Tata Consultancy Services Rejigs Senior Management - Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ కీలక నిర్ణయం.. సీనియర్‌ మేనేజ్‌మెంట్ పదవుల్లో మార్పులు

Jul 29 2023 4:22 PM | Updated on Jul 29 2023 7:34 PM

Tata Consultancy Services Rejigs Senior Management - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. 

టీసీఎస్‌లోని మార్పులతో సంస్థ మాజీ గ్లోబుల్‌ హెడ్‌ ఫర్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) కే.కృతివాసన్ సీఈవో, ఎండీగా నియమించింది. 

బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ప్రస్తుతం టీసీఎస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌,రాజశ్రీని సీనియర్‌ మేనేజ్మెంట్‌ పర్సనల్‌ (ఎస్‌ఎంపీ) బాధ్యతల నుంచి తొలగించింది. జులై 31 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్‌ ఇచ్చింది. 

ఇక, టీసీఎస్‌లో 21 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న గ్లోబుల్‌ మార్కెట్‌ న్యూ చీఫ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభినవ్‌ కుమార్‌ ఇకపై పూర్తి స్థాయిలో యూరప్‌ మార్కెట్‌పై దృష్టి సారించనున్నారు. 

జులై 31న టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కే.అనంత్ కృష్ణన్ రీటైర్‌ కానున్నారు. 

ఆగస్ట్‌ 1 నుంచి టీసీఎస్‌లో 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు విధులు నిర్వహిస్తున్న హారిక్‌ విన్‌, శంకర్‌ నారాయణ్‌, వి. రాజన్న, శివ గణేశన్‌, అశోక్‌ పై, రెగురామన్‌, అయ్యాస్వామీ’లు సీనియర్‌ మేనేజ్మెంట్‌ పర్సనల్‌ (ఎస్‌ఎంపీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

చదవండి👉 టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్‌.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement