Wipro
-
విప్రోకు ఫీనిక్స్ గ్రూప్ భారీ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో తాజాగా బ్రిటిష్ బీమా దిగ్గజం ఫీనిక్స్ గ్రూప్ నుంచి భారీ కాంట్రాక్టును పొందింది. 10 ఏళ్ల కాలానికి 50 కోట్ల పౌండ్ల (రూ.5,524 కోట్లు) విలువైన డీల్ కుదుర్చుకున్నట్లు విప్రో వెల్లడించింది. డీల్లో భాగంగా రీఎస్యూర్ బిజినెస్ కోసం జీవిత బీమా, పెన్షన్ బిజినెస్ నిర్వహణ సంబంధిత సాఫ్ట్వేర్ను డిజైన్ చేయాల్సి ఉంటుందని విప్రో పేర్కొంది. క్లయింట్లకు అత్యుత్తమ సర్వీసులు అందించడంలో ఫైనాన్షియల్ సంస్థలకు విప్రో సహకారాన్ని, కట్టుబాటును ప్రస్తుత ల్యాండ్మార్క్ డీల్ పట్టిచూపుతున్నదని విప్రో యూరప్ సీఈవో ఓంకార్ నిశల్ తెలియజేశారు. భారీ డీల్ నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో 1.4% క్షీణించి రూ. 267 వద్ద ముగిసింది. -
ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత
గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాతో దేశీ ఐటీ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ చేతులు కలిపాయి. వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత విభిన్న సొల్యూషన్లు అందించే బాటలో ఎన్విడియాతో విడిగా భాగస్వామ్యాలకు తెరతీస్తున్నాయి. చిప్ తయారీ దిగ్గజం ప్రస్తుతం కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న జీపీయూ టెక్నాలజీ వార్షిక సదస్సు(జీటీసీ)లో భాగంగా దేశీ ఐటీ కంపెనీలు ఎన్విడియా టెక్నాలజీల ఆధారంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాయి.ఈ సందర్భంగా ఎన్విడియా ఏఐ సాఫ్ట్వేర్ ఆధారిత అటానమస్ ఫార్మాకోవిజిలెన్స్(పీవీ) సొల్యూషన్లు టెక్ మహీంద్రా విడుదల చేసింది. వీటిని ఔషధ భద్రత నిర్వహణలో వినియోగిస్తారు. తద్వారా వేగవంత, కచ్చితమైన పీవీ ప్రాసెస్కు వీలుంటుంది. ఎన్విడియా ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సహాయంతో విప్రో కొత్తతరహా ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రత్యేక ఇన్ఫ్రా, డేటా, వర్క్ఫోర్స్, బిజినెస్ నెట్వర్క్స్ను పటిష్టపరచుకోవడంతోపాటు ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి, అమలు చేసేందుకు వీలుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్కేర్, ఎడ్యుకేషన్ తదితర రంగాలలో పౌర సేవలను భారీగా మెరుగుపరచేందుకు విప్రో ఎకోసిస్టమ్ వినియోగపడనుంది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంఎన్విడియా జెట్సన్ ప్లాట్ఫామ్ను వినియోగించుకోవడం ద్వారా ఏఐ ఆధారిత రైల్వే ట్రాక్ తనిఖీ సొల్యూషన్ ట్రాక్ఈఐను ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ విడుదల చేసింది. తద్వారా రియల్ టైమ్ లోపాల గుర్తింపు, నిర్వహణలో మద్దతు తదితర ప్రపంచవ్యాప్త రైల్వే నెట్వర్క్ల భద్రతను పెంచేందుకు సహాయపడనుంది. ఎన్విడియా జీటీసీ 2025ను ఈ నెల 17–21 మధ్య కాలిఫోర్నియాలోని శాన్జోస్లో నిర్వహిస్తోంది. ఏఐలో తాజా ఆధునికతలను ప్రదర్శించేందుకు సదస్సు ఉపపయోగపడుతోంది. -
అది మా జాగా.. మేమే నిర్మిస్తాం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల అంచనా వ్యయం రూ.837 కోట్లుగా చెప్పి..నాలుగో ప్యాకేజీలో భాగంగా ఈ మూడింటికీ కలిపి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ విప్రో జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవకుండా పెండింగ్లో ఉంచి మిగతా రెండు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాటి నిర్మాణ అంచనా వ్యయం రూ.650 కోట్లు. విప్రో జంక్షన్ వద్ద టెండరు పిలవకపోవడానికి కారణం ఆ మార్గంలో మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ఒకే పిల్లర్పై మెట్రో మార్గం, జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్ను డబుల్ డెక్కర్గా నిర్మించాలని భావించారు. ఆ మేరకు జరిగిన జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో డబుల్ డెక్కర్ నిర్మాణానికి రైల్వే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతోపాటు మెట్రో మార్గం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రైల్వేతో సమన్వయం కుదరదని జీహెచ్ఎంసీ కూడా భావించింది. అంతే కాకుండా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్లు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది. మెట్రో రైలు స్టేషన్ జంక్షన్లోనే ఉంటుంది. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఫ్లై ఓవర్కు టెండర్ పిలవలేదు. అది మా జాగా.. మేమే నిర్మిస్తాంమరోవైపు, విప్రో జంక్షన్ స్థలం తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు చెందినది కావడంతో తమ స్థలంలో అవసరమైన ఫ్లై ఓవర్ను తామే నిర్మిస్తాం సదరు కార్పొరేషన్ అధికారులు జీహెచ్ఎంసీకి తెలిపినట్లు సమాచారం. దీంతో ఇక విప్రో జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ విరమించుకుంది. మిగతా మార్గాల్లో డౌటే ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోనూ డబుల్ డెక్కర్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీహెచ్ఎంసీ కొత్తగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు మార్గాలున్నట్లయితే ఫ్లై ఓవర్ల పై వరుసలో మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా పిల్లర్లు నిరి్మంచాలని భావించారు. ఎత్తయిన పిల్లర్లు నిర్మించి డబుల్ డెక్కర్గా రెండు నిర్మాణాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విప్రో జంక్షన్ వద్ద కూడా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వశాఖలు వేటికవిగా అందుకు విభేదించడంతో జీహెచ్ఎంసీ విరమించుకుంది. మియాపూర్ –పటాన్న్చెరు మార్గంలో ఆలి్వ¯Œన్ క్రాస్రోడ్, మదీనగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్,ఇక్రిశాట్ల మార్గాల్లో, నాగోల్– ఎయిర్పోర్ట్ మార్గంలో ఎల్బీనగర్, కర్మ¯న్Œ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు రానుంది. ఆ మార్గాల్లో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చేచోట డబుల్డెక్కర్లుగా డబుల్ డెక్కర్లు నిరి్మంచేందుకు ఆలోచనలు చేసినప్పటికీ, తాజా పరిస్థితులతో డైలమాలో పడ్డాయి. ⇒ నాగోల్– ఎయిర్పోర్టు మార్గంలో మెట్రో మార్గంలో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాలు ⇒ టీకేఆర్ కాలేజ్,గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్లు ⇒ ఒమర్ హోటల్– సోయబ్హోటల్ (వయా మెట్రో ఫంక్షన్హాల్) ⇒ బండ్లగూడ– ఎరక్రుంట క్రాస్రోడ్స్ ⇒ మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్. ⇒ మియాపూర్ క్రాస్రోడ్– ఆలి్వన్ క్రాస్రోడ్ మార్గంలో మదీనగూడ గంగారం వద్ద. -
రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
భారతదేశం సర్వమత సమ్మేళనం.. కాబట్టి ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరు (ముస్లింలు) కళ, సాహిత్యం, సైన్స్ వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసినప్పటికీ.. వ్యాపార రంగంలో మాత్రం ఇతరులతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అజీమ్ ప్రేమ్జీ కుటుంబం మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే మూడు తరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.1947లో దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా.. అజీమ్ ప్రేమ్జీ తండ్రి 'మహ్మద్ ప్రేమ్జీ'ని పాకిస్తాన్కు రమ్మని ఆహ్వానించడమే కాకుండా.. అక్కడ ఆర్ధిక మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ మహ్మద్ ప్రేమ్జీ నిరాకరించి, భారతదేశంలో ఉండిపోయారు. నిజానికి మహ్మద్ ప్రేమ్జీ బియ్యం వ్యాపారి. ఈయన మొదట్లో మయన్మార్లో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత 1940లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అజీమ్ ప్రేమ్జీ ముంబైలోనే 1945లో జన్మించారు.అజీమ్ ప్రేమ్జీ.. ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం అజీమ్ ప్రేమ్జీ నికర విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ.ప్రాథమిక విద్యను భారతదేశంలోనే పూర్తి చేసిన అజీమ్ ప్రేమ్జీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ సమయంలోనే అజీమ్ ప్రేమ్జీ అన్న ఫరూఖ్ ప్రేమ్జీ తన తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అతని వివాహానంతరం.. పాకిస్తాన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ముహమ్మద్ ప్రేమ్జీ మరణానంతరం.. అజీమ్ ప్రేమ్జీ అప్పులపాలైన కుటుంబ వ్యాపారాన్ని (చమురు వ్యాపారం) నిర్వహించాల్సి వచ్చింది. తన తెలివితో చమురు వ్యాపారాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు. ఆ తరువాత దానిని విస్తరించడం మాత్రమే కాకుండా.. ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే విప్రో కంపెనీ ప్రారంభించారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..భారతదేశంలో 19వ ధనవంతుడు.. ప్రపంచంలోని 195వ ధనవంతుడైన అజీమ్ ప్రేమ్జీ, ఉదారంగా విరాళాలు అందించడంలో కూడా ముందున్నారు. 2020- 2021ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల జాబితాలో.. ఈయన రూ. 9713 కోట్లు విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే అజీమ్ ప్రేమ్జీ రోజుకు రూ. 27 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దేశీ టెక్నాలజీ సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా దిగ్గజాలు టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్సీఎల్ టెక్నాలజీస్(HCL Tech), విప్రో(Wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్ల జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకున్నాయి. 2025కి గాను టాప్ 25 సంస్థలతో బ్రాండ్ వేల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ టీసీఎస్ రెండో స్థానంలో, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇందులో యాక్సెంచర్ వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగింది.టీసీఎస్ బ్రాండ్ విలువ 11 శాతం పెరిగి 21.3 బిలియన్ డాలర్లకు చేరగా, ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండుగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ నిల్చింది. కంపెనీ బ్రాండు విలువ 17 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు విప్రో, టెక్ మహీంద్రా, హెక్సావేర్ మొదలైనవి కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. దేశాలపరంగా చూస్తే మొత్తం బ్రాండ్ వేల్యూలో 40 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో 36 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!కోలుకుంటున్న మార్కెట్ ..ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023 ఆఖర్లో, 2024 తొలినాళ్లలో కార్పొరేట్లు వ్యయాలను తగ్గించుకున్నాయని, అదే సమయంలో కృత్రిమ మేథ సంబంధిత సర్వీసులకు డిమాండ్ పెరిగిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అమెరికా మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రయోజనాలు చేకూరగలవని పేర్కొంది. 2025లో వడ్డీ రేట్లు తగ్గి, కార్పొరేట్లు ఖర్చు చేయడం పెరగడంతో పాటు కొత్త టెక్నాలజీలకు డిమాండ్ నెలకొనడం వల్ల ఐటీ సంస్థలు లబ్ధి పొందవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అత్యంత విలువైన బ్రాండ్లన్నీ కూడా మారుతున్న పరిశ్రమ ట్రెండ్స్కి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. -
మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..
కరోనా సమయంలో ఎంతోమంది టెకీలు జాబ్స్ కోల్పోయారు. డిసెంబర్ 2024లో కూడా దిగ్గజ కంపెనీలు సైతం లేఆప్స్ ప్రకటించాయి. కాగా ఇప్పుడు కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో టీసీఎస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో కూడా నేనున్నానంటూ.. ముందుకు వచ్చింది.దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో 10,000-12,000 మంది ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'సౌరభ్ గోవిల్' (Saurabh Govil) తన Q3FY25 ఆదాయ నివేదికను కంపెనీ విడుదల చేసిన తర్వాత, విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విప్రో తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో దాదాపు 7,000 మంది ఇప్పటికే ఆన్బోర్డ్లో ఉన్నారు. కాగా FY25 చివరి త్రైమాసికంలో మరో 2,500-3,000 మంది చేరే అవకాశం ఉంది. కాగా 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,655గా ఉన్నట్లు సమాచారం.విప్రో, టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను నియమించుకోవాలనే ప్రకటన చేసిన తరువాత, విప్రో కూడా ప్రకటించింది. ఈ వరుసలో ఇన్ఫోసిస్ కూడా చేసింది. FY26లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే లెక్కకు మించిన ఫ్రెషన్స్ ఐటీ కంపెనల్లో ఉద్యోగాలు పొందనున్నట్లు స్పష్టమవుతోంది. -
విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!
ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు (Q3 Results) సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 24% జంప్చేసి రూ. 3,354 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 0.5% పుంజుకుని రూ. 22,319 కోట్లకు చేరింది.క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 260.2–265.5 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదుకాగలదని (గైడెన్స్) తాజాగా ప్రకటించింది. వెరసి ఆదాయ వృద్ధిని మైనస్ 1% నుంచి +1% మధ్య అంచనా వేసింది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు కంపెనీ బోర్డు అనుమతించింది. మూడేళ్లపాటు లాభాల్లో 70%వరకూ వాటాదారులకు చెల్లించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.బిలియన్ డాలర్లు: తాజా సమీక్షా కాలంలో 17 భారీ డీల్స్ ద్వారా బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు విప్రో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో కొత్తగా 10,000–12,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. క్యూ3లో నికరంగా 1,157మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,732కు చేరింది.టెక్ మహీంద్రాఐటీ సొల్యూషన్ల కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 93 శాతం దూసుకెళ్లి రూ. 983 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో ప్రతికూలతల కారణంగా కేవలం రూ. 510 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2లో సాధించిన రూ. 1,250 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గింది.ఇదీ చదవండి: ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..కాగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1 శాతమే పుంజుకుని రూ. 13,286 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే రెండేళ్లలో ఇవి 15 శాతానికి బలపడగలవని కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రధానంగా టెలికం, తయారీ రంగాల నుంచి74.5 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు సీఎఫ్వో రోహిత్ ఆనంద్ వెల్లడించారు. -
ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!
వర్క్లైఫ్ బ్యాలెన్స్పై చివరి వరకు నాది అదే మాట అంటూ ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వార్తల్లో నిలచిని సంగతి తెలిసిందే. తనకు వర్క్లైఫ్ బ్యాలెన్స్పై నమ్మకం లేదని వారానికి 70 గంటలు యువత పనిచేయాల్సిందేనని అన్నారు. అప్పుడే భారతదేశం అభివృధ్దిచెందుతుంది అంటూ మరోసారి వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం హాట్టాపిక్గా మారింది. కొందరూ సీఈవోలు ఆయన మాటకు మొగ్గుచూపగా కొందరూ ఉద్యోగులు, టెక్కీలు మాత్రం ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ బెంగళూరు టెక్ సదస్సు 2024లో ఇదే అంశంపై అత్యంత షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఏ సంస్థం ఇలాంటి ఆఫర్ ఇవ్వదంటూ సరొకత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే వర్క్లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది సదరు ఉద్యోగి బాధ్యతే అంటూ కౌంటరిస్తూ మాట్లాడారు. ఇంతకీ రిషద్ ప్రేమ్జీ ఏమన్నారంటే.."పని-జీవిత సమతుల్యత"ను ఎవరికి వారుగా నిర్వచించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో వెసులబాటు అందిస్తామని ఏ సంస్థలు లేదా కార్యాలయాలు ఉద్యోగికి ఆఫర్లు ఇవ్వవు. అదంతా మన చేతిలోనే ఉంది." అని అటున్నారు రిషద్. తాను ఈ విషయాన్ని కరోనా ప్రారంభ సమయంలోనే తెలుసుకున్నానని అన్నారు. ఈ విషయమై చాలామంది ఉద్యోగులు కంపెనీలపై ఆరోపణలు చేస్తుంటారు. అది సబబు కాదని అన్నారు. నీ సీనియర్ ఉద్యోగులు లేదా పై అధికారులు అదనపు భారం లేదా భాద్యతలు మోపితే దాన్ని సదరు ఉద్యోగే వారితో మాట్లాడి చాకచక్యంగా పని భారం తగ్గించుకునే యత్నం చేయాలి. నీ వర్క్ విషయంలో నీకంటూ ఓ సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అధిగమించేలా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సంస్థకు లేదా పై అధికారులకు వాస్తవాన్ని వివరించి తెలివిగా పనిని బ్యాలెన్స్ చేసుకోవాలని అంటున్నారు. చాలావరకు ఉద్యోగుల నుంచి వచ్చే మొదటి ఫిర్యాదు పని ఒత్తిడి..అస్సలు దీని గురించి మీ టీమ్ ఇన్ఛార్జ్, లేదా సూపర్వైజర్తో చర్చింకుండా మౌనంగా అన్నిటికి తలాడిస్తూ..కోరి మరీ పని ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారని రిషద్ ఆరోపించారు. ఏ సంస్థ కూడా ఉద్యోగిని బొట్టు పెట్టి మరీ వర్క్లైప్ బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యమని చెప్పదు. దాన్ని ప్రతి ఉద్యోగి తనంతటా తానుగా నిర్వహించుకోవాల్సిన సున్నితమైన అంశం. అంతేగాదు పై అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని పని సమతుల్యతను అందించేలా వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే సంస్థ ఉద్యోగి ఒత్తిడులు, టెన్షన్లు, పని సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకుని వెసులుబాటు కల్పించగలిగే అవకాశం ఉంటుందంటున్నారు రిషద్. అంతేగాదు ఈ వర్క్ లైప్ బ్యాలెన్స్ అనేది ముమ్మాటికీ ఎవరికి వారుగా నిర్వహించుకోవాల్సిన విషయం అని బెంగళూరు టెక్ సదస్సులో రిషద్ గట్టిగా నొక్కి చెప్పారు. (చదవండి: పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!) -
ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్స్ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్బోర్డింగ్ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది. -
విప్రో నుంచి బోనస్ షేర్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ వాటాదారులకు తాజాగా బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఈ నెల 16–17న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలను 17న విడుదల చేయనుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 3,003 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ. 21,964 కోట్లకు పరిమితమైంది. వారాంతాన బీఎస్ఈలో విప్రో షేరు 0.8 శాతం బలపడి రూ. 529 వద్ద ముగిసింది.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్కు ప్రత్యర్థి కాదా? -
ఆఫీస్కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్లో హాజరుకు ఉద్యోగుల లీవ్లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్న్యూస్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్బోర్డ్ చేశామని పేర్కొంది.టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్జీఏలను (ఫ్రెషర్స్) ఆన్బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్జీఏలను ఆన్బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్లైన్ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది. -
30 నెలలు వెయిట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్
ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. ఒక వారం లేదా ఒక నెలలో జాయినింగ్ ఉంటుంది. అయితే దిగ్గజ ఐటీ సంస్థ 'విప్రో' మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి.. 30 నెలల తరువాత ఫ్రెషర్లను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కంపెనీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు కంపెనీ ఓ మెయిల్ పంపించింది. ఇందులో 'మీకు ముందుగా తెలియజేసినట్లు.. ఆన్బోర్డింగ్ కోసం ముందస్తు నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి'. అర్హత ప్రమాణాలు పూర్తి చేయడంలో ఫ్రెషర్లు విఫలమయ్యారు' అని వెల్లడించింది. ఇన్ని రోజులూ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ.. ఆఖరికి ఉద్యోగులను రిజెక్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు కంపెనీ ఇలాంటి ఫలితం ఇస్తుందని అస్సలు ఊహించలేదని అన్నారు.విప్రో మాత్రం ఫ్రెషర్స్ ఆఫర్స్ లెటర్స్ రద్దు చేసిన తరువాత.. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సరైన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. కొత్త టెక్నాలజీలో ఉద్యోగులకు తప్పకుండా ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది.ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన ఎంతోమంది ఉద్యోగులకు విప్రో పెద్ద షాక్ ఇచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్నారు. దీనిపైన ఐటీ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్కౌంట్లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్సీఎల్టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్సీఎల్టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్స్కేప్లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
క్యూ1లో విప్రో ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు. 12,000 మందికి చాన్స్ ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది. షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది. -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్లో విప్రోను వీడి కాగ్నిజెంట్లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్వో జతిన్ దలాల్కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
-
ఐదేళ్లకు సరిపడా భారీ డీల్ పట్టేసిన విప్రో
-
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ భారత్ ఐటీ దిగ్గజం విప్రో భారీ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐదేళ్ల కాలానికి 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 4,175 కోట్లు ) డీల్ పొందినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.ఈ ఒప్పందంలో భాగంగా అమెరికన్ సంస్థకు కొన్ని ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం నిర్వహణ సేవలను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో వెల్లడించలేదు.కాగా విప్రో కమ్యూనికేషన్ విభాగం 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో 4.2 శాతం ఈ విభాగం నుంచి కంపెనీ లభించింది. 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు కీలకం. ఎందుకంటే అవి నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి.నాలుగో త్రైమాసికంలో విప్రో భారీ డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వృద్ధిని వేగవంతం చేయడమే విప్రో తక్షణ ప్రాధాన్యత అని కొత్తగా నియమితులైన సీఈవో శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్ కాల్ లో చెప్పారు. -
వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయం
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఆధ్వర్యంలోని సీబీఆర్ స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి విప్రో సీబీఆర్తో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్ను తయారుచేయనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్త టెక్నాలజీ ఇంజిన్లో వాడే కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్డేటా అనలిటిక్స్ నిత్యం వ్యక్తులతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తాయి. గుండె, న్యూరోడిజెనరేటివ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం, వాటిని నిర్వహించడంపై దృష్టి పెడుతాయి. సీబీఆర్ సహకారంతో డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్ను విప్రో పరీక్షిస్తుంది.ఇదీ చదవండి: రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..విప్రో లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి మాట్లాడుతూ..‘సాంకేతిక ఆవిష్కరణల ద్వారా హెల్త్కేర్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈమేరకు కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ ఆధ్వర్యంలోని సీబీఆర్తో భాగస్వామ్యం కావడం సంతోషకరం. విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్ పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు. -
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్ మేనేజ్మెంట్ను ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్ కన్సల్టింగ్ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్నర్షిప్ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్కి రిపోర్ట్ చేయాలి. ఐచెన్హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్లో, నోకియాతో ప్రైవేట్ వైర్లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్మెంట్ లీడర్గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ప్రేమ్జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్రాక్ ఇంక్., సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్ప్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్లోని డేటా స్ట్రీమ్లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్లోని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే..??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచిందివిప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
థియరీ డెలాపోర్టే రాజీనామా, విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు. విప్రో సీఈఓ జీతం ఎంత? గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్ను పూర్తి చేశారు. -
వాళ్లు పోతే పోనీ.. దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రమోషన్లు!
Wipro Promotions : భారతీయ ఐటీ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు, మరో 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రమోట్ చేసినట్లు అంతర్గత మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ అయిన విప్రో నుంచి ఉన్నత స్థాయి నిష్క్రమణల పరంపర తర్వాత సీనియర్-స్థాయి అట్రిషన్ను నిరోధించే చర్యగా ఈ ప్రమోషన్లను పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడింట్గా పదోన్నతి పొందిన చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహాలే, హెల్త్కేర్ పోర్ట్ఫోలియో లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో సీఎఫ్ఓ బెంజమిన్ సైమన్, కెనడా కంట్రీ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ శ్రీనివాసా హెచ్జి, క్లౌడ్ ఆర్మ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్ హెడ్ సతీష్ వై ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్మాన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ భరత్ నారాయణన్ సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రోను వీడారు. నియామక సంస్థ ఎక్స్ఫెనో డేటా ప్రకారం.. దేశంలోని ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడింట్, వైస్ ప్రెసిడింట్, సీనియర్ వైస్ ప్రెసిడింట్ పోస్టుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం తగ్గింది. కాగా ప్రమోషన్ల అంశాన్ని విప్రో యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. "బలమైన అంతర్గత నాయకులను అభివృద్ధి చేయడంలో కొనసాగుతున్న నిబద్ధత"లో ఇది భాగమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది. 2023 జనవరిలో విప్రో రికార్డు స్థాయిలో 73 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. వీరిలో 12 మందిని సీనియర్ వైస్ ప్రెసిడింట్ స్థాయికి, 61 మందిని వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పదోన్నతి కల్పించింది. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!
2024 ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. టెక్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం విప్రో వందలాదిమందిని తొలగించడానికి సిద్ధమైంది. సంస్థ లాభాల మార్జిన్లను మెరుగుపరచుకోవాలనుకుంటున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విప్రో కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపడుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఖర్చులను ఆదా చేయడానికి లేఆప్స్ ప్రక్రియను మొదలుపెట్టాయి. విప్రో కంపెనీ కూడా ఈ సంస్థలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల వెల్లడైన క్యూ3 ఫలితాలలో విప్రో ఆశించిన లాభాలను పొందలేకపోయింది. ఫలితాల ప్రకారం విప్రో లాభం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ. కాబట్టి కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించడానికి సంకల్పించింది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా.. ప్రస్తుతం విప్రో కంపెనీ లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తోంది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'అపర్ణ అయ్యర్' రాబోయే త్రైమాసికంలో కంపెనీ లాభాల మార్జిన్లను మెరుగుపరిచే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ తొలగించనున్న ఉద్యోగులలో ఆన్సైట్లో పని చేసే మధ్య స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. -
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్జీ', ఎంటర్ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు.. ప్రేమ్జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో సహా ప్రేమ్జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది. -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను కాగ్నిజెంట్కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
మాజీ ఉద్యోగులపై కోర్టు మెట్లెక్కిన విప్రో..రిషద్ ఆసక్తికర వ్యాఖ్యలు
విప్రో మాజీ ఉన్నతస్థాయి ఉద్యోగుల తీరును తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించడంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ స్పందించారు. మాజీ ఎగ్జిక్యూటివ్లపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో రిషద్ ప్రేమ్జీ మాట్లాడారు. విప్రో ఉద్యోగులు వారు చేస్తున్న పనిలో గోప్యత పాటించడం అవసరం. ఆ గోప్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలకు తావులేదని చెప్పారు. మా ఉద్దేశం అదికాదు.. వేరే ఉంది వ్యాజ్యాలు ఉద్యోగుల ఉపాధిపై దెబ్బకొట్టేందుకు కాదని, కేవలం వారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నవంబర్లో, విప్రోలో సీఎఫ్ఓగా పనిచేసిన జతిన్ దలాల్పై దావా వేసింది. అతను విప్రోలో సీఎఫ్ఓగా పనిచేసిన వెనువెంటనే కాగ్నిజెంట్లో సీఎఫ్ఓగా చేరారు. తద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించింది. అందరిది ఒకే మాట క్యూ3 ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్జీ సీఈఓ థియరీ డెలాపోర్టే గతంలో ప్రస్తావించిన అంశంపై మాట్లాడారు. కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్పై వ్యాజ్యాలు దాఖలు చేయడం కంపెనీ కాంట్రాక్టు ఉల్లంఘించినందుకే తప్పా ఇందులో వ్యక్తిగత అంశాలకు చోటులేదని చెప్పారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రిషద్ ప్రస్తావించారు. -
అప్పుడాయన ఆ తప్పు చేయకుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు!
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్. -
విప్రో లాభం డౌన్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది. గైడెన్స్ ఇలా ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇతర విశేషాలు ♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది. ♦బీఎఫ్ఎస్ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్ నుంచి మాత్రం 18.8 శాతం జంప్చేసింది. ♦ ఆర్డర్ బుక్ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్ విలువ 0.9 బిలియన్ డాలర్లు. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది. ♦ డిసెంబర్కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్చేసి రూ. 465 వద్ద ముగిసింది. -
ఊహించినట్టుగానే జరిగింది.. భారీగా తగ్గిన విప్రో లాభాలు!
దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది. ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం. క్యూ3 హైలైట్స్: గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి. సేవల శాతం ప్రకారం ఆఫ్షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది. డాలర్ ఆదాయం 2.66 బిలియన్ డాలర్లు ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది. మొత్తం బుకింగ్లు 3.8 బిలియన్ డాలర్లు అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది. విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. -
విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్లో చేరిన తమ మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్ల కాంట్రాక్ట్లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్సీ టెక్నాలజీ, హెచ్సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది. -
కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు!
కంపెనీ మారిన మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది. కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్ను కోరింది. అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్లో సీఎఫ్వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది. జతిన్ దలాల్కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది. -
‘మా ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు?’.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఐటీ కంపెనీలు!
నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారంటూ ప్రముఖ దిగ్గజ టెక్ దిగ్గజ కంపెనీలు ఒకదానికొకటి నోటీసులు జారీ చేసుకుంటున్నాయి. ఇప్పుడీ నోటీసుల పర్వం ఐటీ జాబ్ మార్కెట్ను షేక్ చేస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీ పద్దతి అస్సలు బాగోలేదు.. మా కంపెనీ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు? అంటూ భారత్కు చెందిన టెక్ కంపెనీలు ఒక్కటై అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్కు వరుస నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే విప్రో.. కాగ్నిజెంట్కు నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఇన్ఫోసిస్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. ‘‘ కాగ్నిజెంట్ భారత్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థకు చెందిన సుమారు 20 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అందులో సీఈఓ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ స్థాయిలో విధులు నిర్వహించే నలుగురు టాప్ ఎగ్జిక్యూటీవ్లు ఉన్నారు’’ అని ఆరోపిస్తూ కాగ్నిజెంట్కు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా ‘‘ తాము కాగ్నిజెంట్కు పంపిన నోటీసులు ఆ సంస్థకు ఓ హెచ్చరికలాంటిది. ఆ సంస్థ 20 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని నియమించుకున్న తర్వాత ఆ కంపెనీ ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయి’’ అంటూ ఓ జాతీయ మీడియాతో ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ ఇటీవల, విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హక్ (Mohd Haque)లు కాగ్నిజెంట్లో చేరారు. వాళ్లిద్దరూ కాగ్నిజెంట్లో చేరిన రెండు రోజులకే విప్రో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. జతిన్ దలాల్,మహమ్మద్ హక్ మహమ్మద్ హక్ తన ఉద్యోగ ఒప్పందంలోని నాన్-కాంపిటీ క్లాజ్ను ఉల్లంఘించి తమ కాంపిటీటర్ కాగ్నిజెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లైఫ్ సైన్సెస్కు బిజినెస్ యూనిట్ హెడ్గా చేరారని కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా, హక్ తన నాన్ కాంపిటేట్ నిబంధన గడువు ముగియడానికి ముందే చేరడం చట్ట విరుద్దం అని కోర్టుకు విన్నవించుకుంది. అంతేకాదు, విప్రోను వదిలి కాగ్నిజెంట్లో చేరే సమయంలో తమ సంస్థకు చెందిన ఏడు ఫైళ్ల రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మా ఐటీ బృందం కనిపెట్టింది. దీనికి తోడు విప్రో అఫీషియల్ మెయిల్ నుంచి తన వ్యక్తిగత మెయిల్కు కంపెనీ రహస్యాల్ని సెండ్ చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని కోర్టు ఫిర్యాదులో వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం.. హక్.. విప్రో లక్ష్యాల్ని, వ్యాపార వ్యహరాల్ని తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని అందించారు. రాజీనామాకు కొద్ది సేపటి ముందే చాలా తెలివిగా విప్రో రహస్యాల్ని మెయిల్స్కి పంపుకున్నారు అని వరుస ఆరోపణల్ని గుప్పిస్తూ వస్తోంది. కాగ్నిజెంట్కు ఇన్ఫోసిస్, విప్రో ఎగ్జిక్యూటీవ్ల క్యూ 2022 నుండి విప్రో , ఇన్ఫోసిస్ సంస్థల్లో సీనియర్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ ఎత్తున కాగ్నిజెంట్లో చేరారు. ముఖ్యంగా, సీఎఫ్ఓ నిలంజన్ రాయ్, ఈవీపీ రాజీవ్ రంజన్, అధ్యక్షుడు మోహిత్ జోషి, ఎండీ రవి కుమార్ వంటి కీలక వ్యక్తుల ఇన్ఫోసిస్ నుంచి కాంగ్నిజెంట్లో చేరడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదే విధంగా, విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్, గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మాన్, ఎస్వీపీ మొహమ్మద్ హక్, ఆశిష్ సక్సేనాతో పాటు ఇతర టాప్ ఎక్జిక్యూటీవ్లు సంస్థను వదిలి వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది కాగ్నిజెంట్తో పాటు ఇతర కాంపీటీటర్ సంస్థల్లో చేరారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కారణంగా విప్రో, ఇన్ఫోసిస్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ మాజీ ఉద్యోగులు, వారిని చేర్చుకున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాయి. అందులో కాగ్నిజెంట్ కూడా ఉంది. మూల కారకులు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ కాగ్నిజెంట్ ప్రస్తుత సీఈఓ రవికుమార్ గతంలో ఇన్ఫోసిస్లో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇన్ఫోసిస్ నుంచి బయటకొచ్చి సీఈఓగా కాగ్నిజెంట్లో చేరారు. అనంతరం ఇన్ఫోసిస్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా, నలుగురిని వైస్ ప్రెసిడెంట్లుగా మొత్తం 20 మంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారిని తన సంస్థలోకి ఆహ్వానించారు.ఈ అంశమే కాగ్నిజెంట్పై ఇన్ఫోసిస్, విప్రోలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రేరేపించాయి. -
పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?!
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ‘‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది. వారానికి మూడు రోజులు ఆఫీస్లోనే ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్ వర్క్ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విస్తరిస్తోన్న కరోనా కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్-19 వైరస్ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్-19, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్.. ప్రస్తుతం జేఎన్1 వైరస్గా మన ముందుకొస్తోంది. డిసెంబర్ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది. -
భారత్లో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా?
