Wipro
-
రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
భారతదేశం సర్వమత సమ్మేళనం.. కాబట్టి ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరు (ముస్లింలు) కళ, సాహిత్యం, సైన్స్ వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసినప్పటికీ.. వ్యాపార రంగంలో మాత్రం ఇతరులతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అజీమ్ ప్రేమ్జీ కుటుంబం మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే మూడు తరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.1947లో దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా.. అజీమ్ ప్రేమ్జీ తండ్రి 'మహ్మద్ ప్రేమ్జీ'ని పాకిస్తాన్కు రమ్మని ఆహ్వానించడమే కాకుండా.. అక్కడ ఆర్ధిక మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ మహ్మద్ ప్రేమ్జీ నిరాకరించి, భారతదేశంలో ఉండిపోయారు. నిజానికి మహ్మద్ ప్రేమ్జీ బియ్యం వ్యాపారి. ఈయన మొదట్లో మయన్మార్లో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత 1940లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అజీమ్ ప్రేమ్జీ ముంబైలోనే 1945లో జన్మించారు.అజీమ్ ప్రేమ్జీ.. ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం అజీమ్ ప్రేమ్జీ నికర విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ.ప్రాథమిక విద్యను భారతదేశంలోనే పూర్తి చేసిన అజీమ్ ప్రేమ్జీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ సమయంలోనే అజీమ్ ప్రేమ్జీ అన్న ఫరూఖ్ ప్రేమ్జీ తన తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అతని వివాహానంతరం.. పాకిస్తాన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ముహమ్మద్ ప్రేమ్జీ మరణానంతరం.. అజీమ్ ప్రేమ్జీ అప్పులపాలైన కుటుంబ వ్యాపారాన్ని (చమురు వ్యాపారం) నిర్వహించాల్సి వచ్చింది. తన తెలివితో చమురు వ్యాపారాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు. ఆ తరువాత దానిని విస్తరించడం మాత్రమే కాకుండా.. ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే విప్రో కంపెనీ ప్రారంభించారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..భారతదేశంలో 19వ ధనవంతుడు.. ప్రపంచంలోని 195వ ధనవంతుడైన అజీమ్ ప్రేమ్జీ, ఉదారంగా విరాళాలు అందించడంలో కూడా ముందున్నారు. 2020- 2021ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల జాబితాలో.. ఈయన రూ. 9713 కోట్లు విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే అజీమ్ ప్రేమ్జీ రోజుకు రూ. 27 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దేశీ టెక్నాలజీ సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా దిగ్గజాలు టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్సీఎల్ టెక్నాలజీస్(HCL Tech), విప్రో(Wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్ల జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకున్నాయి. 2025కి గాను టాప్ 25 సంస్థలతో బ్రాండ్ వేల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ టీసీఎస్ రెండో స్థానంలో, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇందులో యాక్సెంచర్ వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగింది.టీసీఎస్ బ్రాండ్ విలువ 11 శాతం పెరిగి 21.3 బిలియన్ డాలర్లకు చేరగా, ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండుగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ నిల్చింది. కంపెనీ బ్రాండు విలువ 17 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు విప్రో, టెక్ మహీంద్రా, హెక్సావేర్ మొదలైనవి కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. దేశాలపరంగా చూస్తే మొత్తం బ్రాండ్ వేల్యూలో 40 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో 36 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!కోలుకుంటున్న మార్కెట్ ..ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023 ఆఖర్లో, 2024 తొలినాళ్లలో కార్పొరేట్లు వ్యయాలను తగ్గించుకున్నాయని, అదే సమయంలో కృత్రిమ మేథ సంబంధిత సర్వీసులకు డిమాండ్ పెరిగిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అమెరికా మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రయోజనాలు చేకూరగలవని పేర్కొంది. 2025లో వడ్డీ రేట్లు తగ్గి, కార్పొరేట్లు ఖర్చు చేయడం పెరగడంతో పాటు కొత్త టెక్నాలజీలకు డిమాండ్ నెలకొనడం వల్ల ఐటీ సంస్థలు లబ్ధి పొందవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అత్యంత విలువైన బ్రాండ్లన్నీ కూడా మారుతున్న పరిశ్రమ ట్రెండ్స్కి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. -
మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..
కరోనా సమయంలో ఎంతోమంది టెకీలు జాబ్స్ కోల్పోయారు. డిసెంబర్ 2024లో కూడా దిగ్గజ కంపెనీలు సైతం లేఆప్స్ ప్రకటించాయి. కాగా ఇప్పుడు కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో టీసీఎస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో కూడా నేనున్నానంటూ.. ముందుకు వచ్చింది.దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో 10,000-12,000 మంది ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'సౌరభ్ గోవిల్' (Saurabh Govil) తన Q3FY25 ఆదాయ నివేదికను కంపెనీ విడుదల చేసిన తర్వాత, విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విప్రో తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో దాదాపు 7,000 మంది ఇప్పటికే ఆన్బోర్డ్లో ఉన్నారు. కాగా FY25 చివరి త్రైమాసికంలో మరో 2,500-3,000 మంది చేరే అవకాశం ఉంది. కాగా 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,655గా ఉన్నట్లు సమాచారం.విప్రో, టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను నియమించుకోవాలనే ప్రకటన చేసిన తరువాత, విప్రో కూడా ప్రకటించింది. ఈ వరుసలో ఇన్ఫోసిస్ కూడా చేసింది. FY26లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే లెక్కకు మించిన ఫ్రెషన్స్ ఐటీ కంపెనల్లో ఉద్యోగాలు పొందనున్నట్లు స్పష్టమవుతోంది. -
విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!
ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు (Q3 Results) సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 24% జంప్చేసి రూ. 3,354 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 0.5% పుంజుకుని రూ. 22,319 కోట్లకు చేరింది.క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 260.2–265.5 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదుకాగలదని (గైడెన్స్) తాజాగా ప్రకటించింది. వెరసి ఆదాయ వృద్ధిని మైనస్ 1% నుంచి +1% మధ్య అంచనా వేసింది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు కంపెనీ బోర్డు అనుమతించింది. మూడేళ్లపాటు లాభాల్లో 70%వరకూ వాటాదారులకు చెల్లించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.బిలియన్ డాలర్లు: తాజా సమీక్షా కాలంలో 17 భారీ డీల్స్ ద్వారా బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు విప్రో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో కొత్తగా 10,000–12,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. క్యూ3లో నికరంగా 1,157మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,732కు చేరింది.టెక్ మహీంద్రాఐటీ సొల్యూషన్ల కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 93 శాతం దూసుకెళ్లి రూ. 983 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో ప్రతికూలతల కారణంగా కేవలం రూ. 510 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2లో సాధించిన రూ. 1,250 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గింది.ఇదీ చదవండి: ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..కాగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1 శాతమే పుంజుకుని రూ. 13,286 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే రెండేళ్లలో ఇవి 15 శాతానికి బలపడగలవని కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రధానంగా టెలికం, తయారీ రంగాల నుంచి74.5 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు సీఎఫ్వో రోహిత్ ఆనంద్ వెల్లడించారు. -
ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!
వర్క్లైఫ్ బ్యాలెన్స్పై చివరి వరకు నాది అదే మాట అంటూ ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వార్తల్లో నిలచిని సంగతి తెలిసిందే. తనకు వర్క్లైఫ్ బ్యాలెన్స్పై నమ్మకం లేదని వారానికి 70 గంటలు యువత పనిచేయాల్సిందేనని అన్నారు. అప్పుడే భారతదేశం అభివృధ్దిచెందుతుంది అంటూ మరోసారి వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం హాట్టాపిక్గా మారింది. కొందరూ సీఈవోలు ఆయన మాటకు మొగ్గుచూపగా కొందరూ ఉద్యోగులు, టెక్కీలు మాత్రం ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ బెంగళూరు టెక్ సదస్సు 2024లో ఇదే అంశంపై అత్యంత షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఏ సంస్థం ఇలాంటి ఆఫర్ ఇవ్వదంటూ సరొకత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే వర్క్లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది సదరు ఉద్యోగి బాధ్యతే అంటూ కౌంటరిస్తూ మాట్లాడారు. ఇంతకీ రిషద్ ప్రేమ్జీ ఏమన్నారంటే.."పని-జీవిత సమతుల్యత"ను ఎవరికి వారుగా నిర్వచించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో వెసులబాటు అందిస్తామని ఏ సంస్థలు లేదా కార్యాలయాలు ఉద్యోగికి ఆఫర్లు ఇవ్వవు. అదంతా మన చేతిలోనే ఉంది." అని అటున్నారు రిషద్. తాను ఈ విషయాన్ని కరోనా ప్రారంభ సమయంలోనే తెలుసుకున్నానని అన్నారు. ఈ విషయమై చాలామంది ఉద్యోగులు కంపెనీలపై ఆరోపణలు చేస్తుంటారు. అది సబబు కాదని అన్నారు. నీ సీనియర్ ఉద్యోగులు లేదా పై అధికారులు అదనపు భారం లేదా భాద్యతలు మోపితే దాన్ని సదరు ఉద్యోగే వారితో మాట్లాడి చాకచక్యంగా పని భారం తగ్గించుకునే యత్నం చేయాలి. నీ వర్క్ విషయంలో నీకంటూ ఓ సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అధిగమించేలా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సంస్థకు లేదా పై అధికారులకు వాస్తవాన్ని వివరించి తెలివిగా పనిని బ్యాలెన్స్ చేసుకోవాలని అంటున్నారు. చాలావరకు ఉద్యోగుల నుంచి వచ్చే మొదటి ఫిర్యాదు పని ఒత్తిడి..అస్సలు దీని గురించి మీ టీమ్ ఇన్ఛార్జ్, లేదా సూపర్వైజర్తో చర్చింకుండా మౌనంగా అన్నిటికి తలాడిస్తూ..కోరి మరీ పని ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారని రిషద్ ఆరోపించారు. ఏ సంస్థ కూడా ఉద్యోగిని బొట్టు పెట్టి మరీ వర్క్లైప్ బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యమని చెప్పదు. దాన్ని ప్రతి ఉద్యోగి తనంతటా తానుగా నిర్వహించుకోవాల్సిన సున్నితమైన అంశం. అంతేగాదు పై అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని పని సమతుల్యతను అందించేలా వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే సంస్థ ఉద్యోగి ఒత్తిడులు, టెన్షన్లు, పని సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకుని వెసులుబాటు కల్పించగలిగే అవకాశం ఉంటుందంటున్నారు రిషద్. అంతేగాదు ఈ వర్క్ లైప్ బ్యాలెన్స్ అనేది ముమ్మాటికీ ఎవరికి వారుగా నిర్వహించుకోవాల్సిన విషయం అని బెంగళూరు టెక్ సదస్సులో రిషద్ గట్టిగా నొక్కి చెప్పారు. (చదవండి: పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!) -
ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్స్ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్బోర్డింగ్ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది. -
విప్రో నుంచి బోనస్ షేర్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ వాటాదారులకు తాజాగా బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఈ నెల 16–17న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలను 17న విడుదల చేయనుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 3,003 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ. 21,964 కోట్లకు పరిమితమైంది. వారాంతాన బీఎస్ఈలో విప్రో షేరు 0.8 శాతం బలపడి రూ. 529 వద్ద ముగిసింది.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్కు ప్రత్యర్థి కాదా? -
ఆఫీస్కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్లో హాజరుకు ఉద్యోగుల లీవ్లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్న్యూస్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్బోర్డ్ చేశామని పేర్కొంది.టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్జీఏలను (ఫ్రెషర్స్) ఆన్బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్జీఏలను ఆన్బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్లైన్ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది. -
30 నెలలు వెయిట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్
ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. ఒక వారం లేదా ఒక నెలలో జాయినింగ్ ఉంటుంది. అయితే దిగ్గజ ఐటీ సంస్థ 'విప్రో' మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి.. 30 నెలల తరువాత ఫ్రెషర్లను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కంపెనీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు కంపెనీ ఓ మెయిల్ పంపించింది. ఇందులో 'మీకు ముందుగా తెలియజేసినట్లు.. ఆన్బోర్డింగ్ కోసం ముందస్తు నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి'. అర్హత ప్రమాణాలు పూర్తి చేయడంలో ఫ్రెషర్లు విఫలమయ్యారు' అని వెల్లడించింది. ఇన్ని రోజులూ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ.. ఆఖరికి ఉద్యోగులను రిజెక్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు కంపెనీ ఇలాంటి ఫలితం ఇస్తుందని అస్సలు ఊహించలేదని అన్నారు.విప్రో మాత్రం ఫ్రెషర్స్ ఆఫర్స్ లెటర్స్ రద్దు చేసిన తరువాత.. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సరైన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. కొత్త టెక్నాలజీలో ఉద్యోగులకు తప్పకుండా ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది.ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన ఎంతోమంది ఉద్యోగులకు విప్రో పెద్ద షాక్ ఇచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్నారు. దీనిపైన ఐటీ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్కౌంట్లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్సీఎల్టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్సీఎల్టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్స్కేప్లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
క్యూ1లో విప్రో ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు. 12,000 మందికి చాన్స్ ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది. షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది. -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్లో విప్రోను వీడి కాగ్నిజెంట్లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్వో జతిన్ దలాల్కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
-
ఐదేళ్లకు సరిపడా భారీ డీల్ పట్టేసిన విప్రో
-
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ భారత్ ఐటీ దిగ్గజం విప్రో భారీ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐదేళ్ల కాలానికి 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 4,175 కోట్లు ) డీల్ పొందినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.ఈ ఒప్పందంలో భాగంగా అమెరికన్ సంస్థకు కొన్ని ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం నిర్వహణ సేవలను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో వెల్లడించలేదు.కాగా విప్రో కమ్యూనికేషన్ విభాగం 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో 4.2 శాతం ఈ విభాగం నుంచి కంపెనీ లభించింది. 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు కీలకం. ఎందుకంటే అవి నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి.నాలుగో త్రైమాసికంలో విప్రో భారీ డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వృద్ధిని వేగవంతం చేయడమే విప్రో తక్షణ ప్రాధాన్యత అని కొత్తగా నియమితులైన సీఈవో శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్ కాల్ లో చెప్పారు. -
వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయం
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఆధ్వర్యంలోని సీబీఆర్ స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి విప్రో సీబీఆర్తో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్ను తయారుచేయనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్త టెక్నాలజీ ఇంజిన్లో వాడే కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్డేటా అనలిటిక్స్ నిత్యం వ్యక్తులతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తాయి. గుండె, న్యూరోడిజెనరేటివ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం, వాటిని నిర్వహించడంపై దృష్టి పెడుతాయి. సీబీఆర్ సహకారంతో డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్ను విప్రో పరీక్షిస్తుంది.ఇదీ చదవండి: రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..విప్రో లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి మాట్లాడుతూ..‘సాంకేతిక ఆవిష్కరణల ద్వారా హెల్త్కేర్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈమేరకు కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ ఆధ్వర్యంలోని సీబీఆర్తో భాగస్వామ్యం కావడం సంతోషకరం. విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్ పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు. -
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్ మేనేజ్మెంట్ను ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్ కన్సల్టింగ్ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్నర్షిప్ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్కి రిపోర్ట్ చేయాలి. ఐచెన్హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్లో, నోకియాతో ప్రైవేట్ వైర్లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్మెంట్ లీడర్గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ప్రేమ్జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్రాక్ ఇంక్., సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్ప్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్లోని డేటా స్ట్రీమ్లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్లోని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే..??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచిందివిప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
థియరీ డెలాపోర్టే రాజీనామా, విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు. విప్రో సీఈఓ జీతం ఎంత? గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్ను పూర్తి చేశారు. -
వాళ్లు పోతే పోనీ.. దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రమోషన్లు!
Wipro Promotions : భారతీయ ఐటీ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు, మరో 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రమోట్ చేసినట్లు అంతర్గత మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ అయిన విప్రో నుంచి ఉన్నత స్థాయి నిష్క్రమణల పరంపర తర్వాత సీనియర్-స్థాయి అట్రిషన్ను నిరోధించే చర్యగా ఈ ప్రమోషన్లను పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడింట్గా పదోన్నతి పొందిన చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహాలే, హెల్త్కేర్ పోర్ట్ఫోలియో లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో సీఎఫ్ఓ బెంజమిన్ సైమన్, కెనడా కంట్రీ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ శ్రీనివాసా హెచ్జి, క్లౌడ్ ఆర్మ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్ హెడ్ సతీష్ వై ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్మాన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ భరత్ నారాయణన్ సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రోను వీడారు. నియామక సంస్థ ఎక్స్ఫెనో డేటా ప్రకారం.. దేశంలోని ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడింట్, వైస్ ప్రెసిడింట్, సీనియర్ వైస్ ప్రెసిడింట్ పోస్టుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం తగ్గింది. కాగా ప్రమోషన్ల అంశాన్ని విప్రో యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. "బలమైన అంతర్గత నాయకులను అభివృద్ధి చేయడంలో కొనసాగుతున్న నిబద్ధత"లో ఇది భాగమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది. 2023 జనవరిలో విప్రో రికార్డు స్థాయిలో 73 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. వీరిలో 12 మందిని సీనియర్ వైస్ ప్రెసిడింట్ స్థాయికి, 61 మందిని వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పదోన్నతి కల్పించింది. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!
2024 ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. టెక్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం విప్రో వందలాదిమందిని తొలగించడానికి సిద్ధమైంది. సంస్థ లాభాల మార్జిన్లను మెరుగుపరచుకోవాలనుకుంటున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విప్రో కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపడుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఖర్చులను ఆదా చేయడానికి లేఆప్స్ ప్రక్రియను మొదలుపెట్టాయి. విప్రో కంపెనీ కూడా ఈ సంస్థలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల వెల్లడైన క్యూ3 ఫలితాలలో విప్రో ఆశించిన లాభాలను పొందలేకపోయింది. ఫలితాల ప్రకారం విప్రో లాభం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ. కాబట్టి కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించడానికి సంకల్పించింది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా.. ప్రస్తుతం విప్రో కంపెనీ లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తోంది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'అపర్ణ అయ్యర్' రాబోయే త్రైమాసికంలో కంపెనీ లాభాల మార్జిన్లను మెరుగుపరిచే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ తొలగించనున్న ఉద్యోగులలో ఆన్సైట్లో పని చేసే మధ్య స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. -
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్జీ', ఎంటర్ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు.. ప్రేమ్జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో సహా ప్రేమ్జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది. -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను కాగ్నిజెంట్కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
మాజీ ఉద్యోగులపై కోర్టు మెట్లెక్కిన విప్రో..రిషద్ ఆసక్తికర వ్యాఖ్యలు
విప్రో మాజీ ఉన్నతస్థాయి ఉద్యోగుల తీరును తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించడంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ స్పందించారు. మాజీ ఎగ్జిక్యూటివ్లపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో రిషద్ ప్రేమ్జీ మాట్లాడారు. విప్రో ఉద్యోగులు వారు చేస్తున్న పనిలో గోప్యత పాటించడం అవసరం. ఆ గోప్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలకు తావులేదని చెప్పారు. మా ఉద్దేశం అదికాదు.. వేరే ఉంది వ్యాజ్యాలు ఉద్యోగుల ఉపాధిపై దెబ్బకొట్టేందుకు కాదని, కేవలం వారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నవంబర్లో, విప్రోలో సీఎఫ్ఓగా పనిచేసిన జతిన్ దలాల్పై దావా వేసింది. అతను విప్రోలో సీఎఫ్ఓగా పనిచేసిన వెనువెంటనే కాగ్నిజెంట్లో సీఎఫ్ఓగా చేరారు. తద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించింది. అందరిది ఒకే మాట క్యూ3 ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్జీ సీఈఓ థియరీ డెలాపోర్టే గతంలో ప్రస్తావించిన అంశంపై మాట్లాడారు. కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్పై వ్యాజ్యాలు దాఖలు చేయడం కంపెనీ కాంట్రాక్టు ఉల్లంఘించినందుకే తప్పా ఇందులో వ్యక్తిగత అంశాలకు చోటులేదని చెప్పారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రిషద్ ప్రస్తావించారు. -
అప్పుడాయన ఆ తప్పు చేయకుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు!
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్. -
విప్రో లాభం డౌన్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది. గైడెన్స్ ఇలా ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇతర విశేషాలు ♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది. ♦బీఎఫ్ఎస్ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్ నుంచి మాత్రం 18.8 శాతం జంప్చేసింది. ♦ ఆర్డర్ బుక్ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్ విలువ 0.9 బిలియన్ డాలర్లు. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది. ♦ డిసెంబర్కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్చేసి రూ. 465 వద్ద ముగిసింది. -
ఊహించినట్టుగానే జరిగింది.. భారీగా తగ్గిన విప్రో లాభాలు!
దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది. ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం. క్యూ3 హైలైట్స్: గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి. సేవల శాతం ప్రకారం ఆఫ్షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది. డాలర్ ఆదాయం 2.66 బిలియన్ డాలర్లు ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది. మొత్తం బుకింగ్లు 3.8 బిలియన్ డాలర్లు అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది. విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. -
విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్లో చేరిన తమ మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్ల కాంట్రాక్ట్లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్సీ టెక్నాలజీ, హెచ్సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది. -
కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు!
కంపెనీ మారిన మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది. కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్ను కోరింది. అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్లో సీఎఫ్వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది. జతిన్ దలాల్కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది. -
‘మా ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు?’.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఐటీ కంపెనీలు!
నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారంటూ ప్రముఖ దిగ్గజ టెక్ దిగ్గజ కంపెనీలు ఒకదానికొకటి నోటీసులు జారీ చేసుకుంటున్నాయి. ఇప్పుడీ నోటీసుల పర్వం ఐటీ జాబ్ మార్కెట్ను షేక్ చేస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీ పద్దతి అస్సలు బాగోలేదు.. మా కంపెనీ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు? అంటూ భారత్కు చెందిన టెక్ కంపెనీలు ఒక్కటై అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్కు వరుస నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే విప్రో.. కాగ్నిజెంట్కు నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఇన్ఫోసిస్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. ‘‘ కాగ్నిజెంట్ భారత్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థకు చెందిన సుమారు 20 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అందులో సీఈఓ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ స్థాయిలో విధులు నిర్వహించే నలుగురు టాప్ ఎగ్జిక్యూటీవ్లు ఉన్నారు’’ అని ఆరోపిస్తూ కాగ్నిజెంట్కు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా ‘‘ తాము కాగ్నిజెంట్కు పంపిన నోటీసులు ఆ సంస్థకు ఓ హెచ్చరికలాంటిది. ఆ సంస్థ 20 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని నియమించుకున్న తర్వాత ఆ కంపెనీ ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయి’’ అంటూ ఓ జాతీయ మీడియాతో ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ ఇటీవల, విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హక్ (Mohd Haque)లు కాగ్నిజెంట్లో చేరారు. వాళ్లిద్దరూ కాగ్నిజెంట్లో చేరిన రెండు రోజులకే విప్రో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. జతిన్ దలాల్,మహమ్మద్ హక్ మహమ్మద్ హక్ తన ఉద్యోగ ఒప్పందంలోని నాన్-కాంపిటీ క్లాజ్ను ఉల్లంఘించి తమ కాంపిటీటర్ కాగ్నిజెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లైఫ్ సైన్సెస్కు బిజినెస్ యూనిట్ హెడ్గా చేరారని కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా, హక్ తన నాన్ కాంపిటేట్ నిబంధన గడువు ముగియడానికి ముందే చేరడం చట్ట విరుద్దం అని కోర్టుకు విన్నవించుకుంది. అంతేకాదు, విప్రోను వదిలి కాగ్నిజెంట్లో చేరే సమయంలో తమ సంస్థకు చెందిన ఏడు ఫైళ్ల రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మా ఐటీ బృందం కనిపెట్టింది. దీనికి తోడు విప్రో అఫీషియల్ మెయిల్ నుంచి తన వ్యక్తిగత మెయిల్కు కంపెనీ రహస్యాల్ని సెండ్ చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని కోర్టు ఫిర్యాదులో వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం.. హక్.. విప్రో లక్ష్యాల్ని, వ్యాపార వ్యహరాల్ని తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని అందించారు. రాజీనామాకు కొద్ది సేపటి ముందే చాలా తెలివిగా విప్రో రహస్యాల్ని మెయిల్స్కి పంపుకున్నారు అని వరుస ఆరోపణల్ని గుప్పిస్తూ వస్తోంది. కాగ్నిజెంట్కు ఇన్ఫోసిస్, విప్రో ఎగ్జిక్యూటీవ్ల క్యూ 2022 నుండి విప్రో , ఇన్ఫోసిస్ సంస్థల్లో సీనియర్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ ఎత్తున కాగ్నిజెంట్లో చేరారు. ముఖ్యంగా, సీఎఫ్ఓ నిలంజన్ రాయ్, ఈవీపీ రాజీవ్ రంజన్, అధ్యక్షుడు మోహిత్ జోషి, ఎండీ రవి కుమార్ వంటి కీలక వ్యక్తుల ఇన్ఫోసిస్ నుంచి కాంగ్నిజెంట్లో చేరడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదే విధంగా, విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్, గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మాన్, ఎస్వీపీ మొహమ్మద్ హక్, ఆశిష్ సక్సేనాతో పాటు ఇతర టాప్ ఎక్జిక్యూటీవ్లు సంస్థను వదిలి వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది కాగ్నిజెంట్తో పాటు ఇతర కాంపీటీటర్ సంస్థల్లో చేరారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కారణంగా విప్రో, ఇన్ఫోసిస్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ మాజీ ఉద్యోగులు, వారిని చేర్చుకున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాయి. అందులో కాగ్నిజెంట్ కూడా ఉంది. మూల కారకులు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ కాగ్నిజెంట్ ప్రస్తుత సీఈఓ రవికుమార్ గతంలో ఇన్ఫోసిస్లో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇన్ఫోసిస్ నుంచి బయటకొచ్చి సీఈఓగా కాగ్నిజెంట్లో చేరారు. అనంతరం ఇన్ఫోసిస్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా, నలుగురిని వైస్ ప్రెసిడెంట్లుగా మొత్తం 20 మంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారిని తన సంస్థలోకి ఆహ్వానించారు.ఈ అంశమే కాగ్నిజెంట్పై ఇన్ఫోసిస్, విప్రోలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రేరేపించాయి. -
పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?!
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ‘‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది. వారానికి మూడు రోజులు ఆఫీస్లోనే ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్ వర్క్ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విస్తరిస్తోన్న కరోనా కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్-19 వైరస్ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్-19, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్.. ప్రస్తుతం జేఎన్1 వైరస్గా మన ముందుకొస్తోంది. డిసెంబర్ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది. -
భారత్లో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా?
భారత్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో ఫ్రాన్స్కు చెందిన థియరీ డెలాపోర్టే అగ్రస్థానంలో నిలిచారు. 2020 నుంచి విప్రో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డెలాపోర్టే .. వేతనాల విషయంలో దేశీయ మిగిలిన టెక్ కంపెనీలు హెచ్సీఎల్, టీసీఎస్ సీఈఓలను వెనక్కి నెట్టారు. ఏడాదికి రూ.82 కోట్ల వేతనాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా ఫోర్బ్స్తో డెలాపోర్టే మాట్లాడుతూ.. ‘‘ విప్రో సీఈఓ పదవికి అర్హులైన వారి కోసం అన్వేహిస్తున్న సమయంలో ఆ సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీని, ప్రస్తుత ఛైర్మన్ అజీమ్ కుమారుడు రిషద్ ప్రేమ్జీని కలిశాను. వారితో మాట్లాడక ముందు భవిష్యత్పై నాకు అనేక ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. కానీ అజీమ్, రిషద్తో మూడు, నాలుగు గంటలు గడిపిన తర్వాత నా ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వారి ఇద్దరి మాటల్లో విలువలతో కూడిన ఆశయాలు, ప్రాధాన్యతల గురించి విన్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను’’ అని డెలాపోర్టే అన్నారు. డెలాపోర్టే తర్వాత ఎవరంటే? ఇక డెలాపోర్టే తర్వాత ఇన్ఫోసిస్కు చెందిన సలీల్ పరేఖ్ దేశంలోనే అత్యధిక చెల్లింపులు జరుపుతున్న రెండవ సీఈఓగా అవతరించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదికలో స్టాక్ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 500 కంపెనీల విశ్లేషణలో తేలింది. పరేఖ్ ఈ ఏడాది రూ. 56.45 కోట్ల జీతం తీసుకున్నారు. రూ. 30 కోట్ల వేతనంతో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ మూడో స్థానంలో నిలిచారు. నాల్గవ స్థానంలో మాజీ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రూ. 29 కోట్లకు పైగా సంపాదించారు రేసులో కామత్ సోదరులు ఈ ఏడాదిలో అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ డైరక్టర్, సీఈఓగా జీరోధా సోదరులు నిలిచారు. జీరోధార ఫౌండర్ నితిన్ కామ్, నిఖిల్ కామత్లు ఇద్దరూ అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ సీఈఓలుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరి వేతనం ఏడాది రూ.72కోట్లుగా ఉంది. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్లో తీసుకువచ్చింది. విప్రో వెబ్సైట్లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు విప్రో ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరులోని తన ఆస్తులను విక్రయించాలని విప్రో నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్లు ఉన్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి విప్రో క్యాంపస్ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్కల్చర్కు అనుగుణంగా హైబ్రిడ్వర్క్ మోడల్ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే విప్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉండగా.. ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది. సెప్టెంబర్ త్రైమాసికం వరకు విప్రోలో 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు. -
వావ్ అనిపిస్తున్న విశాఖ.. విప్రో బాటలో దిగ్గజ కంపెనీలు
-
మరో బ్యాడ్న్యూస్: విప్రో ఉద్యోగుల ఆశలు ఆవిరేనా? పిడుగు లాంటి నివేదిక!
Wipro salary hike: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తోంది. ఇంటి పని చేస్తున్న ఉద్యోగులందరూ ఆఫీస్లకు రావాల్సిందేనని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కంపెనీ ఇప్పుడు జీతాల పెంపు విషయంలో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పిడుగు లాంటి నివేదికను రాయిటర్స్ బయటపెట్టింది. విప్రో సంస్థ పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన పెంపు విషయంలో ఈ సంవత్సరం అధిక ప్యాకేజీ ఉద్యోగులకు మొండిచేయి చూపిస్తుందని, వారికి వార్షిక వేతన పెంపును దాటవేయవచ్చని రాయిటర్స్ తాజాగా నివేదించింది. ఈ కంపెనీలో డిసెంబర్ నెలలో వేతన సవరణలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 1న ఉద్యోగులు పెరిగిన జీతాలు అందుకుంటారని కంపెనీ యాజమాన్యం తమ 2023-24 రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది. తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ఊరట నివేదిక ప్రకారం.. విప్రో కంపెనీ జీతాల పెంపును పూర్తిగా విరమించుకోలేదు. తక్కువ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపును అమలు చేయబోతోంది. వేతన పెంపులో తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్న కంపెనీ అంతర్గత మెమోను రాయిటర్స్ ఉటింకించింది. ఆఫీస్కు రావాల్సిందే.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్కు రావాల్సిందేనని విప్రో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్ పాలసీలో భాగంగా నవంబర్ 15 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన ఈమెయిల్స్లో పేర్కొంది. కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, వచ్చే ఏడాది జనవరి 7 నుంచి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదీ చదవండి: 70-hour work: అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్! -
వర్క్ ఫ్రం హోంపై విప్రో కీలక నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో వర్క్ ఫ్రం హోంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి 3 రోజులు తప్పని సరిగా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్ పాలసీలో భాగంగా నవంబర్ 15,2023 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన మెయిల్స్లో పేర్కొంది. ఇప్పటికే భారత్లోని టెక్ కంపెనీలు పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్కి స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఇన్ఫోసిస్లు వర్క్ ఫ్రమ్ హోమ్లో మార్పులు చేశాయి. టెక్కీలు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబడుతున్నాయి. తాజాగా, విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఈ పాలసీ గురించి మాట్లాడుతూ ఉద్యోగులు కలిసి పనిచేసేందుకు ప్రోత్సహ్తిస్తూ కార్పొరేట్ సంస్కతిని మరింత బలోపేతం చేసేలా హైబ్రిడ్ వర్క్ మోడల్ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానిక నిబంధనలు పాటిస్తూ తగు మార్పులు చేస్తామని పేర్కొన్నారు. కొత్త వర్క్ పాలసీ అనుసరించలేదంటే? కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, జనవరి 7, 2024 నుండి పరిణామాలు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు తెలిపింది. మరి తాజా యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
విశాఖలో విప్రో విస్తరణ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ ‘ప్రాజెక్ట్ లావెండర్’ పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఇప్పుడు మహా నగరాల నుంచి టైర్–2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ సమయంలో వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో వారి వద్దకే వెళ్లేందుకు ఐటీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యయాల్ని తగ్గించుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా విప్రో కూడా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో.. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్మెంట్ సెంటర్ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది. వైఎస్సార్ హయాంలో నాంది సత్యం జంక్షన్లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. తొలుత 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే కోవిడ్ సమయంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(ఎపిటా) గ్రూప్ సీఈవో కిరణ్రెడ్డి విప్రో ప్రతినిధి శశికుమార్తో పలు దఫా లుగా చర్చలు జరిపి.. విస్తరించేందుకు ఆహా్వనించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన విప్రో.. కా ర్యకలాపాలు ప్రారంభించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి విశాఖలో విస్తరణకు విప్రో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. గత క్యాంపస్లో కొంత భాగం ఇప్పటికే అద్దెకు ఇచ్చిన విప్రో.. ముందు భవనంలో ఇప్పటికే సేవలు ప్రారంభించింది. ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లలోనూ తమ సంస్థ మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇందులో అద్దెకు ఇచ్చిన వారిని ఖాళీ చేయించారు. వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల్ని దాదాపు పూర్తి చేసింది. మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం సంస్థ సేవల్ని విశాఖలో విస్తరిస్తామని ప్రభుత్వంతో విప్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి కల్లా 1000 సీట్లకు పెంచుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విప్రో ప్రతినిధులు హామీ ఇవ్వడం శుభపరిణామం. వైజాగ్లో టాలెంట్, అప్స్కిల్లింగ్, అనుభవజు్ఞలైన నిపుణుల్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. భవిష్యత్తులో ఏ క్లైయింట్ వచ్చినా.. ఇక్కడికే తీసుకురావాలని సూచించాం. దానికి కావాల్సిన మానవ వనరుల్ని అందిస్తామన్నాం. దానికి విప్రో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారంతో పాటు విప్రో ప్రాజెక్టులకు అవసరమైన రిక్రూట్మెంట్కు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. – కిరణ్రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 2,667 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,649 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22,516 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,540 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఐదు అనుబంధ సంస్థలను కంపెనీలో విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. వీటిలో విప్రో హెచ్ఆర్, ఓవర్సీస్ ఐటీ, టెక్నాలజీ ప్రొడక్టు సరీ్వసులు, వీఎల్ఎస్ఐ డిజైన్ సరీ్వసులు, విప్రో ట్రేడ్మార్క్ హోల్డింగ్ ఉన్నాయి. గైడెన్స్ వీక్.. ప్రస్తుత త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.5–1.5 శాతం మధ్య క్షీణించవచ్చంటూ విప్రో తాజా అంచనాల(గైడెన్స్)ను ప్రకటించింది. వెరసి కరెన్సీ నిలకడ ప్రాతిపదికన 261.7–267.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఊహిస్తోంది. అంటే రూ. 21,643–22,097 కోట్ల మధ్య టర్నోవర్ను అంచనా కట్టింది. ప్రస్తుత బలహీన ప్రపంచ ఆర్థిక ఔట్లుక్ నేపథ్యంలో తాజా గైడెన్స్ను ప్రకటించింది. ఇతర విశేషాలు ► నిర్వహణ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 16.1 శాతానికి చేరాయి. ► 3.78 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► క్యూ2కల్లా సిబ్బంది సంఖ్య 7 శాతం తగ్గి 2,44,707కు చేరింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 త్రైమాసికాల్లోనే తక్కువగా 15.5%కి పరిమితమైంది. అనిశి్చతులు ఉన్నాయ్... బిజినెస్ వాతావరణం అనిశి్చతిగా ఉన్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలలో కొనసాగుతున్నాయని, పెట్టుబడులపట్ల క్లయింట్లు మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పెట్టుబడుల గరిష్ట వినియోగంపై దృష్టి పెడుతూనే కొత్త పెట్టుబడులపై వేగవంత రిటర్నులను ఆశిస్తున్నట్లు వివరించారు. విచక్షణా వ్యయాలు, ఆర్డర్లు నెమ్మదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్జిన్లు నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 408 వద్ద ముగిసింది. -
ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!
Wipro salary hike: ప్రముఖ దేశీయ టెక్నాలజీ దిగ్గజం విప్రో (Wipro).. తమ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త చెప్పింది. జీతాల పెంపుదలను వచ్చే డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులకు వేతన పెంపు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ఈ మేరకు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ నుంచి ఉద్యోగులకు ఈ-మెయిల్ అందినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. "ప్రస్తుతం సవాళ్లతో కూడిన, అనిశ్చిత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మా మెరిట్ జీతాల పెంపుదల (MSI) 2023 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో, ప్రస్తుత పరిహారం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా అర్హత ఉన్న ఉద్యోగులకు మెరిట్ జీతం పెంపును నిర్ణయిస్తాం" అని ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. (మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్తో రూ.లక్ష మాయం..) స్థూల ఆర్థిక ఎదురుగాలి, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా జీతాల పెంపు ప్రకటనను విప్రో ఈ సంవత్సరం మూడు నెలలు వాయిదా వేసింది. దీంతోపాటు ఈ సంవత్సరం అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు జీతాల పెంపును జాప్యం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ మందగమనం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. లాభదాయకతను పెంపొందించుకోడానికి, ఐటీ రంగంలో తన స్థితిని మెరుగుపరచడానికి విప్రో.. గత జులైలో వ్యూహాత్మక మార్పులను చేపట్టింది. కంపెనీ తన క్లయింట్ బేస్ను తగ్గించుకుని అధిక మార్జిన్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఒప్పందాలపై దృష్టి పెట్టింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8 శాతం సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిన కొన్నాళ్లకే ఈ వ్యూహం అమలు చేసింది. అదనంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, సంస్థ ప్రారంభ ఆఫర్లతో పోలిస్తే కొత్త రిక్రూట్మెంట్ల పే ప్యాకేజీలను దాదాపు 50 శాతం తగ్గించింది. -
ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు
ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్జెమినీ LTIMindtree టాప్ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్ వర్క్ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు. (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!) కాగా గ్లోబల్గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు. -
సీఎఫ్వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్లో ప్రత్యక్షం!
విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ (Jatin Dalal)ను తమ సీఎఫ్వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్వోగా రాజీనామా చేశారు. (లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్టాప్లూ తనిఖీ) ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు మారుతున్న టాప్ ఎగ్జిక్యూటివ్లు ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది టీసీఎస్. వచ్చే డిసెంబర్లో ఆయన విధుల్లో చేరన్నారు. (ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట) ఇక జతిన్ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి. 2015లో విప్రో సీఎఫ్వో అయిన జతిన్ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది. -
20 ఏళ్లనాటి భవనం అమ్మేసిన విప్రో.. దెబ్బకు పతనమైన షేర్లు
తమిళనాడులోని 20 ఏళ్ల నాటి భవనంతో పాటు 14 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఐటీ కంపెనీ విప్రో ఇటీవల ప్రకటించింది. చెన్నైలోని షోలింగనల్లూరు ఐటీ కారిడార్లో దాదాపు 5,89,778 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని రూ. 266.38 కోట్లకు కాసాగ్రాండ్ బిజ్పార్క్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. విప్రో తన ఆస్తులను విక్రయించిన తరువాత కంపెనీ షేర్స్ అన్నీ కూడా వరుస నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 2870.10 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ. 2563.60 కోట్లు. ఈ లెక్కన 2022 కంటే 2023 లో కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగింది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! విప్రో వంటి పెద్ద సంస్థ తన ఆస్తులను అమ్మడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని వల్ల చాలామందికి కంపెనీ నష్టాల్లో ఉందా అనే ఆలోచన వచ్చింది. ఈ దెబ్బతో షేర్లు క్రమంగా తగ్గాయి. అయితే విప్రో నిజంగా నష్టాల్లో ఉందా.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. -
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి?
ఇండియా & కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియన్ ఐటీ పరిశ్రమ మీద ప్రభావం చూపుతాయా అని చాలామంది కంగారుపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?, నిజంగానే ప్రభావం ఉంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్, కెనడా మధ్య వివాదం ఫలితంగా భారతీయ ఐటీ సంస్థలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావానికి లోనయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్షణం ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. కెనడా ప్రాంతం నుంచి ఐటీ కంపెనీల ఆదాయం 5 - 6 శాతం వరకు ఉంది. టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా & కెనడా టెక్ నెట్వర్క్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 15,000 కంటే ఎక్కువ మంది కెనడాలో ఉద్యోగాల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అమెరికాలో వీసా సమస్యల కారణంగా ఎక్కువమంది కెనడాకు పయనమయ్యారు. ఈ ఏడాది జులైలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీని ప్రారంభించింది. దీని ద్వారా 2024 నాటికి కెనడాలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ జనవరిలో, TCS తన డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి.. అదే విధంగా ఆవిష్కరణను పెంచడానికి కెనడియన్ జెట్ తయారీదారు బొంబార్డియర్ ద్వారా వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికైంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు! ఇక విప్రో విషయానికి వస్తే.. జనవరిలో కెనడాలోని టొరంటోలో తన సరికొత్త Wipro-AWS లాంచ్ ప్యాడ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్కు దరఖాస్తు చేసింది. -
విప్రో సీఎఫ్వోగా అపర్ణ అయ్యర్.. గోల్డ్ మెడల్ సీఏ ఈమె..
భారత ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా అపర్ణ అయ్యర్ (Aparna Iyer) నియమితులయ్యారు. ఇప్పటి వరకూ సీఎఫ్వోగా ఉన్న జతిన్ దలాల్ సెప్టెంబర్ 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్ను విప్రో నియమించింది. అపర్ణ అయ్యర్ 20 ఏళ్లుగా విప్రోలో పనిచేస్తున్నారు. 2003లో చేరినప్పటి నుంచి కంపెనీకి వివిధ సీనియర్ స్థానాల్లో సేవలందించారు. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్గా విప్రోలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అయ్యర్ విప్రో సంస్థలో కీలకమైన నాయకత్వ స్థానాలను నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆమె విప్రో క్లౌడ్ సర్వీసెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీజీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి ఆర్థిక సంబంధమైన అంశాల్లో విశేషమైన నైపుణ్యం ఉన్న అపర్ణ అయ్యర్ ఆయా అంశాల్లో పలు కీలక పోస్టులను నిర్వహించారు. అపర్ణ అయ్యర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, సీఏ 2002 బ్యాచ్లో గోల్డ్ మెడల్ విజేతగా గుర్తింపు పొందారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో చేరడానికి ముందు అయ్యర్ 2001లో ముంబైలోని నర్సీ మోంజీ నుంచి కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) “నిష్ణాతురాలైన అపర్ణ ఫలితాలతో నడిచే లీడర్. విప్రోతో తన 20 ఏళ్ల కెరీర్లో ఆమె మా బిజినెస్ లీడర్లకు డైనమిక్, ఫార్వర్డ్ థింకింగ్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు” అని విప్రో లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. విప్రో సీఎఫ్ఓగా నియమితులైన తర్వాత అపర్ణ అయ్యర్ మాట్లాడుతూ "విప్రోకి ఈ ముఖ్యమైన తరుణంలో సీఎఫ్ఓ బాధ్యతలను స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీని స్థిరమైన వృద్ధివైపు నడిపించడానికి, వాటాదారులకు విలువను సృష్టించడానికి సీఈవో థియరీతో, మా ఫైనాన్స్ బృందం, మొత్తం సంస్థతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. -
ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్!
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. లిస్ట్లో ఇండియన్ కంపెనీలు అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 20 లిస్ట్ ఇదే.. 1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ 2. H&R బ్లాక్ 3. డెల్టా ఎయిర్ లైన్స్ 4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5. యాక్సెంచర్ 6. IBM 7. L3 హారిస్ 8. విప్రో 9. ఇన్ఫోసిస్ 10. నైక్ 11. వ్యాన్స్ 12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్ 13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 14. హాల్ మార్క్ 15. మైక్రోసాఫ్ట్ 16. నార్త్రోప్ గ్రుమ్మన్ 17. FedEx ఫ్రైట్ 18. డచ్ బ్రదర్స్ కాఫీ 19. వాల్ట్ డిస్నీ కంపెనీ 20. యాపిల్ Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo — IBM (@IBM) September 21, 2023 -
విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్ రాజీనామా - ఆ స్థానంలో అపర్ణ అయ్యర్
విప్రో (Wipro) కంపెనీలో దాదాపు 20 సంవత్సరాలుగా ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్గా (CFO) సేవలందించిన జతిన్ దలాల్ గురువారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ స్థానంలోకి కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న 'అపర్ణ అయ్యర్'ను నియమిస్తున్నట్లు.. సెప్టెంబర్ 22నుంచి పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అపర్ణ ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు దశాబ్దాలుగా నాకు కంపెనీలో అవకాశం కల్పించినందుకు విప్రోకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించడానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్లో ఇండియన్ ఎంప్లాయిస్.. 2022లో ట్రెజరీ మేనేజర్గా చేరిన దలాల్ అప్పటి నుంచి సీనియర్ మేనేజర్, ఇన్వెస్టర్ రిలేషన్స్, CFO - యూరప్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, IT ఫైనాన్స్ మేనేజర్ అండ్ హెడ్ వంటి అనేక పదవుల్లో కొనసాగారు. కంపెనీ ఉన్నతిలో జతిన్ దలాల్ పాత్ర ఆమోఘనీయం అని పలువురు అభినందించారు. -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు!
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఆఫర్ లెటర్లు తీసుకొని జాయినింగ్ తేదీల కోసం పడిగాపులు కాస్తున్న ఫ్రెషర్స్కు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. జులై1, 2023 నుంచి జూన్ 30, 2024 మధ్య కాలానికి ఫ్రెషర్స్ నియమకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో ఐటీ రంగంలో నియమకాలు, ఫ్రెషర్స్ జాయినింగ్ తేదీలపై మరింత సందిగ్ధత నెలకొంది. కోవిడ్-19 సమయంలో అన్నీ రంగాలు కుదేలవుతుంటే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే.. టెక్కీలు మాత్రం రోజుకి రెండు, మూడు జాబులు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. ఒకనొక సమయంలో అంటే 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలంలో టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో,హెచ్సీఎల్, టెక్ మహీంద్రా,యాక్సెంచర్తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్స్ను నియమించుకున్నాయి. ముఖ్యంగా, ఆయా టెక్నాలజీ కంపెనీలు 2022- 2023 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్ధులకు ఆఫర్ లెటర్లను అందించాయి. ఏడాది క్రితం వారికి ఆఫర్ లెటర్లను అందించినా జాయినింగ్ డేట్ ఎప్పడనేది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ప్రతి రెండు-మూడు నెలలకు కంపెనీల్లో చేరే తేదీలను పొడిగిస్తున్నాయి. మరికొందరు తమ ఆఫర్ లెటర్ల గడువు ముగియడంతో అదనంగా శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరు వారి ఆఫర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో జాబ్ మార్కెట్లో ఫ్రెషర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం.. గత రెండు బ్యాచ్లలో 20,000-25,000 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు పొందారు. కానీ సంస్థలు ప్రాజెక్ట్లలో తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయి. బిజినెస్ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ ప్రశ్నిస్తోంది. తాజాగా, టీమ్ లీజ్ నివేదిక సైతం రానున్న రోజుల్లో ఫ్రెషర్ల నియామకం భారీగా తగ్గిపోతుందని తన నివేదికలో హైలెట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్స్ చేరే తేదీలు, నియమాకాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?
TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే ప్రపంచంలోని తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కంపెనీల ర్యాంకింగ్లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు 750 కంపెనీలున్న టైమ్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ , ఆన్లైన్ డేటా ప్లాట్ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు, సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా ఆ ర్యాంకింగ్లను కేటాయించారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్ మూవింగ్ టెక్ ర్యాంకింగ్లున్నాయి. Infosys has been featured in TIME World’s Best Companies 2023 list. We are among the top 3 global professional services firm and the only brand from India in the Top 100 global rankings: https://t.co/Mvg9lRFxDV pic.twitter.com/dN6n0p76ZA — Infosys (@Infosys) September 14, 2023 టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్లలో తొలి నాలుగు కంపెనీలు అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి, వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి దోహద పడ్డాయని తెలిపింది. ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. -
జర్మనీలో విప్రో సైబర్ డిఫెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా జర్మనీలోని డుసెల్డార్ఫ్లో సైబర్ డిఫెన్స్ సెంటర్ ప్రారంభించింది. క్లయింట్లకు ఈ కేంద్రం ద్వారా సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ, ఏదైనా సంఘటన జరిగితే ప్రతిస్పందన, సమస్య పరిష్కారానికి మద్దతు వంటి సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను విప్రో వినియోగిస్తుంది. -
లైటింగ్ పరిశ్రమలో అగ్ర స్థానంపై విప్రో కన్ను
న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్ప్రైజెస్లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది. మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్లైన్లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు. అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి. గృహోపకరణాల విభాగంలో విస్తరణ గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్లో తాము మార్కెట్ లీడర్గా ఉన్నట్టు చెప్పారు. -
విప్రో గ్లోబల్ ఏఐ హెడ్గా 'బ్రిజేష్ సింగ్' - ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రముఖ ఐటీ సంస్థ 'విప్రో' (Wipro) తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హెడ్గా భారతీయ ఐటీ దిగ్గజం మాజీ డెలాయిట్ ఎగ్జిక్యూటివ్ 'బ్రిజేష్ సింగ్'ను ఎంపిక చేసింది. కంపెనీ పోర్ట్ఫోలియో అంతటా AI అడాప్షన్ను వేగవంతం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు. బ్రిజేష్ సింగ్ టెక్నాలజీ కన్సల్టింగ్ స్పేస్లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ఈయన గతంలో డెలాయిట్లో సీనియర్ భాగస్వామిగా, డేటా-లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ను నడపడంలో బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. లింక్డ్ఇన్ ప్రకారం ఈయన BIT సింద్రీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో కంపెనీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Wipro ai360 ప్రారంభించిన తర్వాత సింగ్ నియామకం జరిగింది. కావున దీని అభివృద్ధికి ఈయన కొత్త వ్యూహాలు రచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ మొత్తం పోర్ట్ఫోలియోను వేగవంతం చేసే సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా ఆయన ప్రధాన పోషించాల్సి ఉంది. -
జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే. ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్మార్ట్ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్షిప్లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు. ‘నేను వాల్మార్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. ప్రస్తుతం, ధన్బాద్లోని ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు. కాబట్టే, నేను వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్మార్ట్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -2గా చేరింది. చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?! -
ఐటీ జాబ్ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్
Wipro Walk In Interview kolkata: ఐటీ పరిశ్రమలో కొన్ని నెలులుగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలతోపాటు స్టార్టప్ సంస్థలు సైతం లేఆఫ్లు అమలు చేస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా మరో జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్లైన్తోపాటు ఎక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరిగినా క్యూ కడుతున్నారు. తాజాగా కోల్కతాలో విప్రో కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు కుప్పలు కుప్పలుగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఈ వీడియోలో ఉన్న వారంతా కోల్కతాలోని విప్రో క్యాంపస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూల కోసం వచ్చారు. ఉన్నది తక్కువ ఉద్యోగాలే అయినా పదివేల మందికి పైగా తరలివచ్చారు. దేశంలో జాబ్ మార్కెట్ పరిస్థితికి ఇది నిదర్శనం’ అంటూ ఓ యూజర్ ఎక్స్ (ట్వటర్)లో వీడియో షేర్ చేశాడు. ఇదీ చదవండి: Safe IT Jobs: ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్లు మాత్రం సేఫ్! విప్రో దేశంలోని పలు నగరాల్లోని కార్యాలయాల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోల్కతా క్యాంపస్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ఆగస్ట్ 8న ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 2.35 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. Outside Wipro's Kolkata office during walkin. 10000+ applicants for some jobs! Job market isint that easy it seems. Your view? pic.twitter.com/BGm1TKfsOv — Abhishek Kar (@Abhishekkar_) August 8, 2023 -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
అమెజాన్ కొత్త పాలసీ.. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో!, ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు చూసి చూడనట్లుగా ఉన్న ఈకామర్స్ దిగ్గజం ఇటీవల ఉద్యోగుల పని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్కు రావాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం.. గత ఏడాది నుంచి సంస్థ ఉద్యోగుల్ని తొలగించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. మరి వారానికి ఎంతమంది ఉద్యోగులు కార్యలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బహుశా! కోవిడ్-19 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి పరిమితమైన ఉద్యోగులే ఆఫీస్కు రావాల్సి ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా అమెజాన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యలయాల నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు సహచర ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార వృద్ది జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టే ఉద్యోగులు ఆఫీసుల్లో ఇతర ఉద్యోగులకు కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీంతో సంస్థ తీసుకునే రోజువారీ నిర్ణయాలు నేరుగా ఉద్యోగులతో చర్చించే వెసులు బాటు కలుగుతుందని తెలిపారు. అమెజాన్లో తొలగింపులు అయినప్పటికీ, అమెజాన్లో ఉద్యోగులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది అమెజాన్ 27,000 మందిని ఇంటికి సాగనంపింది. తన కార్పొరేట్ వర్క్ ఫోర్స్లో అధిక శాతం వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరింది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సియోటల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశీయ టెక్ కంపెనీలు సైతం మరోవైపు దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో,హెచ్సీఎల్లు ఉద్యోగులు ఆఫీస్ రావాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వర్క్ ఫోర్స్ కార్యాలయాలకు రానుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. చదవండి : ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో.. ఆందోళనలో భారతీయులు! -
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటి నుంచి ఉద్యోగులు ఆఫీస్ బాట పడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని కూడా సంస్థలకు తిరిగి రప్పించడానికి దిగ్గజ కంపెనీలు ఒకే మాట మీద నడుస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ఒకే తాటిపై నడుస్తున్నట్లు సమాచారం. 2023-24 ఆర్ధిక సంవత్సరం క్యూ1 ఫలితాల తరువాత అందరిని సంస్థలకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. క్యూ1 ఫలితాల అనంతరం అందరూ ఆఫీసులకు రావాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 50 శాతం మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. టీసీఎస్ కంపెనీలో 55 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నట్లు 'మిలింద్ లక్కడ్' తెలిపారు. విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు కూడా ఇదే విధానం అమలు చేస్తున్నాయి. (ఇదీ చదవండి: ఖాతాదారులకు గట్టి షాక్.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ!) మొత్తం మీద దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను రప్పించడానికి కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికే పరిమితమై పనిచేసుకుంటున్న ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్లో ఎంత మంది? -
జాబ్ మార్కెట్లో ‘AI’ విధ్వంసం..ఉద్యోగులకు విప్రో బంపరాఫర్!
న్యూఢిల్లీ: Wipro launches AI platform ai360 : దేశీ ఐటీ దిగ్గజం విప్రో తమ యావత్ సిబ్బందికి కృత్రిమ మేథ (ఏఐ)లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో విప్రో ఏఐ360 ప్రోగ్రాం ద్వారా బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,200 కోట్లు) వెచ్చించనుంది. సంస్థలో మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ‘వచ్చే 12 నెలల్లో మొత్తం 2,50,000 మంది ఉద్యోగులకు ఏఐ ఫండమెంటల్స్, బాధ్యతాయుతంగా ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తాం‘ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ స్థాయిల్లో ఏఐ వినియోగానికి సంబంధించి కంపెనీ బోధనాంశాలను రూపొందించనుంది. అలాగే హ్యాకథాన్స్ మొదలైనవి కూడా నిర్వహించనుంది. అటు విప్రో వెంచర్స్ ద్వారా ఆధునిక స్టార్టప్లలో ఇన్వెస్ట్ కూడా చేయడంతో పాటు జెన్ఏఐ సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా జనరేటివ్ఏఐ ఆధారిత స్టార్టప్లకు శిక్షణ కల్పించనుంది. -
దక్షిణాఫ్రికాలో విప్రో కొత్త సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ విప్రో తాజాగా నూతన కార్యాలయాన్నిదక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ప్రారంభించింది. 2007 నుంచి దక్షిణాఫ్రికాలో విప్రో కార్యకలాపాలు సాగిస్తోంది. డిజిటల్ పరివర్తనలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఈ ప్రాంత కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతు ఇస్తోంది. విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిస్ చెంచహ్ మాట్లాడుతూ, "సెంచరీ సిటీ, కేప్ టౌన్లో కార్యాలయం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఇది దక్షిణాఫ్రికా అంతటా పెట్టుబడులకు, తమ ఉనికిని విస్తరించేలా తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు..అ లాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న క్లయింట్ బేస్ అవసరాలను మరింత మెరుగ్గా పరిష్కరించడానికి, స్థానిక ప్రతిభకు ఆసక్తికరమైన అవకాశాలను అందించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. -
రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ
Wipro CEO Thierry Delaporte: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'థియరీ డెలాపోర్టే' (Thierry Delaporte) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న సీఈఓలలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓగా ఈయన ప్రసిద్ధి చెందారు. 2022-23 ఆర్ధిక సంవత్సరం వార్షిక వేతనంలో 5శాతం తగ్గినప్పటికీ భారీ ప్యాకేజి తీసుకునే సీఈఓలలో ఇప్పటికీ ఒకరుగా ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో డెలాపోర్టే 10 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం కలిగి ఉన్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 83 కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈయన వార్షిక వేతనం రూ. 79.66 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈయన వేతనం రోజుకి రూ. 22.7 లక్షలు కావడం కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) గత సంవత్సరంలో డెలాపోర్టే మాత్రమే కాకుండా ఎక్కువ జీతం తీసుకునే భారతీయ సీఈఓల జాబితాలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ (రూ. 71.02 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ (రూ. 34 కోట్లు) ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ 17.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 144 కోట్లు), 'జూలీ స్వీట్' యాక్సెంచర్ (Accenture) సీఈఓ 23 మిలియన్ డాలర్ల జీతం (దాదాపు రూ. 189 కోట్లు) తీసుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్
సాక్షి, ముంబై: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్కు మొగ్గు చూపుతున్నతరుణంలో విప్రో రిషద్ ప్రేమ్జీ వేతన కోత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) యుఎస్లోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్కు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం రిషద్ ప్రేమ్జీ 2023 ఆర్థిక సంవత్సరానికి తన జీతంలో స్వచ్ఛందంగా 50 శాతం కోత విధించుకున్నారు. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం వార్షిక పరిహారంగా 951,353 డాలర్లు పొందగా , మునుపటి సంవత్సరం ఆదాయంతో పోలిస్తే దాదాపు 50 శాతం తక్కువ. విప్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రేమ్జీ ప్రస్తుత 5 సంవత్సరాల పదవీకాలం జూలై 30, 2024న ముగియనుంది. ఇదీ చదవండి: యాపిల్ స్పెషల్ ఫీచర్తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..! ఇలాంటి మరెన్సీ కార్పొరేట్ వార్తలు, విశేషాలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో తీరు టెక్నాలజీ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ముందస్తు భయాలు వంటి కారణాలతో ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో విప్రో ఫ్రెషర్స్ నియామకాల్ని 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. కొద్ది రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ భారీ ఎత్తున జీతాల కోత విధించింది. దీనిపై టెక్నాలజీ రంగ నిపుణులు, ఫ్రెషర్స్ విప్రో తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం లేదు దీనిపై అయితే, ప్రొడక్ట్లు, అవకాశాలు వంటి విషయాల్లో టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, కాబట్టే ఫ్రెషర్స్కు ఇచ్చే వేతనాల్ని తగ్గించి విధుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ తామెవరినీ తక్కువ ప్యాకేజీలకు ఉద్యోగంలో చేరాలని బలవంతం చేయలేదని, సంస్థ అందించే వేతనం కావాలనుకుంటే ఇప్పటికీ విప్రోలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ఆఫర్కే అంగీకారం తాజాగా, సంస్థలోని ఫ్రెషర్ల నియామకాలు, వారికి అందించే జీతభత్యాలపై విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విప్రోలో 92 శాతం మంది ఫ్రెషర్లు తాము అందించే ఆఫర్కు అంగీకరించి ఆయా ప్రాజెక్ట్లలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఫ్రెషర్లకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి న్యాయంగా, పారదర్శకతతో తీసుకుంటున్నట్లు జతిన్ దలాల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఫ్రెషర్స్ను ఏడాది పొడవునా సంబంధిత ప్రాజెక్ట్లలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్లు మాత్రమే ఇస్తాం.. ఉద్యోగులదే తుది నిర్ణయం ఉద్యోగులకు మేం ఆప్షన్లు మాత్రమే ఇస్తాం. కంపెనీలో చేరుతారా? లేదా అనేది వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు సైతం ఉద్యోగుల శ్రేయస్సు కోరే విధంగా ఉంటాయి. కాబట్టే, ఫ్రెషర్లు ఎక్కువ ప్యాకేజీలు తీసుకొని ఆన్బోర్డింగ్ కోసం ఎదురు చూడకుండా.. కంపెనీ ఆఫర్ చేసిన జీతానికి కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రెషర్స్ వేతనాల తగ్గింపు ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత రూ.6.5 లక్షల ప్యాకేజీని కాస్త రూ.3.5లక్షలకు కుదించింది. దీనిపై మేం ఇచ్చే ఆఫర్కు ఒప్పుకోవాలని ఫ్రెషర్స్పై ఒత్తిడి తేవడం లేదు. తక్కువ ఆఫర్తో ఆన్బోర్డ్లోకి బోర్డులోకి వెళ్లాలనుకుంటున్నారా? అని నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల అవసరాల్ని గమనిస్తున్నాం మా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగానే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తున్నాం. ఇది మా నియామక ప్రణాళికలకు కారణమవుతుంది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో విధులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటులో పొందిన ఫ్రెషర్లకు పంపిన ఇమెయిల్లో కంపెనీ పేర్కొంది. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం నామమాత్ర వెనకడుగుతో రూ. 3,075 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధితో రూ. 23,190 కోట్లను అధిగమించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం విప్రో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 14 శాతం పైగా ఎగసి రూ. 90,488 కోట్లను తాకింది. క్యూ4లో 1,823 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,56,921కు పరిమితమైంది. అంచనాలు వీక్..: 2023–24 తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఐఎస్ఆర్ఈ సహా.. ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి ఆదాయం త్రైమాసికవారీగా 3–1% మధ్య క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 275.3–281.1 కోట్ల డాలర్ల మధ్య ఆదాయం సాధించవచ్చని గైడెన్స్ ప్రకటించింది. బీఎఫ్ఎస్ఐ, రిటైల్లో మందగమన పరిస్థితులున్నా, డీల్ పైప్లైన్ పటిష్టంగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. షేర్ల బైబ్యాక్కు సై: సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 445 ధర మించకుండా 26,96,62,921 షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇవి కంపెనీ ఈక్విటీలో 4.91 శాతం వాటాకు సమానంకాగా..ఇందుకు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
విప్రో కన్జూమర్ చేతికి బ్రాహ్మిన్స్
న్యూఢిల్లీ: రెడీ టు కుక్ బ్రాండ్, కేరళ సంస్థ బ్రాహ్మిన్స్ను కొనుగోలు చేసినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ తాజాగా పేర్కొంది. సంప్రదాయ వెజిటేరియన్, స్పైస్ మిక్స్ సంస్థ బ్రాహ్మిన్స్ కొనుగోలు విలువను వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం రెడీ టు కుక్ ఫుడ్ తయారీ బ్రాండు నిరపరను సొంతం చేసుకోవడం ద్వారా అజీం ప్రేమ్జీ కంపెనీ విప్రో ఎంటర్ప్రైజెస్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజా కొనుగోలుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో మరింత విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు విప్రో కన్జూమర్ పేర్కొంది. వెరసి దక్షిణాది మార్కెట్ లక్ష్యంగా సొంత స్నాక్స్ బ్రాండును ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. వేగవంత వృద్ధిలో ఉన్న రెడీ టు ఈట్ విభాగంలో సొంత బ్రాండును విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. -
ఆన్బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్కు విప్రో మరో షాక్?
సాక్షి,ముంబై: ఐటీ కంపెనీల్లో ఆన్బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్కు విప్రో మరో షాక్ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 15 నెలలకు పైగా ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు మరో పరీక్ష విధించనుంది. ఇలాంటి శిక్షణను ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ, మరోసారి ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (పీఆర్పీ) శిక్షణ అంటే.. ఈ సాకుతో కొంతమంది ఫ్రెషర్స్ను తొలగించేందుకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వేతనాల్లో సగం కోతం విధించిన తరువాత కూడా ఆన్బోర్డింగ్ కష్టాలకు తెరపడటం లేదు. (ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెషర్ల వేతనాలను రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరీక్షలో ఫ్రెషర్స్ కనీసం 60 శాతం ఓవరాల్ స్కోర్తో, పీఆర్పీ శిక్షణను ఉద్యోగులు క్లియర్ చేయకపోతే, వారు వెంటనే తొలగించబడతారని వారికి పంపిన సూచనలలో కంపెనీ పేర్కొన్నట్టు సమాచారం. అయితే దీనిపై విప్రో అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఐటీ మేజర్ తీసుకుంటున్న చర్యలు అనైతికం, అన్యాయమని, ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. కంపెనీ పాలసీలో ఆకస్మిక మార్పులు ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని వ్యాఖ్యానించారు. (ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!) -
విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 10,000 కోట్ల మైలురాయిని దాటినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలు, బ్రాండ్లు, కేటగిరీలవారీగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 8,634 కోట్లుగా నమోదైంది. (ఈ–కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దేశీయంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్)వ్యాపార విభాగం 17 శాతం పెరిగినట్లు తెలిపింది. సబ్బుల బ్రాండ్ సంతూర్ ఇప్పుడు నిర్దిష్ట విభాగంలో రూ. 2,650 కోట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరిందని పేర్కొంది. అటు వియత్నాం మార్కెట్లో రెండంకెల స్థాయి వృద్ధితో 10 కోట్ల డాలర్ల ఆదాయం మార్కును దాటినట్లు .. దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్యం, ఫిలిప్పీన్స్ తదితర మార్కెట్లలోను రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. 2003లో రూ. 300 కోట్ల ఆదాయం ఉండగా .. గత రెండు దశాబ్దాల్లో 33 రెట్లు పెంచుకుని నేడు అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా ఎదిగామని సంస్థ సీఈవో వినీత్ అగ్రవాల్ తెలిపారు. 1945లో వనస్పతి సంస్థగా ప్రారంభమైన విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్కు ప్రస్తుతం 60 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 18 ఫ్యాక్టరీలు, 10,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఆదాయంలో 51 శాతం వాటా అంతర్జాతీయ వ్యాపారం నుంచి ఉంటోంది. -
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ .. విప్రో నుంచి 120 మంది
గత కొన్ని రోజులుగా మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు తమ కంపెనీలలోని ఉద్యోగులను వివిధ రకాల కారణాల వల్ల తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విప్రో కంపెనీ రీలైన్మెంట్ ఆఫ్ బిజినెస్ (Realignment of Business Needs) కారణంగా USలోని ఫ్లోరిడాలో 120 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ, ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీకి అందించిన వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) నోటీసులో తొలగింపులను గురించి వివరించినట్లు తెలిసింది. టంపాలోని ఒక ప్రదేశంలో మాత్రమే ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు సమాచారం. కంపెనీ తొలగించిన 120 మంది ఉద్యోగులలో వందమందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లు ఉన్నారు. మిగిలిన వారిలో టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్లు ఉన్నారు. అయితే ఇతర విప్రో ఉద్యోగులందరూ అలాగే ఉద్యోగాలలో కొనసాగుతున్నారని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్విక్లో అమెరికా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. (ఇదీ చదవండి: Top Car News of The Week: మారుతి బ్రెజ్జా సిఎన్జి నుంచి టయోటా హైలెక్స్ వరకు..) విప్రో కంపెనీ యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో దాదాపు 20,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ఇటీవలే ఇండియాలో సరైన పనితీరుని కనపరచని దాదాపు 400 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగం పొందేవారు సగం జీతానికే పనిచేయాలని చెబుతున్నట్లు సమాచారం. -
నాలుగు విభాగాలపై విప్రో ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: క్లయింట్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మెరుగైన సర్వీసులు అందించడంపై, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై విప్రో మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నాలుగు వ్యూహాత్మక వ్యాపార విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సాంకేతికత .. వ్యాపార పరివర్తన, ఇంజినీరింగ్, కన్సల్టింగ్ వీటిలో ఉంటాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, పెట్టుబడుల విషయంలో సమర్ధమంతంగా వ్యవహరించేందుకు ఇవి తోడ్పడగలవని విప్రో ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. క్లౌడ్ సామరధ్యలన్నింటినీ విప్రో ఫుల్స్ట్రైడ్ క్లౌడ్ విభాగం కిందికి తేనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇన్ఫ్రా సర్వీసుల విభాగానికి హెడ్గా ఉన్న జో డెబెకర్ దీనికి సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం విప్రో ఐకోర్ వ్యాపార హెడ్గా ఉన్న నాగేంద్ర బండారు .. విప్రో ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్కు గ్లోబల్ హెడ్గా ఉంటారు. క్యాప్కో, డిజైనిట్ మొదలైనవన్నీ విప్రో కన్సల్టింగ్ విభాగం కింద ఉంటాయి. -
విప్రోకు ఎదురుదెబ్బ: ఫ్రెషర్ల జీతం కోత అన్యాయమంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది. కార్మిక శాఖకు ఫిర్యాదు అంతేకాదు ఈమేరకు ప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. విప్రో ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల దోపిడీకి చఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందనినైట్స్ ఫిర్యాదులో పేర్కొంది. మరి తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా విప్రో రూ. 6.5 లక్షల (LPA) ఆఫర్తో ఫ్రెషర్లకు ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్ లాంటి సాకులతో వార్షిక వేతనం సగానికి కోత విధించేందుకు నిర్ణయించింది. 3.5 లక్షలకు పనిచేస్తారా అని ఈ మెయిల్ద్వారా వారిని కోరడం వివాదానికి తీసింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయితే దీనిపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ స్పందించింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదంటూ తప్పుబట్టింది. ఆన్బోర్డ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారానికి యూనియన్తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. -
సగం జీతానికి పనిచేస్తారా.. ఫ్రెషర్స్కు విప్రో ఝలక్!
కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థ విప్రో ఝలక్ ఇచ్చింది. మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సగానికి పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్లను అంగీకరించాలని కోరింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్లను టేకప్ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్ ద్వారా అడిగింది. (ఇదీ చదవండి: ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు) పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్లో వివరించింది. 2023 బ్యాచ్లోని వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ అభ్యర్థులకు కంపెనీ ఈ ఆఫర్ చేసింది.ఇది కూడా ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను బోర్డింగ్లోకి తీసుకునే కసరత్తు మార్చి నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కాలం తర్వాత అసెస్మెంట్లలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్లను తొలగించిన నేపథ్యంలో ఈ సగం ఆఫర్ విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: Layoffs: ట్విటర్లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!) -
విప్రో ఉద్యోగులకు గుడ్న్యూస్: ఫిబ్రవరి జీతాలతో పండగే!
సాక్షి,ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా గ్లోబల్గా దిగ్గజ కంపెనీల్లో సైతం ఉద్యోగాల కోత ప్రకంపనలు పుట్టిస్తున్న తరుణంలో విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వేరియబుల్ పే అందించనుంది. థర్డ్ క్వార్టర్లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేయనున్నామని అంతర్గత ఇమెయిల్లో ఉద్యోగులకు తెలిపింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయనుంది. విప్రో 2022-23 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో A నుండి B3 బ్యాండ్లలోని ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్ను విడుదల చేయనున్నట్లు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారం అందించారు. A నుంచి B3 లెవెల్ ఉద్యోగులు, అన్ని సపోర్ట్ ఫంక్షన్స్లో పనిచేసే సిబ్బందికి ఐటీ కంపెనీ పెర్ఫామెన్స్ పనితీరు ఆధారంగా 87శాతం వేరియబుల్ పే చెల్లించనుండగా.. మేనేజర్ స్థాయి, అంతకుమించి లెవెల్ ఉద్యోగులకు.. బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారిత వేరియబుల్ పే చెల్లించనుంది.అందరు ఉద్యోగులు అంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉంటారు. కాగా రెగ్యులేటరీ ఫైలింగ్ల ప్రకారం,ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఏకీకృత ఆదాయం 14.3 శాతం పెరిగి రూ.23,229 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 16.3 శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే గత త్రైమాసికంలో విప్రో 100 శాతం వేరియబుల్ పే ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్!
సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఇంటర్నల్ పరీక్షలో ఫెయిల్ అయ్యారంటూ దాదాపు 600మందిని ఇన్ఫోసిస్ తొలగించింది. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇటీవల టెక్ దిగ్గజం విప్రో వందలమంది ఫ్రెషర్ల తొలగింపు పతరువాత ఇన్ఫోసిస్లో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు) కాగా క్యూ3 ఫలితాల్లో ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి 13.4శాతం పెరిగి రూ. 6,586 కోట్లకు పెరిగింది. గత ఏడాది లాభం రూ. 5,809 కోట్లుగా ఉంది. నికర ఉద్యోగుల చేరిక గత ఏడాది త్రైమాసికంలోని పదివేల నుంచి 1,627కి పడిపోయింది. సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో స్వచ్ఛంద అట్రిషన్ 27.1 శాతం, డిసెంబర్ 2021తో ముగిసిన మూడు నెలల్లో 25.5 శాతంగా ఉంది. అంతకుముందు, విప్రో పేలవమైన పనితీరు కారణంగా ఇంటర్నల్ టెస్ట్లో విఫలమవడంతో ఫ్రెషర్లను తొలగించిన సంగతి తెలిసిందే. (ఫిబ్రవరి సేల్స్: మారుతి బంపర్ ఆఫర్) -
వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్ను విధుల నుంచి తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. (ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం) ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్ ప్లేస్లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్, రీట్రైనింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) -
విప్రో లాభం రూ. 3,053 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 2.8 శాతం బలపడి రూ. 3,053 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 23,229 కోట్లకు చేరింది. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి ఐటీ సర్వీసుల ఆదాయం 11.5–12 శాతం మధ్య పుంజుకోనున్నట్లు తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 15 శాతం, ఆదాయం 3 శాతం వృద్ధి చూపాయి. డీల్స్ రికార్డ్.. ప్రపంచ అనిశ్చితుల్లోనూ క్యూ3లో రికార్డ్ నెలకొల్పుతూ మొత్తం 4.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఇది 26 శాతం వృద్ధికాగా.. వీటిలో బిలియన్ డాలర్ల విలువకు మించిన భారీ ఆర్డర్లను సైతం పొందినట్లు తెలియజేశారు. క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఇదే స్థాయి ఆర్డర్లు పొందే వీలున్నట్లు అంచనా వేశారు. క్లయింట్లతో లోతైన సంబంధాల ద్వారా అత్యధిక స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలుగుతున్నట్లు వివరించారు. ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాలు, వ్యయ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో క్లయింట్లకు అందిస్తున్న సమర్థవంత సేవలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి క్లౌడ్ సర్వీసులు, ఇంజనీరింగ్ సర్వీసులు ఆర్డర్బుక్కు దన్నుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 396 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ►క్యూ2తో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 435 తగ్గి 2,58,744ను తాకింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 1.8 శాతం తగ్గి 21.2 శాతానికి చేరింది. ► ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్లు 1.2 శాతం బలపడి 16.3 శాతానికి చేరాయి. ► ఐటీ సర్వీసుల ఆదాయం 6.2 శాతం వృద్ధితో 280.35 కోట్ల డాలర్లను తాకింది. ► ఐటీ ప్రొడక్టుల ఆదాయం 2.08 కోట్ల డాలర్లు(రూ. 170 కోట్లు)గా నమోదైంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్లో ఫేక్ ‘చాట్జీపీటీ’ యాప్స్ కలకలం -
టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ నాల్గవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించింది. కంపెనీలోని ఉన్నతోద్యోగులకు రికార్డు స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించింది. సీనియర్ల ప్రతిభను, అనుభవాన్ని నిలుపుకునే క్రమంలో ఈచర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను పై స్థాయిలకు ప్రమోట్ చేసింది. ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్లు ఇంతకుముందెపుడూ ఇవ్వలేదని కంపెనీ తెలిపింది. ఇటీవలి కాలంలో కీలక ఉన్నతస్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్న సమయంలో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రతిభావంతులైన లీడర్షిప్ ఉద్యోగుల పైప్లైన్ను బలోపేతం చేయడానికి రికార్డు స్థాయిలో సీనియర్ ప్రమోషన్లను ప్రారంభించింది విప్రో. కంపెనీ 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్విపి) పదవికి ఎలివేట్ చేయగా, 61 మంది ఎగ్జిక్యూటివ్లను వైస్ ప్రెసిడెంట్ (వీపీ)గా ప్రమోట్ చేసింది. ఫలితంగా విప్రోలో ఇప్పుడు దాదాపు 200 మంది వీపీలు, 32 ఎస్వీపీలు సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 23.3శాతం అట్రిషన్ను నమోదు చేసిన కంపెనీ అక్టోబర్-డిసెంబర్ ఫలితాలను ఈ శుక్రవారం ప్రకటించనుంది. కాగా గత ఏడాది, నాలుగు దేశాల్లో వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న కనీసంనలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రో నుంచి నిష్క్రమించారు. బ్రెజిల్లో వ్యాపారాన్ని పర్యవేక్షించిన డగ్లస్ సిల్వా, జపాన్ హెడ్, టోమోకి టేకుచి,ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సారా ఆడమ్-గెడ్జ్; మిడిల్ ఈస్ట్ రీజియన్ బిజినెస్ హెడ్ మొహమ్మద్ అరేఫ్ సంస్థను వీడిని సంగతి తెలిసిందే.