ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్‌న్యూస్‌ | Wipro Plans to Hire 12000 In FY25 Prioritises Honouring Previous Offers | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్‌న్యూస్‌

Published Sat, Aug 31 2024 11:59 AM | Last Updated on Sat, Aug 31 2024 12:48 PM

Wipro Plans to Hire 12000 In FY25 Prioritises Honouring Previous Offers

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్‌ లెటర్స్‌ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్‌ అసోసియేట్స్‌ (ఫ్రెషర్స్‌)ని ఆన్‌బోర్డ్‌ చేశామని పేర్కొంది.

టెక్‌ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్‌ ఆఫర్లు పొందిన ఎన్‌జీఏలను (ఫ్రెషర్స్‌) ఆన్‌బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్‌జీఏలను ఆన్‌బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.

విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్‌-ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement