
సాక్షి, హైదరాబాద్: టీవీఎస్ మోటార్ కంపెనీ వినియోగదారులకు మరింత చేరువ కానుంది. టీవీఎస్ మోటార్స్ తమ కస్టమర్లకోసం ‘ఎక్స్పర్ట్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రావడానికి చాలా మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులకు వారి ఇళ్ల వద్దే పిరియాడిక్ మెయింటెనెన్స్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా 300 డీలర్షిప్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. దీని ద్వారా టోల్–ఫ్రీ నెంబర్, కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడీ, రోడ్సైడ్ అసిస్టెన్స్ మార్గాల ద్వారా ఏ విధమైన వాహన సమస్యనైనా కస్టమర్లు ఇంటివద్దే పరిష్కరించుకునే వీలుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రకటనతో టీవీఎస్ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు వినియోగదారులకు చేరువ కావడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment