ప్రపంచంలో 2075 సంవత్సరం వరకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే దేశాలను అంచనావేస్తూ గోల్డ్మన్ సాక్స్ నివేదిక విడుదల చేసింది. భారత్ ఇప్పటికే 4 ట్రిలియన్ డాలర్ల మార్క్ను దాటేసిన విషయం తెలిసిందే.
చైనా: 57 ట్రిలియన్ డాలర్లు
భారతదేశం: 52.5 ట్రిలియన్ డాలర్లు
యునైటెడ్ స్టేట్స్: 51.5 ట్రిలియన్ డాలర్లు
ఇండోనేషియా: 13.7 ట్రిలియన్ డాలర్లు
నైజీరియా: 13.1 ట్రిలియన్ డాలర్లు
ఈజిప్ట్: 10.4 ట్రిలియన్ డాలర్లు
బ్రెజిల్: 8.7 ట్రిలియన్ డాలర్లు
జర్మనీ: 8.1 ట్రిలియన్ డాలర్లు
మెక్సికో: 7.6 ట్రిలియన్ డాలర్లు
యూకే: 7.6 ట్రిలియన్ డాలర్లు
జపాన్: 7.5 ట్రిలియన్ డాలర్లు
రష్యా: 6.9 ట్రిలియన్ డాలర్లు
ఫిలిప్పీన్స్: 6.6 ట్రిలియన్ డాలర్లు
ఫ్రాన్స్: 6.5 ట్రిలియన్ డాలర్లు
బంగ్లాదేశ్: 6.3 ట్రిలియన్ డాలర్లు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి గతంలో చేసిన ప్రకటన ప్రకారం.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది.
2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిగా కొనసాగుతోంది.