Public sector
-
స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం నియామకాలు ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(సీపీఎస్ఈ)లోని స్వతంత్ర డైరెక్టర్ పోస్టుల్లో డిసెంబర్ 2024 నాటికి 86% ఖాళీగా ఉన్నాయి. ఇది అక్టోబర్లో ఉన్న 59% కంటే అధికంగా పెరిగింది.వీరు ఏం చేస్తారంటే..కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను నిర్వహించడంలో, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. చట్టబద్ధమైన ఆడిట్ విధానాన్ని పర్యవేక్షించే కమిటీల్లో వీరు ముఖ్యమైన బాధ్యత వహిస్తారు. కంపెనీల ఉనికి, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అత్యున్నత ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తారు.ప్రస్తుత ఖాళీల పరిస్థితిసీపీఎస్ఈ బోర్డుల్లో సుమారు 750 ఇండిపెండెంట్ లేదా నాన్ అఫీషియల్ డైరెక్టర్ పోస్టుల్లో 2024 డిసెంబర్ చివరి నాటికి 648 ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఖాళీలు ఉండడంతో కార్పొరేట్ పాలనపై ఆందోళనలు రేకిస్తున్నాయి. ఈ ఖాళీల పర్వం ఇలాగే కొనసాగితే సంస్థల పనితీరుపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ స్పందన..ఈ ఆందోళనకర పరిస్థితికి ప్రతిస్పందనగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం తక్షణ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా 64 లిస్టెడ్ సీపీఎస్ఈల బోర్డుల్లోని 200 ఖాళీలపై దృష్టి సారించింది. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి డిపార్ట్మెంట్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీఓపీటీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగాలతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరస్పరం చర్చలు జరుపుతుంది.ఇదీ చదవండి: వినియోగ సంక్షోభానికి కారణాలు.. బడ్జెట్పై ఆశలుఖాళీల సమస్యను పరిష్కరించడానికి అధికారులు అనేక చర్యలను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించి పోస్టులను భర్తీ చేసేలా చూడాలనే ప్రతిపాదనలున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్లలో కనీసం మూడింట ఒక వంతు మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. నిర్ణీత పరిమాణానికి మించి అన్ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలకు కనీసం ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవసరం. వీరు కార్పొరేట్ గవర్నెన్స్ కస్టోడియన్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ ఖాళీల భర్తీకి అత్యంత ప్రాధాన్యం ఉంది. -
ప్రైవేటీకరణ మళ్లీ మొదలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు పండగే. ప్రభుత్వమంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రాథమిక సూత్రం బాబు దగ్గర పనిచేయదు. నిరంతరం ప్రైవేటు సేవలో తరించడమే ఆయన ప్రభుత్వ ప్రత్యేకత. ప్రభుత్వ రంగంలో మంచి స్థితిలో ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రకరకాల సాకులతో అనుకున్న వారికి కట్టబెట్టేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజిన ఆంధ్రప్రదేశ్కు గతంలో సీఎంగా ఉండగా కూడా చంద్రబాబు చేసిందిదే. ఇప్పుడూ అదే పనిలో నిమగ్నమయ్యారు. లాభాల్లో నడుస్తున్న ఏపీ కో–ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ ఆయిల్ఫెడ్)ను, దేశంలోనే అతి పెద్దదైన పులివెందులలో స్టేట్ సెంట్రల్ లేబోరేటరీని ప్రైవేటీకరణ పేరుతో తాబేదార్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండూ రాష్ట్రంలో రైతులు, పాడి పరిశ్రమకు సేవలందిస్తున్నవే కావడం గమనార్హం. పొరుగున ఉన్న తెలంగాణలో రెండు ఆయిల్ఫెడ్ యూనిట్ల ఉండగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క యూనిట్ను ప్రైవేటుపరం చేస్తోంది. ఏదైనా ప్రభుత్వ సంస్థను ఎంత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, వాటి విస్తరణ ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడంలేదని రైతులు, పాడి పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి.నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్రఏపీ ఆయిల్ఫెడ్ 1980లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో 1992లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ 2019–23 మధ్య రికార్డు స్థాయిలో 1.25 లక్షల టన్నుల పామాయిల్ను ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్ఎఫ్బీ (తాజా గెలల) ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు రూ.3,500 చొప్పున లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం రూ.168 కోట్ల లాభాల్లో ఉంది. దీని ద్వారా 2.50 లక్షల మంది ఆయిల్పామ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో రూ.230 కోట్లతో అత్యాధునిక ఆయిల్పామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆయిల్ఫెడ్పై ప్రైవేటు సంస్థల కన్ను పడింది. ఈ ప్లాంట్ను చేజిక్కించుకుందుకు త్రిబుల్ ఎఫ్, గోద్రెజ్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తుండగా.. టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనిట్ ఆధునికీకరణకు నిధులు లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ఆధునికీకరణ, కొత్త యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, దీనికి జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పద్ధతిలో ఈ యూనిట్ను ప్రైవేటుకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పేయడంతో రైతులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయిల్ఫెడ్ పరిధిలోని కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని ఆయిల్పామ్ రైతులు మండలాలు, గ్రామాల వారీగా సమావేశమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేటుపరం చేస్తే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిర్వహణ భారం పేరుతో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ ప్రైవేటీకరణ!పులివెందులలోని ప్రతిష్టాత్మకమైన ఏపీ స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ నిర్వహణ భారమైందన్న పేరుతో (పీ–4) మోడ్లో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్లో పాలు, పాల ఉత్పతుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచి నీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని గుర్తిస్తారు. గతంలో వీటి పరీక్షలకు శాంపిల్స్ను కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్యాబ్లకు పంపాల్సి వచ్చేది. దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్కు రూ.2,500 నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక లేబొరేటరీని నిర్మించాలని సంకల్పించింది. పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్స్టాక్ (ఏపీ కార్ల్) ప్రాంగణంలో రూ.11 కోట్లతో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీని నిర్మించింది. గతేడాది నవంబర్లో దీనిని ప్రారంభించారు.రూ.8 కోట్లతో అత్యాధునిక పరికరాలుదేశ, విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలను ఈ ల్యాబ్లో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటిక్ సెల్ ఎనలైజర్, ఎఫ్టీఐఆర్ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్ ట్యాడ్రపుల్ మాస్ డిటెక్టర్తో ఎస్సీఎంఎస్, ఎఫ్ఐడీతో జీసీ ఎంఎస్, సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్ టెస్టింగ్ స్ట్రిప్, మఫిల్ ఫర్నేస్, ఆటో క్లాప్, డబుల్ డిస్టిలేషన్ యూనిట్, గెర్బర్ సెంట్రిప్యూజ్, కల్తీ పరీక్షల కిట్ వంటి అత్యాధునిక పరికరాలున్నాయి. వీటి కోసమే రూ.8 కోట్లు ఖర్చు చేశారు. వీటి ద్వారా వందకుపైగా పరీక్షలు చేసేందుకు నిష్ణాతులైన 15 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్ ఎనలిస్ట్లు ఉన్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఎబీఎల్) ధృవీకరణ కోసం దరఖాస్తు కూడా చేశారు. ఇంత అత్యాధునిక లేబొరేటరీని ప్రైవేటు సంస్థల పరం చేయడం పట్ల పాడి పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ల్యాబ్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే శాంపిల్స్ పరీక్షలకు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారని, ఇది తమకు భారంగా మారుతుందని పాడి రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.ఆయిల్ఫెడ్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాంఆయిల్ఫెడ్ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తే ఆయిల్పామ్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఓఈఆర్ ధరలో రైతులకు న్యాయం జరగదు. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటాం. సుదీర్ఘ చరిత్ర కల్గిన ఆయిల్ఫెడ్ను ప్రైవేటీకరించాలన్న ఆలోచన విరమించుకొని, బలోపేతం చేయాలి. – అనుమోలు గాంధీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ కిసాన్ సంఘ్అమ్మేసుకోవడం సరికాదుఆయిల్ఫెడ్ను ప్రైవేటీకరిస్తే 2.5 లక్షల మంది రైతులు భవిష్యత్తు అంధకారమవుతుంది. లాభాల్లో ఉన్న ఈ యూనిట్ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలి. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఉన్న యూనిట్ను అమ్మేసుకోవడం సరికాదు. – కె.క్రాంత్కుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్పామ్ రైతుల సంఘం -
ఎన్టీపీసీ రూ. 2.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది. లడఖ్లోని చుషుల్లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది. -
ఎల్ఐసీ రూ. 2,441 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,441 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చెక్ అందుకున్నారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెక్రటరీ వివేక్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆస్తుల మానిటైజేషన్ డీలా.. టార్గెట్లో రూ.25 లక్షల కోట్ల లోటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లను అందుకోలేకపోవచ్చని తెలుస్తోంది. దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వివరాల ప్రకారం రూ. 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోనున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్రౌన్ఫీల్డ్(పాత) మౌలిక సదుపాయాల ఆస్తుల అంచనా విలువ రూ. 6 లక్షల కోట్లు. 2022–2025 మధ్య కాలంలో మానిటైజేషన్కు వీలున్న ఆస్తుల అంచనాలివి. కాగా.. ఈ ఏడాది ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 1.5 లక్షల కోట్లు సమీకరించగలమని తాజా ఇంటర్వ్యూలో పాండే తెలియజేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లు, మైనింగ్, రహదారులు, విద్యుత్ రంగంలో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(టీవోటీ) ద్వారా మానిటైజేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలియం రంగంలోనూ ఇకపై మానిటైజేషన్కు తెరతీయనున్నట్లు వెల్లడించారు. ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ బడ్జెట్లో ప్రతిబింబించదని, జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్హెచ్ఏఐ) దీనిని నిర్వహిస్తుందని వివరించారు. ఈ నిధులు ప్రభుత్వానికి చేరుతాయని, తద్వారా ఇవి బడ్జెట్లో ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. అయితే చాలా కేసులలో నిధులు సంస్థలకే చెందుతాయని, ప్రభుత్వానికి కాదని తెలియజేశారు. కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో ప్రయివేట్ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వీలుగా ఆస్తుల మానిటైజేషన్ను చేపడుతున్నామని, ఇది ప్రభుత్వ విధానమని తెలియజేశారు. తద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధితోపాటు పట్టణ, గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని సమ్మిళితం చేయవచ్చని వివరించారు. వ్యూహాత్మక వాటాల విక్రయంపై దృష్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్ తదితర సంస్థల ప్రైవేటీకరణను పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరే ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో కొత్తగా వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని పరిశీలించకపోవచ్చని స్పష్టం చేశారు. కాకపోతే లిస్టెడ్ ప్రభుత్వరంగ సంస్థల సబ్సిడరీల వాటాల విక్రయం ఉండొచ్చని సంకేతం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్లు, బీమా సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ గత మూడేళ్ల కాలంలో 500 శాతం పెరిగి రూ.58 లక్షల కోట్లకు చేరినట్టు పాండే చెప్పారు. భారత ప్రభుత్వం వాటాల విలువ 4 రెట్లు పెరిగి రూ.38 లక్షలకు చేరుకున్నట్టు తెలిపారు. బలమైన పనితీరు, వృద్ధి అవకాశాలు, మూలధన వ్యయాల పునర్నిర్మాణం, స్థిరమైన డివిడెండ్ పంపిణీ విధానం వల్ల ప్రభుత్వరంగ సంస్థల విలువ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ స్టీల్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదనలు అమలు దశలో ఉండడం గమనార్హం. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇవి పూర్తి కావాల్సి ఉండగా, పలు అవాంతరాలతో జాప్యం నెలకొన్నట్టు చెప్పారు. ఇక హిందుస్థాన్ జింక్లో కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. దీని విక్రయంపై పాండేకు ప్రశ్న ఎదురైంది. విడతల వారీగా వాటా విక్రయించాలన్న తమ ప్రతిపాదనకు హిందుస్థాన్ జింక్ యాజమాన్యం డీమెర్జర్ ప్రణాళికలతో అనిశ్చితి ఏర్పడినట్టు చెప్పారు. హిందుస్థాన్ జింక్ను మూడు వేర్వేరు కంపెనీలుగా డీమెర్జర్ చేసేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. -
ఆర్బీఐ, బ్యాంకింగ్ నుంచి డివిడెండ్ల ధమాకా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్ సవరిత అంచనా. ఆర్బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడంతో డివిడెండ్ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. -
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, డి. శ్రీధర్బాబు, ఫిరోజ్ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్తో తమ పోర్ట్ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
ఐఆర్ఎఫ్సీ నుంచి ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్(ఐఆర్ఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనుంది. కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) నిబంధన అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో 11శాతానికిపైగా వాటాను విక్రయించే వీలున్నట్లు అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం రైల్వే రంగ ఫైనాన్సింగ్ కంపెనీలో ప్రభుత్వం 86.36 శాతం వాటా ను కలిగి ఉంది. దీపమ్, రైల్వే శాఖల సీనియర్ అధికారులతో ఏర్పాటైన అంతర్మంత్రివర్గ గ్రూప్ ఎంతమేర వాటా విక్రయించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ ఎంపీఎస్ నిబంధనలో భాగంగా ప్రభుత్వం 11.36 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 2021 జనవరిలో లిస్టయిన కంపెనీ ఐదేళ్లలోపు ఎంపీఎస్ను అమలు చేయవలసి ఉంది. అయితే వాటా విక్రయ అంశంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఈలో ఐఆర్ఎఫ్ఎస్ షేరు దాదాపు రూ. 51 వద్ద కదులుతోంది. ఈ ధరలో 11.36 శాతం వాటాకుగాను ప్రభుత్వం రూ. 7,600 కోట్లు అందుకునే వీలుంది. కాగా.. ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించనుండగా.. మరికొంత తాజాగా జారీ చేయనున్నట్లు అంచనా. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో ఐఆర్ఎఫ్సీ షేరు బీఎస్ఈలో తొలుత రూ. 52.7 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 0.6 శాతం బలపడి రూ. 51.2 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ షేరు 38 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
పెట్రోల్, డీజిల్పై మెరుగుపడిన మార్జిన్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు. గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు. కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్పై లీటరుకు రూ. 17.4, డీజిల్పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్పై మార్జిన్ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్పై మార్జిన్ రూ. 0.50కి మెరుగుపడింది. -
చాలా కాలం తర్వాత ఎఫ్డీలకు కళ!
ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్ నెలకొంది. రుణ డిమాండ్ను అందుకునేందుకు బ్యాంక్లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి. రుణాలకు డిమాండ్.. జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్ చేయకపోవడాన్ని గమనించొచ్చు. బ్యాంకుల వారీ రేట్లు.. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 400 రోజుల డిపాజిట్పై 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల డిపాజిట్పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 800 రోజుల డిపాజిట్పై 7.30 శాతం, పీఎన్బీ 666 రోజుల డిపాజిట్పై 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులు డిపాజిట్పై ఇంతే మేర ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్పై 7.15 శాతం, యూకో బ్యాంక్ 666 రోజుల డిపాజిట్పై 7.15 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
ఎస్జేవీఎన్ భారీ పవన విద్యుత్ ప్రాజెక్టు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎస్జేవీఎన్ (గతంలో సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్) రూ. 700 కోట్ల భారీ పెట్టుబడితో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ–రివర్స్ వేలం ప్రక్రియ ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుండి ఈ ప్రాజెక్ట్ను దక్కించుకున్నట్లు ఎస్జేవీఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్మాణానికి సంబంధించి యూనిట్కు రూ.2.90 (టారిఫ్), అలాగే స్వయం నిర్వహణ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పొందినట్లు పేర్కొంది. తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎస్జీఈఎల్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్ట్ను చేపట్టి, అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎల్ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసీ వేల్యుయేషన్ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25 శాతం డ్రాపవుట్..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 16 శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్లో రూ.2,480 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ అక్టోబర్లో రూ.2,870 కోట్లకు చేరుకున్నాయి. పన్ను ఎగవేతదారులను గుర్తించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం పన్ను ఆదాయం పెరగడంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య 90 శాతం దాటిందన్నారు. అక్టోబర్లో వసూలైన రూ.2,870 కోట్లు రాష్ట్రంలో జరిగిన లావాదేవీలపై వచ్చిన జీఎస్టీ ఆదాయమని, ఇందులో ఎస్జీఎస్టీ మినహాయింపులు తీసేస్తే ఆ మేరకు రాష్ట్రానికి వచ్చే నికర జీఎస్టీ ఆదాయం తగ్గుతుందని వాణిజ్యపన్నుల అధికారులు వివరించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రధమం. -
టాటా గూటికి మహారాజా!!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దశాబ్దాల క్రితం తాను నెలకొల్పిన విమానయాన సంస్థను తిరిగి దక్కించుకోవడానికి చేరువలో ఉంది. రుణభారంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్గా టాటా గ్రూప్ నిలి్చనట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (ఏఐఎస్ఏఎం) ఈ బిడ్పై ఆమోదముద్ర వేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, టాటా గ్రూప్ దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం బుధవారం పరిశీలించిందని వారు వివరించారు. నిర్దేశించిన రిజర్వ్ ధరతో పోల్చి చూసినప్పుడు టాటా గ్రూప్ అత్యధికంగా కోట్ చేసిన సంస్థగా నిలి్చందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రతిపాదనను ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఇటు ఆర్థిక శాఖ అటు టాటా సన్స్ దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఐఎస్ఏఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మరోవైపు, ఎయిరిండియా ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించేసిందంటూ వచి్చన వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తోసిపుచ్చారు. ‘ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్ అంశంలో ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు సరి కావు. ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీడియాకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు. టాటా గ్రూప్నకు ఇప్పటికే ఎయిర్ఏíÙయా ఇండియాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఇక, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తారా అనే జాయింట్ వెంచర్ నిర్వహిస్తోంది. 2017 నుంచి అమ్మకానికి ప్రయత్నాలు.. ఇండియన్ ఎయిర్లైన్స్ను విలీనం చేసుకున్నాక 2007 నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 2020 జనవరిలో దీపం జారీ చేసిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇందులో దాదాపు రూ. 23,286.5 కోట్ల భారాన్ని కొత్త ఇన్వెస్టరు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతాది ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్) పేరిట ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్కి బదలాయిస్తారు. బిడ్డింగ్లో గెలుపొందిన సంస్థకు దేశీ ఎయిర్పోర్టుల్లో 4,400 దేశీ, 1,800 అంతర్జాతీయ సర్వీసుల విమానాల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. అలాగే విదేశీ ఎయిర్పోర్టుల్లో 900 పైచిలుకు స్లాట్లు దక్కుతాయి. అలాగే చౌక విమాన సేవల సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలు లభిస్తాయి. 1932లో మహారాజా ప్రస్థానం ప్రారంభం... మహారాజా మస్కట్తో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్లైన్స్ గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సరీ్వసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. సం స్థ ప్రకటనల్లో అప్పటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులు దర్శనమిచ్చేవారు. విమానంలో ప్రయాణించే వారికి ఖరీ దైన షాంపేన్, ప్రసిద్ధ చిత్రకారుడు శాల్వడోర్ డాలీ గీసిన చిత్రాలతో రూపొందించిన పోర్సెలీన్ యాష్ట్రేలు వంటి విలాసాలు అందుబాటులో ఉండేవి. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సరీ్వసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. -
ఎగుమతులకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. ఎగుమతుల రంగం పురోగతికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందని, ఇందులో సెప్టెంబర్ ముగింపునకు 190 బిలియన్ డాలర్లకు చేరువవుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎగుమతుల పురోగతికి ఈసీజీసీ తమ సామర్థ్యాన్ని మరింత పటిష్ట చేసుకోడానికి దోహదపడుతుందని వివరించారు. తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈసీజీసీ లిస్టింగ్ ప్రక్రియను కేంద్రం త్వరలో ప్రారంభిస్తుందని, వచ్చే ఏడాది ఆఫర్ మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు. ఎన్ఈఐఏ స్కీమ్ కొనసాగింపు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్ఈఐఏ) స్కీమ్ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.ఈ చర్య ద్వారా సంఘటిత రంగంలో దాదాపు 12,000సహా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని మంత్రి వివరించారు. 2022 మార్చి వరకు ఈసీఎల్జీఎస్ స్కీమ్ చిన్న సంస్థలకు మరింత చేయూత కోసమే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయంచింది. 2020లో తీసుకొచి్చన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెపె్టంబర్ 30తో ముగిసిపోవాలి. కానీ, 2020 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల మండళ్లు, ఇతర భాగస్వాముల నుంచి డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ‘‘కరోనా రెండో విడత వల్ల ప్రభావితమైన పలు వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు 2020 మార్చి 31 వరకు ఈసీఎల్జీఎస్ పథకం గడువును పొడిగించాలని నిర్ణయించడమైనది. లేదా రూ.4.5 లక్షల కోట్ల రుణాల మంజూరు లక్ష్యం పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ పథకం కింద రుణాల విడుదలకు చివరి తేదీగా 2020 జూన్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు.. అదనంగా మరో 10% (మిగిలిన రుణంలో) లభిస్తుందని పేర్కొంది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటి వరకు సాయం పొందని సంస్థలు.. 30 శాతాన్ని (తమ రుణ బకాయిల మొత్తంలో) తాజా రుణం కింద తీసుకోవచ్చని సూచించింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద ప్రకటించిన రంగా ల్లోని కంపెనీలకు ఇది 40%గా అమలు కానుంది. -
పెట్రోల్కు డిమాండ్
న్యూఢిల్లీ: ఇంధనాల వినియోగం ఆగస్టులో మిశ్రమంగా నమోదైంది. కోవిడ్–19 పరిస్థితులతో ప్రజలు వ్యక్తిగత రవాణా సాధనాలకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో నెలవారీగాను పెట్రోల్కు డిమాండ్ కొనసాగగా, డీజిల్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థల ప్రాథమిక గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఆగస్టులో 2.43 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయించాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 13.6 శాతం అధికం. 2019 ఆగస్టు (కోవిడ్కి పూర్వం) అమ్మకాలు 2.33 మిలియన్ టన్నులు. మరోవైపు, దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు జులైతో పోలిస్తే ఆగస్టులో 9.3 శాతం తగ్గాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 15.9 శాతం పెరిగి 4.94 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2019 ఆగస్టుతో పోలిస్తే 9.8 శాతం క్షీణించాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోల్చినప్పుడు గత నెల డీజిల్ వినియోగం 8 శాతం తగ్గింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ విజృంభించడానికి ముందు మార్చిలో ఇంధనాల వినియోగం దాదాపు సాధారణ స్థాయికి తిరిగి వచ్చింది. కానీ ఇంతలోనే సెకండ్ వేవ్ రావడంతో ప్రతికూల ప్రభావం పడి మే నెలలో పడిపోయింది. కరోనా కట్టడి కోసం అమలవుతున్న ఆంక్షలను సడలిస్తుండటంతో ఆ తర్వాత నెలల్లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. ప్రభుత్వ రవాణా సాధనాలకు బదులుగా వ్యక్తిగత వాహనాలకు ప్రజలు ప్రాధాన్యమిస్తుండటంతో జులైలోనూ పెట్రోల్ వినియోగం పెరిగింది. మరోవైపు, తాజాగా ఆగస్టులో వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1.85 శాతం వృద్ధి చెంది 2.33 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. విమానయాన సర్వీసులు క్రమంగా పెరిగే కొద్దీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 42 శాతం పెరిగి 3,50,000 టన్నులకు చేరాయి. -
ఎల్ఐసీలోకి విదేశీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు కూడా పాలుపంచుకునేందుకు అవకాశం లభించనుంది. దీనిపై గత కొద్ది వారాలుగా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ శాఖలు కూడా చర్చించాక, క్యాబినెట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుందని వివరించాయి. ప్రస్తుత ఎఫ్డీఐ విధానం ప్రకారం బీమా రంగ సంస్థల్లో ఆటోమేటిక్ విధానంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే, ప్రత్యేకంగా చట్టం ద్వారా ఏర్పాటైన ఎల్ఐసీకి మాత్రం ఇది వర్తించదు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లను కూడా అనుమతించాలంటే సెబీ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. -
నామినేటెడ్ పోస్టులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్ తర్వాతగానీ నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్ఐఐసీ, స్పోర్ట్స్ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్కు చెందిన బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. భారీగానే ఆశావహులు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్ఎస్లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్ఎస్లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. ఈ పదవులన్నీ ఖాళీయే.. పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. -
ఆ విద్యుత్ ఏమైపోతోంది?
సంస్కరణలు అమలు చేస్తేనే.. విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణలతో దేశవ్యాప్తంగా డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3.03 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని (ఆత్మనిర్భర్–2 కింద) ప్యాకేజీని ప్రకటించింది. వ్యవసాయం మినహా మిగతా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగించడం, వ్యవసాయ ఫీడర్లను విభజించడం, ఫీడర్లు–డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడం, ప్రతి పట్టణంలో స్కాడా సెంటర్ ఏర్పాటు చేయడం, కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్/ఏఐ) వినియోగం వంటి సంస్కరణలను ప్రతిపాదించింది. వీటిని అమలు చేస్తే డిస్కంలు ‘ఏటీ–సీ’నష్టాలను సమూలంగా నిర్మూలించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఏటేటా పెరుగుతున్న నష్టాలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిపాలన, నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్న డిస్కంలు గట్టెక్కేదెలాగనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో గుర్తించడం, సాంకేతిక–వాణిజ్యపర లోపాలతో ఏర్పడే ‘ఏటీ–సీ’నష్టాలను నియంత్రించడం, వినియోగదారులకు ఇచ్చే రాయతీలకు తగ్గట్టు ప్రభుత్వ సబ్సిడీలను పెంచడం, అధిక ధర విద్యుత్ కొనుగోళ్లను వదులుకోవడం, దుబారా ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలు చేపడితేనే.. డిస్కంలు మెరుగుపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలు తోడ్పతాయని చెప్తున్నారు. ఏటా వేల కోట్ల నష్టాలు.. డిస్కంలు ఏటా భారీ విద్యుత్ నష్టంతో వేల కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లు 2019–20 ఉమ్మడిగా రూ.6,061 కోట్ల వార్షిక నష్టాలను ప్రకటించగా.. అందులో నియంత్రించదగిన ‘సాంకేతిక, వాణిజ్య(అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్/ఏటీ–సీ)’నష్టాలే రూ.3,837.65 కోట్ల మేర ఉండటం గమనార్హం. ఆ ఏడాది రెండు డిస్కంలు కలిపి విద్యుత్ ప్లాంట్ల నుంచి 65,751.1 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ను కొనుగోలు చేయగా.. వినియోగదారులకు సరఫరా చేసినట్టు లెక్క తేలినది 59,631.68 ఎంయూలు మాత్రమే. మిగతా 6,119.42 ఎంయూల విద్యుత్ ఏమైందో తెలియదు. డిస్కంలు దానిని సాంకేతిక, వాణిజ్య నష్టాల కింద లెక్కలు చూపాయి. ►ఎస్పీడీసీఎల్ రూ.24,907.26 కోట్ల వ్యయంతో 45,247.02 ఎంయూ విద్యుత్ కొనుగోలు చేయగా.. సరఫరా లెక్కలు 40,981.27 ఎంయూలకే ఉన్నాయి. మిగతా 4,265.75 ఎంయూల విద్యుత్ ఏమైంది, ఎలా నష్టపోయిందన్న లెక్కలు తెలియవు. సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.5.5 ఖర్చు చేయగా.. వినియోగదారులకు అమ్మినది రూ.6 చొప్పున. అయినా రూ.2,560.68 కోట్లు నష్టపోయింది. ►ఎన్పీడీసీఎల్ రూ.11,326.08 కోట్లతో 20,504.08 ఎంయూ విద్యుత్ కొన్నది. 18,650.41 ఎంయూల సరఫరా లెక్కలతో రూ.12,848.57 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్కో యూనిట్ కొనుగోలుకు సగటున రూ.5.52 పైసలు ఖర్చుచేయగా.. వినియోగదారులకు విక్రయించినది రూ.6.88. అంటే గణనీయంగా ఆదాయం రావాలి. కానీ 1,853.67 ఎంయూల విద్యుత్ లెక్కలు తెలియక.. రూ.1,276.97 కోట్ల ఆదాయానికి గండిపడింది. వాస్తవ నష్టాలు ఇంకా ఎక్కువే! వ్యవసాయం మినహా మిగతా అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ మీటర్లు ఉన్నాయి. దీంతో వ్యవసాయ వినియోగం అంచనాలను పెంచడం ద్వారా నష్టాలను తగ్గించి చూపిస్తున్నారన్న ఆరోపణలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. వాస్తవానికి డిస్కంల నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు 2019–20లో ఎన్పీడీసీఎల్ 11,510.14 ఎంయూ విద్యుత్ను మీటర్లు గల వినియోగదారులకు విక్రయించగా, మరో 7,140.27 ఎంయూ విద్యుత్ను వ్యవసాయానికి సరఫరా చేసినట్టు అంచనా వేసింది. మరో 1,853.66 ఎంయూ నష్టపోయినట్టు చూపింది. అంటే మూడో వంతుకుపైగా విద్యుత్ను వ్యవసాయానికే వినియోగించినట్టు పేర్కొంది. ఎక్కడికక్కడ నష్టాలు తెలుసుకోవచ్చు దేశవ్యాప్తంగా తొలివిడత కింద 2023 డిసెంబర్ నాటికి 10 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఫీడర్లు, డిస్ట్రిబ్యుషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిల్లో ‘కమ్యూనికేబుల్ ఏఎంఐ మీటర్ల’ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీటిద్వారా ఏయే ప్రాంతాల్లో, ఏ కారణాలతో విద్యుత్ నష్టాలు వస్తున్నాయో గుర్తించవచ్చు. సాంకేతిక లోపాలతో నష్టం వచ్చినా, చౌర్యం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఆయా ప్రాంతాల్లో బాధ్యులైన అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ‘సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా)’కేంద్రం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరాను దీని ద్వారా సమీక్షిస్తుంటారు. ఇకపై అన్ని పట్టణాల్లో స్కాడా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్ సరఫరా ఫీడర్లను వేరుచేసి, మీటర్లు ఏర్పాటు చేస్తే.. వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు బయటపడతాయి. ఇతర నష్టాలను వ్యవసాయ ఖాతాలో వేయడానికి అవకాశం ఉండదు. రూ.9,020 కోట్లు నష్టాలు: నీతి ఆయోగ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2018–19 నాటికి రూ.9,020 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని విద్యుత్ పంపిణీ రంగం– సంస్కరణలపై తాజాగా ప్రచురించిన అధ్యయన నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ వచ్చాక 2014–15లో రూ.2,912 కోట్లుగా ఉన్న నష్టాలు ఏటా పెరుగుతూ ఐదేళ్లలో మూడింతలైనట్టు తెలిపింది. నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాలివీ.. -
క్యూ1లో గెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 500 శాతం దూసుకెళ్లి రూ. 1,530 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ1లో దాదాపు రూ. 256 కోట్లు మాత్రమే ఆర్జించింది. కోవిడ్–19 కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు కారణంగా గత క్యూ1లో కార్యకలాపాలకు విఘాతం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. అయితే తాజా క్వార్టర్లోనూ మహమ్మారి సెకండ్ వేవ్ తలెత్తినప్పటికీ తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని తెలియజేసింది. మొత్తం ఆదాయం సైతం 44 శాతం జంప్చేసి రూ. 17,387 కోట్లను తాకింది. లాభాల తీరిలా సొంత పైప్లైన్ల ద్వారా గ్యాస్ రవాణా పెరగడంతో ఈ విభాగం నుంచి లాభదాయకత 27 శాతం పుంజుకుని రూ. 915 కోట్లకు చేరినట్లు వివరించింది. కాగా.. గ్యాస్పై మార్జిన్లు బలపడటంతో రూ. 378 కోట్లు ఆర్జించింది. గత క్యూ1లో రూ. 545 కోట్లకుపైగా నష్టాలు వాటిల్లాయి. ఇక పెట్రోకెమికల్ బిజినెస్ సైతం రూ. 138 కోట్ల లాభం సాధించగా.. గతంలో రూ. 154 కోట్ల నష్టం నమోదైంది. భాగస్వామ్య సంస్థలతో కలసి 8,000 కిలోమీటర్ల పైప్లైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 38,000 కోట్లవరకూ వెచ్చిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉసార్లో పీడీహెచ్పీపీ యూనిట్ ద్వారా పాలీప్రొపిలీన్ సామర్థ్యాన్ని 5,00,000 టన్నులమేర విస్తరిస్తోంది. ఇదేవిధంగా యూపీలోని పాటాలో 60,000 పీపీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 10,000 కోట్ల పె ట్టుబడులను కేటాయించింది. మొత్తం పెట్టుబడు ల్లో ఈ ఏడాది రూ. 6,600 కోట్లు సమకూర్చనుంది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 143 వద్ద ముగిసింది. -
సాధారణ బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: సాధారణ బీమా వ్యాపారం (జాతీయీకరణ) సవరణ బిల్లు, 2021కి లోక్సభ మంగళవారం ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం వేసింది. పెగాసస్, ఇతర సమస్యలపై సభ్యుల ఆందోళనల నడుమ ఈ బిల్లును సభలో ఆమోదం నిమిత్తం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో కేంద్రం తన వాటాల విక్రయానికి మార్గం సుగమం చేయడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రైవేటుపరం కానుంది. అయితే ఈ పేరును ఇంకా కేంద్రం ఖరారు చేయలేదు. ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ గత వారమే ఆమోదముద్ర వేసింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. ఇక రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సవరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. -
‘ఆటో’ అవకాశాలను అందిపుచ్చుకునేలా..
సాక్షి, హైదరాబాద్: వాహన తయారీ రంగంలో గతంలో ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం పలు ప్రైవేటు వాహన తయారీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ, మరమ్మతు, అనుబంధ రంగాల కోసం మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పాలసీనీ రూపొందించింది. ఆటోమోటివ్ రంగంలో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల ఆటోనగర్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆటో పార్కులు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా బూచినెల్లి, మెదక్ జిల్లా కాళ్లకల్ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే ఏర్పాటైన ఆటో పార్కులను విస్తరించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆటో పార్కులు.. ఆటో క్లస్టర్లు కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం (కుందనపల్లి)లో కొత్తగా ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు భువనగిరి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మడికొం డ, శాయంపేట, సంగెంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా బూచినెల్లిలోనూ ఆటోమోటివ్ అనుబంధ పరిశ్రమల కోసం ఆటోపార్కును ఏర్పాటు చేశారు. మహీంద్ర పరిశ్రమకు అవసరమైన విడి భాగాలు తయారు చేసే పరిశ్రమలు బూచినెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాహన వినియోగదారులకు వాహన డీలర్లను చేరువ చేసేందుకు ‘నయాగాడీ’ అనే ఐటీ ఆధారిత స్టార్టప్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్లు, మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ వాహ నాల విడి భాగాలు, బ్యాటరీల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు ►రూ. 2,100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్ చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆల్టో, వేగనార్ కార్లలో ఈవీ కిట్లను (రెట్రోఫిట్టెడ్) అమర్చేందుకు రాష్ట్రానికి చెందిన ‘ఈ ట్రియో’అనే స్టార్టప్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అనుమతులు సాధించింది. రెట్రోఫిట్టెడ్ ఎలక్ట్రిక్ కార్లు గేర్లు అవసరం లేకుండా సింగిల్ చార్జితో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ►టచ్ స్క్రీన్ యూనిట్లు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు వంటి డిజిటల్ సాంకేతికతో కూడిన నెక్సా షోరూమ్లను మారుతి సుజుకి రాష్ట్రంలో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఈటీఓ మోటార్స్, హాంకాంగ్కు చెందిన క్యోటో గ్రీన్ టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యూనిట్ను ఏర్పాటు చేస్తాయి. ►వ్యవసాయ యంత్ర పరికరాల రంగంలో పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాద్లోని తమ యూనిట్లో ‘కె2’ట్రాక్టర్లను తయారు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ‘కె2’ప్రాజెక్టు ద్వారా అదనంగా రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు 2024 నాటికి ఉద్యోగ అవకాశాలు రెండింతలు అయ్యే అవకాశముంది. -
ప్రైవేటీకరణ దిశగా కేంద్రం జోరు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాటలో కేంద్రం తన స్పీడ్ పెంచింది. ఈ దిశలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) కేంద్రం గురువారం అనుమతినిచ్చింది. దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. ఇక ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ బుధవారమే ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆయిల్, గ్యాస్ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్ రెండవ అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది. ‘‘ఆయిల్, సహజ వాయువు రంగాలకు సంబంధించి ఎఫ్డీఐ విధానానికి కొత్త క్లాజ్ను జోడించడం జరిగింది. దీని ప్రకారం, వ్యూహాత్మక విక్రయాలకు సూత్రప్రాయ ఆమోదం పొందిన సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్లో (కఠిన ఆమోదాలు అవసరం లేని) అనుమతించడం జరుగుతుంది’’ అని డీపీఐఐటీ (పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ) ఒక నోట్లో పేర్కొంది. విదేశీ కంపెనీల ఆసక్తి.. బీపీసీఎల్లో ప్రభుత్వ పూర్తి వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసిన 3 కంపెనీల్లో రెండు విదేశీ కంపెనీలే. ప్రభుత్వం నుంచి 52.98% వాటాను కొనుగోలు చేసే సంస్థ, టేకోవర్ నిబంధనల ప్రకారం ఇతర వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వవచ్చు. బీపీసీఎల్ కొనుగోలు రేసులో వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్వేర్డ్ క్యాపిటల్స్ అనుబంధ విభాగం థింక్ గ్యాస్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకూ 49 శాతమే! 2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్ చేస్తున్న చమురు రిఫైనర్లో ఎఫ్డీఐ పరిమితి 26% నుంచి 49%కి పెరిగింది. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే, ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా! ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. చిన్న విమానాశ్రయాలు షురూ..! దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్సభ గురువారం ఆమోదముద్ర వేసింది. పెగాసస్, రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చా లేకుండా పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
సౌదీ చమురు పెత్తనానికి చెక్!
న్యూఢిల్లీ: చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్ చెప్పే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్రూడాయిల్ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వ రంగ రిఫైనరీలను ఆదేశించింది. నిబంధనలు తమకు అనుకూలంగా ఉండే విధంగా చర్చలు జరపాలని ప్రభుత్వం సూచించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మధ్యప్రాచ్య ప్రాంతం కాకుండా ఇతరత్రా దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లు జరిపే అవకాశాలను అన్వేషించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)కి కేంద్రం సూచించినట్లు వివరించారు. ఉమ్మడిగా బేరసారాలు జరపడం ద్వారా భారత్కు ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు ధరలు ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పడు.. నియంత్రణలను సడలించుకుని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీ అరేబియాను భారత్ కోరింది. అయితే, దీన్ని సౌదీ పట్టించుకోలేదు. పైగా రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న చమురును వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీనితో చమురు అవసరాల కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన భారత్.. ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలుపెట్టింది. ఎగుమతి దేశాల కుమ్మక్కు.. సింహభాగం చమురు అవసరాల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. 85% పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది. ‘సాధారణంగా సౌదీ అరేబియా, చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) నుంచే భారత్ ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతోంది. అయితే, వాటి నిబంధనలు కొనుగోలుదార్లకు ప్రతికూలంగా ఉంటున్నాయి‘ అని అధికారి వివరించారు. భారతీయ కంపెనీలు మూడింట రెండొంతుల కొనుగోళ్లు స్థిరమైన వార్షిక కాంట్రాక్టుల ఆధారంగా జరుపుతుంటాయి. వీటి వల్ల సరఫరాకు కచ్చితమైన హామీ ఉంటున్నప్పటికీ, ధరలు.. ఇతరత్రా నిబంధనలు మాత్రం సరఫరాదారు దేశాలకే అనుకూలంగా ఉంటున్నాయి. ‘కాంట్రాక్టులో కుదుర్చుకున్న మొత్తం పరిమాణాన్ని కొనుగోలుదారులు కొనాల్సిందే. అయితే, ఒపెక్ కూటమి గానీ రేట్లను పెంచుకునేందుకు ఉత్పత్తి తగ్గించుకోవాలనుకుంటే ఆ మేరకు సరఫరాలను తగ్గించేసేలా సౌదీ సహా ఇతర ఉత్పత్తి దేశాలకు అనుకూలంగా నిబంధనలు ఉంటున్నాయి. ఒపెక్ నిర్ణయాలకు వినియోగదారులెందుకు మూల్యం చెల్లించాలి? ఇంత పరిమాణం కొనుక్కుంటా మంటూ కుదుర్చుకున్న ఒప్పందానికి కొనుగోలుదారులు ఎలా కట్టుబడి ఉంటున్నారో.. సరఫరాపై ఉత్పత్తి దేశాలు కూడా కాంట్రాక్టుకు కట్టుబడి ఉండాలి కదా‘ అని అధికారి వ్యాఖ్యానించారు. సరఫరా మాత్రమే కాకుండా రేట్ల విషయంలోనూ ఆ దేశాలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వార్షిక టర్మ్ కాంట్రాక్టుకు మించి చమురు కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలుదారులు కనీసం 6 వారాల ముందుగా తెలియజేయాల్సి ఉంటోందని, ఉత్పత్తి దేశం ప్రకటించిన సగటు అధికారిక రేటునే చెల్లించాల్సివస్తోందని వివరించారు. ‘సాధారణంగా లోడింగ్ జరిగిన రోజున ఏ రేటు ఉందో అదే ధరను తీసుకోవాలి. తద్వారా అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు కొనుక్కుంటే కొనుగోలుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సౌదీ, ఇతర ఒపెక్ దేశాలు మాత్రం అవి నిర్దేశించే అధికారిక రేటే చెల్లించాలని పట్టుబడుతుంటాయి‘ అని అధికారి చెప్పారు. వ్యూహం ఇలా.. ప్రస్తుతం దేశీ రిఫైనింగ్ సంస్థలు ఎక్కువగా వార్షిక టర్మ్ కాంట్రాక్టుల ద్వారా చమురు కొనుగోళ్లు జరుపుతున్నాయి. కొత్త వ్యూహం ప్రకారం నెమ్మదిగా టర్మ్ కాంట్రాక్టుల వాటాను తగ్గించుకుంటూ స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోళ్లను పెంచుకునే అంశంపై దృష్టి పెట్టనున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గితే అప్పుడు భారీగా కొనుక్కునేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ధరలపరమైన వెసులుబాటుతో పాటు ఏ కారణంతోనైనా ఉత్పత్తి పడిపోయినా సరఫరా కచ్చితంగా ఉండే రకంగా కాంట్రా క్టులు ఉండాలని కోరుకుంటున్నాం‘ అని అధికారి తెలిపారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు భారత్ చమురు కొనుక్కుంటుందని పేర్కొన్నారు. ‘ఎప్పుడు కావాలి, ఎంత కావాలి (కొనుగోలు పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వెసులుబాటు) అనేది ఎప్పుడైనా నిర్ణయించుకునే హక్కుతో పాటు కచ్చితమైన సరఫరా కోసం హామీ ఉండాలని భావిస్తున్నాం‘ అని వివరించారు. దేశీ రిఫైనర్లు దశాబ్దం క్రితం మొత్తం క్రూడ్ కొనుగోళ్లలో 20% చమురును స్పాట్ మార్కెట్లో కొంటుండగా.. ప్రస్తుతం దీన్ని 30–35%కి పెంచుకున్నాయి. -
హెచ్పీసీఎల్ లాభం 157 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) నికర లాభం 157 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ. 877 కోట్లు. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడం, పరిశ్రమతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరు కనపర్చడం వల్ల కరోనా వైరస్పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు హెచ్పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా తెలిపారు. క్యూ1లో అమ్మకాలు రూ. 45,945 కోట్లకు క్షీణించినప్పటికీ నికర లాభాలు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 74,596 కోట్లు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయని, అయితే క్రమంగా ఆంక్షల సడలింపుతో మళ్లీ పుంజుకుంటున్నాయని సురానా చెప్పారు. -
బీపీసీఎల్ నష్టం రూ.1,361 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలహీనంగా ఉండటం, ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, లాక్డౌన్ కారణంగా అమ్మకాలు తగ్గడం...ఈ కారణాల వల్ల గత క్యూ4లో ఈ కంపెనీకి రూ.1,361 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ రూ.1,261 కోట్ల నికర లాభం సాధించింది. కాగా, ఆదాయం 8 శాతం తగ్గి రూ.68,991 కోట్లకు చేరిందని బీపీసీఎల్ వెల్లడించింది. n అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,703 కోట్ల నిర్వహణ లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.619 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. n గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రూ.1,081 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. n చమురు ఉత్పత్తి సీక్వెన్షియల్గా 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ 2 శాతం లాభంతో రూ.357 వద్ద ముగిసింది. -
దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 150 చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోని సంస్థల్లో సీబీఐ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, జైపూర్, జోధ్పూర్, గువాహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్పూర్, నాగ్పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో అవినీతికి ఆస్కారమున్న సంస్థల్లో సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. -
మార్కెట్లోకి ‘బిగ్బాస్’?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధా న్యం ఇస్తుండడంతో, ఎల్ఐసీ లిస్టింగ్ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఐపీవో ద్వారా స్వల్ప మొత్తంలో వాటాలను ప్రభుత్వం విక్రయించే చాన్స్ ఉందని సమాచారం. ఎల్ఐసీ తొలిదశ ఐపీవోకు అధిక ప్రీమి యం ఉంటుందని అంచనా. ఈక్విటీ చిన్నది కావడమే దీనికి కారణం. ఎల్ఐసీలో వాటాల అమ్మకం ఆరంభ దశలో ఉందని, ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాల సమాచారం. విలువ అధికం... ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. స్టాక్ ఎక్సే్ఛంజ్లో ఎల్ఐసీ గనుక లిస్ట్ అయితే మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ను దాటిపోతుందని అంచనా. రూ.5 కోట్ల ఈక్విటీ ఆధారంగా వేసిన అంచనా ఇది. లిస్ట్ చేయడం వల్ల ఖాతాలు మరింత పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, పెట్టుబడులు, రుణాల పోర్ట్ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి వస్తుంది. ఇది మరింత మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్కు దారితీస్తుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర సర్కారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలను లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే అందుకు ఎల్ఐసీ చట్టం 1956లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం... ఎల్ఐసీ పాలసీలు అన్నింటికీ వాటి సమ్ అష్యూర్డ్, బోనస్లు చెల్లించే విషయంలో ప్రభుత్వం హామీదారుగా ఉంటోంది. పెట్టుబడుల కొండ ఎల్ఐసీ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం చూస్తే... డిబెంచర్లు, బాండ్లలో రూ.4,34,959 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, ఎన్నో మౌలిక రంగ ప్రాజెక్టులకు రూ.3,76,097 కోట్లను రుణాలుగా సమకూర్చింది. అదే ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.23,621 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఈక్విటీలలో ఆ ఏడాది రూ.68,621 కోట్లు పెట్టుబడులు పెట్టింది. రూ.5 కోట్ల మూలధనంతో ఎల్ఐసీ సంస్థ ఏర్పాటు కాగా, ఐఆర్డీఏఐ నిబంధనల మేరకు బీమా సంస్థల కనీస ఈక్విటీ రూ.100 కోట్లుగా ఉండాలి. ఈక్విటీ చిన్నదే అయినప్పటికీ, ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీ నిర్వహణలో భారీ ఆస్తులు ఉన్నాయి. 2018–19లో ఎల్ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ వార్షికంగా 8.61 శాతం పెరిగి రూ.28.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.46 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేషన్ మొత్తం ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లకు చేరాయన్నది అంచనా. ‘‘అధికారికంగా ప్రకటించినా, ప్రకటించకపోయినా కానీ ఎల్ఐసీ వ్యవస్థాపరంగా చాలా ముఖ్యమైన బీమా సంస్థ. ఐఎల్అండ్ఎఫ్ఎస్ తదితర వెంచర్ల బెయిలవుట్ విషయంలో ఎల్ఐసీ పెట్టుబడులు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. మిలియన్ల పాలసీదారుల సొమ్ములు ఇవి. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి ముందు ఎల్ఐసీ చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుంది’’అని ఐఆర్డీఏఐ సభ్యుడు కేకే శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఎల్ఐసీని తన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఓ సాధనంగా వాడుకుంటున్న పరిస్థితి ఇన్వెస్టర్లకు అవగతమే. ఓఎన్జీసీ తదితర ఎఫ్పీవోలకు, ఐడీబీఐ బెయిలవుట్కు ప్రభుత్వ ఆదేశాలతో ఎల్ఐసీయే భారీగా నిధులు సమకూర్చింది. ఏటా ప్రభుత్వ సెక్యూరిటీల్లో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా ఎల్ఐసీయే. ఏటా రూ.55,000–65,000 కోట్ల మేర స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. 2018–19లో ఎల్ఐసీ నూతన పాలసీలు, రెన్యువల్ పాలసీల ప్రీమియం రూపంలో రూ.3,37,185 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. పాలసీదారులకు చెల్లించిన మొత్తం ప్రయోజనం రూ.2,50,936 కోట్లు కావడం గమనార్హం. -
ఇండియన్ బ్యాంక్కు ప్రొవిజనింగ్ దెబ్బ..
న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో.. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సగానికి తగ్గి రూ. 152 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ లాభం రూ. 303 కోట్లు. ఇక క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,903 కోట్ల నుంచి రూ. 5,269 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 6.27 శాతం నుంచి 7.46 శాతానికి ఎగిశాయి. నికర ఎన్పీఏలు కూడా 3.3 శాతం నుంచి 4.42 శాతానికి పెరిగాయి. పరిమాణంపరంగా స్థూల ఎన్పీఏలు రూ. 9,595 కోట్ల నుంచి రూ. 13,198 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ. 4,899 కోట్ల నుంచి రూ. 7,571 కోట్లకు ఎగిశాయి. ఫలితంగా మొండిబాకీలకు కేటాయింపులు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ. 385 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. -
ఎల్ఐసీ చైర్మన్గా భార్గవకు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి చైర్మన్గా ప్రస్తుత ఎండీ హేమం త్ భార్గవ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎల్ఐసీ చైర్మన్గా వీకే శర్మ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. హేమంత్ భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్ఐసీ ఎండీ బాధ్యతల్లో ఉన్నారు. చైర్మన్ పదవికి ఇంటర్వ్యూలు ఎల్ఐసీ చైర్మన్, ఎండీ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖ సెక్రటరీ బీపీ శర్మ ఆధ్వర్యంలోని బ్యాంకు బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎండీగా ఉషా సంగ్వాన్ పదవీకాలం గతేడాది సెప్టెంబర్తో ముగిసిపోవడంతో ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలుంటారు. చైర్మన్, ఎండీ పదవుల కోసం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు సంబంధిత వర్గాల కథనం. ఎల్ఐసీలోనే అధికారుల స్థాయిలో ఉన్న ఎంఆర్ కుమార్, హెచ్ఎస్ శశికుమార్, టీసీ సుశీల్ కుమార్ (హైదరాబాద్ జోనల్ మేనేజర్), ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాజ్కుమార్ తదితరులు రేసులో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఎండీ పదవుల్లో ఉన్న సునీతా శర్మ ఈ ఏడాది మార్చిలో రిటైర్ కానున్నారు. అలాగే బి. వేణుగోపాల్ మే నెలలో, హేమంత్ భార్గవ జూలైలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. -
ఐఓసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ... బెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017–18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు చూస్తే... ► ప్రభుత్వానికి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన వాటిల్లో ఐవోసీఎల్ వాటా 13.37 శాతం, ఓఎన్జీసీ 12.49 శాతం, ఎన్టీపీసీ 6.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోల్ ఇండియా, పవర్గ్రిడ్ కార్పొరేషన్ లాభదాయత పరంగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ► టాప్–10 లాభదాయక ప్రభుత్వ కంపెనీల్లో పవర్ ఫైనాన్స్ కూడా చోటు సంపాదించింది. ► ప్రభుత్వరంగంలో 184 కంపెనీలు లాభాలను నమోదు చేస్తే, ఈ లాభాల్లో 61.83 శాతం అగ్ర స్థాయి 10 కంపెనీలదే. ► 2017–18లో 71 ప్రభుత్వరంగ కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, మొత్తం నష్టాల్లో 84.71 శాతం టాప్–10 కంపెనీలవే ఉన్నాయి. ఇందులోనూ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ఇండియా ఉమ్మడి నష్టాలే 52.15 శాతం. ► భారత్ కోకింగ్ కోల్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ నష్టాలను ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 52 ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి మార్కెట్ క్యాప్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.15.22 లక్షల కోట్లు. ప్రభుత్వ ఖజానాకు రూ.3.5 లక్షల కోట్లు ఇక ప్రభుత్వరంగ సంస్థల ద్వారా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ప్రభుత్వ సర్వే తెలియజేసింది. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, డివిడెండ్ రూపంలో ఈ మొత్తాన్ని సమకూర్చాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో చూస్తే 2.98 శాతం తక్కువ. 2016–17లో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయం రూ.3.6 లక్షల కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క డివిడెండ్ రూపంలోనే రూ.76,578 కోట్లు సమకూరింది. క్యాజువల్, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10.88 లక్షల మందికి ప్రభుత్వరంగ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 11.35 లక్షల మందితో పోలిస్తే 4.14 శాతం తగ్గింది. కానీ, అదే సమయంలో వేతనాల బిల్లు రూ.1,40,956 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,621 కోట్లకు పెరిగింది. -
మూడు బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోద ముద్ర వేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. విలీన ప్రతిపాదనకు ఏఎం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం సమాచారమిచ్చిందని బీవోబీ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 29న బీవోబీ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మిగతా రెండు బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఇప్పటికే ఓకే చెప్పాయి. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పాటయ్యే కొత్త సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత స్థానాన్ని ఇది దక్కించుకుంటుంది. విలీన బ్యాంక్ మొండిబాకీల నిష్పత్తి 5.71 శాతంగా ఉండనుంది. పీఎస్బీల సగటు 12.13 శాతం కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. విలీన ప్రతిపాదనకు ఏఎం అనుమతుల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో బీవోబీ షేరు .. 0.30 శాతం పెరిగి రూ. 115.20 వద్ద క్లోజయ్యింది. -
దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం
♦ తెలుగుభాషను మృతభాషగా మార్చేందుకు కుట్ర ♦ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ (గాంధీనగర్) : దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందని, దానిని పరిరక్షించుకోవాలంటే విద్యార్థులు, యువకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటర్లుగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక హక్కుల వేదిక పేరుతో హనుమాన్పేటలోని దాసరి భవన్లో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్బాబు అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకులు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతన్నారని ఆరోపించారు. ఈ వర్గాలకు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేస్తే పాఠశాలలు, హాస్టళ్లను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తెలుగు మీడియం రద్దుకు పూనుకున్నారని విమర్శించారు. మాతృభాషను మృతభాషగా మార్చి, బడుగు వర్గాలను విద్యకు దూరం చేసేందుకు కుట్రపన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తున్న దృష్ట్యా ఆ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధనకు పాటుపడుతున్న సామాజిక హక్కుల వేదిక అండగా విజయవాడ (గాంధీనగర్) : దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందని, దానిని పరిరక్షించుకోవాలంటే విద్యార్థులు, యువకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటర్లుగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రి, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.విశ్వనాథ్, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గాభవానీ ప్రసంగించారు. -
'దాగిన డబ్బంతా బయటకు వస్తుంది'
ఇంతవరకు లెక్కలోకి రాకుండా ప్రైవేటు రంగంలో చలామణి అవుతున్న డబ్బు మొత్తం ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి వస్తుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్దనోట్లను రద్దచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న మొత్తాలలో డిపాజిట్లు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, పెద్ద మొత్తాలు డిపాజిట్ చేసేవారిపై మాత్రం ఇప్పటి ఉన్న పన్ను చట్టాల ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. ఆదాయపన్ను పరిమితి లోపల ఉన్న మొత్తాలను డిపాజిట్ చేయడానికి ప్రజలు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు. ఇక మీదట ప్రజల ఖర్చు అలవాట్లు మారుతాయని, కొన్నాళ్ల పాటు తాము ఇబ్బంది పడుతున్నామని అనుకుంటారు గానీ, తర్వాత వాళ్లకు కూడా తెలుస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. చిన్న కొనుగోళ్ల విషయంలో కొన్నాళ్ల పాటు ఇబ్బందులు ఉంటాయి కానీ, కావల్సినంత కరెన్సీ ఉంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకరమే అవుతుందన్నారు. బ్యాంకులు వీలైనంత ఎక్కువ సమయం పనిచేసి ప్రజలకు కొత్త నోట్లు అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఇందుకోసం బ్యాంకింగ్ శాఖ, రిజర్వు బ్యాంకు తగిన చర్యలు తీసుకున్నాయన్నారు. ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఆయన చూపిన ఎజెండా ప్రకారమే మంత్రులంతా పనిచేయాలని, విస్తృత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ కేబినెట్లో మంచి వాతావరణం ఉన్నందువల్ల చాలావరకు నిర్ణయాలను తామంతా విస్తృత ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థికరంగంలోని పలు అంశాలు అందరికీ అందుబాటులో ఉండాలని, తద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వీలవుతుందని అన్నారు. దానికి తగినట్లుగా చట్టాలలో కావల్సిన మార్పుచేర్పులు చేశామన్నారు. తాము గత ప్రభుత్వ అనుభవాల నుంచి నేర్చుకున్నామని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ కాలం ప్రభుత్వం దగ్గరే నానుస్తూ ఉంటే ఫలితాలు బాగోవని, కాంట్రాక్టులు రద్దుచేయాల్సి రావడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయని, అంతా బ్యాక్ ఫైర్ అవుతుందని తెలుసుకున్నామన్నారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని వాటిని కూడా మేం అమలుచేశామని తెలిపారు. -
'దాగిన డబ్బంతా బయటకు వస్తుంది'
-
‘పచ్చ’ బస్సు పిప్పీప్పీ..
► ఎర్రబస్సే ఎరుగని పల్లెల్లో ► ఇంగ్లిష్ మీడియం పేరుతో పల్లెల్ని ఊడ్చేస్తున్న ప్రైవేటు స్కూళ్లు (సాక్షి నెట్వర్క్) అది పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని ఓ తండా.. రోడ్డు కూడా సరిగా లేని ఆ తండాకు ఆర్టీసీ బస్సు లేదు.. కానీ ప్రైవేటు స్కూల్ బస్సు మాత్రం ఉదయం 7 గంటలకే వచ్చేసింది..! రారమ్మంటూ హారన్ కొట్టింది.. నాలుగేళ్ల బాబును హడావుడిగా రెడీ చేసి తీసుకొచ్చింది ఓ తల్లి.. బాబును బస్సెక్కించి టాటా చెప్పింది.. ఆ వెనుకే మరో ఐదారుగులు పిల్లలు బిలబిలమంటూబస్సెక్కికూర్చున్నారు.. పిల్లల్ని ప్రైవేటు స్కూలు బస్సు పొద్దున్నే తీసుకెళ్లడంతో ఆ తండాలో సర్కారు బడి ఉన్నా.. లేనట్టుగా ముక్కుతూ మూలుగుతూ నడుస్తోంది!! .. ఇది ఒక్క ఆ తండాలో పరిస్థితి మాత్రమే కాదు.. అలాంటి ప్రైవేటు స్కూళ్ల పచ్చ బస్సులెన్నో తండా ల్ని, మారుమూల పల్లెల్ని చుట్టుముట్టి పిల్లల్ని ఎగరేసుకుపోతున్నాయి. రోడ్డు లేని ప్రాంతాలకు సైతం చొచ్చుకుపోతున్నాయి. పిల్లలు మాలాగా కావొద్దని, నాలుగు ఇంగ్లిష్ ముక్కలు నేర్పిస్తే ఎక్కడైనా బతుకుతారన్న ఆశతో దిగువ మధ్యతరగతి వారు కూడా తమ పిల్లలను సమీప పట్టణాల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపుతున్నారు. వారి ఆశలను సొమ్ము చేసుకుంటూ ప్రైవేటు స్కూళ్లు పోటీ పడి మరీ బస్సులు పెట్టి పిల్లల్ని తీసుకెళ్తున్నాయి. ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు విద్యార్థులను తరలిస్తున్నాయి. ఊళ్లో పిల్లలంతా ఏడు, ఎని మిది గంటల్లోపే వెళ్లిపోతుండడంతో పల్లె బడి చిన్నబోతోంది. తరగతికి ఒక్కరో ఇద్దరో మిగిలితే వాళ్లందరినీ ఒకేచోట కూర్చోబెట్టి ప్రభుత్వ బడిలో పాఠాలు చెబుతున్నారు. అగ్గిపెట్టెల్లాంటి బస్సుల్లో కుక్కేసి.. ఊళ్లో ఏడింటికే బసెక్కిన పిల్లాడు ప్రైవేటు స్కూలుకు చేరుకునేది మాత్రం 9 గంటలకు! మొదటి ఊరిలో ఏడింటికి కదిలిన బస్సు ఆరేడు గ్రామాల్లో పిల్లల్ని తీసుకుని వెళ్తోంది. కొన్నిచోట్ల బస్సులు 40 నుంచి 50 కి.మీ. దూరం దాకా ప్రయాణిస్తున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల్లో చిన్నారులు అంత దూరం ప్రయాణం చేయాల్సి రావడం ఎంత ప్రమాదకరమో మాసాయిపేటతోపాటు అనేక ఘటనలు కళ్లకు కట్టాయి. అగ్గిపెట్టెల్లాంటి బస్సుల్లో 80 నుంచి 100 మంది పిల్లలను కుక్కేస్తున్నారు. ఇంత మంది పిల్లలతో వెళ్తున్న బస్సుల కండీషన్ ప్రధానం. కానీ ఇది ఎవరికీ పట్ట డం లేదు. గుంతలమయమైన రోడ్లు, దానికితోడు వాటికి నిపుణులైన డ్రైవర్లు ఉండడం లేదు. చాలా బస్సుల్లో సహాయకులు ఉండడం లేదు. పిల్లల్లోనే కా స్త పెద్దవారిని చూసి గేటు వద్ద నిలబెట్టుకుని ప్రమాదకర పరిస్థితుల్లో తరలిస్తున్నారు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లే కొద్దీ పిల్లల సంఖ్య పెరిగిపోవడంతో ఇద్దరు కూర్చునే సీట్లో ముగ్గురు, నలుగురిని కూర్చొబెడుతున్నారు. ఇక చివరి గ్రామాల పిల్లలు నిల్చొని వెళ్లాల్సి వస్తోంది. కొన్ని బస్సుల్లో సీట్ల మధ్యలో బెంచీలను ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఉన్న ఊర్లోనే ఇంగ్లిష్ చదువుంటే.. ఉన్న గ్రామంలోనే బడిని పటిష్టం చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే పిల్లలను ఇన్ని కష్టాల మధ్య పట్టణాలకు ఎందుకు పంపుతామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్కూలు ఫీజులతోపాటు బస్సుల్లో తీసుకెళ్లినందుకు అధికం మొత్తంలో వసూలు చేయడంతో ఆర్థికంగా పెను భారం అవుతోందని వాపోతున్నారు. అక్కడక్కడ సర్కారు బడి టీచర్లే చొరవ తీసుకొని... తాము ఇంగ్లిష్ నేర్పిస్తామని, అయితే పిల్లలందరినీ ప్రభుత్వ స్కూలుకే పంపించాలంటూ పంచాయతీల్లో తీర్మానాలు చేయిస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని స్కూళ్లు ముందుకొస్తే కొద్దిమేరకైనా పరిస్థితి మారుతుందంటున్నారు. ఇలాంటి స్కూళ్లకు ప్రభుత్వం చేయూత నిస్తే పల్లె బడి మళ్లీ కళకళలాడుతుంది. బస్సులెట్లా తిరుగుతున్నయంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ఏజెన్సీలో ఉండే గ్రామం నర్సాపూర్(బి). ఇది మండల కేంద్రం ఉట్నూర్కు సుమారు 12 కి.మీల దూరంలో ఉంది. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. కానీ ఉట్నూర్లోని ప్రైవేటు పాఠశాలల బస్సులు నిత్యం ఈ గ్రామాల నుంచి విద్యార్థులను తరలిస్తాయి. మార్గమధ్యంలో ఉన్న ఎంద, ఉమ్రి, సాలెగూడ, జైత్రం తండా వంటి గూడేల నుంచి నిత్యం 50 మంది పిల్లలను తరలిస్తాయి. మరికొన్ని గ్రామాలకు టాటా ఏస్ వంటి ఆటోలను పెట్టి పిల్లల్ని తరలిస్తున్నారు. ఈ మండలంలో చాందూరి, నర్సాపూర్ -బి, సాలెవాడ-కె, నర్సాపూర్-జే, ఉమ్రి, సాలెవాడ -బి, వడోని వంటి గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. కానీ ప్రైవేటు పాఠశాలలు మాత్రం బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం టేకులతండాలో 25 మంది చదువుకునే పిల్లలున్నారు. ఇందులో 15 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. రోడ్డు అంతత మాత్రంగానే ఉండడంతో టేకులతండాకు ఆర్టీసీ బస్సు నడపట్లేదు. కానీ మండల కేంద్రం నుంచి రోజూ మూడు పాఠశాలలకు చెందినమూడు బస్సులు వచ్చి పిల్లలను తీసుకెళ్తున్నాయి. తీర్మానం సాక్షిగా.. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం శిల్గాపురం గ్రామం అది. 900 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 120 మంది విద్యార్థులున్నారు. ఊర్లో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఉన్నా 80-90 మంది పిల్లలు 12 కిలోమీటర్ల దూరంలోని హాలియాకు వెళ్లి చదువుకుంటున్నారు. రోజూ ప్రైవేటు స్కూలు బస్సులు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తుంటాయి. గ్రామంలో నాలుగు రోజుల క్రితం బడిబాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో గ్రామస్తులు చేసిన తీర్మానం ఏంటో తెలుసా... ‘మా గ్రామంలో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.3-4 వేలు ట్రాన్స్పోర్ట్ కోసం చెల్లించి చదివిస్తున్నాం. ప్రభుత్వం మా ఊర్లో ఇంగ్లిష్ మీడియం స్కూలు పెడితే విద్యార్థికి రూ.2 వేలు వేసుకుని అయినా పాఠశాలను అభివృద్ధి చేసుకుని ఊర్లోనే చదివించుకుంటాం..’ అని. ఈ ఒక్క తీర్మానమే ప్రభుత్వ రంగంలో ఆంగ్ల మాధ్యమ ఆవశ్యకతను తెలియజేస్తోంది. గ్రామీణ మధ్య తరగతి కుటుంబాలు చదువు కొనుక్కునేందుకు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తోంది. ఈ గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా ఆర్టీసీ బస్సు రాదు. కానీ ప్రైవేటు స్కూల్ బస్సులు మాత్రం రోజూ ఠంచన్గా రెండు ట్రిప్పులు తిరుగుతున్నాయి. మూతపడ్డ పాఠశాల నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామ జనాభా 1,350. ఇక్కడ ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండేది. గ్రామానికి కామారెడ్డి పట్టణం నుంచి మూడు ప్రైవేటు స్కూళ్ల బస్సులు వస్తాయి. పక్కనే ఉన్న చిన్నమల్లారెడ్డి, రాజంపేట గ్రామాల్లోని పాఠశాలలకు చెందిన బస్సులూ వస్తాయి. గ్రామానికి చెందిన పిల్లలందరూ ఆయా బస్సుల్లో వెళ్లడంతో ఉన్న సర్కారు బడి మూతబడింది. సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ బడికే పంపుతాం ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ బడికే పంపుతాం. ప్రైవేటు బడుల్లో ఫీజుల భారం మోయలేక పోతున్నాం. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు పాఠశాల బస్సులో పంపడంతో ఆర్థికంగా భారం అవుతుంది. నాకున్న ఇద్దరు పిల్లలకు రవాణా ఖర్చులే సంవత్సరానికి రూ.6 వేల నుంచి రూ.7 వేలు అవుతున్నాయి. స్కూల్ ఫీజులు మరో రూ.20 వేలు కడుతున్నా. కూలి చేసుకుంటూ బతికేటోళ్లం. అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేకున్నా కష్టపడి పంపుతున్నాం. - బొల్లిగొర్ల సైదమ్మ, శిల్గాపురం ఇంగ్లీష్ బడి లేకే.. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు 12 కి.మీ. దూరంలో ఉంటుంది రాగబోయినగూడెం. ఇక్కడి 20 మంది పిల్లలు ఇల్లెందులోని ప్రైవేట్ స్కూలుకు వెళ్తారు. స్థానికంగా ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్లే బస్సులో 12 కి.మీ. పంపాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామంలో మొదలైన బస్సు ఐదారు ఊర్లలోని పిల్లల్ని ఎక్కించుకుని గంటన్నర ప్రయాణించి స్కూలుకు చేరుతుంది. స్కూల్ టైం ఎనిమిదిన్నర అయితే ఏడు గంటలకే పిల్లలను బస్సెక్కించాలి. ఊళ్లోనే ఇంగ్లిష్ మీడియం బడి ఉంటే ఎక్కడికో ఎందుకు పంపుతామంటున్నారు గ్రామస్తులు. బస్సు ఫీజే రూ.5 వేలు.. రాగబోయిన గూడెంలో ఇంగ్లిష్ మీడియం స్కూ ళ్లు లేవు. దీంతో ఎంత ఖర్చయినా భరించుకుంటూ ఇల్లెందుకు తోలుతున్నం. చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. బడి ఫీజు కాకుండా.. బస్సుకే ఏడాదికి రూ.ఐదు వేల పైనే వసూలు చేస్తున్నరు. పిల్లల చదువుల కంటే ఖర్చు భారం కాదని భావించి అప్పు చేసైనా చదవించాల్సి వస్తోంది - కె.కోటేశ్వర్రావు, రాగబోయినగూడెం, ఇల్లెందు మండలం, ఖమ్మం జిల్లా బస్ చార్జీలూ భారం.. మహబూబ్నగర్ జిల్లాలోని మండల కేంద్రం నాగర్కర్నూల్కు గుడిపల్లి అనే ఊరు 10 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం నుంచి 45 మంది పిల్లలు రోజూ నాగర్కర్నూల్ వెళ్తుంటారు. గ్రామం నుంచి పాఠశాలలకు తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.6,500 వసూలు చేస్తున్నాయి. పాఠశాల ఫీజులు వేలకు వేలు ఉంటే ఈ బస్సు చార్జీ తలకు మించిన భారమవుతోందని, ఒకవేళ బస్సు ఫీజు చెల్లించకపోతే ఆటోలే దిక్కని వాపోతున్నారు గ్రామస్తులు. గుడిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలున్నాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తే పిల్లలకు ఈ తిప్పలు ఉండవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంగ్లిష్ మీడియం లేక నే పంపుతున్నం.. మా ఊర్లో ఇంగ్లిష్ మీడియం పాఠశాల లేకపోవడం వల్లే నాగర్ కర్నూల్కు పిల్లల్ని పంపుతున్నం. అందరూ ఇంగ్లిష్ మీడియం చదువుతున్నరు. మా పిల్లలు తెలుగులో చదివితే భవిష్యత్తు ఇబ్బందిగా ఉంటుందని ఖర్చయినా పంపుతున్నం. - రాములు, విద్యార్థి తండ్రి, గుడిపల్లి, మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ స్కూళ్లలో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2011-12 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,76,352 మంది విద్యార్థులు ఉంటే.. అది 2015-16 నాటికి 27,92,514కు పడిపోయింది. ఏకంగా 2,83,838 మంది తగ్గిపోయారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో క్రమంగా పెరుగుతున్నారు. 2011లో ప్రైవేటు పాఠశాలల్లో 30,64,343 మంది విద్యార్థులు ఉండగా 2015-16 నాటికి వారి సంఖ్య 32,70,799కు పెరిగింది. -
ఎస్బీహెచ్ ఓటీఎస్ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రుణాలు తీసుకొని కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఉన్న మొండి బకాయిలను వసూలు చేయడం కోసం అదాలత్ పేరిట ‘వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఓటీఎస్ స్కీం అమల్లో ఉంటుందని, డిఫాల్టర్లు సమీప బ్యాంకు శాఖకు వెళ్ళి రుణ బకాయిలను పరిష్కరించుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, చిన్న, మధ్య స్థాయి పారిశ్రామిక రంగాల వారు ఈ ఓటీఎస్ స్కీంను వినియోగించుకోవడం ద్వారా పెనాల్టీలు, న్యాయపరమైన చర్యల నుంచి తప్పించుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. -
సెయిల్ తాత్కాలిక సీఎండీగా స్టీల్ సెక్రటరీ రాకేశ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాత్కాలిక సీఎండీగా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ వర్మ బుధవారం పదవీ విరమణ నేపథ్యంలో రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను చేపట్టినట్లు సెయిల్ గురువారం బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్లో తెలిపింది. సంస్థ సీఎండీగా కొత్త నియామకం జరిగే వరకూ రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది. -
యునెటైడ్ బ్యాంక్ బేస్రేటు తగ్గింపు
ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించిన ఐడీబీఐ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ బేస్రేటును 0.10 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 10% నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఈ నెల 19 నుంచి ఇది అమలవుతుంది. ఫలితంగా రుణ గ్రహీతలకు ఈఎంఐలు తగ్గే వీలుంది. గత వారంలోనే రిటైల్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ తగ్గించింది. ఒక ఏడాది రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 8 శాతానికి, ఏడాదికి మించిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 7.75 శాతానికి తగ్గించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.55 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపు నేటి(బుధవారం) నుంచే అమల్లోకి వస్తుందని వివరించింది. గత వారంలో కీలక రేట్లను ఆర్బీఐ పావు శాతం తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ తమ బేస్రేట్లను తగ్గించాయి. -
తెలంగాణ పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి
వరంగల్ సిటీ : తెలంగాణ ప్రాంతంలో పండే పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలంగాణ కాటన్, మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబాయిలో జరిగిన మినీ టెక్స్టైల్ కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశానికి తాను హాజరయ్యానని, సీసీఐ మేనేజింగ్ డెరైక్టర్ బొంబాయి, కోయంబత్తూర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగిన సమావేశ ం కాబట్టి బోర్డు సమావేశంలో కూడా తెలంగాణను చేర్చాలని, ఇక్కడ పండిన పత్తి నాణ్యమైనందున తగిన డిమాండ్ ఉండాలని బోర్డు సభ్యులను కోరినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను తెలుపుతూ అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వ రంగ సంస్థలు- పెట్టుబడుల ఉపసంహరణ
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఏటికేటికీ పెరుగుతోంది. ఆర్థికవృద్ధి సాధనే ధ్యేయంగా 1991-92 నుంచి ప్రారంభమైన ఈ ఉపసంహరణ ప్రస్థానం.. ఇంకా కొనసాగుతోంది. పుష్కర కాలం క్రితం ప్రభుత్వ రంగ సంస్థలలో నూటికి నూరు శాతం ఉన్న ప్రభుత్వ పెట్టుబడులు నేడు సగానికి పడిపోయాయి. సర్కారు స్థానంలో ప్రైవేటు రంగాలు పాగా వేస్తున్నాయి. మొన్నటికి మొన్న మరో మూడు సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరో 12 సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అభివృద్ధి అజెండాతో ఉపసంహరణ అంకానికి ఉపక్రమిస్తున్న పాలక ప్రభుత్వాల నిర్ణయాలు ఏ మేర దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెడతాయన్నది ఇప్పటికీ సందేహమే. ప్రభుత్వ రంగ సంస్థలలో వెచ్చించిన మూలధనం నుంచి ప్రతిఫల రేటు రుణాత్మకంగా ఉండటాన్ని ప్రభుత్వ నూతన ఆర్థిక విధానం (జూలై -1991) గుర్తించింది. సరిగా పనిచేయని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ వనరులపై అధికంగా ఆధారపడటంతో ఆస్తుల కల్పన తగ్గింది. రుణభారం పెరిగింది. ఆర్థిక వృద్ధి వేగవంతం చేస్తాయని భావించిన ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థకు భారమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రతిఫల రేటు తగ్గడంతో జాతీయ స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయ పొదుపు రేటులో క్షీణత ఏర్పడింది. పర్యవసానంగా స్థూల దేశీయ పొదుపులో 10 నుంచి 15 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఉపయోగితా మూలధనంతో పోల్చినపుడు లాభాల స్థాయి చాలా తక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం భావించింది. తమ పనితీరును మెరుగుపరచుకోవడం ద్వారా ఆయా సంస్థలు సామాజిక లక్ష్యాలను సాధించాలని సర్కారు ఆశించింది. పోటీ వాతావరణంలో లాభాలతో నడుస్తున్న కంపెనీలలో యాజమాన్య, వాణిజ్య పరమైన స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ, లాభాలార్జిస్తున్న కంపెనీలను ప్రైవేటుపరం చేయరాదని ప్రభుత్వం భావించింది. జాతీయ కనీస సాధారణ కార్యక్రమం జాతీయ కనీస సాధారణ కార్యక్రమం (నేషనల్ కామన్ మినిమమ్ ప్రోగ్రాం) లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో పారదర్శకతను పాటించాలని ప్రభుత్వం భావించింది. నవరత్న హోదా పొందిన కంపెనీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ మూల ధన మార్కెట్ నుంచి ఆయా సంస్థలు వనరులు సమీకరించేలా తీర్చిదిద్దాలని ఆశించింది. నష్టాలతో నడిచే కంపెనీలను ఆధునికీకరించలేని పక్షంలో శ్రామికుల బకాయిలు, నష్ట పరిహారం చెల్లించి పూర్తిగా మూసేయడం గానీ లేదా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర వెలకట్టలేనిది. స్వాతంత్య్రానంతరం పారిశ్రామిక పురోగమనంలో వీటి అభివృద్ధిలో పాలక ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాయి. మార్చి 31, 2013 నాటికి పలు మంత్రిత్వ శాఖల పరిధిలో 277 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వీటిలో 228 కార్యకలాపాలు కొనసాగిస్తుండగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. వీటి మొత్తం పెట్టుబడి (చెల్లించిన మూలధనం + దీర్ఘకాలిక రుణాలు) రూ. 8,50, 599 కోట్లు. 2011-12 తో పోల్చితే ఈ మొత్తంలో పెరుగు దల 16.6 శాతం. 2012-13లో లాభాలార్జిస్తున్న 149 సంస్థల నికర లాభం రూ.1,43,559 కోట్లు . నష్టాలార్జిస్తున్న 79 సంస్థల నికర నష్టాలు రూ. 28,260 కోట్లు. లాభాలార్జిస్తున్న వాటిలో ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటి నికర లాభాలు తగ్గుముఖం పట్టాయి. 2005 ఫిబ్రవరిలో నికర లాభాలు 8.7 శాతం ఉంటే.. 2011 ఫిబ్రవరి నాటికి 6.2 శాతానికి చేరింది. నికర లాభాలలో క్షీణతకు కారణాలివి లోపభూయిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థల ధరల విధానం -అవస్థాపితా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోకపోవడం ప్రాజెక్టుల ప్రణాళిక, వాటి నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలు -యాజమాన్య పరమైన సమస్యలు, స్వయం ప్రతిపత్తి లోపించడం పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను తగ్గించడం ద్వారా ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆర్థిక భారం తొలగింపు, పబ్లిక్ ఫైనాన్స్ను మెరుగుపరచ డం, మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, వృద్ధికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చడానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ అంశం తెరమీదికి వచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా లభించిన మొత్తంతో 1. ప్రభుత్వ ద్రవ్యలోటు పెరిగిన క్రమంలో దాన్ని తగ్గించడానికి వినియోగించడం 2. పెద్ద తరహా అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవడం 3. కొనుగోలు వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక వ్యవస్థలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా మరల్చడం 4. ప్రభుత్వ రుణ భారం తగ్గింపు 5. విద్య, ఆరోగ్యం, గృహ వసతి, తాగునీరు లాంటి సా మాజిక రంగ కార్యకలాపాలపై పెట్టుబడులుగా మరల్చడానికి సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నది ముఖ్య లక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింది ప్రయోజనాలు కల్పించేలా ఉండాలి. యాజమాన్య సమర్థత ఆర్థిక వ్యవస్థలో మూలధన కొరత నివారణ అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురావడం కొత్త మార్కెట్లోప్రవేశం వ్యూహాత్మక పెట్టుబడిదారుల ఆసక్తి గుర్తింపు ఉపాధి, పోటీ వాతావరణంతోపాటు పర్యావరణ అభిలషణీయ విధానాలు రూపొందించడం పెట్టుబడుల ఉపసంహరణ-గత లక్ష్యాలు వాస్తవంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ 1991-92 నుంచి ప్రారంభమైంది. ఆనాటి నుంచి నేటివరకు ఏదో సంస్థ నుంచి తన పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. 1991-92 బడ్జెట్లో మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 2,500 కోట్లు కాగా సాధించింది రూ.3037.74కోట్లు. 2013-14లో లక్ష్యం రూ. 40వేల కోట్లు కాగా సాధించింది రూ. 15,819 కోట్లు. ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం నుంచి 2014-15 (ఆగస్టు 5, 2014)వరకు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం రూ.1,52,842,25 కోట్లకు చేరింది. జాతీయ పెట్టుబడి నిధి ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టపరిచే లక్ష్యంతో బోర్డ్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటయింది. పునర్నిర్మించడానికి వీలుకాని, దీర్ఘకాలంగా నష్టాలతో నడిచే కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, మూసివేతకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి ఈ బోర్డు సూచిస్తుంది. అలా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించిన మొత్తంతో జాతీయ పెట్టుబడి నిధి (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నిధిలో 75 శాతం మొత్తాన్ని విద్య, ఆరోగ్యం,ఉపాధిని ప్రోత్సహించడానికి వెచ్చిస్తారు. 2013-14 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించిన మొత్తాన్ని జాతీయ పెట్టుబడి నిధి అంశం కింద పబ్లిక్ అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పెట్టుబడి నిధిలో భాగాగం ఉండే ఈ మొత్తం పంపిణీని ప్రభుత్వ బడ్జెట్లో నిర్ణయిస్తారు. జాతీయ పెట్టుబడి నిధి-పాత్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే తగ్గించకుండా ఉంచడం ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలలో రీ క్యాపిటలైజేషన్ రిజర్వ్బ్యాంక్, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్లలో పెట్టుబడులు పలు మెట్రో ప్రాజెక్టులలో ప్రభుత్వ ఈక్విటీ నిర్వహణ భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్, యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మదుపు రైల్వేలలో మూలధన వ్యయం పెట్టుబడులకు జాతీయ పెట్టుబడి నిధి సహాయపడుతుంది. ఇటీవలి పరిణామాలు ఇటీవల అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా లిమిటెడ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ కార్పోరేషన్, ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్లలో పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిద్వారా రూ. 44వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగొచ్చని అంచనా. కోల్ ఇండియాలో 10 శాతం, ఓఎన్జీసీలో 5 శాతం, ఎన్హెచ్పీసీలో 11.36 శాతం వాటా విక్రయానికి సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం కోల్ ఇండియాలో రూ.23వేల కోట్లు, ఓఎన్జీసీలో రూ.18వేల కోట్లు, ఎన్హెచ్పీసీలో రూ.2,800 కోట్లు. 2014-15 బడ్జెట్ అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 58,425 కోట్లు. అయితే వరుసగా ఐదేళ్ల కాలంలో ఆశించిన లక్ష్యం చేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో అది నెరవేరుతుందో? లేదో? చూడాలి. ప్రైవేటీకరణ ప్రక్రియ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు నాణ్యమైన ఆస్తులు, మానవశక్తి (మ్యాన్ పవర్) కొదువే లేదు. విధాన నిర్ణయాల విషయంలోనే లోపమంతా. దీనివల్లే ప్రభుత్వ రంగ సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగా లేని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా పారదర్శకత పెంపొందించవచ్చు. అలాగే పని వాతావరణాన్ని కూడా మెరుగుపరచవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ-పరిణామాలు గతేడాది నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్ ధరలలో పెరుగుదల కనిపించింది. స్టాక్ ధరలలో 300 శాతం వృద్ధి చోటుచేసుకుంది. బీఈఎమ్ఎల్ స్టాక్లో 295 శాతం, ఎంటీఎన్ఎల్లో 150 శాతం, సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో 110 శాతం, నాల్కోలో 107 శాతం, ఫ్యాక్ట్లో 85 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ (స్టాండర్డ్ అండ్ పూర్స్), బీఎస్ఈ సెన్సెక్స్, సీఎన్ఎక్స్ నిఫ్టీ సూచీలలో నిరుడు 33 శాతం పురోగతి కనిపించింది. కంపెనీలను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు కంపెనీల స్టాక్ ధరల పెరుగుదలకు ఉపకరించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 12 కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, తేహ్రి హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్, ఎన్హెచ్పీసీ, కాంకర్,ఎంఎంటీసీ, ఎన్ఎల్సీ ముఖ్యమైనవి. -
ముంబై తీరంలో గ్యాస్ లీకేజీ
తక్షణమే భద్రత చర్యలు చేపట్టిన ఓఎన్జీసీ న్యూఢిల్లీ: ముంబై సముద్ర తీరంలో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీకి చెందిన చమురు, సహజవాయు క్షేత్రంలోని ‘ఎన్ఎస్’ అనే గ్యాస్ బావిలో శనివారం సర్వీసింగ్ జరుపుతుండగా భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అయింది. భారీ ఒత్తిడితో, అత్యంత జ్వలనశీలత కలిగిన గ్యాస్ లీక్ కావడంతో ఓఎన్జీసీ వెంటనే భద్రత చర్యలు చేపట్టింది. చమురు క్షేత్రం వద్ద ఉన్న 82 మందిలో అత్యవసరం కాని 42 మంది సిబ్బందిని అక్కడి నుంచి పంపించేసింది. ‘ఓఎన్జీసీకి చెందిన సాగర్ ఉదయ్ అనే రిగ్తో చమురు బావిని సర్వీసింగ్ చేస్తుండగా లీకేజీని గుర్తించాం’ అని ఓఎన్జీసీ ప్రతినిధి తెలిపారు. ఎక్కడినుంచి గ్యాస్ లీక్ అవుతుందో గుర్తించగానే మరమ్మతు ప్రారంభిస్తామన్నారు. సంస్థకు చెందిన సంక్షోభ నివారణ బృందం ఘటనస్థలికి చేరుకుంది. పరిస్థితి విషమిస్తే రంగంలోకి దిగడానికి భారత నౌకాదళం, తీర రక్షక దళాలకు చెందిన రెండు నౌకలూ ఆప్రాంతానికి బయల్దేరాయి. రెండు హెలికాప్టర్లనూ సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. అయితే, అది బ్లోఅవుట్ కాదని, కేవలం గ్యాస్ లీకేజీనేనని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. -
రసాయనాల పరిశ్రమ స్థాపనకు సహకారం
కేంద్ర మంత్రి అనంత భరోసా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఎవరైనా రసాయనాల పరిశ్రమను స్థాపించడానికి ముందుకు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. జయనగరలో రత్నా ఫౌండేషన్ శనివారం ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో రసాయన ఎరువులకు కొరత ఏర్పడ కూడదని ఆకాంక్షిం చారు. ఈ విషయంలో స్వావలంభన సాధించాల్సి ఉందన్నారు. ఈ దిశగా కర్మాగారాలను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉందన్నారు. రాష్ర్టంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో లక్ష టన్నులకు బదులు లక్షన్నర టన్నుల రసాయనాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంగళూరు ఫర్టిలైజర్స్ ఎదుర్కొంటున్న రసాయనాల కొరతను తీర్చామని చెప్పారు. వచ్చే మూడు నెలల పాటు పాత పద్ధతిలోనే ఎరువులను ఉత్పత్తి చేయాలని సూచించామని తెలిపారు. జయపై విమర్శలు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కావేరి వివాదాన్ని తిరిగి కెలకడానికి ఎంతగా ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వబోదని తెలిపారు. కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయకూడదని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కోరామని చెప్పారు. కావేరి నీరు మండ్య జిల్లా రైతులకు జీవ నాడి అని, బెంగళూరు ప్రజల దాహార్తిని తీర్చుతోందని తెలిపారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహణా మండలిని ఏర్పాటు చేయకూడదని కోరామన్నారు. అయితే జయలలిత అధికారుల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయని చెబుతూ, అక్కడ కూడా సమర్థంగా వాదనలు వినిపించి మండలి ఏర్పాటు కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
కడిగేసిన కాగ్!!
ముంబై: ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆరోపించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ వాటా ఉన్నా బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తించిందని అసెంబ్లీ సమావేశాల చివరిరోజైన శనివారం సమర్పించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రధానమైన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని పేర్కొంది. అందులో మొదటిది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం సిద్ధం చేసిన ఆర్థిక పద్దులకు అనుగుణంగా పెట్టుబడలకు సంబంధంచిన నిర్ధిష్టమైన అంకెను అందజేయడంలో విఫలం కావడం మొదటిది కాగా వార్షిక ఖాతాలను సిద్ధం చేయకపోవడం, వాటిని తనిఖీ చేయించక పోవడం రెండో వైఫల్యంగా కాగ్ ఆరోపించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ లోపించిందని పేర్కొంది. మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ మూడు ఒప్పందాలకు సంబంధించి నియమనిబంధనలను తుంగలోతొక్కి డెవలపర్లకు లబ్ది చేకూర్చిందని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 149.35 కోట్లమేర ఆర్థిక భారం పడిందని ఆరోపించింది. ఇక మహారాష్ట్ర విద్యుత్ సరఫరా కంపెనీ ఆదాయపు పన్ను మదింపు సమయంలో తప్పుడు లెక్కలు చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 33.58 నష్టం కలుగజేసిందని పేర్కొంది. ఇక మహారాష్ట్ర విద్యుదుత్పత్తి కంపెనీ అవసరం లేకున్నా సిమెంట్ పైపుల కొనుగోలు విషయంలో రూ. 4.01 కోట్లు ఖర్చు చేయించిందని ఆరోపించింది. నీటి ఖర్చు విషయంలో కూడా లెక్కలు సరిగ్గా చూపలేదని పేర్కొంది. ఇక మహారాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ రోడ్డు విస్తరణ పనుల అప్పగింతలో కూడా పారదర్శకత పాటించలేదని, అనూయాకులకే పనులు అప్పగించడం ద్వారా రూ. 46.14 లక్షల మేర నష్టం కలుగజేసిందని పేర్కొంది. ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) కూడా ముంబై పట్టణ మౌలిక వసతుల కల్పన పేరుతో చేపట్టిన ప్రాజెక్టు విషయంలో కూడా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, అంచనావ్యయాన్ని భారీగా పెంచడం ద్వారా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిళ్లిందని కాగ్ పేర్కొంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో జవాబుదారీతనం లోపించిందని కాగ్ పేర్కొంది. అయితే అసెంబ్లీ సమావేశాల చివరిరోజు నివేదిక అందజేయడంతో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం దొరకకుండా పోయింది. -
పీఠం కోసం ఇంకొన్నాళ్లు!
ఉసూరుమంటున్న ‘స్థానిక’ ప్రతినిధులు రెండు నెలలైనా దక్కని అధికారం ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరమే నోటిఫికేషన్ అప్పుడే ఎంపీపీ, జెడ్పీ,పురపాలక చైర్మన్ల ఎన్నిక విశాఖ రూరల్ : ఎన్నో వ్యయప్రయాసలకోర్చారు. ప్రజాక్షేత్రంలో విజ యం సాధించారు. ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు చేతికి అధికారం మాత్రం చిక్కలేదు. జిల్లా పరిషత్తు చైర్మన్ స్థానంతో పాటు 39 మండల పరిషత్తులకు అధ్యక్షులను, రెండు మున్సిపాలిటీలకు చైర్పర్సన్, వైస్చైర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంది. అయి తే ఈ ఎన్నికలు నెలాఖరు వరకు జరిగే అవకాశం కని పించడం లేదు. ఈ ఏడాది మార్చి 30న జిల్లాలో యల మంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. రెండిం టిని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జిల్లాలో ఉన్న 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 24 జెడ్పీటీసీలను టీడీపీ, 15 జెడ్పీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అలాగే 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు వాయిదా పడగా, 334 స్థానాలను టీడీపీ, 254 వైఎస్ఆర్ కాంగ్రెస్, 17 కాంగ్రెస్, 5 సీపీఎం, 3 సీపీఐ, బీజేపీ, బీఎస్పీ ఒక్కోటి, స్వతంత్రులు 17 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరమే.. ఎంపీపీ, జెడ్పీ పీఠాల పరిస్థితి ఒకలా ఉంటే.. పురపాలక సంఘాల పరిస్థితి మరోలా ఉంది. ఎమ్మెల్యేలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండడమే ఇందుకు కారణం. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తే తప్పా మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియోగా ఓటేసే అధికారం రాదు. ఈ నెల 19 లేదా 20వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి లేదా మలి రోజున ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారం చేశాకే స్థానిక సంస్థల్లో వారి ఎక్స్ అఫిషియో సభ్యత్వం ఖరారవుతుంది. ఆ తర్వాతే వారి ఎక్స్ అఫీషియో సభ్యత్వాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్లకు సమాచార మందిస్తుంది. ఆ తరువాతే ఎన్నికల సంఘం వీటి అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అయితే ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశమున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సం బంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పురపాలక, ప్రాదేశిక అధ్యక్ష ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. అసెంబ్లీ సమావేశాలు తరువాత వారంలోనే నోటిఫికేషన్ రావచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు గె లుపొందిన అభ్యర్థులు అధికారం కోసం ఎదురుచూడక తప్పదు. -
పీఎస్యూలకు భారీ రుణాలు వద్దు
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)లకు భారీ రుణాలు మంజూరు చేయవద్దని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆదేశించింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలకు మేలు చేయడమే ఈ బ్యాంకుల రుణాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించింది. పీఎస్యూలకు పట్టణ సహకార బ్యాంకులు భారీ లోన్లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయా బ్యాంకులకు బుధవారం పంపిన సమాచారంలో ఆర్బీఐ తెలిపింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలు, రైతులు, చిన్నతరహా వ్యాపారుల రుణ అవసరాలు తీర్చడమే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేసింది. కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాలి: రాజన్ ద్రవ్య విధానాల్లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య మరింత సహకారం అవసరమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. పెద్ద దేశాల విధానాలు వర్ధమాన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని నివారించేందుకు ఆయా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాల్సి ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం టోక్యోలో ఏర్పాటు చేసిన సదస్సులో రాజన్ ప్రసంగించారు. ద్రవ్య విధానాలపై ఇతర దేశాల స్పందననూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానానికి ఎలాంటి పద్ధతీ లేకపోవడం ప్రగతికి, ద్రవ్యరంగానికి ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు. -
10, 11 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నారు. వేతన సవరణపై బ్యాంక్ యూనియన్లు, యాజమాన్యం ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే దీనికి కారణం. యూనియన్లు- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో సమస్యపై తగిన పరిష్కారం కనుగొనలేకపోవడంతో సమ్మె అనివార్యం అయినట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫర్, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదని బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సంఘం(ఎన్ఓబీడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా అన్నారు. డిసెంబర్ 14న వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావడంతో అదేనెల 18వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. 2012 నవంబర్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ, అధికారుల యూనియన్లకు యూఎఫ్బీయూ నేతృత్వం వహిస్తోంది. దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
అత్యవసర సేవలకు ఆటంకం కలగనివ్వం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులందరూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తుండటంతో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం తన చాంబర్లో కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వైద్యం, డ్రింకింగ్, వాటర్, శానిటేషన్, విద్యుత్, తదితర అత్యవసర సర్వీసులకు ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమ్మె నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని వివరించారు. ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళుతున్నందున చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె.మహంతి కొన్ని సూచనలు ఇచ్చారని వాటిని పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే వారి సేవలు వివిధ అవసరాలకు ఉపయోగించుకుంటున్నామన్నారు. అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల(పబ్లిక్ సెక్టార్) ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని వివరించారు. సమ్మె కారణంగా అత్యవసర సేవలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా తెలిపారు. శాంతి భద్రతలకు భంగం వాటిళ్లకుండా పోలీస్ యంత్రాంగానికి తగిన సూచనలు ఇచ్చినట్లు వివరించారు.