జాతీయోద్యమ వారసత్వం... ప్రజాశ్రేయస్సు – పేద వర్గాల అభ్యున్నతి, శాస్త్రీయ విజ్ఞానసమాజ నిర్మాణం, పౌరహక్కులు, చట్టం ముందు అందరూ సమానం! వీటిని సాధించే క్రమంలో ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించడం నేటి అవసరం. భారతీయ సంస్కృతిని ‘భిన్నత్వంలో ఏకత్వం’గా చెప్పుకుంటాం. ఇటీవలి కాలంలో దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల దృష్ట్యా... దేశీయతలో ఏకత్వం లోపించి, భిన్నత్వం మరింత వృద్ధి చెందుతోంది. ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఆయాప్రాంతాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉత్పన్నమై, రాజ్యస్వభావంలో మౌలిక మార్పులకు దోహదం చేస్తున్నాయి. ► ఈ పరిణామం భారత దేశీయతకు అడ్డు కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని గూర్చి పరిగణిస్తూనే, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భిన్నత్వాన్ని గుర్తించి దానికి తగిన చోటును మనం కల్పించుకోవాలి. అలా చేసినప్పుడు భారతదేశ సమైక్యత, జాతీయత మరింతగా వృద్ధి చెందుతాయి. జాతీయోద్యమ బృహత్ ప్రణాళికలో లక్ష్యాలైన పేదరిక, నిరక్షరాస్యత నిర్మూలన ఇంకా అపరిష్కృత సమస్యలుగానే ఉండిపోయాయి. నిజానికి ఇవే మన దేశీయతకు భంగం కలిగించే ముఖ్యాంశాలు. వీటిని అధిగమించగలిగితే మనం భారతీయతను సాధించగలం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యంగా ఉండాలి. డా‘‘ వకుళాభరణం రామకృష్ణ వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ఆచార్యులు -
జెండా ఊంఛా రహే హమారా!
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హాసన్. హైదరాబాద్ వాసి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ జెండాల రెపరెపలు, జైహింద్ నినాదాల హోరు దేశమంతటా అలుముకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజా హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఆజాద్ భారత్కు ఇది 75వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని జనం ఆదరిస్తున్నారు. ఇళ్ళ మీదనే కాదు, వీధుల్లో సైతం జెండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు మొబైల్ ఫోన్లలో వారి ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. జెండా ఉత్సవాల ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆక్రమించాయి. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఒక ఫోటో కొంత ప్రత్యేకంగా కనిపించింది. ఒక ఛాయాచిత్రం అనేక విషయాలను చెప్పగలదనేది నానుడి (Photo speaks volumes). ఈ ఫోటో చాలా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నది. దాని బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే ఏజెన్సీ ప్రాంతంగా తోస్తున్నది. ఒక సన్నటి వెదురు కర్రకు ఒక జాతీయ జెండాను తొడిగారు. కర్రను మట్టిలో పాతి, దాని చుట్టూ ముగ్గు వేశారు. మందార పూలు పెట్టారు. చుట్టూ ఓ పదిమంది పిల్లలు నిలబడి జెండా వందనం చేస్తున్నారు. వారి వయసు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వరకుండవచ్చు. వాళ్ల నిక్కర్లు జీర్ణావస్థలో ఉన్నాయి. పైన చొక్కా ల్లేవు. అందరికంటే చిన్నవాడికి నిక్కర్ కూడా లేదు. జెండా ఎగరేసే తాడు వాని చేతిలోనే ఉన్నది. కనుక వాడే చీఫ్గెస్టయి వుంటాడు. అందరిలో పేదరికం తాండవిస్తున్నది. జెండాను తలకిందులుగా ఎగరేయడం వంటి తప్పులు వాళ్లు చేయలేదు. ఫ్లాగ్ కోడ్ పాటించారు. వారి సెల్యూల్లో ఏ వంకా లేదు. ఆ జెండా తమలాంటి వాళ్ల జీవితాల్ని మార్చివేస్తానన్న హామీని 75 ఏళ్ల కిందనే ఇచ్చిందన్న విషయం ఆ పిల్లలకు తెలియకపోవచ్చు. జెండా అంటే దేవుడితో సమానమని మాత్రమే తెలుసు. పూజించాలని మాత్రమే తెలుసు. ఈ ఫోటో మరోసారి కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మనముందు తెచ్చింది. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? కేవలం మాట్లాడే స్వేచ్ఛ మాత్రమేనా? ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రాల మాటేమిటి? సామాజిక న్యాయం సంగతేమిటి? రాజ్యాంగం పూచీపడినట్టు అందరికీ ఆలోచనా, భావ ప్రకటనా, నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ సమకూరిందా? హోదాల్లో అవకాశాల్లో సమానత్వం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన నాటి రోజులతో పోలిస్తే దారిద్య్రం అంత తీవ్రంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఆకలి చావుల మాటలు వినిపించకపోవచ్చు. అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు. జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం పెరిగి ఉండవచ్చు. కానీ అసమానతలు కూడా పెరిగాయి. పేదలు – ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉన్నది. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ లెక్క ప్రకారం దేశ సంపదలో 58% కేవలం ఒక్కశాతం కుబేరుల చేతిలోనే ఉన్నది. పది శాతం శ్రీమంతుల చేతిలో 80 శాతం జాతి సంపద పోగుపడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో పది శాతం సంపన్నుల చేతిలో 54 శాతం సంపద ఉండేది. ఆ అంతరం ఇప్పుడు మరింత పెరిగింది. పేదలు, నిరుపేదలు, దిగువ, ఎగువ మధ్యతరగతులందరి ఉమ్మడి సంపద ప్రస్తుతం 14 శాతమే. ఆర్థిక అసమానతలు తొలగించలేక మరింత పెంచుకోవడం ఒక విషాదం. సామాజిక అసమానతలను కూడా పూర్తిగా రూపుమాపలేకపోయాము. సోషల్లీ రాడికల్ స్వభావం కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని కొందరు పరిగణిస్తారు. అయినప్పటికీ సామాజిక అసమానతలు 75 ఏళ్ల తరువాత కూడా కొనసాగుతున్నాయి. ‘ఎస్.సీ. కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా మీడియా గోష్ఠి లోనే కామెంట్ చేయగలిగిన ఒక కులదురహంకారి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా చలామణి కాగలగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయం. మెదళ్లకు బూజు పట్టించిన ఛాందస భావాలు ఇంకా సమాజాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. దళితులు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినబోరంటూ బహిష్కరిస్తున్న ఘటనలు ఇంకా జరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అల్లుడిని కరకు కత్తులకు బలి ఇస్తున్నారు. పైగా దానికి ‘పరువు హత్య’ అనే ముద్దుపేరు పెట్టుకుంటున్నారు. వెనుకబడిన వర్గాలుగా పరిగణించే చేతివృత్తుల వారి వృత్తి వ్యాపారాల్లోకి క్రమంగా సంపన్నులు ప్రవేశించారు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం, పాల వ్యాపారం, లిక్కర్ బిజినెస్, కుండలు, బుట్టలు, ఫర్నిచర్, బంగారం వగైరాలన్నీ వెనుకబడిన వర్గాల నుంచి ఎప్పుడో చేజారిపోయాయి. వీధిన పడిన ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ కోటాను అమలుచేయ ప్రయత్నించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. మనదేశంలో పొట్టకూటి కోసం రెక్కలమ్ముకుంటున్న వారి సంఖ్య 90 కోట్లు. ఇందులో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే. ప్రైవేట్ సెక్టార్లోని వైట్కాలర్ ఉద్యోగాల్లో ఈనాటికీ ఎటువంటి రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించి వారిని ఎంపవర్ చేయకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని కుల దురహంకార విషసర్పం వేయి పడగల్ని విప్పి రోజూ వేయిటన్నుల విషాన్ని విరజిమ్ముతున్న భయానక పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తే గిట్టదు. మహిళలకు కీలక శాఖల్ని కేటాయిస్తే నచ్చదు. వారికి నామినేటెడ్ పదవులిస్తే కోపం. నామినేటెడ్ పనులు అప్పగిస్తే కోపం. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిస్తే పట్టరాని ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే తనువంతా కంపరం. పారదర్శకంగా ప్రజలకు నగదు బదిలీ చేస్తే పాపం. ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యనందించడం సహించరాని నేరం. ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ డాక్టర్ను పంపిస్తాననడం అపచారం. స్వపరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరించడం మహా పాపం. అవ్వాతాతల పెన్షన్ డబ్బులు ఠంచన్గా తలుపు తట్టడం అపరాధం... వేయి పడగల విషసర్పం దృష్టిలో ఇవన్నీ జగన్ ప్రభుత్వ నేరాలు. ఇటువంటి పడగల్ని కత్తిరించకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధి తక్కువేమీ కాదు. పంపిణీలో అసమానతలుండడమే అసలు సమస్య. ప్రధానమంత్రి పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వచ్చే రెండు మూడేళ్లలో దేశ సంపద ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి. ఇంకో పది పన్నెండేళ్లలో పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కాబోతున్నదని ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇందుకు దోహదపడే కారణంగా మన మానవ వనరుల సంపదను వారు చూపెడుతున్నారు. ఈ వనరులకు నాణ్యమైన విద్యనిచ్చి నైపుణ్యాన్ని జతచేయడమే మనం చేయవలసిన పని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెరవేర్చగలిగితే రాబోయే తరం యువకులు ఈ దేశాన్ని మరో రెండు దశాబ్దాల్లోగా అగ్రరాజ్యంగా నిలబెట్టగలుగుతారు. ఈ లక్ష్యసాధన కోసం మానవ వనరుల్ని సాధికారం చేయడానికి ప్రగతి శీల ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చును కొందరు ప్రబుద్ధులు తప్పుపడుతున్నారు. ‘ఉచితాలు అనుచితం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారి జేబుల్లోనే సుజనా చౌదరి వంటి బ్యాంకు కేటుగాళ్లుండటం ఒక విచిత్రం. ఇటువంటి కేటుగాళ్లు ఎగవేసిన లక్షలకోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం ప్రజలను ఎంపవర్ చేసే పథకాలకు మోకాలడ్డాలనుకోవడం ఒక వైరుద్ధ్యం. ఇటువంటి వంకర విధానాలను సరిదిద్దుకోకుండా భారతదేశం తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యంకాదు. కట్టుబట్టలు కూడా లేకున్నా సరే, దేశభక్తిలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్న మన ఏకలవ్య బాలల్ని మరవద్దు. వారికి చేయూతనిచ్చి ప్రధాన స్రవంతిలో నిలబెడితే మన ప్రగతి రథం పరుగులు తీస్తుంది. అట్లా కాకుండా మళ్లీ బొటనవేళ్లు నరకడానికే పూనుకుంటే ఇంకో వందేళ్లయినా ఈ దేశం అగ్రదేశం కాబోదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆజాదీకా అమృత్ మహోత్సవ్: సాంస్కృతిక కార్యక్రమ దృశ్యాలు