ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ నుంచి డివిడెండ్ల ధమాకా | Interim Budget 2024: Government to receive Rs 1.02 lakh crore as dividend from RBI, PSBs in FY25 | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ నుంచి డివిడెండ్ల ధమాకా

Published Fri, Feb 2 2024 5:48 AM | Last Updated on Fri, Feb 2 2024 10:16 AM

Interim Budget 2024: Government to receive Rs 1.02 lakh crore as dividend from RBI, PSBs in FY25 - Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంకింగ్‌సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్‌ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్‌ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్‌ సవరిత అంచనా. ఆర్‌బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్‌ చెల్లించడంతో డివిడెండ్‌ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది.

2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్‌ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్‌ అంచనావేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement