hiring
-
ఇన్ఫోసిస్లో 20,000 నియామకాలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్(Infosys) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికకు అనుగుణంగా సాగుతున్నట్టు వెల్లడించింది. కొత్తగా చేరిన వారికి ఉత్తమ కార్పొరేట్ శిక్షణ ఇవ్వనున్నట్టు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు.ఇదిలాఉండగా, 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించింది. ‘మైసూరు క్యాంపస్లో వీరికి ప్రాథమిక శిక్షణ పూర్తి అయింది. అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియలో మెరుగైన పనితీరు కనబర్చలేదు. మూడు విడతలుగా అవకాశం ఇచ్చాం. అయినా ఉత్తీర్ణులు కాలేదు. దీంతో ఉద్వాసన పలకాల్సి వచ్చింది’ అని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఉద్యోగులను ఎటువంటి ఒత్తిడికి గురి చేయలేదని మాథ్యూ వివరించారు. మదింపు ప్రక్రియలో పనితీరు కనబర్చని ఫ్రెషర్ల తొలగింపు సాధారణమే. అయితే గతంలో ఇది 10 శాతానికి లోబడి ఉండేది. ఈ నెలలో ఇది ఏకంగా 30–40 శాతం ఉన్నట్టు సమాచారం. ఇదే వివాదానికి కేంద్ర బిందువైంది. ఇదీ చదవండి: భారత్పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..అక్రమంగా, అనైతికంగా..ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) వాదన మరోలా ఉంది. మైసూరు శిక్షణ కేంద్రం నుంచి 700 మందికిపైగా ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ తొలగించిందని ఆరోపిస్తోంది. అక్రమంగా, అనైతికంగా ఉద్యోగులను తొలగించారంటూ కార్మిక శాఖకు సైతం నైట్స్ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెర్మినేషన్కు గురైన వారంతా 2022 హైరింగ్ బ్యాచ్కు చెందినవారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత 2024 సెప్టెంబర్లో జాబ్స్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ 2024లో అమలు చేసిన పరీక్షా విధానం కఠినంగా ఉంది. సిలబస్ ఎక్కువగా ఉండడం, శిక్షణ సమయం తక్కువ కావడంతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయిందని నైట్స్ చెబుతోంది. స్వచ్ఛందంగా మానేస్తున్నట్టు ఉద్యోగులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందితో బెదిరింపులకు దిగారని కార్మిక శాఖకు ఇచ్చిన ఫిర్యాదులో నైట్స్ వెల్లడించింది. -
ఐటీ ఉద్యోగాలు.. ఇంకొన్నాళ్లు ఇంతే!
భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో 2025–26 రెండవ అర్ధ భాగం నాటికి వృద్ధి ఊపందుకునేంత వరకు నియామకాలు సమీప కాలంలో తక్కువ స్థాయిలోనే ఉంటాయని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇక్రా నివేదిక ప్రకారం.. యుఎస్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల తక్షణ కాలంలో కొంత విధానపర అనిశ్చితి ఏర్పడవచ్చు.అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం మధ్య యూఎస్, యూరప్లోని కీలక మార్కెట్లలో కస్టమర్లు సాంకేతికతపై తక్కువ వ్యయం చేయడంతో 6–8 త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల కంపెనీలకు డిమాండ్ తగ్గింది. తక్కువ అట్రిషన్, ఉద్యోగుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు కూడా నియామకాల్లో మందగమనానికి కారణం అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కొంత రికవరీ ఉన్నప్పటికీ.. 2025–26 అక్టోబర్–మార్చి నాటికి వృద్ధి ఊపందుకుంటున్నంత వరకు సమీప కాలంలో నియామకాలు తక్కువగానే ఉంటాయి. నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.. 2021–22, 2022–23 కాలంలో జోడించిన ఉద్యోగుల వినియోగం పెరుగుదల 2023–24, 2024–25 క్యూ1లో ఐటీ సేవల కంపెనీల నియామకాలపై ఒత్తిడి తెచ్చింది. అట్రిషన్ స్థాయిల పెరుగుదలతో పాటు, ఇక్రా ఎంచుకున్న కంపెనీలకు 2024–25 క్యూ1 వరకు ఏడు త్రైమాసికాల్లో నికర ఉద్యోగుల చేరిక ప్రతికూలతకు దారితీసింది. ఈ జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్ ఉన్నాయి.జనరేటివ్ (జెన్) ఏఐ వేగంగా ప్రవేశిస్తున్నందున ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యాపార అవకాశాలను అన్వేషించడం ద్వారా అన్ని ప్రముఖ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. కోవిడ్కు ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ఇది తాజా నియామకంలో మొత్తం నియంత్రణకు దారితీసే అవకాశం ఉందని అంచనా. ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం జనరేటివ్ ఏఐ విస్తృత స్వీకరణ ప్రభావం రాబోయే కొన్ని సంవత్సరాలలో కనిపిస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. డిమాండ్ నియంత్రణతో.. నివేదిక రూపకల్పనకు ఇక్రా ఎంచుకున్న కంపెనీల్లో ఒక్కో ఉద్యోగికి సగటు ఆదాయం 2019–20 నుంచి 2023–24లో దాదాపు 50,000 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. 12 నెలల అట్రిషన్ రేటు 2021–22 క్యూ4, 2022–23 క్యూ1 సమయంలో దాదాపు 23 శాతానికి చేరుకుంది. నియామకాలు పెద్ద ఎత్తున జరగడం, ఆ తరువాత డిమాండ్–సరఫరా అసమతుల్యత ఇందుకు కారణం.యూఎస్, యూరప్లోని కీలక మార్కెట్లలో డిమాండ్ నియంత్రణ కారణంగా ఐటీ సేవల కంపెనీల ద్వారా తక్కువ నియామకాలతో అట్రిషన్ క్రమంగా క్షీణించింది. ఇక్రా నమూనా కంపెనీల అట్రిషన్ రేటు 2023–24 క్యూ3 నుండి దాదాపు 13 శాతం వద్ద స్థిరీకరించడం ప్రారంభించింది. కోవిడ్ ముందస్తు 2019–20 క్యూ1లో ఇది 18 శాతం నమోదైంది అని ఇక్రా వివరించింది. -
ఆరోగ్య రంగంలో అధిక నియామకాలు
ముంబై: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో నియామకాలు పెరగనున్నాయని టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. ఈ రంగంలో 47 శాతం సంస్థలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. అత్యాధునిక టెలీహెల్త్ సేవల విస్తరణ, ముందస్తు వ్యాధి నివారణ సేవలకు పెరుగుతున్న ఆదరణతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నట్టు పేర్కొంది.ఈ రంగంలోని కీలక పోస్ట్లకు ఢిల్లీ, చైన్నై నగరాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ కేంద్రాలుగా అవతరించాయని, వైద్య పరిశోధన, అనుబంధ క్లినికల్ పరీక్షలు, డేటా నిర్వహణ విధులు ఇందులో కీలకమని పేర్కొంది. ‘‘వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి చికిత్సలు తీసుకోవడం కంటే, అవి రాక ముందే రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంశాల కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది’’అని టీమ్లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ అన్నారు. ఆన్లైన్ వైద్య సేవలకు డిమాండ్‘‘వృద్ధ జనాభా పెరుగుదల, దీర్ఘకాలిక అనారోగ్యాలు నిరంతరం వైద్య సహకారం, వినూత్నమైన చికిత్సల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. కానీ, ఆరోగ్య సంరక్షణ రంగం వినూత్నంగా నిలుస్తోంది. కరోనా తర్వాత నుంచి వర్చువల్ కన్సల్టేషన్ (ఆన్లైన్లో వైద్య సలహా), రిమోట్ హెల్త్కేర్ సేవలు సాధారణంగా మారిపోయాయి’’అని శంతను రూజ్ తెలిపారు. నర్సింగ్ అసిస్టెంట్లకు హైదరాబాద్, చండీగఢ్, గురుగ్రామ్లో ఎక్కువ డిమాండ్ నెలకొన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది.వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్లకు ముంబై, హైదరాబాద్, ఇండోర్లో ఎక్కువ డిమాండ్ ఉంది. డయాగ్నోస్టిక్స్ సేవల విస్తరణ, ఇంటర్నెట్ సాయంతో మారుమూల ప్రాంతాల నుంచే వైద్య సహకారం పొందడం వంటివి ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్టు రూజ్ తెలిపారు. ల్యాబ్ టెక్నిక్, డయాగ్నోస్టిక్స్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్, రోగుల సంరక్షణ, డేటా అనలైసిస్లో నైపుణ్యాలున్న వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. -
ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.నౌకరీ ప్లాట్ఫామ్పై వైట్కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్లో విదేశీ ఎంఎన్సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్లో 21 శాతం వృద్ధి కనిపించింది. -
ఐటీ జాబ్స్.. వచ్చే ఆరు నెలలూ అదుర్స్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న నేపథ్యంలో దేశీయంగా ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలు 10–12 శాతం వరకు పెరగనున్నాయి. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.బిజినెస్ సర్వీసుల సంస్థ క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. టెక్ నియామకాలకు నెలకొన్న డిమాండ్, మార్కెట్లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించే విధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. పుష్కలంగా టెక్ నిపుణుల లభ్యత, వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యాలతో డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్ 10–12 శాతం పెరగవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. టాప్ 5 నైపుణ్యాలు.. నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్లో 79 శాతం వాటా .. ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్సెక్యూరిటీ (20 శాతం), డెవ్ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.క్యూ2లో టెక్ హైరింగ్కి సంబంధించి జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ఆప్స్ నిపుణులకు డిమాండ్ కనిపించింది. ప్రాంతాలవారీగా చూస్తే మొత్తం ఉద్యోగావకాశాలకు సంబంధించి 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 43.5 శాతంతో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా జీసీసీలు విస్తరిస్తుండటంతో వివిధ నగరాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో సుశిక్షితులైన నిపుణులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. -
హిందీ నేర్పిస్తారా? ఎలాన్ మస్క్ అదిరిపోయే ఆఫర్
ఎలాన్ మస్క్కు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్ఏఐ(xAI).. హిందీ ట్యూటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో ఏఐ ట్యూటర్లుగా పనిచేయడానికి భాషా నిపుణుల కోసం గ్లోబల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించింది. ఇంగ్లీష్తోపాటు హిందీ, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్ వంటి ఇతర భాషలలో నిపుణులను నియమించుకుంటోంది.తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏఐ మోడల్స్ భాషా అభ్యాస ప్రక్రియలకు మార్గనిర్దేశం చేయడంలో ద్విభాషా కమ్యూనికేషన్, సాంకేతిక రచన లేదా జర్నలిజంలో నైపుణ్యం అవసరం. "బలమైన పరిశోధనా నైపుణ్యాలు, వివిధ సమాచార వనరులు, డేటాబేస్లు, ఆన్లైన్ వనరులను ఇంగ్లీష్ నుంచి ఇతర భాషలలోకి మార్చగల సామర్థ్యం చాలా అవసరం" అని ఉద్యోగ వివరణ పేర్కొంది.వర్క్ ఫ్రమ్ హోమ్ఎక్స్ఏఐ ప్రకటించిన ఈ ట్యూటర్ ఉద్యోగాలు పూర్తిగా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అభ్యర్థులు స్థానిక టైమ్ జోన్లో సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ ఉద్యోగ కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీనికి ఎంపికైనవారికి ప్రామాణిక వైద్య ప్రయోజనాలతో పాటు అర్హతలు, అనుభవాన్ని బట్టి గంటకు 35 నుండి 65 డాలర్లు (రూ. 2,900 నుండి రూ. 5,400) వరకు చెల్లిస్తారు.ఎక్స్ఏఐ గురించి..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్ఫామ్ ఎక్స్ఏఐని 2023లో ఎలాన్ మస్క్ స్థాపించారు. కృత్రిమ మేధస్సు సంక్లిష్టతను తొలగిస్తూ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని వివిధ భాషలకు తమ సేవలను విస్తరిస్తోంది. -
యాక్సెంచర్లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్ఏ) మీద ఫోకస్తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్కి భారత్లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
ఐటీ కంపెనీలు క్యాంపస్లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్ల కోసం కాలేజీ క్యాంపస్లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్టీఐమైండ్ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్న్యూస్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్బోర్డ్ చేశామని పేర్కొంది.టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్జీఏలను (ఫ్రెషర్స్) ఆన్బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్జీఏలను ఆన్బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్లైన్ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
జీసీసీల్లో హైరింగ్ జోరు
బడా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీలు) తమ సొంత అవసరాల కోసం దేశీయంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు జోరుగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారిగా ఐటీ సేవల కంపెనీలను మించి వీటిలో హైరింగ్ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి క్యూ1లో 46 శాతం అధికంగా జీసీసీల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది బహుళజాతి సంస్థలు భారత్లో కొత్తగా జీసీసీలను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని విస్తరించడంపై అంతర్జాతీయ కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సరీ్వసుల విభాగంలో సిబ్బంది సంఖ్య నికరంగా 50,000 పైచిలుకు పెరగ్గా జీసీసీల్లో 60,000 పైచిలుకు స్థాయిలో వృద్ధి చెందిందని వివరించాయి. అంతే గాకుండా ఐటీ సరీ్వసుల కంపెనీలతో పోలిస్తే కేపబిలిటీ సెంటర్లలో వేతనాలు 30–40 శాతం అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉండగా.. వచ్చే ఏడాదినాటికి ఇది 1,900కి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. 70వేల పైచిలుకు నియామకాలు..పరిశ్రమ వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు) నియామకాలకు ఎంఎన్సీల జీసీసీల్లో డిమాండ్ 20–25 శాతం మేర పెరిగింది. బహుళజాతి సంస్థలు తక్కువ వ్యయాలతో అవసరాల మేరకు కార్యకలాపాలను విస్తరించుకునే వెసులుబాటుపై దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమనది విశ్లేషణ . ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో జీసీసీలు 70,000 వరకు గిగ్ వర్కర్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపారపరమైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఫుల్–టైమ్ ప్రాతిపదికన కన్నా ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలను బట్టి తక్కువ వ్యయాలతో ఎంతమందినైనా తీసుకోవడానికి అవకాశం ఉండటం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫుల్–టైమ్ ఉద్యోగులతో పోలిస్తే గిగ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా కంపెనీ సగటున 25–40 శాతం వరకు వ్యయాలను ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నాయి. తాత్కాలిక, ప్రాజెక్ట్–ఆధారిత థర్డ్ పార్టీ నియామకాల విధానంలో మానవ వనరుల విభాగంపరమైన వ్యయాలు, హైరింగ్..ఆన్బోర్డింగ్ వ్యయాలు, అడ్మిని్రస్టేషన్ వ్యయాలు, ఎప్పటికప్పుడు వేతనాల పెంపు మొదలైన భారాలను కంపెనీలు తగ్గించుకోవచ్చని వివరించాయి. కొన్ని వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మొత్తం జీసీసీ సిబ్బందిలో 8 శాతంగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య వచ్చే 12 నెలల్లో సుమారు 11.6 శాతానికి చేరనుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జాబ్ మార్కెట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కంపెనీలు
ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు. మరోవైపు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం. ఫలితంగా జాబ్ మార్కెట్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో అదే జాబ్ మార్కెట్లో ‘గోస్ట్ జాబ్స్’ ట్రెండ్ మొదలైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ థ్రెడ్ యూజర్, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ గురించి షేర్ చేశారు. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గోస్ట్ జాబ్స్ ఏంటో తెలుసా? గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఓ టెక్ కంపెనీలో సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అప్లయ్ చేసుకోవచ్చంటూ సదరు కంపెనీ హైరింగ్ కేటగిరిలో సమాచారం ఇస్తుంది. పనిలో పనిగా అందులో ఓపెన్ అనే ఆప్షన్ ఉంచుతుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి కంపెనీకి కావాల్సిన అర్హతులు ఉన్న అభ్యర్ధులు జాబ్స్ కోసం అప్లయ్ చేస్తుంటారు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. రోజులు, నెలలు గడుస్తున్నా ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్ రాదు. కానీ కంపెనీ వెబ్సైట్ హైరింగ్ కేటగిరిలో ఉద్యోగులు కావాలనే సంకేతం ఇస్తూ ఓపెన్ అనే ఆప్షన్ను అలాగే ఉంచుతుంది. ఇదిగో ఇప్పుడు ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి ఆయా కంపెనీలు. దీన్ని గోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు. ఘోస్ట్ జాబ్ అంటే ఏమిటి? ఘోస్ట్ జాబ్స్ అంటే తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి. జాబ్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చంటూ ప్రకటనలు ఇస్తాయి. కానీ ఉద్యోగుల్ని నియమించుకోవు. దీనికి కారణం కంపెనీని బట్టి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు తమ వద్ద నిధులు లేకపోవడం, టాలెంట్ ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించేందుకు ఇలా చేస్తాయి. లేదంటే ఈ ఓపెన్ జాబ్లు త్వరలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలకు ముందుగానే కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఇలా చేసేందుకు అవకాశం ఉందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏం చెబుతోంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. కరోనా కష్టాలంలో చేస్తున్న ఉద్యోగులకు రాజీనామాలు చేసే సంఖ్య పెరగడం, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగాల సంఖ్య పెరిగినట్లు అంచనా. అంతేకాదు భవిష్యత్పై స్పష్టత లేని కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్లో ఉద్యోగుల్ని నియమించుకోవడం ఓ కారణమని అధ్యయనం తెలిపింది. ఉద్యోగం నిజమా? కాదా? అని తేల్చేదెలా? ఓ కంపెనీ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చినప్పుడు అవి నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్ జాబ్స్లో ఉద్యోగులు చేయాల్సి విధులు, ఇతర జీతభత్యాల గురించి అస్పష్టంగా ఉంటుంది. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారాలు లేదా నెలల తరబడి ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని ఘోస్ట్ జాబ్స్ అని అర్ధం చేసుకోవాలి. లేదంటే తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, అదే జాబ్స్ రోల్ ఎక్కువ కాలం ఉంచితే దాన్ని ఘోస్ట్ జాబ్గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తప్పు తెలుసుకుందా?
TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్ నాస్కామ్ సెషన్లో టీసీఎస్ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. 6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. మార్కెట్లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. టీసీఎస్ నియామక ప్రణాళికలతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు. -
2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా?
టెస్లా పవర్ ఇండియా ఇటీవల తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఏకంగా 2,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇంజినీరింగ్, ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్, సపోర్ట్ ఫంక్షన్లలోని వివిధ విభాగాలలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ ప్రకటనలో వెల్లడించింది. సస్టైనబుల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సేవలను అందిస్తున్న టెస్లా పవర్ కంపెనీ బ్యాటరీ బ్రాండ్ రీస్టోర్ను కూడా ప్రారంభించింది. కంపెనీ ఈ 2026 నాటికి దేశవ్యాప్తంగా ఈ రీస్టోర్ యూనిట్లను సుమారు ఐదు వేలకు చేర్చడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ రంగాల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నద్దమవుతోంది. భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించడంతో భాగంగా ప్రతిభావంతులైన కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు, వారికి మా సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని టెస్లా పవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కవిందర్ ఖురానా అన్నారు. -
లేఆఫ్స్ వేళ.. ఫ్రెషర్స్కు గుడ్ న్యూస్!
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కంపెనీలలో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 6 శాతం పెరిగినట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 62 శాతంగా ఉంటే, 2024 మొదటి ఆరు నెలలకు సంబంధించి 68 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇక క్రితం ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 3 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి కెరీర్ అవుట్లుక్ నివేదికను టీమ్లీజ్ ఎడ్టెక్ విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం ప్రస్తుత ఏడాది జనవరి–జూన్ కాలానికి స్వల్పంగా పెరిగి 79.3 శాతానికి చేరింది. ఈ స్థిరమైన వృద్ధి రానున్న నెలల్లో ఫ్రెషర్ల నియామకాలకు సంబంధించి సానుకూలతను సూచిస్తున్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది. ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో ఈ–కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్లు (55 శాతం), ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53 శాతం), టెలికమ్యూనికేషన్స్ (50 శాతం) కంపెనీల్లో ఉద్దేశ్యం వ్యక్తమైంది. ఇక ఐటీ రంగంలో మాత్రం గతేడాది మొదటి ఆరు నెలలో పోలిస్తే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశ్యం తగ్గుముఖం పట్టింది. 49 శాతం నుంచి 42 శాతానికి తగ్గింది. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో 3 శాతం, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీలో 4 శాతం చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి నియామకాల ధోరణి తగ్గింది. వీరికి డిమాండ్.. గ్రాఫిక్ డిజైనర్, లీగల్ అసోసియేట్, కెమికల్ ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొంది. ఎన్ఎల్పీ, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఐవోటీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, మెటావర్స్ ప్రముఖ డొమైన్ నైపుణ్యాలుగా ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. బెంగళూరులో ఫ్రెషర్లకు (69 శాతం) ఎక్కువగా అవకాశాలు రానున్నాయి. ఆ తర్వాత ముంబైలో 58 శాతం, చెన్నైలో 51 శాతం, ఢిల్లీలో 51 శాతం చొప్పున ఫ్రెషర్లను తీసుకునే విషయంలో కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జెనరేషన్ ఏఐ ప్రభావం ఫ్రెషర్ల నియామకాలపై ఏ మేరకు ఉంటుందన్న దానిపైనా ఈ నివేదిక దృష్టి సారించింది. సాఫ్ట్వేర్ డెవలపర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిజైనర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, టెక్నికల్ రైటర్లు, లీగల్ అసిస్టెంట్ల ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని గుర్తించింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, వాటిని అమలు చేయడం అన్నవి ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపింది. కనుక ఫ్రెషర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవడమే కాకుండా, జెనరేషన్ ఏఐతో కలసి పనిచేసే విధంగా ఉండాలని సూచించింది. 18 రంగాల నుంచి 526 చిన్న, మధ్య, భారీ కంపెనీలను విచారించిన టీమ్లీజ్ ఎడ్టెక్ ఈ వివరాలను నివేదికలో పొందుపరిచింది. -
ఈ ఏడాది నియామకాల్లో రికవరీ
ముంబై: డిసెంబర్లో జాబ్ మార్కెట్ కోలుకుంటున్న సంకేతాలు కనిపించిన నేపథ్యంలో ఈ ఏడాది నియామకాలు మెరుగుపడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2024లో మొత్తం హైరింగ్ 8.3 శాతం వృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఫౌండిట్ రూపొందించిన వార్షిక ట్రెండ్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది డిసెంబర్లో హైరింగ్లో 2 శాతం వృద్ధి నమోదైంది. కొత్త సంవత్సరంలో నియామకాల వృద్ధి 8.3 శాతంగా ఉండవచ్చని, బెంగళూరులో అత్యధికంగా 11 శాతం వృద్ధి నమోదు కావచ్చని నివేదిక పేర్కొంది. తయారీ, బీఎఫ్ఎస్ఐ, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్, టూరిజం విభాగంలో హైరింగ్ ఎక్కువగా ఉండనుంది. 2022తో పోలిస్తే 2023లో హైరింగ్ కార్యకలాపాలు 5 శాతం తగ్గాయి. అయితే, డిసెంబర్లో కాస్త మెరుగ్గా 2 శాతం వృద్ధి కనపర్చింది. 2022 మధ్య నుంచి జాబ్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న ట్రెండ్ 2023 ఆఖర్లో మారిందని నివేదిక తెలిపింది. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సరైన వారిని నియమించుకోవడంలో వ్యాపార సంస్థలకు సవాళ్లు ఎదురవుతున్నాయని, జాబ్ ఓపెనింగ్స్, హైరింగ్ మధ్య వ్యత్యాసం ఇదే సూచిస్తోందని పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తమ ప్లాట్ఫామ్లో నమోదైన డేటాను విశ్లేషించిన మీదట ఫౌండిట్ ఈ నివేదికను రూపొందించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2023లో కొన్ని రంగాలు చెప్పుకోతగ్గ స్థాయిలో వృద్ధి కనపర్చాయి. మారిటైమ్, షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలు 28 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా వాణిజ్యం పెరగడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇందుకు తోడ్పడ్డాయి. అలాగే రిటైల్, ట్రైవెల్, టూరిజం రంగాల్లో కూడా 25 శాతం వృద్ధి నమోదైంది. అడ్వరై్టజింగ్, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో 18 శాతం పెరుగుదల కనిపించింది. æ 2024లో కొత్త టెక్నాలజీల్లో అనుభవమున్న నిపుణులకు డిమాండ్ పెరగనుంది. కృత్రిమ మేథ/మెíÙన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు గణనీయంగా అవకాశాలు ఉంటాయి. -
భారీగా తగ్గిపోయిన నియామకాలు.. ఐటీ రంగం ప్రభావంతోనే!
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) 2023 డిసెంబర్ నెలలో భారీగా తగ్గిపోయాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం మేర తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్లో వెల్లడైంది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, హెల్త్కేర్ రంగాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘‘2023 నవంబర్తో పోలిస్తే డిసెంబర్ నెలలో కార్యాలయ ఉద్యోగ నియామకాలు 2 శాతం పెరిగాయి. ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఇందుకు అనుకూలించాయి. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ 16 శాతం తగ్గిపోవడానికి ఐటీ రంగమే ఎక్కువ ప్రభావం చూపించింది. ఐటీలో నియామకాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ కాలమే వేచి చూడాల్సి రావచ్చు’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ డిసెంబర్ నెల గణాంకాల ప్రకారం.. బీపీవో రంగంలో (వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) నియామకాలు 17 శాతం తగ్గాయి. విద్యా రంగంలో 11 శాతం, రిటైల్లో 11 శాతం, హెల్త్కేర్లో 10 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు ఏకంగా 21 శాతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబర్తో పోల్చి చూసినప్పుడు ఐటీ నియామకాలు 4 శాతం తగ్గాయి. డేటా సైంటిస్ట్లకు డిమాండ్.. ఐటీలో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ.. ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఫ్లాట్గా (పెరగకుండా/తగ్గకుండా) ఉన్నాయి. నౌకరీ డాట్ కామ్ ప్లాట్ఫామ్పై కొత్త జాబ్ పోస్టింగ్లు, నియామకాల ధోరణులు, ఉద్యోగాలకు సంబంధించిన శోధనల సమాచారాన్ని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 4 శాతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో ఆతిథ్య రంగ నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. 16 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అధిక డిమాండ్ నెలకొంది. ఫార్మా రంగంలోనూ 2 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, వదోదర, ముంబైలో ఫార్మా నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో 17 శాతం డౌన్ డిసెంబర్ నెలలో హైదరాబాద్లో నియామకాలు 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరులో అయితే 23 శాతం చొప్పున తగ్గాయి. పుణెలో 15 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. -
‘మీలో స్కిల్స్ ఉన్నాయా’.. కొత్త ఏడాది దిగ్గజ సంస్థల్లో నియామకాల జోరు!
చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికే ఉద్యోగం చేస్తూ మరో సంస్థలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, మీకో శుభవార్త!. మార్కెట్లో పెరిగిపోతున్న డిమాండ్కు అనుగుణంగా భారత్కు చెందిన టెక్నాలజీ,మార్కెటింగ్తో పాటు ఇతర విభాగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, రిక్రూట్మెంట్ కంపెనీ ‘మ్యాన్పవర్ గ్రూప్’ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వేని విడుదల చేసింది. ఆ సర్వేలో సుమారు 3,100కి పైగా రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 37శాతం నియామకాలు జనవరి - మార్చి 2024 సమయానికి ఆయా కంపెనీలు ఎంత మంది ఉద్యోగుల్ని తొలగించనున్నాయి. ఎంతమందిని నియమించుకోనున్నాయనే విషయంపై ఆరా తీసింది. ఈ సర్వేలో 37 శాతం మేర కంపెనీలో ఉద్యోగుల్ని హైయర్ చేసుకోనున్నాయి. గత ఏడాది పోలిస్తే నియమాకం 5 శాతం ఎక్కువగా ఉంది. సర్వే ప్రకారం... 37 శాతంతో భారత్, నెదర్లాండ్లు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో 35 శాతంతో కోస్టారికా- అమెరికా, 34 శాతంతో మెక్సికో 3వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా సగటున 26 శాతం మంది మాత్రమే ఉపాధి పొందనున్నారు. ఈ రంగాల్లో నియామకాల జోరు ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నియామకాల జోరు కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో టెక్నాలజీ, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ విభాగాలున్నాయి. ఐటీ కంపెనీలు 44 శాతం, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో 45 శాతం హైయర్ చేసుకోనుండగా కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ రంగంలో 42 శాతం, ఎనర్జీ, యుటిలిటీస్లో 28 శాతం జరగనున్నట్లు సర్వే తేల్చి చెప్పింది. టాలెంట్ గుర్తించ లేక జపాన్లో 85 శాతం కంపెనీలు ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవసరమయ్యే నిపుణుల్ని గుర్తించడంలో విఫలమైనట్లు మ్యాన్పవర్ గ్రూప్ సర్వే హైలెట్ చేసింది. ఆ తర్వాత జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్ 82 శాతం, భారత్ 81 శాతంతో కొనసాగుతున్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగాలకు భారీ డిమాండ్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్, ఆటోమొటీవ్ విభాగాలు ఉండగా.. వాటి తర్వాతి స్థానంలో ఐటీ విభాగం ఉంది. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించి వారిని ఆకట్టుకునేలా జీతాలు పెంచుతూ వారితో పనిచేయించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటి అండ్ డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్,హెచ్ఆర్లలో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ రంగాల్లో స్కిల్ ఉంటే జాబ్ త్వరగా సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీకి బ్యాడ్ టైమ్.. 25 ఏళ్ల టెక్నాలజీ చరిత్రలో ఇదే తొలిసారి!
భారత ఐటీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలా వరకు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేయడంతో పాటు.. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. వారిని వేతనాలు తగ్గించుకొని చేరాలని చెబుతున్నాయి. ఫలితంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవలందించే 10 కంపెనీలలో తొమ్మిదింటిలో నియామకాలు తగ్గాయి. నివేదిక ప్రకారం, 25 ఏళ్ల దేశ ఐటీ రంగ చరిత్రలో నియామకాలు తగ్గడం ఇదే తొలిసారి. జులై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) ముగింపు నాటికి ప్రముఖ టాప్ 10 భారత ఐటీ కంపెనీల్లో వర్క్ఫోర్స్ 2.06 మిలియన్లకు పడిపోయింది. త్రైమాసికం ప్రారంభంలో ఈ సంస్థలు 2.11 మిలియన్ల ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఒక్క ఎల్ అండ్ టీ మాత్రమే ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే ఉద్యోగుల నియామకాల్లో వృద్దిని సాధించింది. క్యూ2లో 32 మంది ఉద్యోగులను నియమించుకుంది. తద్వారా హెడ్కౌంట్ను ఆల్ టైమ్ హై 22,265కి చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సహా ఇతర ప్రధాన సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. అనిశ్చితే కారణం ఈ సందర్భంగా టీమ్లీజ్ డిజిటల్ స్టాఫింగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ చెమ్మన్కోటిల్ను మాట్లాడుతూ..మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల నియమకాలు తక్కువగా ఉన్నాయి. చివరి నాటికి ఈ హెడ్కౌంట్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. వర్క్ ప్రొడక్టివిటీని పెంచే టెక్నాలజీతో పాటు గిగ్స్ వంటి విభాగాల ఉద్యోగుల నియామకాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. -
షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్
దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 3.1 శాతం పెరిగి లాభం రూ.6,215 కోట్లగా నమోదైంది. ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరింది. అలాగే లితాల అనంతరం విలేకరుల సమావేశంలో సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అసమర్థతలను కంపెనీ మోస్తోందన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది.ఇన్ఫోసిస్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాలను 1 నుండి 2.5 శాతానికి తగ్గించింది. ఇంతకు ముందు రెవెన్యూ గైడెన్స్ 1 నుంచి 3.5 శాతంగా ఉండేది. అంతేకాదు ఏడాది కూడా క్యాంపస్ నియామకాలనలేవని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఫ్రెషర్లు ఎదుర్కొంటున్న ఆన్బోర్డింగ్ ఆలస్యంపై స్పందిస్తూ ఇప్పటికే ఉన్న ఆఫర్లకు తగిన సమయంలో కట్టుబడి ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 7,500మేర తగ్గింది.త్రైమాసికం క్రితం 17.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 14.6శాతానికి కి తగ్గిందిసెప్టెంబర్ త్రైమాసికంలో దాని మొత్తం సిబ్బంది సంఖ్య 7,530 తగ్గి 328,764కి చేరింది. యుఎస్లో కొనసాగుతున్న మాంద్యం భయాల మధ్య బలహీనమైన డీల్ పైప్లైన్ కారణంగా ఐటి సంస్థలు ఇప్పుడు ఫ్రెషర్లను నియమించుకోవడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నాయి. జీతాల పెంపు ఆలస్యం వేతనాల పెంపు ఆలస్యం చేస్తూ ఉద్యోగులను షాకిచ్చింది. నవంబర్ 1 నుండి తన వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ తెలిపారు. కంపెనీ ఏప్రిల్లో సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు, ఆ పైన జూలైలో పైన ఉన్నవారికి పెంపుదల ఉంటుంది. ఈ ఆలస్యానికి గల కారణాలను కంపెనీ స్పష్టం చేయలేదు. మరోవైపు Wipro, మెరిట్ జీతాల పెంపుదల డిసెంబర్ 1 కి వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగులకు తెలియజేసింది. HCLTech జూనియర్ ఉద్యోగులకు త్రైమాసిక పెంపుదలని వాయిదా వేసింది . సీనియర్ మేనేజ్మెంట్ కోసం మెరిట్ పెంపుదలని దాటవేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!
IT jobs data: దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా మారింది. నియామకాలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ నియామయాల పరిస్థితిని ప్రముఖ జాబ్ పోర్టల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్కేర్ బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 6 శాతం తగ్గాయి. జాబ్ పోర్టల్ నౌకరీ (Naukri) డేటా ప్రకారం.. 2023 ఆగస్టులో 2,666 జాబ్ పోస్టింగ్లు వచ్చాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,828 జాబ్ పోస్టింగ్లు వచ్చాయి. కాగా నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ (Naukri JobSpeak Index) ప్రకారం ఈ ఏడాది జులైలో 2,573 జాబ్ పోస్టింగ్లతో పోలిస్తే ఈ ఆగస్టులో నియామకాలు 4 శాతం పెరిగాయి. భారీగా తగ్గిన కొత్త జాబ్లు ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. ఐటీతో పాటు, బీమా, ఆటో, హెల్త్కేర్,బీపీఓ వంటి రంగాలు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కల్పనలో వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించినట్లుగా నివేదిక పేర్కొంది. జాబ్ మార్కెట్లో టెక్ రంగం ఇప్పటికీ కష్టపడుతుండగా, నాన్-టెక్ సెక్టార్లో మాత్రం నియామకాలు పెరిగాయి. నివేదిక ప్రకారం ఆయిల్&గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో కొత్త ఉద్యోగాలలో అత్యధిక వృద్ధి కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్మెంట్ వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరిగింది. -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్ఫారమ్లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్ఫారమ్లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్ను వివరించే స్క్రీన్షాట్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
కొత్త ఉద్యోగాలు పెరగనున్నాయ్.. ఇదిగో సాక్ష్యం!
కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడం లేదా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయడం గానీ పూర్తిగా ఆపేసాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలుబాటు కల్పించి ఇంటికే పరిమితం చేశాయి. కాగా ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.. నియామకాల జోరు కూడా పెరుగుతోంది. నివేదికల ప్రకారం, 2023 డిసెంబర్ చివరి నాటికి కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కంపెనీలు సన్నద్ధమవుతాయని తెలుస్తోంది. నౌకరి హైరింగ్ అవుట్ లుక్ (Naukri Hiring Outlook) రూపొందించిన ఒక నివేదికలో 1200ల కంటే ఎక్కువ నియామక సంస్థలు, కన్సల్టెంట్స్ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా? రానున్న రోజుల్లో దాదాపు 92 శాతం నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందులో కూడా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వాటిలో ఉద్యోగాలు మెండుగా ఉండనున్నాయి. ఈ ఏడాది చాలా సంస్థలు తమ ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్స్ కల్పించాయి, కాగా మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్ ఊసే ఎత్తలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడిన ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని బడా సంస్థలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. -
ఈ రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా?
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీఎఫ్ఎస్ఐ, తయారీ రంగాలు నియామకాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించినట్టు మానవ వనరుల ప్లాట్ఫామ్ ‘ఫౌండిట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఐటీలో 19 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో 13 శాతం, గృహోపకరణాల రంగంలో 26 శాతం, తయారీ రంగంలో 14 శాతం మేర నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు తగ్గాయి. వీటిల్లో కొన్ని రంగాలు నియామకాల విషయంలో మే నెలతో పోల్చిచూసినప్పుడు కాస్త మెరుగైన పనితీరు చూపించాయి. నెలవారీగా జాబ్ పోస్టింగ్ల డేటా ఆధారంగా ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ (గతంలో మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) ఈ వివరాలు ప్రకటించింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూన్ నెలలో 2 శాతం పెరిగాయి. హెల్త్కేర్లో 11 శాతం, బీపీవోలో 7 శాతం, తయారీలో 5 శాతం, లాజిస్టిక్స్లో 9 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించింది. ముఖ్యంగా మెట్రోల్లో 3 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. టైర్–2 పట్టణాల్లో 2 శాతం మేర క్షీణత కనిపించింది. 0–2 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొనగా, మేనేజ్మెంట్ ఉద్యోగుల నియామకాలు 4 శాతం పెరిగాయి. 11–15 ఏళ్ల అనుభవం కలిగి సీనియర్ ఉద్యోగుల నియామకాలు ఒక శాతం, 7–10 ఏళ్ల అనుభవం ఉన్న విభాగంలో 2 శాతం, 4–6 ఏళ్ల అనుభవం కలిగిన విభాగంలో 2 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. రానున్న త్రైమాసికంలో మెరుగు.. ‘‘మేము ట్రాక్ చేస్తున్న మెజారిటీ రంగాల్లో నియామకాల్లో సానుకూల ధోరణి కనిపించడం ప్రోత్సాహకరంగా అనిపించింది. హెల్త్కేర్, తయారీ, ఐటీలోనూ కొంత మేర నియామకాలు పుంజుకున్నాయి. రానున్న త్రైమాసికంలో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. కంపెనీలు తమ నైపుణ్య అవసరాలను తిరిగి సమీక్షించుకోనున్నాయి’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీష తెలిపారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్పును స్వీకరించడం అనేవి ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఉద్యోగంలో రాణించేందుకు అవసరమని సూచించారు. ఐటీ రంగంలో కూడా తగ్గాయంటున్న నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో మూడు శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వేలో తేలిసింది. ఐటీ, రిటైల్, బీపీవో, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ నియామకాల విషయంలో అప్రమ్తత ధోరణి వ్యవహరించడమే ఇందుకు కారణంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయంగా తగ్గాయి. జూన్ నెలలో 2,795 ఉద్యోగాలకు పోస్టింగ్లు పడ్డాయి. 2022 జూన్ నెలలో ఇవి 2,878గానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మే నెల నియామకాలతో పోల్చి చూసినా జూన్లో 2 శాతం తగ్గాయి. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రతి నెలా ఉద్యోగ మార్కెట్ ధోరణులు, నియామకాల వివరాలను విడుదల చేస్తుంటుంది. కార్యాలయ ఉద్యోగ మార్కెట్ దీర్ఘకాలం తర్వాత నిర్మాణాత్మక మార్పును చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఈ ఉద్యోగాలకు మెట్రో పట్టణాలు కీలక చోదకంగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, బీఎఫ్ఎస్ఐ ఎక్కువ ఉద్యోగాలకు కల్పించినట్టు నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో ఆందోళనకరం ఐటీ రంగంలో నియామకాల ధోరణి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. గతేడాది జూన్ నెలతో పోల్చిచూసినప్పుడు, ఈ ఏడాది జూన్లో ఐటీ నియామకాలు 31 శాతం తక్కువగా నమోదైనట్టు వివరించింది. అన్ని రకాల ఐటీ కంపెనీల్లోనూ ఇదే ధోరణి కనిపించినట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, సిస్టమ్ అనలిస్టులకు డిమాండ్ క్షీణత కొనసాగినట్టు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఏఐ స్పెషలిస్ట్ల నియామకాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో బుల్లిష్ ధోరణి కొనసాగిందని, జూన్లో కొత్త ఉద్యోగ నియామకాలు ఈ రంగంలో క్రితం ఏడాది ఇదే మాసంతో పోల్చినప్పుడు 40 శాతం పెరిగాయని పేర్కొంది. పెద్ద ఎత్తున రిఫైనరీ సామర్థ్యాల విస్తరణ, దేశీయ డిమాండ్ అవసరాలను చేరుకునేందుకు కంపెనీల వ్యూహాలు నియామకాలకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. ఫార్మా రంగంలో నియామకాలు 14 శాతం పెరిగాయి. ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్లోనూ నియామకాల గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు జూన్లో 23 శాతం వృద్ధి చెందాయి. వదోదరలో 14 శాతం, జైపూర్లో స్థిరంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్మీడియా వెబ్సైట్ కారణాలివే!
ప్రముఖ సోషల్మీడియా వెబ్సైట్ రెడిట్ తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో పునర్నిర్మించే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ సుమారు 90 మంది ఉద్యోగులను తొలగిస్తోంది . అంతేకాదు రానున్న సంవత్సరాల్లో హైరింగ్ను ప్రణాళికలను వెనక్కి తీసుకుంటోంది. కంపెనీ స్టీవ్ హఫ్ఫ్మాన్ ఈ సందేశాన్ని ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్లో తెలియజేశారు. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కంపెనీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు .2024 చివరి నాటికి కంపెనీ ప్రణాళికలను సమీక్షించనున్నామనీ, రీస్ట్రక్చర్ నిర్ణయం ఫలితం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఇది ఇకపై కూడా కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేవారు. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) నివేదిక ప్రకారం దాదాపు 5శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది.300 మంది అదనపు ఉద్యోగులను నియమించుకోవాలని భావించింది, కానీ ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 100కి తగ్గించేసినట్టు సమాచారం. ప్రస్తుతం కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులున్నారు. ఇదీ చదవండి: ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం -
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
-
అనిశ్చితిలో ‘అద్భుత దీపం’.. 15 వేల మందిని నియమించుకోనున్న ఈ-కామర్స్ దిగ్గజం!
ఆర్థిక అనిశ్చితితో ప్రపంచమంతా అనేక కంపెనీల్లో నియామకాలు మందగించి లేఆఫ్ల బాట పడుతున్న వేళ చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మంచి వార్త చెప్పింది. ఈ సంవత్సరం 15000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ తన ఆరు ప్రధాన వ్యాపార విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది మొత్తంగా 15,000 మందిని నియమించుకోనున్నట్లు అలీబాబా గ్రూప్ చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ "వీబో" ద్వారా మే 25న ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త నియామకాల్లో 3,000 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయనున్నట్లు తెలిపింది. అంటే ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వనుంది. తమ సంస్థలో భారీగా తొలగింపులు జరగనున్నాయని గతంలో వచ్చిన వార్తలను పుకార్లుగా కొట్టిపారేసింది. ఉద్యోగులు వెళ్లిపోవడం అనేది సాధారణ ప్రవాహంలో భాగమని పేర్కొంది. కాగా అలీబాబాకు చెందిన క్లౌడ్ విభాగం ఉద్యోగ కోతలను ప్రారంభించిందని, సుమారు 7 శాతం సిబ్బందిని తగ్గించవచ్చని బ్లూమ్బెర్గ్ ఇటీవల నివేదించింది. అలీబాబా 15000 ఉద్యోగాల నియామకాల గురించి వెల్లడించడం ద్వారా బ్లూమ్బర్గ్ నివేదిక అవాస్తవం అని తెలియజేసింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేనియల్ జాంగ్ మే నెల ప్రారంభంలో మొదటిసారిగా కంపెనీ వివరాలను వెల్లడించారు. 2023 మార్చి నాటికి సంస్థలో 2,35,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అప్పటికింకా సంస్థలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు కాలేదు. ఇదీ చదవండి: Meta Layoffs 2023: మెటాలో తొలగింపులు! వారికి జుకర్బర్గ్ ఇస్తానన్న ప్యాకేజీ ఏంటో తెలుసా? -
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో హైరింగ్ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్ నుంచి మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్ చానల్స్ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్–ఎండ్ సిస్టమ్స్ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన. మారుతీ కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్ హైరింగ్ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీతో జట్టు కట్టింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ భారత్లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) క్యాంపస్లలోనూ ఆసక్తి.. ఆటోమొబైల్ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్ ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితరుల కోసం డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్ చేసుకునే ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి. -
ఐటీ ఉద్యోగులకు చేదువార్త: వేరియబుల్ పే కట్స్, హైరింగ్పై నిపుణుల వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్మెంట్ సెషన్లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్లో అంత యాక్టివ్గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్కైట్స్ (APAC) హెచ్ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. -
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపు.. ఐటీ రంగంలో వీళ్లకి తిరుగులేదు!
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువ స్థాయిలో ఉండనున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆ రంగానికి చెందిన సీనియర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోతుందన్న భయాలు నెలకొన్న తరుణంలో చిన్న చిన్న కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో మిగిలిన రంగాల పరిస్థితులు ఎలా ఉన్న టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో ఈ లేఆఫ్స్ భయాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రముఖ దేశీయ ఎంప్లాయిమెంట్ సంస్థ నౌకరీ.. 1400 మంది రిక్రూట్లు, జాబ్ కన్సల్టెన్సీలతో సర్వే నిర్వహించింది. ఆ అధ్యయనంలో 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్రెషర్ల నియామకం ముమ్మరంగా కొనసాగనుందని, లేఆఫ్స్ .. ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్పై తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఐటీ రంగంలో 6 నెలలు పాటు అట్రిషన్ రేటు అధికంగా 15 శాతం ఉండనుందని, అదే సమయంలో గ్లోబుల్ మార్కెట్లో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్ భారీగా ఉంటుదని రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి పైగా 29 శాతంతో కొత్త ఉద్యోగాల రూపకల్పనలో నిమగ్నం కాగా.. 17 శాతం ఉద్యోగులు సంఖ్యను అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. 2023 మొదటి అర్ధభాగంలో (6 నెలలు) నియామక కార్యకలాపాలపై ఆశాజనకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందున .. భారతీయ ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్లను పొందవచ్చని అంచనా. సర్వే చేసిన మొత్తం రిక్రూటర్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సగటు పెరుగుదలను 20 శాతానికి పైగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నియామకాల ట్రెండ్లపై ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా క్యాంపస్ సెలక్షన్లు ఎక్కువ జరుగుతాయని సమాచారం. -
రూ.346.6 కోట్ల నష్టం.. జొమాటో సంచలన నిర్ణయం!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. జొమాటో త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. ఆ ఫలితాల్లో ఫుడ్ డెలివరీ రంగంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల కారణంగా డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. కాబట్టే పనితీరు ప్రోత్సాహకరంగా లేని చిన్న నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం డిమాండ్లో మందగమనం ఊహించని విధంగా ఉంది. ఇది ఫుడ్ డెలివరీ లాభాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ లాభదాయకత లక్ష్యాన్ని చేరుకునే స్థితులో ఉన్నామని భావిస్తున్నట్లు కంపెనీ తన క్యూ3 నివేదికలో పేర్కొంది. అందుబాటులో గోల్డ్సబ్స్క్రిప్షన్ జొమాటో దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్లలో ఒకటి నిలిచింది.మార్కెట్ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు గోల్డ్ సబ్స్క్రిప్షన్ను తిరిగి ప్రారంభించింది. మరోవైపు 225 చిన్న నగరాల నుండి వైదొలగాలని కంపెనీ నిర్ణయం తీసుకున్న తరుణంలో దాదాపు 800 మంది నియమించుకోవాలని యోచిస్తోంది. -
వావ్.. 2500 ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న కంపెనీ
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజాల నుంచి స్టార్టప్ల దాకా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల ఊచకోత వార్తలు ఆందోళన రేపుతోంటే ఒక యూనికార్న్ ఎడ్టెక్ సంస్థ గుడ్న్యూస్ చెప్పింది. 2023,మార్చి నాటికి 2500మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఫిజిక్స్ వాలా ప్రకటించింది. బిజినెస్ అనలిస్ట్లు, డేటా అనలిస్ట్లు, కౌన్సెలర్లు, ఆపరేషన్స్ మేనేజర్లు, బ్యాచ్ మేనేజర్లు, టీచర్లు, ఇతర ఫ్యాకల్టీ సభ్యులతో పాటు నిపుణులను నియమిస్తున్నట్లు ఫిజిక్స్ వాలా కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రతిష్టాత్మక బ్రాండ్ వృద్ధి లక్ష్యాలకనుగుణంగానే ఈ నియామకాలని తెలిపింది. అన్నింటికీ మించి విద్యార్థులందరికీ సరసమైన, నాణ్యమైన విద్యను అందించాలనే తమ విజన్కు అనుగుణంగా పనిచేసే ఉత్సాహవంతులైన, నిబద్ధతల వారి కోసం చూస్తున్నామని సంస్థ హెచ్ ఆర్ హెడ్, సతీష్ ఖేంగ్రే తెలిపారు. కాగా కంపెనీలో ప్రస్తుతం 6,500 మంది ఉద్యోగులున్నాయి. ఇందులో 2వేల మంది ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు ఉన్నారు. గత నెలలో, అప్స్కిల్లింగ్ విభాగంలో iNeuronని కొనుగోలు చేసింది కంపెనీ. గత ఏడాది బైజూస్, అనాకాడెమీ, వేదాంతు, ఫ్రంట్రో మొదలైన అనేక ఎడ్టెక్ కంపెనీలు భారీ లే-ఆఫ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లక్షల్లో ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ సంచలనం!
సాఫ్ట్వేర్ కొలువు.. ఐటీ రంగంలో కెరీర్.. దేశంలో డిగ్రీ స్థాయి కోర్సులు చదువుతున్న ప్రతి ఒక్కరి స్వప్నం! చదివిన డొమైన్తో సంబంధం లేకుండా.. ఇప్పుడు అధికశాతం మంది ఐటీ జాబ్స్ కోసం అన్వేషణ సాగిస్తున్న పరిస్థితి! కాని∙క్యాంపస్ డ్రైవ్స్ కేవలం ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న టాప్ కాలేజీల విద్యార్థులకే లభిస్తున్నాయనే భావన! ఇలాంటి వారు తమ సాఫ్ట్వేర్ కొలువు కలను సాకారం చేసుకునేందుకు మార్గం.. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్!! దేశంలో టాప్–5 ఐటీ కంపెనీల జాబితాలో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్.. ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో చేపడుతున్న నియామక విధానమే.. స్మార్ట్ హైరింగ్! తాజాగా స్మార్ట్ హైరింగ్–2023 ప్రక్రియను టీసీఎస్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. స్మార్ట్ హైరింగ్కు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్ తదితర వివరాలు ఐటీ కంపెనీల్లో నాన్–ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కొలువు అందని ద్రాక్షే అనే అభిప్రాయముంది. దీనికి భిన్నంగా.. సైన్స్, మ్యాథమెటిక్స్,స్టాటిస్టిక్స్, ఒకేషనల్, కంప్యూటర్స్/ఐటీ సబ్జెక్ట్లతో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్వేర్ జాబ్ ఖరారు చేసేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్..ఆఫ్ క్యాంపస్ విధానంలో చేపడుతున్న నియామక ప్రక్రియే.. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్. అర్హతలు నిర్దేశిత గ్రూప్లలో 2023లో డిగ్రీ పూర్తి చేసుకోనున్న విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను టీసీఎస్లోప్రారంభించింది.∙బీసీఏ, బీఎస్సీ(మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/బయో కెమిస్ట్రీ/కంప్యూటర్ సైన్స్/ఐటీ), కంప్యూటర్ సైన్స్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులను 2023 లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులను అర్హులుగా పేర్కొంది. ∙పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు ప్రతి స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు లేదా 5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ∙బ్యాచిలర్ డిగ్రీలో ఒక బ్యాక్లాగ్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ∙అకడమిక్గా గ్యాప్ రెండేళ్ల కంటే ఎక్కువ ఉండకూడదని కూడా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 18–28 ఏళ్ల మధ్య ఉండాలి. ‘సైన్స్ టు సాఫ్ట్వేర్’ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రధాన ఉద్దేశం..ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ను విస్తృతం చేయడం.అదే విధం గా.. నిర్దేశిత సబ్జెక్ట్ గ్రూప్లతో డిగ్రీ పూర్తి చేసిన వారికి సాఫ్ట్వేర్ కొలువులు ఖరారు చేయడం. ఇందుకోసం ప్రత్యేకంగా సైన్స్ టు సాఫ్ట్వేర్ పేరుతో వినూత్న ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్లతో బీ ఎస్సీ..అదే విధంగా బీసీఏ,సీఎస్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను చేపడుతోంది. సమయం ఆదాటీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియలో మరోప్రధాన ఉద్దేశం.. సమయం ఆదా చేయడం. వాస్తవానికి క్యాంపస్ డ్రైవ్స్ విధానంలో నియామక ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతోంది. దీంతో అటు విద్యార్థులకు, ఇటు సంస్థకు సమయం ఆదా అయ్యేలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ దోహదపడుతుంది. 40 వేల మంది టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ద్వారా ఏటా దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకుంటోంది. ఈ సంఖ్యను ప్రతి ఏటా సంస్థ నియామక ప్రణాళిక ఆధారంగా నిర్ధారిస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు రెండువేలకు పైగా ఇన్స్టిట్యూట్ల విద్యార్థులకు ఈఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల శిక్షణ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆఫర్ ఖరారు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్,బిహేవియర్ స్కిల్స్, ఇతర సాఫ్ట్ స్కిల్స్లోనూ నైపుణ్యం పొందేలా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్ విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. మూడు దశల ఎంపిక ప్రక్రియ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ విధానంలో మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్ష ఫిబ్రవరి 10వ తేదీన టీసీఎస్ ఐయాన్ సెంటర్లలో జరుగుతుంది. రాత పరీక్ష.. మూడు విభాగాలు తొలుత ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల(వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరిక్ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 15–20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పరీక్ష వ్యవధి 50 నిమిషాలు. రెండో దశ.. టెక్నికల్ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్లో సంస్థ నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశ టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశలో ఐటీ రంగానికి సంబంధించిన అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానం,సాఫ్ట్వేర్ రంగంపై ఆసక్తి, అకడమిక్ నేపథ్యం ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్లలో నైపుణ్యాలను పరీక్షిస్తారు. చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెక్నికల్ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,నాయకత్వ లక్షణాలను,సాఫ్ట్ స్కిల్స్ను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో నూ విజయం సాధిస్తే.. నియామకం ఖరారు చేసి..ఆరు నెలలపాటు నిర్వహించే శిక్షణకు పంపుతారు. రాత పరీక్షలో విజయం ఇలా తొలి దశగా నిర్వహించే రాత పరీక్షలో.. 3 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అవి.. వెర్బల్ ఎబిలిటీ యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్,ది ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాక్టివ్–ప్యాసివ్ వాయిస్, క్లోజ్ టెస్ట్, వెర్బల్ అనాలజీస్, సెంటెన్స్ కరెక్షన్, పేరా రైటింగ్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, డైరెక్ట్–ఇన్డైరెక్ట్ స్పీచ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఇంగ్లిష్ గ్రామర్పై పదో తరగతి స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా సెంటెన్స్ ఫార్మేషన్, కరెక్షన్, కాంప్రహెన్షన్ల కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ ఈ విభాగంలో కోడింగ్, డీ కోడింగ్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ,సిరీస్, పజిల్స్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రమ్స్, విజువల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ ఈ విభాగంలో ఫ్రాక్షన్స్,ప్రాబబిలిటీ, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, యావరేజెస్, ఈక్వేషన్స్, ఏరియా,స్సేస్, పెరిమీటర్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, వర్క్ అండ్ టైమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, నంబర్ సిస్టమ్, ఎల్సీఎం, హెచ్సీఎం, పర్సంటేజెస్ వంటి ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వడం కోసం 12వ తరగతి స్థాయిలోప్యూర్ మ్యాథ్స్, అదే విధంగా అర్థమెటిక్ పుస్తకాలు అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సగటున 50 సెకన్ల నుంచి ఒక నిమిషం వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. రిజిస్ట్రేషన్ ఇలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్–2023కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://nextstep.tcs.com/campus/#/ లో లాగిన్ ఐడీ,పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐటీ, బీపీఎస్ విభాగాల్లో తమకు ఆసక్తి ఉన్న విభాగంపై క్లిక్ చేయాలి. తర్వాత దశలో ఆన్లైన్ అప్లికేషన్ను పూర్తి చేయాలి. అదే విధంగా నిర్దేశిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2023 ఆన్లైన్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 10, 2023 ∙పూర్తి వివరాలకు వెబ్సైట్: www.tcs.com/careers/india/tcs-smart-hiring-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్: https://nextstep.tcs.com/campus/# -
టీసీఎస్ సంచలనం, ఇక ‘ఐటీ ఉద్యోగులకు పండగే!’
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు. 150,000 మంది నియామకం టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు. చదవండి👉 మూన్లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ఉద్యోగాల ఊచకోత..వందల మందిని తొలగిస్తున్న టెక్ కంపెనీలు..ఇదే బాటలో
ఆతిథ్య సేవల్ని అందించే ఓయో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్లో ఆర్ధిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనతో సంస్థకు చెందిన 600మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. ఓయోలో దేశ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సంస్థ పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్)లో భాగంగా ఇంజినీరింగ్,వెకేషన్ హోమ్ టీమ్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. అదే సమయంలో పార్ట్నర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవెలప్మెంట్ విభాగాల్లో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇక యాప్లో గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్, పాట్రన్ ఫెసిలిటేట్ కంటెంట్ వంటి కాన్సెప్ట్లను అభివృద్ధి చేస్తున్న టీమ్ సభ్యుల్లో ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇండియన్ టెకీలకు తీపికబురు అందించారు. తాజా అంచనాలు ఈ ఊహాగానాలను బలాన్నిస్తున్నాయి. ట్విటర్ కొత్త నియామాకాల్లో ఎక్కువగా భారతదేశ ఇంజనీర్లను నియమించాలని మస్క్ యోచిస్తున్నారట. ట్విటర్ ఇంటర్నెల్ సమావేశంలో, ప్లాట్ఫారమ్ టెక్నాలజీ స్టాక్ను మొదటి నుండి నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మస్క్ ఇండియన్ ఇంజనీర్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) ట్విటర్లో ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియకు ముగింపు పలికిన మస్క్ ఇపుడిక మరింత మందిని నియమించుకోవాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువమందిని నియమించుకునే తన ప్రణాళికలను వెల్లడించారు. సంస్థ అంతర్గత సమావేశంసందర్భంగా, జపాన్, ఇండియా, ఇండోనేషియా. బ్రెజిల్లలో ఇంజనీరింగ్ బృందాలను నియమించుకోనున్నారని ది వెర్జ్ రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం భారత్లోనూ ఇంజినీరింగ్ బృందాల ఏర్పాటును మస్క్ సూచనప్రాయంగా వెల్లడించారు. మస్క్ ఎలాంటి ఇంజనీర్లు లేదా ఎలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించు కోవాలనుకుంటున్నారో నివేదిక పేర్కొనలేదు. అయితే సాఫ్ట్వేర్ రాయడంలో నిపుణుల అవసరాన్ని నొక్కి చెప్పిన మస్క్ వారికే 'అత్యున్నత ప్రాధాన్యత' అని ప్రకటించారు. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) ఉద్యోగులకు కొత్త పరిహారం, ప్రధాన కార్యాలయ మార్పులేదు అంతేకాదు తొలగించిన ఉద్యోగులకు అందించే పరిహారంపై కూడా మస్క్ మాట్లాడారు. స్పేస్ఎక్స్ కంపెనీలో మాదిరిగానే వారికివ్వాల్సిన పరిహారాన్ని స్టాక్ ఆప్షన్లలో చెల్లిస్తామనీ, ప్రతిసారీ ఆ స్టాక్లను లిక్విడేట్ చేయడానికి అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్ ట్విటర్ పై మస్క్ ప్రశంసించిన ట్విటర్ అమెరికా ట్విటర్ సెంట్రిక్ కాదని వ్యాఖ్యానించారు. యూఎస్తో పోలిస్తే తక్కువ జనాభా ఉన్నప్పటికీ జపాన్లో యాక్టివ్ యూజర్ల సంఖ్య దాదాపు అదే రేంజ్లో ఉందని పేర్కొన్నారు. ట్విటర్ తన ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుండి టెక్సాస్కు తరలింపు వార్తలను కూడా మస్క్ ఖండించారు. ట్విటర్లో ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతున్న తరుణంలో చాలా తప్పులు ఉంటాయి కానీ కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయని మస్క్ ట్వీట్ చేయడం గమనార్హం. అక్టోబరులో మస్క్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ట్విటర్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 7,500 ఉండగా, ప్రస్తుతం 2,750 మందికి చేరింది. కాగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా కొంతమంది ఎగ్జిక్యూటివ్లను తొలగించారు. అలాగే సంస్థలో సగంమంది ఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. దీనికి తోడు ఎక్కువ పనిగంటలు పనిచేస్తారా, రాజీనామా చేస్తారా అన్న అల్టిమేటంపై అనూహ్యంగా స్పందించిన దాదాపు 1200 మంది ఉద్యోగులు ట్విటర్కు బైబై చెప్పారు. కాగా నెలకు 8 డాలర్లతో బ్లూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 29నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సేవను మస్క్ మరోసారి వాయిదా వేశారు. ట్విటర్ డీల్ తరువాత మస్క్కు భారత సంతతికి చెందిన మాజీ ట్విటర్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్ కృష్ణన్ ప్రధాన సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఉపాధి కల్పన ఊపందుకోనున్నట్లు టీమ్లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ నివేదిక అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉద్యోగ నియామకాల్లో 61 శాతం వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. ఇందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) దోహదపడనున్నట్లు తెలియజేసింది. పీఎల్ఐకింద పబ్లిక్ పెట్టుబడులు పెరగనుండటంతో క్యూ2లో భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు టీమ్లీజ్ నిర్వహించిన సర్వేలో కంపెనీలు వెల్లడించాయి. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 54 శాతంతో పోలిస్తే ఉపాధి కల్పనకు పెరిగిన ఆసక్తి 7 శాతం అధికమని టీమ్లీజ్ తెలియజేసింది. నగరాల స్పీడ్ త్రైమాసికవారీగా చూస్తే రానున్న కాలం(క్యూ2)లో మెట్రోలు, టైర్–1 నగరాలలో ఉద్యోగ కల్పన ఆసక్తి 6 శాతం పుంజుకుని 89 శాతానికి చేరినట్లు నివేదిక తెలియజేసింది. ఇక టైర్–2 నగరాలలో మరింత అధికంగా 7 శాతం బలపడి ఉపాధి కల్పనాసక్తి 62 శాతాన్ని తాకింది. టైర్–3 పట్టణాలలో ఇది 3 శాతం పెరిగి 37 శాతమయ్యింది. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి నామమాత్ర వృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టికి 2 శాతమే ఆసక్తి కనబడింది. ఈ సర్వేకు టీమ్లీజ్ 14 నగరాలు, పట్టణాల నుంచి 23 రంగాలను పరిగణించింది. 900 చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలను ఎంపిక చేసుకుంది. సర్వీసులు భేష్ ఉపాధి కల్పనకు సై అంటున్న సర్వీసుల రంగంలో బెంగళూరు(97 శాతం), ముంబై(81 శాతం), ఢిల్లీ(68 శాతం) ముందు నిలిచాయి. ఇక తయారీ రంగంలో అయితే ఢిల్లీ(72 శాతం), ముంబై(59 శాతం), చెన్నై(55 శాతం) జాబితాలో చోటు సాధించాయి. పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పనకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు టీమ్లీజ్ సహవ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి తెలియజేశారు. పీఎల్ఐ పథకంలో భాగంగా పబ్లిక్ పెట్టుబడులు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.65 లక్షల కోట్ల ముందస్తు సహాయక ప్యాకేజీ.. పర్యాటకం, విమానయానం, హౌసింగ్ తదితర పలు రంగాలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఉద్యోగావకాశాల పట్ల సానుకూల థృక్పథం నెలకొన్నట్లు వివరించారు. రానున్న త్రైమాసికాలలోనూ హైరింగ్ సెంటిమెంటు 70 శాతం మార్క్ను దాటగలదని అంచనా వేశారు. మహమ్మారితో చెక్ కోవిడ్–19 కేసులు పెరగడం, లేదా ఆంక్షల అమలుతో కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ ఉపాధి కల్పనను నిలిపి వేస్తున్నట్లు చక్రవర్తి తెలియజేశారు. అయితే మొత్తంగా ఇందుకు అనుకూల వాతావరణమే ప్రస్తుతం నెలకొని ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పరిమాణంరీత్యా చూస్తే చిన్న సంస్థలు అత్యధికంగా 47 శాతం(6 శాతం ప్లస్), మధ్యతరహా, భారీ కంపెనీలు 69 శాతం(4 శాతం అప్) హైరింగ్కు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మధ్య, సీనియర్ స్థాయిలతో పోలిస్తే ప్రారంభస్థాయి ఉపాధి కల్పన వేగమందుకోగా.. తదుపరి జూనియర్ స్థాయికి డిమాండ్ ఉన్నట్లు తెలియజేసింది. మార్కెటింగ్ విభాగంలో ఉపాధి కల్పనాసక్తి 10 శాతం పెరిగి 63 శాతానికి, ఐటీలో 8 శాతం పుంజుకుని 90 శాతానికి చేరింది. -
భర్తను అద్దెకిచ్చిన భార్య.. అవాక్కవ్వకండి, అక్కడే ఉంది అసలు విషయం
భార్యేంటి.. భర్తను అద్దెకివ్వడమేంటని అవాక్కవ్వకండి. ఆమె భర్తను అద్దెకిచ్చింది... ఇల్లు రిపేర్, అలంకరణ, పునరుద్ధరణ వంటి పనులకోసం. సాధారణంగా ఇలాంటి పనులు ఎవరింట్లో వాళ్లే చేసుకోవచ్చు. కానీ కొందరికి సమయం దొరకదు. కొన్నిళ్లలో వృద్ధులు మాత్రమే ఉంటారు. ఇంట్లో పనులు చేసుకోలేరు. అలా అని పెద్ద వర్క్స్ చేసేవాళ్లకిస్తే ఎక్కువ చార్జ్ చేస్తారు. చిన్న పనికోసం అంత ఖర్చు చేయాలా అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి పనులను అద్భుతంగా చేసే తన భర్తను ‘హైర్ మై హ్యాండీ హబ్బీ’ పేరుతో అద్దెకిచ్చిందీ మహిళ. యూకేకు చెందిన లారా యంగ్కు ముగ్గురు పిల్లలు. కుటుంబం బకింగ్హామ్ షైర్లో నివాసముంటోంది. అంతకుముందు వేర్హౌజ్లో పనిచేసిన ఆమె భర్త జేమ్స్.. ఆటిజంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి భార్య ఇబ్బంది పడటం చూసి ఉద్యోగం మానేశాడు. జేమ్స్ కార్పెంట్ వర్క్ అద్భుతంగా చేస్తాడు. పెయింటింగ్, అలంకరణ, టైల్స్ వేయడంలోనూ నిపుణుడు. తన ఇంటిని కూడా అలాగే సరికొత్తగా మార్చేశాడు. గది వైశాల్యాన్ని బట్టి బెడ్స్, కిచెన్, చెత్తనుంచి డైనింగ్ టేబుల్ ఇలా కొత్తకొత్తవాటిని సృష్టించాడు. గార్డెనింగ్లోనూ జేమ్స్ది అందెవేసిన చేయి. బంధువులు, స్నేహితుల ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్దాడు. రోజువారీ ఖర్చులు పెరగడంతో ఆ కష్టాలను అధిగమించడానికి జేమ్స్ చేయదగ్గ పార్ట్ టైమ్ వర్క్ ఇదొక్కటే అనుకుంది. మోటార్ మెకానిక్స్ చదవాలనుకుంటున్న జేమ్స్ సమయానికీ సరిగ్గా సరిపోతుంది. అందుకే ఫేస్బుక్, నెక్స్ట్ డోర్ యాప్లో ‘హైర్ మై హ్యాండీ హబ్బీ’ పేరుతో ప్రకటన ఇచ్చింది. అవసరమున్న కొందరు ఆసక్తి చూపారు. మరికొందరు ఇదేం పద్ధతంటూ పెదవి విరిచారు. ఎవరేమనుకున్నా.. తక్కువ ఖర్చుతో వాళ్లకు సహాయం, తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ముఖ్యమని చెబుతోంది లారా. చదవండి: Sri Lanka: పెట్రోల్ కోసం క్యూలో రోజుల తరబడి.. -
శాలరీ రూ.7.3లక్షలు!! విద్యార్ధులకు టీసీఎస్ బంపరాఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ విద్యార్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన 'ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్'గ్రామ్ కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అవకాశం కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. తేదీలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు వారి అర్హతలను బట్టి జీతం పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ.7 లక్షలు పొందుతారు. అయితే వారి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సంవత్సరానికి రూ.7.3 లక్షల జీతం పొందవచ్చు. అర్హతలు ►ఏదైనా నుండి బ్యాచిలర్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) లేదా (ఎంటెక్)/బ్యాచిలర్ లేదా మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీఈ) లేదా (ఎంఈ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)/మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ఈ) నుండి విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ 2019,2020, 2021లో పట్టభద్రులు మాత్రమే దరఖాస్తచేసుకోవడానికి అర్హులు. ►అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో కనీసం 6-12 నెలల పని అనుభవం కూడా కలిగి ఉండాలి. ►అభ్యర్థులు 10, 12వ తరగతి, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్లో కనీసం 70% మొత్తం మార్కులను స్కోర్ చేసి ఉండాలి. ►అభ్యర్థులకు ఎలాంటి బ్యాక్లాగ్లు ఉండకూడదు మరియు నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. ►విద్యలో ఖాళీలు ఏవైనా ఉంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ప్రకటించాలి. అత్యధిక విద్యార్హత వరకు మొత్తం అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు. ►పూర్తి సమయం కోర్సులు మాత్రమే పరిగణించబడతాయి, పార్ట్ టైమ్/కరస్పాండెన్స్ కోర్సులు పరిగణించబడవు. ఎంపిక విధానం కంపెనీ నిర్వహించే రెండు రౌండ్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ వ్రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ. రాత పరీక్ష రిమోట్గా నిర్వహించబడుతుంది. అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 నిమిషాలు), వెర్బల్ ఎబిలిటీ (10 నిమిషాలు), అడ్వాన్స్డ్ కోడింగ్ (60 నిమిషాలు) ఆధారంగా పలు ప్రశ్నలుంటాయి. -
జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూన్తో పోలిస్తే జూలైలో నియామకాలు 4 శాతం పెరిగాయని మాన్స్టర్.కామ్ వెల్లడించింది. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే జూలైలో జాబ్ పోస్టింగ్స్ 8 శాతం అధికమయ్యాయి. 2021 జూన్తో పోలిస్తే గత నెలలో ట్రావెల్, టూరిజం విభాగంలో 16 శాతం, షిప్పింగ్, మెరైన్ 14, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఆటోమేషన్ 9, రియల్ ఎస్టేట్లో నియామకాలు 9 శాతం పెరిగాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో 8 శాతం, హైదరాబాద్, పుణే 7, చెన్నై 6, బెంగళూరులో 6 శాతం అధికమయ్యాయి. 0–3 ఏళ్ల అనుభవం కలిగిన ఎంట్రీ లెవెల్ ఉద్యోగ నియామకాలు 5 శాతం పెరిగాయి. మధ్యస్థ (4–6), మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ (7–10) కోసం నియామకాలు 7 శాతం పెరిగితే, సీనియర్ ప్రొఫెషనల్స్ (11–15) కోసం 4 శాతం అధికం అయ్యాయి. టాప్ మేనేజ్మెంట్ కోసం నియామకాలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో సానుకూల వాతావరణం ఉంటుందనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ అని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రాచెల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి : బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు -
రైతుకు చేయూత
సాక్షి, రంగారెడ్డి: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు స్వతహాగా కొనుగోలు చేయలేని రైతుల కోసం మండలానికో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్సీ) అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో దాదాపు 50 శాతానికి.. సన్న, చిన్న కారు రైతులకు మార్కెట్ ధరలో కొంచెం తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) నిధులతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి 31 సీహెచ్సీలు రాగా.. 29 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున గ్రాంట్ మంజూరయ్యాయి. హైదరాబాద్ మినహా జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. మహిళలే నిర్వాహకులు.. వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సంఘాల్లోని సభ్యులే ఈ సీహెచ్సీల నిర్వాహకు లు. ఇలా ఒక మండలంలోని మహిళా రైతులంతా కలసి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూ ప్ (ఎఫ్పీజీ)గా ఏర్పడతారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 31 మండలాల్లోని ఎఫ్పీజీలకు.. సీహెచ్సీ ఏర్పాటుకు కావాల్సిన కేంద్ర గ్రాంట్ అందింది. ఈ నిధులతో స్థానిక వ్యవసాయ పంటలకు కావాల్సిన పరికరాలు, పనిముట్లను కొనుగోలు చేసి కేంద్రాలను వినియోగంలోకి తెస్తున్నారు. అందుబాటులో ఉన్న పనిముట్లు.. ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్ల ర్, టార్పాలిన్లు, పవర్ స్ప్రేయర్స్, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ట్రాక్టర్ ఆపరేటర్ తదితర పనిముట్లు, పరికరాలు కస్టమ్ హైరిం గ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 29 జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం శక్తికి మించి భారం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రైతులే 80 శాతం మంది ఉన్నారు. వీరికి యాంత్రీకరణను చేరువ చేయడంలో సీహెచ్సీలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. అలాగే పెట్టుబడులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అధిక విస్తీర్ణంలో పంటల సాగు కూడా సులభం కానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. సీహెచ్సీలకు మంచి స్పందన లభిస్తుండటంతో వీటి సేవలు విస్తరించాలన్న డిమాండ్ వస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నారు. పట్టణ ప్రాంత సెగ్మెంట్లు మినహా.. గ్రామీణంలో ఉన్న సుమారు 75 నియోజకవర్గాల్లో త్వరలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 31 సెగ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటయ్యే సీహెచ్సీలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభించదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పరికరాలు, పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయంలోంచి రుణాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను చూసుకోవాలి. రైతులకు ఎంతో మేలు.. సీహెచ్సీలతో పేద, మధ్య తరగతి రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మహిళా సంఘాల ద్వారా మా వంతు సహకారం అందించనున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అధికంగా వ్యవసాయం చేసే మూడు గ్రామాలను గుర్తించి యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన ఎఫ్పీజీని ఏర్పాటు చేశాం. ఫోన్ నంబర్లు ఇచ్చి ఒక సీసీతో పాటు అకౌంటెంట్ను పర్యవేక్షణకు నియమిస్తున్నాం. బయటి కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నాం. – వట్నాల శ్యామల, రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
వాల్మార్ట్లో 50 వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది. రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో వినియోగదారుల నుండి కిరాణా, గృహ అవసరాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నియామకాలని వాల్మార్ట్ శుక్రవారం ప్రకటించింది. లక్షా 50 వేల మందిని నియమించుకోవాలన్న తమ మునుపటి లక్ష్యాన్ని ఆరువారాలముందే చేరుకున్నామని, సగటున రోజుకు 5,000 మంది చొప్పున తీసుకున్నామని వెల్లడించింది. (కరోనా : అమెజాన్లో 75 వేల ఉద్యోగాలు) తాజాగా వాల్మార్ట్ దుకాణాలు, క్లబ్బులు, కార్పొరేట్ కార్యాలయాలు, ఇతర పంపిణీ కేంద్రాలలో 50 వేల మంది కార్మికులను నియమించుకో నున్నామని వాల్మార్ట్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ తెలిపారు. తమ ఉద్యోగలు మాస్క్ లు, శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటించాల్సి అవసరం వుందని పేర్కొన్నారు. అలాగే కంపెనీ అత్యవసర సెలవు విధానాన్ని మే చివరి దాకా పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో ప్రపంచ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలు ఎక్కడిక్కడ రద్దు అయ్యాయి. దీంతో వినిమయ డిమాండ్ క్షీణించి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతవుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు మూతపడే క్రమలో ఉన్నాయి. మరికొన్ని ఖర్చులను నివారించు కునేందుకు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అయితే ఆహారం, హ్యాండ్ శానిటైజర్, టాయిలెట్ పేపర్, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పుంజుకోవడంతో అమెజాన్ సంస్థ వేలాది మందిని నియమించున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎవరీ భారతీయ కుబేరుడు..?
బ్రిటన్లోని స్కాట్లాండ్ సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో చేరనున్న ఓ అమ్మాయికి ఆమె తండ్రి సమకూర్చిన సకల సౌకర్యాలను చూసి బ్రిటన్ పత్రికలు ముక్కున వేలేసుకున్నాయి. కూతురి సపర్యల కోసం భారతీయుడైన ఆ తండ్రి విలాసవంతమైన భవంతిని కొనుగోలుచేయడమేకాకుండా ఆమె అడుగులకు మడుగులొత్తేందుకు 12 మంది ఉద్యోగులను నియమించడం అక్కడి పత్రికల్లో పతాకశీర్షికలకెక్కింది. ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ మిడిల్టన్ చదివిన సెయింట్ ఆండ్రూస్ వర్సిటీలోనే ఓ భారతీయ కుబేరుడి కూతురు ఎంట్రీ అట్టహాసంగా మారింది. స్కాట్లాండ్లో అత్యంత సుందరమైన భవంతుల్లో ఒకదాన్ని తండ్రి కొనుగోలుచేసి, ఆమెకు బాగా ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించేందుకు ఒక పాకశాస్త్రప్రవీణుడిని, ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఒక పనిమనిషిని, ఆమె డ్రెస్లు, ఆమెకు కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచేందుకు మరో మనిషిని, అమ్మాయి ఇంట్లోకి వచ్చేటపుడు వెళ్లేటపుడు తలుపులు తీసి పట్టుకోవడానికి మరో వ్యక్తినీ, ఇలా ఆమెకు దాదాపు అన్ని పనుల్లో సాయపడేందుకు 12 మంది ఉద్యోగులను నియమిం చారు ఆమె తండ్రి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవాలని సిల్వర్ స్వాన్ రిక్రూట్మెంట్ అనే ఓ ప్రముఖ జాబ్ ఏజెన్సీలో ప్రకటన సైతం ఇచ్చారు. బలహీనంగా ఉండకుండా, హుషారుగా ఉండేవారు మాత్రమే కావాలని పేర్కొన్నారు. భవంతిలో పనిచేయనున్న ఉద్యోగులకు వేతనం సైతం భారీస్థాయిలోనే ఉంది. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.28 లక్షల వేతనం ఇస్తామని ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేది పెద్ద మిస్టరీ అయ్యింది. ఆ కుటుంబం వివరాలు తెలిసిన వారు సమాచారమివ్వాలని బ్రిటన్ పత్రికలు కోరడం మరో విశేషం. -
బాస్ కోసం ఎఫ్బీ వేట..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్ నుంచి బాస్ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్బుక్ ఇండియా బృందానికి త్వరలోనే కొత్త సారథి నేతృత్వం వహించనున్నారు. ఎండీ ఉమాంగ్ బేడీ సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంస్థను వీడటంతో అప్పటినుంచి ఫేస్బుక్ భారత టీం కెప్టెన్ లేకుండానే నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో ఫేస్బుక్ భారత్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇండియా హెడ్ కోసం కంపెనీ వేట సాగిస్తోంది. కంట్రీ హెడ్ను నియామకంతో పాటు టాప్మేనేజ్మెంట్ బృందంలో మార్పులు చేసేందుకు ఫేస్బుక్ సంసిద్ధమైంది. మరోవైపు ఫేస్బుక్ ఇండియా హెడ్ కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోని ఇంటర్వ్యూలకూ హాజరయ్యారు. వీరిలో హాట్స్టార్ సీఈఓ అజిత్ మోహన్, టాటా స్కై సీఈవో హరిత్ నాగ్పాల్, స్టార్ ఇండియా ఎండీ సంజయ్ గుప్తా, కర్ణాటక మాజీ ఐటీ కార్యదర్శి శ్రీవత్స కృష్ణలు ఉన్నారు. అయితే ఇండియా హెడ్ ఎంపికపై ఎఫ్బీ ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. -
రిక్రూటర్లకు వారే అతిపెద్ద సవాల్
ముంబై : కంపెనీల్లో ఉద్యోగులను నియమించుకోవాలంటే రిక్రూటర్లకు తల ప్రాణం తోకకు వస్తోంది. సీనియర్ స్థాయి ఉద్యోగుల నియమించుకునేటప్పుడైతే, ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. రిక్రూటర్లకు ప్రస్తుతం సీనియర్ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడం అతిపెద్ద సవాల్గా నిలుస్తుందని, ఈ అభ్యర్థులు ప్రస్తుత వేతనానికి 20 నుంచి 40 శాతం పెంపు కోరుకుంటున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. మెజార్టీ సీనియర్ స్థాయి ఉద్యోగులు, తమ ప్రస్తుత వేతనానికి 20 శాతం నుంచి 40 శాతం పైగా పెంపు ఉంటేనే ఉద్యోగ మార్పును పరిగణలోకి తీసుకుంటున్నారని సీఐఈఎల్ నిర్వహించిన టాలెంట్ మార్కెట్పై ఏడాది సర్వే వెల్లడించింది. ఇది భవిష్యత్తులో ఉద్యోగవకాశాల విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రతిభావంతులను ఆకర్షించుకోవడం కూడా రిక్రూటర్లకు అతిపెద్ద సవాల్ అని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, పలు రంగాల్లో వివిధ స్థాయిలోని 107 ఎగ్జిక్యూటివ్లపై ఈ సర్వే నిర్వహించింది. కేవలం సీనియర్ ఉద్యోగులను నియమించుకోవడమే కాక, రిక్రూటర్లకు ఎంప్లాయర్ బ్రాండింగ్ కూడా సవాల్గా నిలుస్తుందని సర్వే బహిర్గతం చేసింది. 35 శాతం మంది దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారన్నారు. ఎంట్రీ లెవల్, మధ్య స్థాయి వారికి కొత్త ఉద్యోగవకాశాలు చూడటం, వేతనాలు, ప్రయోజనాలు వంటివి అత్యంత ముఖ్యమైన కారకాలు కాగ, సీనియర్ స్థాయి వారికి వేతనం, ఇతరాత్ర ప్రయోజనాలు రెండో అతిపెద్ద కారకాలని సర్వే పేర్కొంది. కొత్త ఉద్యోగాలు వెతుకోవడానికి మరో ముఖ్యమైన అంశం మేనేజర్లతో సంబంధాలని కూడా తెలిపింది. కెరీర్లో వెదకడం కోసం కూడా ఉద్యోగం మారుతున్నట్టు చెప్పింది. -
టెకీలకు ఆ ఐటీ కంపెనీ 1500 ఉద్యోగాలు
సాక్షి, పుణే : ఓ వైపు ఆటోమేషన్, మరోవైపు విదేశీ మార్కెట్లలో రక్షణాత్మక విధానాలు దేశీయ టెకీలకు చుక్కలు చూపిస్తున్న క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సైనెక్రోన్ అనే మధ్య స్థాయి ఐటీ కంపెనీ వచ్చే 12 నెలల్లో 1,500 మందిని కొత్తగా తమ సంస్థలో నియమించుకోనున్నట్టు తెలిపింది. అదేవిధంగా తన రెవెన్యూలను కూడా 2020కి రెండింతలు చేసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రస్తుతం తమ ఐటీ కంపెనీలో 7500 మంది ఉద్యోగులున్నారని, వచ్చే 12 నెలల కాలంలో 1000-1500 మంది ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫైసల్ హుస్సేన్ చెప్పారు. ఈ నియామకాలతో బెంగళూరు, హైదరాబాద్, పుణే ప్రాంతాల్లో, కంపెనీ తన ఉద్యోగులను 5000 మందికి పైగా పెంచుకోనున్నట్టు పేర్కొన్నారు. 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూలు 390 మిలియన్ డాలర్లుగా ఉండబోతున్నాయని, ఇవి 2018కి వచ్చేసరికి 480 మిలియన్ డాలర్లకు పెంచుకుంటామని హుస్సేన్ చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలలో అందిస్తున్న సేవలతో 25 శాతం కంటే ఎక్కువగా తమ రెవెన్యూ వృద్ధిని నమోదుచేయగలమని హుస్సేన్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రాబోతున్న టెక్నాలజీలు డిజిటల్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, బ్లాక్-చైన్ టెక్నాలజీస్పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో సైనెక్రోన్ వీటి నుంచి లబ్ది పొందనున్నట్టు కూడా పేర్కొన్నారు. నియమించుకోబోతున్న ఉద్యోగుల్లో 1000 మంది పుణేకి కేటాయించబోతున్నారు. పుణేలో ఈ కంపెనీకి అతిపెద్ద సింగిల్ డెవలప్మెంట్ సెంటర్ కలిగి ఉంది. చాలా నియామకాలు కూడా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల నుంచే ఉంబోతున్నాయని, కానీ ప్రస్తుత విద్యావిధానం పరిశ్రమకు తగ్గట్టు ఉండాలని కోరారు. స్టార్టప్ మాదిరిగా ఇద్దరు స్నేహితులతో కలిసి, హుస్సేన్ ఈ సంస్థను 16ఏళ్ల క్రితం ప్రారంభించారు. -
టెకీలకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెడుతున్న నేపథ్యంలో భారీ టెక్నాలజీ కంపెనీలు భారీగా నియామకాలకు దిగుతుండటం టెకీలకు ఊరట ఇస్తోంది. యాక్సెంచర్, క్యాప్జెమిని, ఒరాకిల్, ఐబీఎం, గోల్డ్మన్శాక్స్ వంటి ఎంఎన్సీలు వేలాది ఉద్యోగుల నియామకానికి సన్నాహాలు చేస్తుండటం ఐటీ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. యాక్సెంచర్ భారత్లో 5396 మందిని రిక్రూట్ చేసుకోనుండగా, ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని 2649 మంది ఉద్యోగులను చేర్చుకోనుంది. ఇక ఒరాకిల్ భారత్లో 1124 మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐబీఎం, గోల్డ్మాన్శాక్స్, డెల్, మైక్రోసాఫ్ట్, సిస్కో తదితర కంపెనీల్లోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. భారత్లో గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్లు కలిగిన ఎంఎన్సీలు ఈ ఏడాది భారీగా నియామకాలను చేపడతారని కన్సల్టెన్సీ సంస్థ జిన్నోవ్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఈ సంస్థలు భారత్లో దాదాపు 30,000 మందిని పైగా నియమించుకుంటాయని భావిస్తున్నారు.ఐటీ దిగ్గజాలు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్ర తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న క్రమంలో తాజా నియామకాలు ఐటీ పరిశ్రమలో నూతనోత్తేజం నింపుతాయని పరిశ్రమ సంస్థ నాస్కామ్ పేర్కొంది. -
టెకీలకు శుభవార్త: ఆ కంపెనీ 20వేల ఉద్యోగాలు
బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల నియామకంపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బహుళ జాతీయ కంపెనీ క్యాప్జెమిని గుడ్న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాది భారత్లో 20వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అంతేకాక ఆటోమేషన్ ప్రభావం ప్రస్తుత ఉద్యోగులపై పడకుండా ఉండేందుకు మే నెల వరకు ఈ కంపెనీ 45 వేల మందికి రీస్కిల్ చేపట్టింది. ఈ ఫ్రెంచ్ ఐటీ సర్వీసు కన్సల్టెంట్ గతేడాది 33వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. 51వేల మందికి రీస్కిల్ చేపట్టింది. తాము ఎక్కువమొత్తంలో పెట్టుబడులను ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ అభివృద్ధి కోసం పెడుతున్నామని క్యాప్జెమిని ఆటోమేషన్, ఇండస్ట్రియలైజేషన్ హెడ్ క్రిస్టోఫర్ స్టాన్కోమ్బ్ చెప్పారు. తమ వర్క్ఫోర్స్లో ఎక్కువ అవకాశాలు ఆటోమేషన్, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ కల్పిస్తుండటంతో ట్రైనింగ్ ప్రొగ్రామ్లలో పెట్టుబడులు పెంచినట్టు తెలిపారు. క్యాప్జెమిని భారత కార్యకలాపాల్లో కంపెనీకి లక్ష మంది ఉద్యోగులున్నారు. అయితే అంతర్జాతీయంగా ఎంతమందిని నియమించుకుంటుంది, ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తుందో కంపెనీ బహిర్గతం చేయలేదు. ఆటోమేషన్ తమ ఉద్యోగులకు మరింత ఉత్పాదకతను అందిస్తుందని క్రిస్టోఫర్ చెప్పారు. ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులకు మరింత డిమాండ్ను కల్పించనుందనే ఈ కంపెనీ చెబుతోంది. అయితే ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావంతో చాలా ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించాయి. ఇండస్ట్రి బాడీ నాస్కామ్ సైతం ఈ ఏడాది ఉద్యోగాల వృద్ది కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఉద్యోగ నియామకాలు 20-25 శాతం తగ్గిపోయే అవకాశముందని కూడా అంచనావేసింది. మరోవైపు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో భారత్లో 20వేల మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. అయితే ఆటోమేషన్తో 11వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులను ఇంటికి పంపేసినట్టు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. -
ఉద్యోగ నియామకాల్లో ఐటి కంపెనీల దూకుడు
న్యూడిల్లీ: ఉద్యోగాల కోత సంక్షోభంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు మండువేసవిలో జోరువాన లాంటి వార్త. మే నెలలో ఐటీ కంపెనీలు రికార్డ్ నియామకాలతో దూకుడును ప్రదర్శించాయి. మొత్తం ఉద్యోగాలతో పోలిస్తే బిపిఓ / ఐటి రంగంలో భారీ ఉద్యోగాలతో మొదటి స్థానం సాధించింది. ఏప్రిన్ నెలతో పోల్చుకుంటే మే నెలలో 25 శాతం వృద్ధిని సాధించిందని టైమ్స్ జాబ్స్ 'రిక్రూట్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తంగా ఉద్యోగాల కల్పన 4 శాతం వృద్ధితో చేసిందని ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మే నెలలో పుణే, జైపూర్ నగరాల్లో 20 శాతం పుంజుకుని బెస్ట్ రిక్రూటర్లు గా నిలిచాయని నివేదించింది. ఐటీ బీపీఓ రంగాల్లో ఆటోమేషన్ ఉద్యోగాల కోతలకు దారితీసినప్పటికీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వృద్ధి చెందుతున్న ఆర్థిక వృద్ధి ద్వారా నూతన ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయనే వాస్తవాన్ని గమనించాలని ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో భాగమైన టైమ్స్ జాబ్స్ రామత్రేయ కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా 2016-17లో ఐటీ సెక్టార్ ఒక లక్ష, 70వేల ఉద్యోగాలకు జోడించిందన్న నాస్కామ్మ నివేదికను ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణ మరియు ఫార్మా రెండవ స్థానంలో నిలిచింది. మే నెలలోఉద్యోగాల కల్పనలో 7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కస్టమర్ సర్వీస్ నిపుణుల డిమాండ్ 20 శాతం పెరిగింది, అదే సమయంలో వైద్య నిపుణుల నియామకం 19 శాతం పెరిగింది. ఆటోమొబైల్ , బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్,బీమా విభాగాలు ఈ నెలలో ఇతర ముఖ్యమైన రిక్రూటర్లుగా ఉన్నాయి. అంతేకాదు 20ఏళ్ల అనుభవం వున్ననిపుణుల డిమాండ్ఆశ్చర్య కరంగా బాగా పుంజుకుందని ఈస్టడీ పేర్కొంది. 10-20 సం.రాల అనుభవం వారి డిమాండ్ 14 జంప్ చేయగా, 5-10 ఏళ్ల అనుభవం ఉన్న వారి డిమావండ్7శాతం పెరిగి రికార్డ్ క్రియేట చేసింది. కాగా 2-5 సం.రాల అనుభవం వున్న వారి గ్రోత 6శాతంగా ఉంది. అలాగే రెండేళ్ల లోపు అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ కనీసం 3 శాతం పెరిగిందని ఈ నివేదిక తేల్చింది. -
ఐటీ ఇండస్ట్రిలోనే భారీగా పతనం
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రిలో ఇటీవల నెలకొన్న ఉద్యోగులపై ఉద్వాసన వేటు తెలిసిందే. ఇటు ఉద్యోగుల కోత మాత్రమే కాక, అటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల నియామకం కూడా భారీగా పతనమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐటీ ఇండస్ట్రిలో ఉద్యోగుల నియామకం 24 శాతం పడిపోయినట్టు నౌకరి.కామ్ తాజా సర్వేలో తెలిసింది. మొత్తంగా కొత్త ఉద్యోగాల కల్పన 11 శాతం పడిపోగా.. దానిలో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలోనే క్షీణించినట్టు తాజా సర్వే పేర్కొంది. గతేడాది కంటే ఈ ఏడాదిలో 24 శాతం పడిపోయినట్టు నౌకరి జాబ్ సీక్ ఇండెక్స్ నివేదించింది. మేజర్ మెట్రోలు ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నైలోనే ఏడాది ఏడాదికి ఉద్యోగుల కల్పన తగ్గిపోయినట్టు ఈ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం, బీపీఓ, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతుందని తెలిపింది. కీలక పరిశ్రమలు నిర్మాణం, బీపీఓలలో 10 శాతం, 12 శాతం ఉద్యోగుల నియామకం పడిపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లో 11 శాతం తగ్గిపోయింది. జాబ్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతుందని, ఏప్రిల్ నెలలో ఈ నెగిటివ్ వృద్ధి 11 శాతం నమోదైనట్టు పేర్కొంది. మరి కొన్ని నెలల పాటు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగనుందని ఈ ఇండెక్స్ తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఆరు మెట్రోల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఈ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది. -
ఆ టెక్ సంస్థలో 2500 ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఓ వైపు ఉద్యోగాల కోతతో టెకీలకు అన్ని బ్యాడ్ న్యూస్ లే వినిపిస్తుండగా.. ఎల్ అండ్ టీ ఓ చల్లటి గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్ మేజర్ లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ కు చెందిన ఐటీ సర్వీసుల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(ఎల్టీటీఎస్)లో 2500 మంది భారతీయులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఈ నియామకాలు చేపడతామని కంపెనీకి చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని తెలిపారు. '' వృద్ధిని నమోదుచేయడంలో టెలికాం అండ్ హై-టెక్, ట్రాన్స్ పోర్టేషన్ రెండు నిటారుగా ఉన్నాయి. అదనంగా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ ఏడాది వృద్దిని నమోదుచేయాలనుకుంటున్నాం'' అని ఎల్టీటీఎస్ ప్రధాన మానవ వనరుల అధికారి పనేష్ రావు తెలిపారు. మింట్ పేపర్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపారు. ఎల్టీటీఎస్ లో ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావంపై మాట్లాడిన ఆయన, ఆటోమేషన్ తో ఐటీ రంగం ఉద్యోగాల కోతను ఎదుర్కొంటుందని చెప్పారు. '' మమల్ని చూసుకుంటే పూర్తిగా మాది ఐటీ కంపెనీ అనేది సరియైనది కాదు. పూర్తిగా ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ. మేము డిజైనింగ్ కంపెనీలో ఉన్నాం. ఉత్పత్తి అయ్యేంత వరకు మేము డిజైన్ చేస్తూనే ఉంటాం. డిజైన్ ను ఆటోమేట్ చేయలేం. దానికి కచ్చితంగా మనుషుల మేధస్సు అవసరం. ఈ కారణంతో మేము ఆటోమేషన్ ముప్పును పడటం లేదు'' అని చెప్పారు. 2016 సెప్టెంబర్ లోనే ఎల్టీటీఎస్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టు అయింది. మొత్తంగా ఈ కంపెనీకి గ్లోబల్ గా 11వేల మంది ఉద్యోగులున్నారు. భారత్ లో 8750 మంది ఉద్యోగులు ఆరు డెలివరీ సెంటర్లలో పనిచేస్తున్నారు. అమెరికాలో కూడా ఈ కంపెనీకి ఆరు డెలివరీ సెంటర్లున్నాయి. కేవలం ఇండియాలోనే కాక, అమెరికాలోనూ ఉద్యోగుల నియామకం చేపట్టాలని కంపెనీ భావిస్తోంది. తాజాగా గ్రాడ్యుయేట్లు పూర్తి చేసుకున్న వారిని కంపెనీ రిక్రూట్ చేసుకోనున్నట్టు రావు తెలిపారు. గతేడాది నియమించుకున్న 2500 మంది ఉద్యోగుల్లో 50 శాతం మంది ప్రెష్ గ్రాడ్యుయేట్లే. భవిష్యత్తులో కూడా ప్రెషర్ల ఉద్యోగులను భారీగా ఈ కంపెనీ నియమించుకోబోతుంది. అంతేకాక ఈ ఏడాది ఎంట్రీ లెవల్ ఉద్యోగుల వేతనాలను కూడా 20 శాతం వరకు పెంచనున్నట్టు రావు తెలిపారు. -
ఇన్ఫీని వదిలేసిన 38వేల మంది ఉద్యోగులు
-
ఇన్ఫీని వదిలేసిన 38వేల మంది ఉద్యోగులు
బెంగళూరు : దేశీయంగా టాప్ ప్లేస్ లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. కానీ ఇటీవల కంపెనీ వేతన విషయంలో నెలకొన్న లుకలుకలు, భారీగా తగ్గిపోతున్న రిక్రూట్మెంట్ కంపెనీ పేరును దెబ్బతీస్తున్నాయి. ఈ సాప్ట్ వేర్ దిగ్గజం నుంచి గతేడాది దాదాపు 38 వేల మంది ఉద్యోగాలు వదిలివేసినట్టు వెళ్లినట్టు వెల్లడైంది. అంతేకాక 2016-17లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ కూడా 65 శాతం పడిపోయినట్టు తెలిసింది. దీనికంతటికీ ప్రధానకారణం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాగ, మరోవైపు ప్రాజెక్టులకు కూడా దెబ్బపడుతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఎంప్లాయీ మెట్రిక్స్ వివరాలు వెల్లడించిన ఇన్ఫోసిస్, తన కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుబంధ కంపెనీల నుంచి 37,915 మంది ఉద్యోగులు వదిలివెళ్లినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 34,688 మందే రాజీనామా చేశారు. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 44,235 టెక్కీలను నియమించుకున్నప్పటికీ, నికరంగా కంపెనీలోకి వచ్చింది 6320 మంది మాత్రమేనని ఇన్ఫోసిస్ తెలిపింది. అంటే ఇది కూడా 65 శాతం పడిపోయినట్టు వెల్లడించింది. అదేవిధంగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని కూడా 2016 నియమించుకున్న సంఖ్యకంటే తక్కువగా 18,797 మందినే నియమించుకుందని తెలిపింది. మొత్తంగా అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 6320కి పెంచి, 2,00,364కు చేర్చుకుంది. దీనిఫలితంగా పేరెంట్ కంపెనీలో అట్రిక్షన్ లెవల్స్(ఉద్యోగులను తగ్గించుకోవడం) 15 శాతానికి పెరిగినట్టు వార్షిక సమీక్షలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. గతేడాది ఈ శాతం 13.6 శాతంగానే ఉందని తెలిపింది. -
కారు డ్రైవర్లకోసం గూగుల్ 'సెర్చ్'
ఉద్యోగార్థులకు శుభవార్త! ఆకాశమే హద్దుగా ఆధునిక ప్రపంచం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొంటోంది. కంప్యూటరీకరణ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా సగానికి పైగా జనం ప్రతి విషయానికీ ఇంటర్నెట్ నే ఆశ్రయించడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ కు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు గూగుల్ లేనిదే పని జరగని పరిస్థితి ఏర్పడింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గూగుల్... తమ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. వివరాల్లోకి వెడితే... సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. గూగుల్ డ్రైవర్ లెస్ కార్ల తయారీలో కొంతకాలంగా పూర్తిశాతం దృష్టి సారించిచిన సంస్థ... ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో కార్లను విడుదల చేసేందుకు ముందు వాటిని సమర్థవంతంగా నడపగలిగే ఉద్యోగస్థులకోసం వెతుకుతోంది. డ్రైవర్ లెస్ కార్ల సృష్టికి శ్రీకారం చుట్టి, కొంత కాలంగా అదే పనిలో నిమగ్నమైన గూగుల్... వెహికిల్ సేఫ్లీ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు డ్రైవర్ లెస్ కార్ల పనితీరు తెలుసుకోడానికి పని చేయాల్సి ఉంటుంది. బ్యాచులర్ డిగ్రీతోపాటు ఇంతకు ముందు ఎటువంటి ప్రమాదాలు జరపనట్లు రుజువు చేసుకోవడమే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అర్హత. దీనికి తోడు అభ్యర్థులపై ఎటువంటి క్రిమినల్ కేసులూ ఉండకూడదు. అలాగే నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలిగే అనుభవం కూడ ఉండాలి. ఈ ఉద్యోగం రోజుకు 6 గంటలనుంచి 8 గంటల పాటు ఉంటుంది. వారానికి ఐదు రోజుల మాత్రమే పని దినాలు. 12 నుంచి 24 నెలల కాంట్రాక్ట్ నిబంధనతో ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రోడ్లపై డ్రైవర్ లెస్ కార్ల పని తీరును పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు తమ ఇంజనీర్లకు విషయాలను అందించడమే ఈ ఉద్యోగంలో ముఖ్యంగా చేయాల్సిన పని. -
హైదరాబాద్లో హైరింగ్ 15 శాతం అప్!
న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్లో హైరింగ్ కార్యకలాపాలు హైదరాబాద్లో 15 శాతం వృద్ధి చెందాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్కామ్ తెలిపింది. దేశవ్యాప్తంగా హైరింగ్ 25 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. దీంతో కొత్త ఏడాదిలో హైరింగ్ జోరుగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, ప్రకటనల, మీడియా రంగాల్లో హైరింగ్ జోరుగా ఉంది. -
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'
బీజింగ్: క్రికెట్ లీగ్ మ్యాచుల్లో అభిమానులను ఉల్లాసపరిచి ఉత్తేజితుల్ని చేయడానికి 'చీర్ లీడర్స్' పేరిట అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపిన విషయం మనకు తెల్సిందే. అలాగే చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మగవాళ్లను ఉల్లాసపరిచి ఉత్పాదకతను పెంచేందుకు చీర్ లీడర్స్ను రంగంలోకి దింపాయి. 'వారికి ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్'గా నామకరణం కూడా చేశాయి. పొట్టి స్కర్టులు, గౌన్లు ధరించి ఉత్సాహంగా కనిపించే అందమైన ఈ చీర్ లీడర్స్... పని వేళల్లో మగవాళ్లతో కలుపుగోలుగా మాట్లాడుతారు. వారికి కావాల్సిన స్నాక్స్ను తెలుసుకొని సకాలంలో సరఫరా చేస్తారు. భోజనం వేళల్లో కంపెనీ ఇస్తారు. జోకులతో నవ్విస్తారు. విరామ సమయాల్లో ఉద్యోగులతో కలసి పింగ్పాంగ్ (టేబుల్ టెన్నీస్) ఆడతారు. సరదాగా కబుర్లు చెబుతారు. ఈ విషయాన్ని వెల్లడించిన సామాజిక వెబ్సైట్ 'ట్రెండింగ్ ఇన్ చైనా' ఎన్ని కంపెనీలు ఇప్పటి వరకు ఇలాంటి చీర్ లీడర్లును నియమించిందన్న విషయాన్ని, కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు. అందమైన అమ్మాయిలను చీర్ లీడర్స్గా నియమించినప్పటి నుంచి తమ కంపెనీలో వాతావరణమే మారిపోయిందని, మున్నెన్నడులేని విధంగా మగవాళ్లు ఉల్లాసంగా పని చేస్తున్నారని, కంపెనీ ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగిందని ముగ్గురు చీర్ లీడర్లను నియమించిన ఓ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తెలియజేశారు. తమ కంపెనీల్లో కొంత మంది ఉద్యోగులకు సోషల్గా ఎలా నడుచుకోవాలో తెలియదని, ఈ చీర్ లీడర్స్ కారణంగా వారిలో ఎంతో మార్పు వచ్చిందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు తమ ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగుల గురించి ప్రశ్నించగా తమ కంపెనీలో మహిళా ఉద్యోగులు చాలా తక్కువని చెప్పారు. చైనా టెక్ కంపెనీల్లో మొదలైన ఈ కొత్త ట్రెండ్ గురించి విమర్శిస్తున్నవారూ లేకపోలేదు. పని పట్ల చిత్తశుద్ధి ఉండాలేగానీ అందమైన అమ్మాయిలను చూసి పనిచేస్తారా ? అంటూ ప్రశ్నించిన వాళ్లు, వారిని చూసి పని ఎగ్గొట్టి వారితో కబుర్లతో కాలంగడిపేవారు ఉంటారన్న వాళ్లూ ఉన్నారు. 'ఉల్లాసమనేది మగ ఉద్యోగులకేనా, ఆడ ఉద్యోగులకు అవసరం లేదా ?'అని ఓ యూజర్ ప్రశ్నించగా, 'మాకావసరం లేదు, మేము బుద్ధిగా పని చేస్తాం' అంటూ ఓ మహిళా యూజర్ సమాధానమిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ట్రెండ్ చైనా కంపెనీలకు కొత్త కాదు. ఒకప్పుడు ఫ్యాక్టరీల్లో ఉత్పాదకతను పెంచేందుకు విరామ సమయాల్లో కార్మికులకు వేశ్యలను సరఫరా చేసిన చరిత్ర కూడా చైనాకు ఉంది. -
హైదరాబాద్లో పెరిగిన హైరింగ్
నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో ఉద్యోగాల భర్తీ దాదాపు 20 శాతం పెరిగింది. 2013 డిసెంబరు నుంచి 2014 డిసెంబరు మధ్య దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ తీరును విశ్లేషించినపుడు ఈ విషయం వెల్లడైనట్లు జాబ్స్ వెబ్సైట్ నౌకరీ డాట్కామ్కు చెందిన నౌఖరీ జాబ్ స్పీక్ తెలియజేసింది. మొత్తమ్మీద అన్ని నగరాలనూ పోలిస్తే పుణె 30 శాతం, చెన్నై 29 శాతంతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ది ఆ తరువాతి స్థానం కాగా... బెంగళూరు 17%, ముంబయి 11%, కోల్కత 10%తో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం 1 శాతం భర్తీ పెరుగుదలతో ఆఖర స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రంగాల వారీ చూస్తే టెలికంలో 12% తగ్గుదల కనిపించగా చమురు-గ్యాస్ 27%, బ్యాంకింగ్ 17%, ఐటీ 12% వృద్ధితో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఏ కంపెనీలో చూసినా ఫైనాన్స్ విభాగంలో 21%, హెచ్ఆర్ విభాగంలో 20%, ఐటీ విభాగంలో 18% భర్తీలో పెరుగుదల నమోదైనట్లు జాబ్స్పీక్ ఇండెక్స్ వెల్లడిచింది. మొత్తమ్మీద ఉద్యోగాల భర్తీలో 10% వృద్ధి నమోదైనట్లు ఈ ఇండెక్స్ వెల్లడించింది. ఐటీ సెక్టార్లో అధిక వేతనాలు న్యూఢిల్లీ: దేశంలోనే లాభదాయకమైన రంగంగా ఐటీ సెక్టార్ ఆవిర్భవించింది. ఈ రంగంలో ఉద్యోగులు కనీసం గంటకు రూ.291 లను జీతంగా పొందుతున్నారు. ఇది సగటున గంటకు రూ.341గా ఉంది. ఇది ఇతర రంగాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే పురుషులతో పోలిస్తే మహిళలు 34 శాతంమేర తక్కువ జీతాల్ని పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆన్లైన్ కెరీర్, నియామకాల సొల్యూషన్స్ ప్రొవైడర్ మాన్స్టర్ ఇండియా పేర్కొంది. దీని ప్రకారం నిర్మాణ రంగంలో ఉద్యోగుల సగటు జీతాలు గంటకు రూ.259, హెల్త్ కేర్ రంగంలో రూ.215, తయారీ-రవాణా రంగాల్లో రూ.230గా ఉన్నాయి. విద్యా రంగంలోని ఉద్యోగులు చాలా తక్కువ జీతాల్ని (గంటకు రూ.186లు) పొందుతున్నారని తెలిపింది. -
ఐటీలో భారీగా ఉద్యోగాలు
మైహైరింగ్క్లబ్డాట్కామ్ సర్వే న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే 3 నెలల్లో హైరింగ్ కార్యకలాపాల జోరును పెంచనున్నాయి. మైహైరింగ్క్లబ్డాట్కామ్ ఈ అంశాలను తెలిపింది. ద ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ పేరిట 5,414 భారత కంపెనీలపై సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని 78 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఇతర రంగాలతో పోల్చితే భారీగా ఐటీ, ఐటీఈఎస్ తరువాత బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో అధికంగా ఉద్యోగాలు రానున్నాయి. -
ఈ ఏడాది జోరుగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొత్త ఉద్యోగాలివ్వనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగానే ఈ ఏడాది కొత్త కొలువులివ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రముఖ జాబ్ సెర్చ్, కెరీర్ పోర్టల్ హెడ్హన్కోస్డాట్కామ్ నిర్వహించిన సర్వేలో 84 శాతానికి పైగా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను భారీగానే పెంచుకోనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య 160 కంపెనీలకు చెందిన హెచ్ఆర్, నియామక నిపుణులపై నిర్వహించిన ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఉద్యోగాలిచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు విస్తరణకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో భారీ సంఖ్యలో కొత్త కొలువులొస్తాయి. కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని 6 శాతం కంపెనీలు, ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని 10% కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 10 శాతానికి పైగా పెరుగుతుందని 55 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిభ గల ఉద్యోగుల కోసం కంపెనీలు పోటీపడనున్నందున వేతనాలు బాగానే పెరిగే అవకాశాలున్నాయి. -
హైదరాబాద్లో హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: హైరింగ్ కార్యకలాపాలు గత నెలలో 3 శాతం వృద్ధి చెందాయని టైమ్స్జాబ్స్డాట్కామ్ రిక్రూటెక్స్ నివేదిక వెల్లడించింది. మార్చిలో అగ్రశ్రేణి ఉద్యోగ కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు...., హైదరాబాద్లో ప్రతిభ గల ఉద్యోగులకు డిమాండ్ 30 శాతం పెరిగింది. ఈ డిమాండ్ చెన్నైలో 20 శాతం ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో 6 శాతంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలలో ఉద్యోగ నియామక కార్యకలాపాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి లేదు. ఫిబ్రవరిలో 90 పాయింట్లుగా ఉన్న రిక్రూటెక్స్ డిమాండ్ ఇండెక్స్ మార్చిలో 93 పాయింట్లకు పెరిగింది. రాజకీయ అనిశ్చితికి ఎన్నికల ద్వారా తెరపడనున్నందున మార్చిలో హైరింగ్ కార్యకలాపాలు పెరిగాయి. భవిష్యత్ పట్ల భారత కంపెనీలు ఆశావహంగా ఉన్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. మార్చిలో ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. ఈ రంగంలో హైరింగ్ వృద్ధి 12 శాతంగా ఉంది. ఇక అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రెండో రంగమైన పెట్రో కెమికల్స్ పరిశ్రమలో 9 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలను మొదటిసారిగా ఈ రెండు రంగాలు సూచిస్తున్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి జనవరిలో సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండగా, ఫిబ్రవరిలో కాస్త పుంజుకుంది. నిర్మాణ, సిమెంట్, లోహ, స్టీల్, ఉక్కు పరిశ్రమల్లో హైరింగ్ వృద్ధి 9 శాతంగా ఉంది. ఐటీ, టెలికం రంగాల్లో హైరింగ్ 6 శాతం పెరగ్గా, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, తయారీ, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో 5 శాతం వృద్ధి నమోదైంది. భారత కంపెనీల నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులకు డిమాండ్ భారీగా ఉంది. రానున్న కాలంలో ఇది మరింతగా పెరగనున్నది. మార్చిలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రంగం ఇదే. 20 ఏళ్ల అనుభవమున్న వృత్తి నిపుణులకు డిమాండ్ 30 శాతం పెరిగింది. -
రాష్ట్ర విభజనతో ఇరువైపులా ప్రయోజనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగగలవని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఎండీ ఎ. కృష్ణ కుమార్ తెలిపారు. అసలు ఏ రాష్ట్ర విభజన వెనుకైనా ముఖ్యోద్దేశం.. రెండు ప్రాంతాల్లోనూ వృద్ధిని మెరుగుపర్చాలన్నదేనని పేర్కొన్నారు. తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఇది మరొక అవకాశంగా తాము పరిగణిస్తున్నట్లు బుధవారమిక్కడ ఎస్బీఐ శాఖ ప్రారంభించిన సందర్భంగా కృష్ణకుమార్ చెప్పారు. నిర్దిష్టంగా వృద్ధి ఏ స్థాయిలో ఉంటుందన్నది లెక్కలు వేయలేనప్పటికీ.. విభజన వల్ల రెండు రాష్ట్రాల ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ‘రాష్ట్రాల విభజన పరిస్థితులను ఎదుర్కొనడం అన్నది ఎస్బీఐకి కొత్త కాదు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ లాంటి రాష్ట్రాల విభజనను చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికీ మా కార్యాలయాలు ఉన్నాయి, వ్యాపారం కూడా చేస్తూనే ఉన్నాం’ అని కృష్ణ కుమార్ వివరించారు. అయితే, గత కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశం మీద జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ వ్యాపారం దెబ్బతిందని చెప్పారు. ఎస్బీఐలో తగ్గనున్న నియామకాల జోరు.. కార్యకలాపాలు విస్తరిస్తున్నప్పటికీ రాబోయే రెండు,మూడేళ్లలో తాము భారీ స్థాయిలో నియామకాలు చేపట్టకపోవచ్చని కృష్ణ కుమార్ తెలిపారు. సిబ్బంది సంఖ్యను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎస్బీఐలో 2.23 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, మార్చ్ ఆఖరు నాటికి ఈ సంఖ్య 2.2 లక్షలకు తగ్గొచ్చని కృష్ణకుమార్ తెలిపారు. పదవీ విరమణ చేసే వారి స్థానాల్లో భర్తీలు చేయడం తప్ప ఉద్యోగుల సంఖ్యను పెంచుకోకపోవచ్చని చెప్పారు. మరోవైపు, దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత త్రైమాసికంలో కార్పొరేట్ రుణాలకు పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చన్నారు. జంట నగరాల్లో 187వ, హైదరాబాద్ సర్కిల్లో 1379వ బ్రాంచ్ను కృష్ణకుమార్ సనత్నగర్లో ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెన్షన్దారుల సౌకర్యార్ధం హెల్ప్లైన్ నెంబర్ 1800-425-4787ను ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రెండు నెలల్లో 500 కస్టమర్ సర్వీస్ పాయింట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. -
జనవరిలో జోరుగా హైరింగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో హైరింగ్ పెరిగిందని ఆన్లైన్ హైరింగ్ పోర్టల్ నౌకరీడాట్కామ్ తెలిపింది. గత మూడు నెలలుగా హైరింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత మరింతగా ఊపందుకుంటాయని తెలియజేసింది. మెట్రో నగరాల్లో హైరింగ్ పరిస్థితులు హైదరాబాద్, కోల్కతాల్లో గరిష్ట మెరుగుదల ఉందని పేర్కొంది. నౌఖరీ సర్వే ప్రకారం... గతేడాది డిసెంబర్తో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 13 శాతం వృద్ధితో 1,466 పాయింట్లకు పెరిగింది. ఇక గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 15 శాతం పెరిగింది. ఐటీ, బీపీవో రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. టెలికాం రంగంలో హైరింగ్ చాలా ఎక్కువ తగ్గింది. వాహన రంగంలో స్వల్పంగా తగ్గింది. సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఉద్యోగులకు డిమాండ్ పెరగడం కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నెలకు సగటున 4% చొప్పున వృద్ధి సాధిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, త్వరలో జరగనున్న ఎన్నికలు తదితర కారణాలతో నియామకాలు పుంజుకుంటాయి. ఎన్నికల అనంతరం పలు కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడతాయి. ఫలితంగా ప్రతిభ గల ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతుంది. -
బ్యాంక్ కొలువుల జాతర
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో వచ్చే 5-10 ఏళ్లలో 20 లక్షల కొత్త కొలువులు వస్తాయని నిపుణులంటున్నారు. కొత్త సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వనుండడం, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి భారత రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయనుండడం తదితర కారణాల వల్ల బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉద్యోగాలు భారీ స్థాయిలో వస్తాయని వారంటున్నారు. ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాలిచ్చే రంగాల్లో బ్యాంకింగ్ కూడా ఒకటిగా నిలవనున్నది. ర్యాండ్స్టాడ్ ఇండియా మెరిట్ట్రాక్ సర్వీసెస్, మణిపాల్ అకాడెమీ ఫర్ బ్యాంకింగ్, మేరాజాబ్ ఇండియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం... {పభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు సగం సిబ్బంది సమీప భవిష్యత్తులో రిటైర్ కానున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకోవడం ఆయా బ్యాంకులకు తప్పనిసరి. దీంతో ఒక్క పీఎస్ బ్యాంకుల్లోనే 5-7 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగ విస్తరణ, నేరుగా నియామకాలు కారణంగా బ్యాంకింగ్ రంగంలో వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో కొలువులు వస్తాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే కొత్త బ్యాంక్ లెసైన్స్లను ఆర్బీఐ జారీ చేయనున్నది. దీంతో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. {పస్తుతం భారత దేశ జనాభాలో కేవలం 30 శాతం కంటే తక్కువ మందికే బ్యాంక్ అకౌంట్లున్నాయి. గ్రామీణ మార్కెట్లలో బ్యాంకుల విస్తరణ వల్ల లాభదాయకత, వృద్ధి పెరుగుతాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థలు 60,000-70,000 ఉద్యోగాలివ్వగా, ప్రైవేట్ బ్యాంకులు 40 వేల వరకూ ఉద్యోగాలిచ్చాయి. ముంబై, చెన్నై, ఎన్సీఆర్ రీజియన్లో బ్యాంక్ కొలువులు ఎక్కువగా వచ్చాయి. చిన్న నగరాల్లో అధిక సంఖ్యలో బ్యాంక్ కొలువులు రానున్నాయి. బ్యాంకు ఉద్యోగుల ఉత్పాదకత పెరగ్గా, ఉద్యోగుల వలస తగ్గింది. క్లర్క్లు, ప్రారంభ స్థాయి ఆఫీసర్ల ఉద్యోగాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఉద్యోగాలు పెరుగుతాయ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో ఉద్యోగ నియామకాలు మెరుగుపడతాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్కామ్ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో జోరు దీనికి కారణం కానున్నదని వివరిం చింది. గత ఏడాది నవంబర్లోలాగానే గత నెలలో కూడా ఉద్యోగ నియామక కార్యకలాపాలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీలో హైరింగ్ కార్యకలాపాలు గరిష్టంగా మెరుగుపడ్డాయంటున్న ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నందున కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడుతాయి. ఫలితంగా కొత్త కొలువులు పెరుగుతాయి. ఆన్లైన్ ద్వారా నెలవారీ హైరింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేసే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ గతేడాది డిసెంబర్లో 1,296 పాయింట్లకు చేరింది. 2012, డిసెంబర్తో పోల్చితే ఇది 13 శాతం అధికం. అయితే గతేడాది నవంబర్తో పోల్చితే మాత్రం ఎలాంటి మార్పు లేదు. బీపీవో హైరింగ్ 33% పెరిగింది. ఫార్మా(16%), టెలికాం (7%) చొప్పున వృద్ధి చెందాయి. ఐటీ, బీపీవో, ఫైనాన్స్ రంగాల్లో డిమాండ్ పెరగ్గా, బ్యాంకింగ్, బీమా, సరఫరా చెయిన్ మేనేజ్మెంట్లో ఉద్యోగాలు తగ్గాయి. ఇక హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో హైరింగ్ కార్యకలాపాలు బాగా మెరుగుపడగా, చెన్నైలో మాత్రం 4 శాతం తగ్గాయి. -
కొలువుల బ్యాంకింగ్
ముంబై: ఈ ఏడాది బ్యాంక్ కొలువులు భారీగా రానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జోరుగా విస్తరణ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది మొత్తంమీద కొత్తగా 80 వేల నుంచి లక్ష వరకూ బ్యాంక్ ఉద్యోగాలు నమోదుకానున్నట్లు పరిశ్రమ నిపుణులంటున్నారు. గత ఏడాది వచ్చిన ఉద్యోగాలతో పోల్చితే ఇది 30 శాతం అధికమని వారంటున్నారు. బ్యాంకులు తమ బ్రాంచీ, పోర్ట్ఫోలియో విస్తరణ, ఉద్యోగుల వలస, రిటైర్మెంట్, కొత్త బ్యాంకుల ప్రవేశం తదితర కారణాల వల్ల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు రానున్నాయని టాలెంట్స్ప్రింట్ ఎండీ, సీఈవో శంతను పాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోనే ఆర్బీఐ కొత్త బ్యాంకులకు లెసైన్స్లు ఇస్తుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 వేల బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాయని, ప్రైవేట్, గ్రామీణ, విదేశీ బ్యాంకులు తమ నెట్వర్క్ను విస్తృతం చేస్తున్నాయని, ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కొలువులు పెరుగుతుండటంతో గత ఏడాది 45గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ల సంఖ్య ఈ ఏడాది 210కు పెరిగిందని తెలిపారు. ఐసీఐసీఐలో 6,000 ఉద్యోగాలు కాగా ఈ ఏడాది 5,000-6,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 300 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని 2,000-2,200 కొత్త ఉద్యోగాలివ్వనున్నామని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎం.ఒ. రెగో చెప్పారు. కొత్త బ్యాంకుల రాక కారణంగా తమ బ్యాంక్ నుంచి అధికంగా ఉద్యోగులు వలసపోతారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది 800 మంది రిటైరవుతున్నారని, అందుకే తమకు అవసరమైన దానికంటే 30 శాతం అధికంగా ఉద్యోగులను తీసుకోనున్నామని, ఈ ఏడాది 2,000 ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ సి.వి.ఆర్. రాజేంద్రన్ చెప్పారు.