భారత్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో ఫ్రాన్స్కు చెందిన థియరీ డెలాపోర్టే అగ్రస్థానంలో నిలిచారు. 2020 నుంచి విప్రో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డెలాపోర్టే .. వేతనాల విషయంలో దేశీయ మిగిలిన టెక్ కంపెనీలు హెచ్సీఎల్, టీసీఎస్ సీఈఓలను వెనక్కి నెట్టారు. ఏడాదికి రూ.82 కోట్ల వేతనాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా ఫోర్బ్స్తో డెలాపోర్టే మాట్లాడుతూ.. ‘‘ విప్రో సీఈఓ పదవికి అర్హులైన వారి కోసం అన్వేహిస్తున్న సమయంలో ఆ సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీని, ప్రస్తుత ఛైర్మన్ అజీమ్ కుమారుడు రిషద్ ప్రేమ్జీని కలిశాను. వారితో మాట్లాడక ముందు భవిష్యత్పై నాకు అనేక ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. కానీ అజీమ్, రిషద్తో మూడు, నాలుగు గంటలు గడిపిన తర్వాత నా ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వారి ఇద్దరి మాటల్లో విలువలతో కూడిన ఆశయాలు, ప్రాధాన్యతల గురించి విన్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను’’ అని డెలాపోర్టే అన్నారు. డెలాపోర్టే తర్వాత ఎవరంటే? ఇక డెలాపోర్టే తర్వాత ఇన్ఫోసిస్కు చెందిన సలీల్ పరేఖ్ దేశంలోనే అత్యధిక చెల్లింపులు జరుపుతున్న రెండవ సీఈఓగా అవతరించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదికలో స్టాక్ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 500 కంపెనీల విశ్లేషణలో తేలింది. పరేఖ్ ఈ ఏడాది రూ. 56.45 కోట్ల జీతం తీసుకున్నారు. రూ. 30 కోట్ల వేతనంతో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ మూడో స్థానంలో నిలిచారు. నాల్గవ స్థానంలో మాజీ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రూ. 29 కోట్లకు పైగా సంపాదించారు రేసులో కామత్ సోదరులు ఈ ఏడాదిలో అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ డైరక్టర్, సీఈఓగా జీరోధా సోదరులు నిలిచారు. జీరోధార ఫౌండర్ నితిన్ కామ్, నిఖిల్ కామత్లు ఇద్దరూ అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ సీఈఓలుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరి వేతనం ఏడాది రూ.72కోట్లుగా ఉంది. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్లో తీసుకువచ్చింది. విప్రో వెబ్సైట్లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు విప్రో ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరులోని తన ఆస్తులను విక్రయించాలని విప్రో నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్లు ఉన్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి విప్రో క్యాంపస్ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్కల్చర్కు అనుగుణంగా హైబ్రిడ్వర్క్ మోడల్ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే విప్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉండగా.. ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది. సెప్టెంబర్ త్రైమాసికం వరకు విప్రోలో 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు. -
వావ్ అనిపిస్తున్న విశాఖ.. విప్రో బాటలో దిగ్గజ కంపెనీలు
-
మరో బ్యాడ్న్యూస్: విప్రో ఉద్యోగుల ఆశలు ఆవిరేనా? పిడుగు లాంటి నివేదిక!
Wipro salary hike: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తోంది. ఇంటి పని చేస్తున్న ఉద్యోగులందరూ ఆఫీస్లకు రావాల్సిందేనని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కంపెనీ ఇప్పుడు జీతాల పెంపు విషయంలో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పిడుగు లాంటి నివేదికను రాయిటర్స్ బయటపెట్టింది. విప్రో సంస్థ పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన పెంపు విషయంలో ఈ సంవత్సరం అధిక ప్యాకేజీ ఉద్యోగులకు మొండిచేయి చూపిస్తుందని, వారికి వార్షిక వేతన పెంపును దాటవేయవచ్చని రాయిటర్స్ తాజాగా నివేదించింది. ఈ కంపెనీలో డిసెంబర్ నెలలో వేతన సవరణలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 1న ఉద్యోగులు పెరిగిన జీతాలు అందుకుంటారని కంపెనీ యాజమాన్యం తమ 2023-24 రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది. తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ఊరట నివేదిక ప్రకారం.. విప్రో కంపెనీ జీతాల పెంపును పూర్తిగా విరమించుకోలేదు. తక్కువ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపును అమలు చేయబోతోంది. వేతన పెంపులో తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్న కంపెనీ అంతర్గత మెమోను రాయిటర్స్ ఉటింకించింది. ఆఫీస్కు రావాల్సిందే.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్కు రావాల్సిందేనని విప్రో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్ పాలసీలో భాగంగా నవంబర్ 15 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన ఈమెయిల్స్లో పేర్కొంది. కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, వచ్చే ఏడాది జనవరి 7 నుంచి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదీ చదవండి: 70-hour work: అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్! -
వర్క్ ఫ్రం హోంపై విప్రో కీలక నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో వర్క్ ఫ్రం హోంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి 3 రోజులు తప్పని సరిగా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్ పాలసీలో భాగంగా నవంబర్ 15,2023 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన మెయిల్స్లో పేర్కొంది. ఇప్పటికే భారత్లోని టెక్ కంపెనీలు పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్కి స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఇన్ఫోసిస్లు వర్క్ ఫ్రమ్ హోమ్లో మార్పులు చేశాయి. టెక్కీలు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబడుతున్నాయి. తాజాగా, విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఈ పాలసీ గురించి మాట్లాడుతూ ఉద్యోగులు కలిసి పనిచేసేందుకు ప్రోత్సహ్తిస్తూ కార్పొరేట్ సంస్కతిని మరింత బలోపేతం చేసేలా హైబ్రిడ్ వర్క్ మోడల్ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానిక నిబంధనలు పాటిస్తూ తగు మార్పులు చేస్తామని పేర్కొన్నారు. కొత్త వర్క్ పాలసీ అనుసరించలేదంటే? కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, జనవరి 7, 2024 నుండి పరిణామాలు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు తెలిపింది. మరి తాజా యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
విశాఖలో విప్రో విస్తరణ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ ‘ప్రాజెక్ట్ లావెండర్’ పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఇప్పుడు మహా నగరాల నుంచి టైర్–2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ సమయంలో వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో వారి వద్దకే వెళ్లేందుకు ఐటీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యయాల్ని తగ్గించుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా విప్రో కూడా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో.. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్మెంట్ సెంటర్ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది. వైఎస్సార్ హయాంలో నాంది సత్యం జంక్షన్లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. తొలుత 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే కోవిడ్ సమయంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(ఎపిటా) గ్రూప్ సీఈవో కిరణ్రెడ్డి విప్రో ప్రతినిధి శశికుమార్తో పలు దఫా లుగా చర్చలు జరిపి.. విస్తరించేందుకు ఆహా్వనించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన విప్రో.. కా ర్యకలాపాలు ప్రారంభించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి విశాఖలో విస్తరణకు విప్రో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. గత క్యాంపస్లో కొంత భాగం ఇప్పటికే అద్దెకు ఇచ్చిన విప్రో.. ముందు భవనంలో ఇప్పటికే సేవలు ప్రారంభించింది. ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లలోనూ తమ సంస్థ మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇందులో అద్దెకు ఇచ్చిన వారిని ఖాళీ చేయించారు. వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల్ని దాదాపు పూర్తి చేసింది. మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం సంస్థ సేవల్ని విశాఖలో విస్తరిస్తామని ప్రభుత్వంతో విప్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి కల్లా 1000 సీట్లకు పెంచుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విప్రో ప్రతినిధులు హామీ ఇవ్వడం శుభపరిణామం. వైజాగ్లో టాలెంట్, అప్స్కిల్లింగ్, అనుభవజు్ఞలైన నిపుణుల్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. భవిష్యత్తులో ఏ క్లైయింట్ వచ్చినా.. ఇక్కడికే తీసుకురావాలని సూచించాం. దానికి కావాల్సిన మానవ వనరుల్ని అందిస్తామన్నాం. దానికి విప్రో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారంతో పాటు విప్రో ప్రాజెక్టులకు అవసరమైన రిక్రూట్మెంట్కు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. – కిరణ్రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 2,667 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,649 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22,516 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,540 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఐదు అనుబంధ సంస్థలను కంపెనీలో విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. వీటిలో విప్రో హెచ్ఆర్, ఓవర్సీస్ ఐటీ, టెక్నాలజీ ప్రొడక్టు సరీ్వసులు, వీఎల్ఎస్ఐ డిజైన్ సరీ్వసులు, విప్రో ట్రేడ్మార్క్ హోల్డింగ్ ఉన్నాయి. గైడెన్స్ వీక్.. ప్రస్తుత త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.5–1.5 శాతం మధ్య క్షీణించవచ్చంటూ విప్రో తాజా అంచనాల(గైడెన్స్)ను ప్రకటించింది. వెరసి కరెన్సీ నిలకడ ప్రాతిపదికన 261.7–267.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఊహిస్తోంది. అంటే రూ. 21,643–22,097 కోట్ల మధ్య టర్నోవర్ను అంచనా కట్టింది. ప్రస్తుత బలహీన ప్రపంచ ఆర్థిక ఔట్లుక్ నేపథ్యంలో తాజా గైడెన్స్ను ప్రకటించింది. ఇతర విశేషాలు ► నిర్వహణ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 16.1 శాతానికి చేరాయి. ► 3.78 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► క్యూ2కల్లా సిబ్బంది సంఖ్య 7 శాతం తగ్గి 2,44,707కు చేరింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 త్రైమాసికాల్లోనే తక్కువగా 15.5%కి పరిమితమైంది. అనిశి్చతులు ఉన్నాయ్... బిజినెస్ వాతావరణం అనిశి్చతిగా ఉన్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలలో కొనసాగుతున్నాయని, పెట్టుబడులపట్ల క్లయింట్లు మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పెట్టుబడుల గరిష్ట వినియోగంపై దృష్టి పెడుతూనే కొత్త పెట్టుబడులపై వేగవంత రిటర్నులను ఆశిస్తున్నట్లు వివరించారు. విచక్షణా వ్యయాలు, ఆర్డర్లు నెమ్మదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్జిన్లు నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 408 వద్ద ముగిసింది. -
ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!
Wipro salary hike: ప్రముఖ దేశీయ టెక్నాలజీ దిగ్గజం విప్రో (Wipro).. తమ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త చెప్పింది. జీతాల పెంపుదలను వచ్చే డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులకు వేతన పెంపు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ఈ మేరకు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ నుంచి ఉద్యోగులకు ఈ-మెయిల్ అందినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. "ప్రస్తుతం సవాళ్లతో కూడిన, అనిశ్చిత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మా మెరిట్ జీతాల పెంపుదల (MSI) 2023 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో, ప్రస్తుత పరిహారం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా అర్హత ఉన్న ఉద్యోగులకు మెరిట్ జీతం పెంపును నిర్ణయిస్తాం" అని ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. (మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్తో రూ.లక్ష మాయం..) స్థూల ఆర్థిక ఎదురుగాలి, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా జీతాల పెంపు ప్రకటనను విప్రో ఈ సంవత్సరం మూడు నెలలు వాయిదా వేసింది. దీంతోపాటు ఈ సంవత్సరం అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు జీతాల పెంపును జాప్యం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ మందగమనం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. లాభదాయకతను పెంపొందించుకోడానికి, ఐటీ రంగంలో తన స్థితిని మెరుగుపరచడానికి విప్రో.. గత జులైలో వ్యూహాత్మక మార్పులను చేపట్టింది. కంపెనీ తన క్లయింట్ బేస్ను తగ్గించుకుని అధిక మార్జిన్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఒప్పందాలపై దృష్టి పెట్టింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8 శాతం సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిన కొన్నాళ్లకే ఈ వ్యూహం అమలు చేసింది. అదనంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, సంస్థ ప్రారంభ ఆఫర్లతో పోలిస్తే కొత్త రిక్రూట్మెంట్ల పే ప్యాకేజీలను దాదాపు 50 శాతం తగ్గించింది. -
ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు
ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్జెమినీ LTIMindtree టాప్ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్ వర్క్ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు. (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!) కాగా గ్లోబల్గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు. -
సీఎఫ్వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్లో ప్రత్యక్షం!
విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ (Jatin Dalal)ను తమ సీఎఫ్వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్వోగా రాజీనామా చేశారు. (లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్టాప్లూ తనిఖీ) ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు మారుతున్న టాప్ ఎగ్జిక్యూటివ్లు ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది టీసీఎస్. వచ్చే డిసెంబర్లో ఆయన విధుల్లో చేరన్నారు. (ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట) ఇక జతిన్ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి. 2015లో విప్రో సీఎఫ్వో అయిన జతిన్ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది. -
20 ఏళ్లనాటి భవనం అమ్మేసిన విప్రో.. దెబ్బకు పతనమైన షేర్లు
తమిళనాడులోని 20 ఏళ్ల నాటి భవనంతో పాటు 14 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఐటీ కంపెనీ విప్రో ఇటీవల ప్రకటించింది. చెన్నైలోని షోలింగనల్లూరు ఐటీ కారిడార్లో దాదాపు 5,89,778 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని రూ. 266.38 కోట్లకు కాసాగ్రాండ్ బిజ్పార్క్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. విప్రో తన ఆస్తులను విక్రయించిన తరువాత కంపెనీ షేర్స్ అన్నీ కూడా వరుస నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 2870.10 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ. 2563.60 కోట్లు. ఈ లెక్కన 2022 కంటే 2023 లో కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగింది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! విప్రో వంటి పెద్ద సంస్థ తన ఆస్తులను అమ్మడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని వల్ల చాలామందికి కంపెనీ నష్టాల్లో ఉందా అనే ఆలోచన వచ్చింది. ఈ దెబ్బతో షేర్లు క్రమంగా తగ్గాయి. అయితే విప్రో నిజంగా నష్టాల్లో ఉందా.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. -
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి?
ఇండియా & కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియన్ ఐటీ పరిశ్రమ మీద ప్రభావం చూపుతాయా అని చాలామంది కంగారుపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?, నిజంగానే ప్రభావం ఉంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్, కెనడా మధ్య వివాదం ఫలితంగా భారతీయ ఐటీ సంస్థలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావానికి లోనయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్షణం ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. కెనడా ప్రాంతం నుంచి ఐటీ కంపెనీల ఆదాయం 5 - 6 శాతం వరకు ఉంది. టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా & కెనడా టెక్ నెట్వర్క్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 15,000 కంటే ఎక్కువ మంది కెనడాలో ఉద్యోగాల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అమెరికాలో వీసా సమస్యల కారణంగా ఎక్కువమంది కెనడాకు పయనమయ్యారు. ఈ ఏడాది జులైలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీని ప్రారంభించింది. దీని ద్వారా 2024 నాటికి కెనడాలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ జనవరిలో, TCS తన డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి.. అదే విధంగా ఆవిష్కరణను పెంచడానికి కెనడియన్ జెట్ తయారీదారు బొంబార్డియర్ ద్వారా వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికైంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు! ఇక విప్రో విషయానికి వస్తే.. జనవరిలో కెనడాలోని టొరంటోలో తన సరికొత్త Wipro-AWS లాంచ్ ప్యాడ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్కు దరఖాస్తు చేసింది. -
విప్రో సీఎఫ్వోగా అపర్ణ అయ్యర్.. గోల్డ్ మెడల్ సీఏ ఈమె..
భారత ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా అపర్ణ అయ్యర్ (Aparna Iyer) నియమితులయ్యారు. ఇప్పటి వరకూ సీఎఫ్వోగా ఉన్న జతిన్ దలాల్ సెప్టెంబర్ 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్ను విప్రో నియమించింది. అపర్ణ అయ్యర్ 20 ఏళ్లుగా విప్రోలో పనిచేస్తున్నారు. 2003లో చేరినప్పటి నుంచి కంపెనీకి వివిధ సీనియర్ స్థానాల్లో సేవలందించారు. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్గా విప్రోలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అయ్యర్ విప్రో సంస్థలో కీలకమైన నాయకత్వ స్థానాలను నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆమె విప్రో క్లౌడ్ సర్వీసెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీజీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి ఆర్థిక సంబంధమైన అంశాల్లో విశేషమైన నైపుణ్యం ఉన్న అపర్ణ అయ్యర్ ఆయా అంశాల్లో పలు కీలక పోస్టులను నిర్వహించారు. అపర్ణ అయ్యర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, సీఏ 2002 బ్యాచ్లో గోల్డ్ మెడల్ విజేతగా గుర్తింపు పొందారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో చేరడానికి ముందు అయ్యర్ 2001లో ముంబైలోని నర్సీ మోంజీ నుంచి కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) “నిష్ణాతురాలైన అపర్ణ ఫలితాలతో నడిచే లీడర్. విప్రోతో తన 20 ఏళ్ల కెరీర్లో ఆమె మా బిజినెస్ లీడర్లకు డైనమిక్, ఫార్వర్డ్ థింకింగ్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు” అని విప్రో లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. విప్రో సీఎఫ్ఓగా నియమితులైన తర్వాత అపర్ణ అయ్యర్ మాట్లాడుతూ "విప్రోకి ఈ ముఖ్యమైన తరుణంలో సీఎఫ్ఓ బాధ్యతలను స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీని స్థిరమైన వృద్ధివైపు నడిపించడానికి, వాటాదారులకు విలువను సృష్టించడానికి సీఈవో థియరీతో, మా ఫైనాన్స్ బృందం, మొత్తం సంస్థతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. -
ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్!
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. లిస్ట్లో ఇండియన్ కంపెనీలు అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 20 లిస్ట్ ఇదే.. 1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ 2. H&R బ్లాక్ 3. డెల్టా ఎయిర్ లైన్స్ 4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5. యాక్సెంచర్ 6. IBM 7. L3 హారిస్ 8. విప్రో 9. ఇన్ఫోసిస్ 10. నైక్ 11. వ్యాన్స్ 12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్ 13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 14. హాల్ మార్క్ 15. మైక్రోసాఫ్ట్ 16. నార్త్రోప్ గ్రుమ్మన్ 17. FedEx ఫ్రైట్ 18. డచ్ బ్రదర్స్ కాఫీ 19. వాల్ట్ డిస్నీ కంపెనీ 20. యాపిల్ Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo — IBM (@IBM) September 21, 2023 -
విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్ రాజీనామా - ఆ స్థానంలో అపర్ణ అయ్యర్
విప్రో (Wipro) కంపెనీలో దాదాపు 20 సంవత్సరాలుగా ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్గా (CFO) సేవలందించిన జతిన్ దలాల్ గురువారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ స్థానంలోకి కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న 'అపర్ణ అయ్యర్'ను నియమిస్తున్నట్లు.. సెప్టెంబర్ 22నుంచి పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అపర్ణ ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు దశాబ్దాలుగా నాకు కంపెనీలో అవకాశం కల్పించినందుకు విప్రోకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించడానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్లో ఇండియన్ ఎంప్లాయిస్.. 2022లో ట్రెజరీ మేనేజర్గా చేరిన దలాల్ అప్పటి నుంచి సీనియర్ మేనేజర్, ఇన్వెస్టర్ రిలేషన్స్, CFO - యూరప్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, IT ఫైనాన్స్ మేనేజర్ అండ్ హెడ్ వంటి అనేక పదవుల్లో కొనసాగారు. కంపెనీ ఉన్నతిలో జతిన్ దలాల్ పాత్ర ఆమోఘనీయం అని పలువురు అభినందించారు. -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు!
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఆఫర్ లెటర్లు తీసుకొని జాయినింగ్ తేదీల కోసం పడిగాపులు కాస్తున్న ఫ్రెషర్స్కు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. జులై1, 2023 నుంచి జూన్ 30, 2024 మధ్య కాలానికి ఫ్రెషర్స్ నియమకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో ఐటీ రంగంలో నియమకాలు, ఫ్రెషర్స్ జాయినింగ్ తేదీలపై మరింత సందిగ్ధత నెలకొంది. కోవిడ్-19 సమయంలో అన్నీ రంగాలు కుదేలవుతుంటే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే.. టెక్కీలు మాత్రం రోజుకి రెండు, మూడు జాబులు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. ఒకనొక సమయంలో అంటే 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలంలో టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో,హెచ్సీఎల్, టెక్ మహీంద్రా,యాక్సెంచర్తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్స్ను నియమించుకున్నాయి. ముఖ్యంగా, ఆయా టెక్నాలజీ కంపెనీలు 2022- 2023 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్ధులకు ఆఫర్ లెటర్లను అందించాయి. ఏడాది క్రితం వారికి ఆఫర్ లెటర్లను అందించినా జాయినింగ్ డేట్ ఎప్పడనేది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ప్రతి రెండు-మూడు నెలలకు కంపెనీల్లో చేరే తేదీలను పొడిగిస్తున్నాయి. మరికొందరు తమ ఆఫర్ లెటర్ల గడువు ముగియడంతో అదనంగా శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరు వారి ఆఫర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో జాబ్ మార్కెట్లో ఫ్రెషర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం.. గత రెండు బ్యాచ్లలో 20,000-25,000 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు పొందారు. కానీ సంస్థలు ప్రాజెక్ట్లలో తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయి. బిజినెస్ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ ప్రశ్నిస్తోంది. తాజాగా, టీమ్ లీజ్ నివేదిక సైతం రానున్న రోజుల్లో ఫ్రెషర్ల నియామకం భారీగా తగ్గిపోతుందని తన నివేదికలో హైలెట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్స్ చేరే తేదీలు, నియమాకాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?
TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే ప్రపంచంలోని తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కంపెనీల ర్యాంకింగ్లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు 750 కంపెనీలున్న టైమ్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ , ఆన్లైన్ డేటా ప్లాట్ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు, సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా ఆ ర్యాంకింగ్లను కేటాయించారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్ మూవింగ్ టెక్ ర్యాంకింగ్లున్నాయి. Infosys has been featured in TIME World’s Best Companies 2023 list. We are among the top 3 global professional services firm and the only brand from India in the Top 100 global rankings: https://t.co/Mvg9lRFxDV pic.twitter.com/dN6n0p76ZA — Infosys (@Infosys) September 14, 2023 టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్లలో తొలి నాలుగు కంపెనీలు అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి, వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి దోహద పడ్డాయని తెలిపింది. ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. -
జర్మనీలో విప్రో సైబర్ డిఫెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా జర్మనీలోని డుసెల్డార్ఫ్లో సైబర్ డిఫెన్స్ సెంటర్ ప్రారంభించింది. క్లయింట్లకు ఈ కేంద్రం ద్వారా సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ, ఏదైనా సంఘటన జరిగితే ప్రతిస్పందన, సమస్య పరిష్కారానికి మద్దతు వంటి సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను విప్రో వినియోగిస్తుంది. -
లైటింగ్ పరిశ్రమలో అగ్ర స్థానంపై విప్రో కన్ను
న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్ప్రైజెస్లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది. మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్లైన్లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు. అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి. గృహోపకరణాల విభాగంలో విస్తరణ గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్లో తాము మార్కెట్ లీడర్గా ఉన్నట్టు చెప్పారు. -
విప్రో గ్లోబల్ ఏఐ హెడ్గా 'బ్రిజేష్ సింగ్' - ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రముఖ ఐటీ సంస్థ 'విప్రో' (Wipro) తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హెడ్గా భారతీయ ఐటీ దిగ్గజం మాజీ డెలాయిట్ ఎగ్జిక్యూటివ్ 'బ్రిజేష్ సింగ్'ను ఎంపిక చేసింది. కంపెనీ పోర్ట్ఫోలియో అంతటా AI అడాప్షన్ను వేగవంతం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు. బ్రిజేష్ సింగ్ టెక్నాలజీ కన్సల్టింగ్ స్పేస్లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ఈయన గతంలో డెలాయిట్లో సీనియర్ భాగస్వామిగా, డేటా-లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ను నడపడంలో బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. లింక్డ్ఇన్ ప్రకారం ఈయన BIT సింద్రీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో కంపెనీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Wipro ai360 ప్రారంభించిన తర్వాత సింగ్ నియామకం జరిగింది. కావున దీని అభివృద్ధికి ఈయన కొత్త వ్యూహాలు రచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ మొత్తం పోర్ట్ఫోలియోను వేగవంతం చేసే సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా ఆయన ప్రధాన పోషించాల్సి ఉంది. -
జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే. ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్మార్ట్ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్షిప్లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు. ‘నేను వాల్మార్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. ప్రస్తుతం, ధన్బాద్లోని ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు. కాబట్టే, నేను వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్మార్ట్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -2గా చేరింది. చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?! -
ఐటీ జాబ్ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్
Wipro Walk In Interview kolkata: ఐటీ పరిశ్రమలో కొన్ని నెలులుగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలతోపాటు స్టార్టప్ సంస్థలు సైతం లేఆఫ్లు అమలు చేస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా మరో జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్లైన్తోపాటు ఎక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరిగినా క్యూ కడుతున్నారు. తాజాగా కోల్కతాలో విప్రో కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు కుప్పలు కుప్పలుగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఈ వీడియోలో ఉన్న వారంతా కోల్కతాలోని విప్రో క్యాంపస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూల కోసం వచ్చారు. ఉన్నది తక్కువ ఉద్యోగాలే అయినా పదివేల మందికి పైగా తరలివచ్చారు. దేశంలో జాబ్ మార్కెట్ పరిస్థితికి ఇది నిదర్శనం’ అంటూ ఓ యూజర్ ఎక్స్ (ట్వటర్)లో వీడియో షేర్ చేశాడు. ఇదీ చదవండి: Safe IT Jobs: ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్లు మాత్రం సేఫ్! విప్రో దేశంలోని పలు నగరాల్లోని కార్యాలయాల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోల్కతా క్యాంపస్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ఆగస్ట్ 8న ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 2.35 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. Outside Wipro's Kolkata office during walkin. 10000+ applicants for some jobs! Job market isint that easy it seems. Your view? pic.twitter.com/BGm1TKfsOv — Abhishek Kar (@Abhishekkar_) August 8, 2023 -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
అమెజాన్ కొత్త పాలసీ.. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో!, ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు చూసి చూడనట్లుగా ఉన్న ఈకామర్స్ దిగ్గజం ఇటీవల ఉద్యోగుల పని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్కు రావాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం.. గత ఏడాది నుంచి సంస్థ ఉద్యోగుల్ని తొలగించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. మరి వారానికి ఎంతమంది ఉద్యోగులు కార్యలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బహుశా! కోవిడ్-19 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి పరిమితమైన ఉద్యోగులే ఆఫీస్కు రావాల్సి ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా అమెజాన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యలయాల నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు సహచర ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార వృద్ది జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టే ఉద్యోగులు ఆఫీసుల్లో ఇతర ఉద్యోగులకు కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీంతో సంస్థ తీసుకునే రోజువారీ నిర్ణయాలు నేరుగా ఉద్యోగులతో చర్చించే వెసులు బాటు కలుగుతుందని తెలిపారు. అమెజాన్లో తొలగింపులు అయినప్పటికీ, అమెజాన్లో ఉద్యోగులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది అమెజాన్ 27,000 మందిని ఇంటికి సాగనంపింది. తన కార్పొరేట్ వర్క్ ఫోర్స్లో అధిక శాతం వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరింది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సియోటల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశీయ టెక్ కంపెనీలు సైతం మరోవైపు దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో,హెచ్సీఎల్లు ఉద్యోగులు ఆఫీస్ రావాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వర్క్ ఫోర్స్ కార్యాలయాలకు రానుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. చదవండి : ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో.. ఆందోళనలో భారతీయులు! -
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటి నుంచి ఉద్యోగులు ఆఫీస్ బాట పడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని కూడా సంస్థలకు తిరిగి రప్పించడానికి దిగ్గజ కంపెనీలు ఒకే మాట మీద నడుస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ఒకే తాటిపై నడుస్తున్నట్లు సమాచారం. 2023-24 ఆర్ధిక సంవత్సరం క్యూ1 ఫలితాల తరువాత అందరిని సంస్థలకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. క్యూ1 ఫలితాల అనంతరం అందరూ ఆఫీసులకు రావాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 50 శాతం మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. టీసీఎస్ కంపెనీలో 55 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నట్లు 'మిలింద్ లక్కడ్' తెలిపారు. విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు కూడా ఇదే విధానం అమలు చేస్తున్నాయి. (ఇదీ చదవండి: ఖాతాదారులకు గట్టి షాక్.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ!) మొత్తం మీద దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను రప్పించడానికి కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికే పరిమితమై పనిచేసుకుంటున్న ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్లో ఎంత మంది? -
జాబ్ మార్కెట్లో ‘AI’ విధ్వంసం..ఉద్యోగులకు విప్రో బంపరాఫర్!
న్యూఢిల్లీ: Wipro launches AI platform ai360 : దేశీ ఐటీ దిగ్గజం విప్రో తమ యావత్ సిబ్బందికి కృత్రిమ మేథ (ఏఐ)లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో విప్రో ఏఐ360 ప్రోగ్రాం ద్వారా బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,200 కోట్లు) వెచ్చించనుంది. సంస్థలో మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ‘వచ్చే 12 నెలల్లో మొత్తం 2,50,000 మంది ఉద్యోగులకు ఏఐ ఫండమెంటల్స్, బాధ్యతాయుతంగా ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తాం‘ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ స్థాయిల్లో ఏఐ వినియోగానికి సంబంధించి కంపెనీ బోధనాంశాలను రూపొందించనుంది. అలాగే హ్యాకథాన్స్ మొదలైనవి కూడా నిర్వహించనుంది. అటు విప్రో వెంచర్స్ ద్వారా ఆధునిక స్టార్టప్లలో ఇన్వెస్ట్ కూడా చేయడంతో పాటు జెన్ఏఐ సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా జనరేటివ్ఏఐ ఆధారిత స్టార్టప్లకు శిక్షణ కల్పించనుంది. -
దక్షిణాఫ్రికాలో విప్రో కొత్త సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ విప్రో తాజాగా నూతన కార్యాలయాన్నిదక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ప్రారంభించింది. 2007 నుంచి దక్షిణాఫ్రికాలో విప్రో కార్యకలాపాలు సాగిస్తోంది. డిజిటల్ పరివర్తనలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఈ ప్రాంత కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతు ఇస్తోంది. విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిస్ చెంచహ్ మాట్లాడుతూ, "సెంచరీ సిటీ, కేప్ టౌన్లో కార్యాలయం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఇది దక్షిణాఫ్రికా అంతటా పెట్టుబడులకు, తమ ఉనికిని విస్తరించేలా తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు..అ లాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న క్లయింట్ బేస్ అవసరాలను మరింత మెరుగ్గా పరిష్కరించడానికి, స్థానిక ప్రతిభకు ఆసక్తికరమైన అవకాశాలను అందించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. -
రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ
Wipro CEO Thierry Delaporte: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'థియరీ డెలాపోర్టే' (Thierry Delaporte) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న సీఈఓలలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓగా ఈయన ప్రసిద్ధి చెందారు. 2022-23 ఆర్ధిక సంవత్సరం వార్షిక వేతనంలో 5శాతం తగ్గినప్పటికీ భారీ ప్యాకేజి తీసుకునే సీఈఓలలో ఇప్పటికీ ఒకరుగా ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో డెలాపోర్టే 10 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం కలిగి ఉన్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 83 కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈయన వార్షిక వేతనం రూ. 79.66 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈయన వేతనం రోజుకి రూ. 22.7 లక్షలు కావడం కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) గత సంవత్సరంలో డెలాపోర్టే మాత్రమే కాకుండా ఎక్కువ జీతం తీసుకునే భారతీయ సీఈఓల జాబితాలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ (రూ. 71.02 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ (రూ. 34 కోట్లు) ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ 17.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 144 కోట్లు), 'జూలీ స్వీట్' యాక్సెంచర్ (Accenture) సీఈఓ 23 మిలియన్ డాలర్ల జీతం (దాదాపు రూ. 189 కోట్లు) తీసుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్
సాక్షి, ముంబై: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్కు మొగ్గు చూపుతున్నతరుణంలో విప్రో రిషద్ ప్రేమ్జీ వేతన కోత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) యుఎస్లోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్కు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం రిషద్ ప్రేమ్జీ 2023 ఆర్థిక సంవత్సరానికి తన జీతంలో స్వచ్ఛందంగా 50 శాతం కోత విధించుకున్నారు. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం వార్షిక పరిహారంగా 951,353 డాలర్లు పొందగా , మునుపటి సంవత్సరం ఆదాయంతో పోలిస్తే దాదాపు 50 శాతం తక్కువ. విప్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రేమ్జీ ప్రస్తుత 5 సంవత్సరాల పదవీకాలం జూలై 30, 2024న ముగియనుంది. ఇదీ చదవండి: యాపిల్ స్పెషల్ ఫీచర్తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..! ఇలాంటి మరెన్సీ కార్పొరేట్ వార్తలు, విశేషాలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో తీరు టెక్నాలజీ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ముందస్తు భయాలు వంటి కారణాలతో ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో విప్రో ఫ్రెషర్స్ నియామకాల్ని 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. కొద్ది రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ భారీ ఎత్తున జీతాల కోత విధించింది. దీనిపై టెక్నాలజీ రంగ నిపుణులు, ఫ్రెషర్స్ విప్రో తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం లేదు దీనిపై అయితే, ప్రొడక్ట్లు, అవకాశాలు వంటి విషయాల్లో టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, కాబట్టే ఫ్రెషర్స్కు ఇచ్చే వేతనాల్ని తగ్గించి విధుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ తామెవరినీ తక్కువ ప్యాకేజీలకు ఉద్యోగంలో చేరాలని బలవంతం చేయలేదని, సంస్థ అందించే వేతనం కావాలనుకుంటే ఇప్పటికీ విప్రోలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ఆఫర్కే అంగీకారం తాజాగా, సంస్థలోని ఫ్రెషర్ల నియామకాలు, వారికి అందించే జీతభత్యాలపై విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విప్రోలో 92 శాతం మంది ఫ్రెషర్లు తాము అందించే ఆఫర్కు అంగీకరించి ఆయా ప్రాజెక్ట్లలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఫ్రెషర్లకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి న్యాయంగా, పారదర్శకతతో తీసుకుంటున్నట్లు జతిన్ దలాల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఫ్రెషర్స్ను ఏడాది పొడవునా సంబంధిత ప్రాజెక్ట్లలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్లు మాత్రమే ఇస్తాం.. ఉద్యోగులదే తుది నిర్ణయం ఉద్యోగులకు మేం ఆప్షన్లు మాత్రమే ఇస్తాం. కంపెనీలో చేరుతారా? లేదా అనేది వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు సైతం ఉద్యోగుల శ్రేయస్సు కోరే విధంగా ఉంటాయి. కాబట్టే, ఫ్రెషర్లు ఎక్కువ ప్యాకేజీలు తీసుకొని ఆన్బోర్డింగ్ కోసం ఎదురు చూడకుండా.. కంపెనీ ఆఫర్ చేసిన జీతానికి కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రెషర్స్ వేతనాల తగ్గింపు ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత రూ.6.5 లక్షల ప్యాకేజీని కాస్త రూ.3.5లక్షలకు కుదించింది. దీనిపై మేం ఇచ్చే ఆఫర్కు ఒప్పుకోవాలని ఫ్రెషర్స్పై ఒత్తిడి తేవడం లేదు. తక్కువ ఆఫర్తో ఆన్బోర్డ్లోకి బోర్డులోకి వెళ్లాలనుకుంటున్నారా? అని నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల అవసరాల్ని గమనిస్తున్నాం మా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగానే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తున్నాం. ఇది మా నియామక ప్రణాళికలకు కారణమవుతుంది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో విధులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటులో పొందిన ఫ్రెషర్లకు పంపిన ఇమెయిల్లో కంపెనీ పేర్కొంది. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం నామమాత్ర వెనకడుగుతో రూ. 3,075 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధితో రూ. 23,190 కోట్లను అధిగమించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం విప్రో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 14 శాతం పైగా ఎగసి రూ. 90,488 కోట్లను తాకింది. క్యూ4లో 1,823 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,56,921కు పరిమితమైంది. అంచనాలు వీక్..: 2023–24 తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఐఎస్ఆర్ఈ సహా.. ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి ఆదాయం త్రైమాసికవారీగా 3–1% మధ్య క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 275.3–281.1 కోట్ల డాలర్ల మధ్య ఆదాయం సాధించవచ్చని గైడెన్స్ ప్రకటించింది. బీఎఫ్ఎస్ఐ, రిటైల్లో మందగమన పరిస్థితులున్నా, డీల్ పైప్లైన్ పటిష్టంగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. షేర్ల బైబ్యాక్కు సై: సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 445 ధర మించకుండా 26,96,62,921 షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇవి కంపెనీ ఈక్విటీలో 4.91 శాతం వాటాకు సమానంకాగా..ఇందుకు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
విప్రో కన్జూమర్ చేతికి బ్రాహ్మిన్స్
న్యూఢిల్లీ: రెడీ టు కుక్ బ్రాండ్, కేరళ సంస్థ బ్రాహ్మిన్స్ను కొనుగోలు చేసినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ తాజాగా పేర్కొంది. సంప్రదాయ వెజిటేరియన్, స్పైస్ మిక్స్ సంస్థ బ్రాహ్మిన్స్ కొనుగోలు విలువను వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం రెడీ టు కుక్ ఫుడ్ తయారీ బ్రాండు నిరపరను సొంతం చేసుకోవడం ద్వారా అజీం ప్రేమ్జీ కంపెనీ విప్రో ఎంటర్ప్రైజెస్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజా కొనుగోలుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో మరింత విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు విప్రో కన్జూమర్ పేర్కొంది. వెరసి దక్షిణాది మార్కెట్ లక్ష్యంగా సొంత స్నాక్స్ బ్రాండును ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. వేగవంత వృద్ధిలో ఉన్న రెడీ టు ఈట్ విభాగంలో సొంత బ్రాండును విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. -
ఆన్బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్కు విప్రో మరో షాక్?
సాక్షి,ముంబై: ఐటీ కంపెనీల్లో ఆన్బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్కు విప్రో మరో షాక్ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 15 నెలలకు పైగా ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు మరో పరీక్ష విధించనుంది. ఇలాంటి శిక్షణను ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ, మరోసారి ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (పీఆర్పీ) శిక్షణ అంటే.. ఈ సాకుతో కొంతమంది ఫ్రెషర్స్ను తొలగించేందుకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వేతనాల్లో సగం కోతం విధించిన తరువాత కూడా ఆన్బోర్డింగ్ కష్టాలకు తెరపడటం లేదు. (ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెషర్ల వేతనాలను రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరీక్షలో ఫ్రెషర్స్ కనీసం 60 శాతం ఓవరాల్ స్కోర్తో, పీఆర్పీ శిక్షణను ఉద్యోగులు క్లియర్ చేయకపోతే, వారు వెంటనే తొలగించబడతారని వారికి పంపిన సూచనలలో కంపెనీ పేర్కొన్నట్టు సమాచారం. అయితే దీనిపై విప్రో అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఐటీ మేజర్ తీసుకుంటున్న చర్యలు అనైతికం, అన్యాయమని, ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. కంపెనీ పాలసీలో ఆకస్మిక మార్పులు ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని వ్యాఖ్యానించారు. (ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!) -
విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 10,000 కోట్ల మైలురాయిని దాటినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలు, బ్రాండ్లు, కేటగిరీలవారీగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 8,634 కోట్లుగా నమోదైంది. (ఈ–కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దేశీయంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్)వ్యాపార విభాగం 17 శాతం పెరిగినట్లు తెలిపింది. సబ్బుల బ్రాండ్ సంతూర్ ఇప్పుడు నిర్దిష్ట విభాగంలో రూ. 2,650 కోట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరిందని పేర్కొంది. అటు వియత్నాం మార్కెట్లో రెండంకెల స్థాయి వృద్ధితో 10 కోట్ల డాలర్ల ఆదాయం మార్కును దాటినట్లు .. దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్యం, ఫిలిప్పీన్స్ తదితర మార్కెట్లలోను రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. 2003లో రూ. 300 కోట్ల ఆదాయం ఉండగా .. గత రెండు దశాబ్దాల్లో 33 రెట్లు పెంచుకుని నేడు అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా ఎదిగామని సంస్థ సీఈవో వినీత్ అగ్రవాల్ తెలిపారు. 1945లో వనస్పతి సంస్థగా ప్రారంభమైన విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్కు ప్రస్తుతం 60 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 18 ఫ్యాక్టరీలు, 10,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఆదాయంలో 51 శాతం వాటా అంతర్జాతీయ వ్యాపారం నుంచి ఉంటోంది. -
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ .. విప్రో నుంచి 120 మంది
గత కొన్ని రోజులుగా మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు తమ కంపెనీలలోని ఉద్యోగులను వివిధ రకాల కారణాల వల్ల తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విప్రో కంపెనీ రీలైన్మెంట్ ఆఫ్ బిజినెస్ (Realignment of Business Needs) కారణంగా USలోని ఫ్లోరిడాలో 120 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ, ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీకి అందించిన వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) నోటీసులో తొలగింపులను గురించి వివరించినట్లు తెలిసింది. టంపాలోని ఒక ప్రదేశంలో మాత్రమే ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు సమాచారం. కంపెనీ తొలగించిన 120 మంది ఉద్యోగులలో వందమందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లు ఉన్నారు. మిగిలిన వారిలో టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్లు ఉన్నారు. అయితే ఇతర విప్రో ఉద్యోగులందరూ అలాగే ఉద్యోగాలలో కొనసాగుతున్నారని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్విక్లో అమెరికా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. (ఇదీ చదవండి: Top Car News of The Week: మారుతి బ్రెజ్జా సిఎన్జి నుంచి టయోటా హైలెక్స్ వరకు..) విప్రో కంపెనీ యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో దాదాపు 20,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ఇటీవలే ఇండియాలో సరైన పనితీరుని కనపరచని దాదాపు 400 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగం పొందేవారు సగం జీతానికే పనిచేయాలని చెబుతున్నట్లు సమాచారం. -
నాలుగు విభాగాలపై విప్రో ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: క్లయింట్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మెరుగైన సర్వీసులు అందించడంపై, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై విప్రో మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నాలుగు వ్యూహాత్మక వ్యాపార విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సాంకేతికత .. వ్యాపార పరివర్తన, ఇంజినీరింగ్, కన్సల్టింగ్ వీటిలో ఉంటాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, పెట్టుబడుల విషయంలో సమర్ధమంతంగా వ్యవహరించేందుకు ఇవి తోడ్పడగలవని విప్రో ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. క్లౌడ్ సామరధ్యలన్నింటినీ విప్రో ఫుల్స్ట్రైడ్ క్లౌడ్ విభాగం కిందికి తేనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇన్ఫ్రా సర్వీసుల విభాగానికి హెడ్గా ఉన్న జో డెబెకర్ దీనికి సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం విప్రో ఐకోర్ వ్యాపార హెడ్గా ఉన్న నాగేంద్ర బండారు .. విప్రో ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్కు గ్లోబల్ హెడ్గా ఉంటారు. క్యాప్కో, డిజైనిట్ మొదలైనవన్నీ విప్రో కన్సల్టింగ్ విభాగం కింద ఉంటాయి. -
విప్రోకు ఎదురుదెబ్బ: ఫ్రెషర్ల జీతం కోత అన్యాయమంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది. కార్మిక శాఖకు ఫిర్యాదు అంతేకాదు ఈమేరకు ప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. విప్రో ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల దోపిడీకి చఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందనినైట్స్ ఫిర్యాదులో పేర్కొంది. మరి తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా విప్రో రూ. 6.5 లక్షల (LPA) ఆఫర్తో ఫ్రెషర్లకు ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్ లాంటి సాకులతో వార్షిక వేతనం సగానికి కోత విధించేందుకు నిర్ణయించింది. 3.5 లక్షలకు పనిచేస్తారా అని ఈ మెయిల్ద్వారా వారిని కోరడం వివాదానికి తీసింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయితే దీనిపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ స్పందించింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదంటూ తప్పుబట్టింది. ఆన్బోర్డ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారానికి యూనియన్తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. -
సగం జీతానికి పనిచేస్తారా.. ఫ్రెషర్స్కు విప్రో ఝలక్!
కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థ విప్రో ఝలక్ ఇచ్చింది. మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సగానికి పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్లను అంగీకరించాలని కోరింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్లను టేకప్ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్ ద్వారా అడిగింది. (ఇదీ చదవండి: ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు) పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్లో వివరించింది. 2023 బ్యాచ్లోని వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ అభ్యర్థులకు కంపెనీ ఈ ఆఫర్ చేసింది.ఇది కూడా ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను బోర్డింగ్లోకి తీసుకునే కసరత్తు మార్చి నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కాలం తర్వాత అసెస్మెంట్లలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్లను తొలగించిన నేపథ్యంలో ఈ సగం ఆఫర్ విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: Layoffs: ట్విటర్లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!) -
విప్రో ఉద్యోగులకు గుడ్న్యూస్: ఫిబ్రవరి జీతాలతో పండగే!
సాక్షి,ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా గ్లోబల్గా దిగ్గజ కంపెనీల్లో సైతం ఉద్యోగాల కోత ప్రకంపనలు పుట్టిస్తున్న తరుణంలో విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వేరియబుల్ పే అందించనుంది. థర్డ్ క్వార్టర్లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేయనున్నామని అంతర్గత ఇమెయిల్లో ఉద్యోగులకు తెలిపింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయనుంది. విప్రో 2022-23 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో A నుండి B3 బ్యాండ్లలోని ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్ను విడుదల చేయనున్నట్లు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారం అందించారు. A నుంచి B3 లెవెల్ ఉద్యోగులు, అన్ని సపోర్ట్ ఫంక్షన్స్లో పనిచేసే సిబ్బందికి ఐటీ కంపెనీ పెర్ఫామెన్స్ పనితీరు ఆధారంగా 87శాతం వేరియబుల్ పే చెల్లించనుండగా.. మేనేజర్ స్థాయి, అంతకుమించి లెవెల్ ఉద్యోగులకు.. బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారిత వేరియబుల్ పే చెల్లించనుంది.అందరు ఉద్యోగులు అంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉంటారు. కాగా రెగ్యులేటరీ ఫైలింగ్ల ప్రకారం,ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఏకీకృత ఆదాయం 14.3 శాతం పెరిగి రూ.23,229 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 16.3 శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే గత త్రైమాసికంలో విప్రో 100 శాతం వేరియబుల్ పే ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్!
సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఇంటర్నల్ పరీక్షలో ఫెయిల్ అయ్యారంటూ దాదాపు 600మందిని ఇన్ఫోసిస్ తొలగించింది. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇటీవల టెక్ దిగ్గజం విప్రో వందలమంది ఫ్రెషర్ల తొలగింపు పతరువాత ఇన్ఫోసిస్లో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు) కాగా క్యూ3 ఫలితాల్లో ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి 13.4శాతం పెరిగి రూ. 6,586 కోట్లకు పెరిగింది. గత ఏడాది లాభం రూ. 5,809 కోట్లుగా ఉంది. నికర ఉద్యోగుల చేరిక గత ఏడాది త్రైమాసికంలోని పదివేల నుంచి 1,627కి పడిపోయింది. సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో స్వచ్ఛంద అట్రిషన్ 27.1 శాతం, డిసెంబర్ 2021తో ముగిసిన మూడు నెలల్లో 25.5 శాతంగా ఉంది. అంతకుముందు, విప్రో పేలవమైన పనితీరు కారణంగా ఇంటర్నల్ టెస్ట్లో విఫలమవడంతో ఫ్రెషర్లను తొలగించిన సంగతి తెలిసిందే. (ఫిబ్రవరి సేల్స్: మారుతి బంపర్ ఆఫర్) -
వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్ను విధుల నుంచి తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. (ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం) ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్ ప్లేస్లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్, రీట్రైనింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) -
విప్రో లాభం రూ. 3,053 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 2.8 శాతం బలపడి రూ. 3,053 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 23,229 కోట్లకు చేరింది. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి ఐటీ సర్వీసుల ఆదాయం 11.5–12 శాతం మధ్య పుంజుకోనున్నట్లు తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 15 శాతం, ఆదాయం 3 శాతం వృద్ధి చూపాయి. డీల్స్ రికార్డ్.. ప్రపంచ అనిశ్చితుల్లోనూ క్యూ3లో రికార్డ్ నెలకొల్పుతూ మొత్తం 4.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఇది 26 శాతం వృద్ధికాగా.. వీటిలో బిలియన్ డాలర్ల విలువకు మించిన భారీ ఆర్డర్లను సైతం పొందినట్లు తెలియజేశారు. క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఇదే స్థాయి ఆర్డర్లు పొందే వీలున్నట్లు అంచనా వేశారు. క్లయింట్లతో లోతైన సంబంధాల ద్వారా అత్యధిక స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలుగుతున్నట్లు వివరించారు. ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాలు, వ్యయ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో క్లయింట్లకు అందిస్తున్న సమర్థవంత సేవలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి క్లౌడ్ సర్వీసులు, ఇంజనీరింగ్ సర్వీసులు ఆర్డర్బుక్కు దన్నుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 396 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ►క్యూ2తో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 435 తగ్గి 2,58,744ను తాకింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 1.8 శాతం తగ్గి 21.2 శాతానికి చేరింది. ► ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్లు 1.2 శాతం బలపడి 16.3 శాతానికి చేరాయి. ► ఐటీ సర్వీసుల ఆదాయం 6.2 శాతం వృద్ధితో 280.35 కోట్ల డాలర్లను తాకింది. ► ఐటీ ప్రొడక్టుల ఆదాయం 2.08 కోట్ల డాలర్లు(రూ. 170 కోట్లు)గా నమోదైంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్లో ఫేక్ ‘చాట్జీపీటీ’ యాప్స్ కలకలం -
టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ నాల్గవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించింది. కంపెనీలోని ఉన్నతోద్యోగులకు రికార్డు స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించింది. సీనియర్ల ప్రతిభను, అనుభవాన్ని నిలుపుకునే క్రమంలో ఈచర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను పై స్థాయిలకు ప్రమోట్ చేసింది. ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్లు ఇంతకుముందెపుడూ ఇవ్వలేదని కంపెనీ తెలిపింది. ఇటీవలి కాలంలో కీలక ఉన్నతస్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్న సమయంలో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రతిభావంతులైన లీడర్షిప్ ఉద్యోగుల పైప్లైన్ను బలోపేతం చేయడానికి రికార్డు స్థాయిలో సీనియర్ ప్రమోషన్లను ప్రారంభించింది విప్రో. కంపెనీ 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్విపి) పదవికి ఎలివేట్ చేయగా, 61 మంది ఎగ్జిక్యూటివ్లను వైస్ ప్రెసిడెంట్ (వీపీ)గా ప్రమోట్ చేసింది. ఫలితంగా విప్రోలో ఇప్పుడు దాదాపు 200 మంది వీపీలు, 32 ఎస్వీపీలు సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 23.3శాతం అట్రిషన్ను నమోదు చేసిన కంపెనీ అక్టోబర్-డిసెంబర్ ఫలితాలను ఈ శుక్రవారం ప్రకటించనుంది. కాగా గత ఏడాది, నాలుగు దేశాల్లో వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న కనీసంనలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రో నుంచి నిష్క్రమించారు. బ్రెజిల్లో వ్యాపారాన్ని పర్యవేక్షించిన డగ్లస్ సిల్వా, జపాన్ హెడ్, టోమోకి టేకుచి,ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సారా ఆడమ్-గెడ్జ్; మిడిల్ ఈస్ట్ రీజియన్ బిజినెస్ హెడ్ మొహమ్మద్ అరేఫ్ సంస్థను వీడిని సంగతి తెలిసిందే. -
ఏక ఉద్యోగ వ్రతమే మంచిది
-
రెండ్రోజుల క్రితం విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
-
విప్రో జంక్షన్లో టిప్పర్ బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్: బండరాళ్ల లోడ్తో వెళ్తున్న టిప్పర్ వాహనం ఆదివారం అర్ధరాత్రి ఐటీ కారిడార్లో బీభత్సం సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్లోని విప్రో జంక్షన్లో సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న 3 కార్లను, 3 బైక్లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ టిప్పర్ను ఢీకొని అది ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. బైక్లపై వెళుతున్న ఇద్దరు, టిప్పర్ సూపర్వైజర్ తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఖానామెట్లోని ఓ సైట్లో బండరాళ్లు లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని క్రషర్లో అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్కు చేరుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో అప్పటికే కార్లు బైక్లు ఆగి ఉన్నాయి. టిప్పర్ అతివేగంతో దూసుకువచ్చి మొదట స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు ముందున్న ఐ20 కారు, ఇండిగో కార్లను బలంగా తాకడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కార్లను ఢీకొట్టిన టిప్పర్ ఎడమ వైపు దూసుకెళ్లి మూడు బైక్లను ఢీకొంది. అంతటితో ఆగకుండా గౌలిదొడ్డి వైపు నుంచి వస్తున్న మరో టిప్పర్ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ హుస్సేన్ (30) తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు.. యమహా బైక్పై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడి కాలు విరిగింది. వెనకాల ఉన్న యువకుడు సురక్షితంగా బయపడ్డాడు. మరో బైక్పై ఉన్న సుబెందుదాస్ ఎడమ కాలు విరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్కు తరలించారు. టిప్పర్లో ఉన్న ఖలీం అందులోనే ఇరుక్కుపోవడంతో కాలు విరిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లు సురక్షితం.. నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి రెండు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐ 20 కారులో గౌలిదొడ్డి వైపు వస్తున్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, కుటుంబ సభ్యులు సాహితి, సుదీప్తిలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ధ్వంసమైన ఇండిగో కారు క్యాబ్ డైవర్కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన టిప్పర్ డ్రైవర్.. టిప్పర్ బీభత్సానికి కారణమైన డ్రైవర్ కాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ చెందిన ఇతను మూడు రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్రైవర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఖానామెట్ నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే దారి తెలియకపోవడంతో అతని వెంట సూపర్వైజర్ ఖలీం వచ్చారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటడం, విప్రో జంక్షన్లో ఏటవాలు ఎక్కువగా ఉన్న విషయంపై అవగాహన లేకపోవడంతో టిప్పర్ అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ గోనె సురేష్లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ గోనె సురేష్ స్పష్టం చేశారు. -
అధిక వేగంతో టిప్పర్ బీభత్సం
-
కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న విప్రో!
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల కంపెనీ నిరాపరాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలో అత్యధికంగా విక్రయమవుతున్న సంప్రదాయ ఆహార బ్రాండ్ల సంస్థ నిరాపరాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డాబర్, ఇమామీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ సరసన చేరనున్నట్లు పేర్కొంది. 1976లో ప్రారంభమైన నిరాపరా మిశ్రమ మసాలా దినుసులకు పేరొందింది. ఈ బ్రాండు పలు రకాల మిశ్రమ దిసుసులతోపాటు.. విభిన్న అప్పడాల తయారీలో వినియోగించే బియ్యపు పిండినీ రూపొందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్ కేరళలో 63 శాతం, గల్ఫ్ దేశాల నుంచి 29 శాతం నమోదవుతున్నట్లు విప్రో ఎంటర్ప్రైజెస్ ఈడీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 390 వద్ద ముగిసింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్పై అమెరికన్ల ఆగ్రహం!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్ని నియమించుకునే విషయంలో వివక్ష చూపుతుందంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. గతవారం (డిసెంబర్7)న టీసీఎస్ మాజీ ఉద్యోగి కాట్జ్ అమెరికా న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అమెరికాలో ఉద్యోగుల నియామకంలో స్థానికులపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావాలో పేర్కొన్నారు. స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సౌత్ ఏషియన్, భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటుందని, స్థానికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీఎస్ కావాలనే ఉద్దేశపూర్వకంగా యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 70శాతం దక్షిణాసియా ఉద్యోగులను (ప్రధానంగా భారత్ నుండి) నియమించారనేది ప్రధాన ఆరోపణ భారతీయులేనా పనిమంతులు ఆఫీస్ వర్క్ విషయంలో టీసీఎస్ భారతీయులు, అమెరికన్లు మధ్య వ్యత్యాసం చూస్తుందని కోర్టులో వాదించారు. యూఎస్కి చెందిన ఐటీ పరిశ్రమలో కేవలం 12శాతం నుండి 13 శాతం మంది మాత్రమే దక్షిణాసియాకు చెందినవారు ఉంటే.. అమెరికాకు చెందిన టీసీఎస్ వర్క్ఫోర్స్లో దాదాపు 70శాతం దక్షిణాసియాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. వర్క్ వీసాల (హెచ్1 బీ) ద్వారా యూఎస్కు వచ్చిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని కోర్టులో దావా వేసిన టీసీఎస్ మాజీ ఉద్యోగి కాట్జ్ వెల్లడించారు. 9 ఏళ్ల పాటు ఉద్యోగం 9 సంవత్సరాలకు పైగా టీసీఎస్లో పనిచేసిన కాట్జ్, వివిధ ప్రాజెక్టులకు ఉద్యోగులను కేటాయించే హెచ్ఆర్ విభాగం నుంచి సరైన సహాయం లేకపోవడం,సంస్థలో సరైన అవకాశాలు లభించకపోవడంతో తనను తొలగించారని పేర్కొన్నారు. కాబట్టి టీసీఎస్ చట్టవిరుద్ధమైన నియామకాలు చేపట్టకుండా నిరోధించాలని, వివక్ష లేని నియామక పద్ధతులను అవలంబించాలని ఫిర్యాదుదారు అభ్యర్థించారు. జాబ్ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం కావాలని కోర్టును కోరాడు. టీసీఎస్కు అనుకూలంగా గతంలో టీసీఎస్ ఇదే తరహా వివాదంలో చిక్కుకుంది. 2019లో ముగ్గురు మాజీ ఉద్యోగులు దాఖలు చేసిన ఇదే విధమైన వ్యాజ్యంపై కాలిఫోర్నియా జిల్లా కోర్టు టీసీఎస్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారతీయ ఐటి సంస్థ యుఎస్ కార్యాలయాల్లో అమెరికన్లకు బదులుగా భారతీయులతో పనిచేయడానికి ఇష్టపడుతుందన్న వాదనలను జ్యూరీ తిరస్కరించింది. టీసీఎస్తో పాటు ఇతర టెక్ కంపెనీలు సైతం టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్,హెచ్సిఎల్టెక్, విప్రో వంటి ఇతర భారత్కు చెందిన ఐటీ కంపెనీలు అమెరికాలో వివక్షతతో కూడిన నియామకాలు చేపడుతున్నాయంటూ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. -
మూన్లైటింగ్పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్లైటింగ్’ అంటారు. అయితే టెక్ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ మూన్లైటింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్లైటింగ్పై స్పందించారు. తాను ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్లైటింగ్కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్గా పనిచేస్తూనే ఏఐఆర్లో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ అనే షోస్గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో చెప్పారు. ఆ వీడియోని బార్ అండ్ బెంచ్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్ చేయడానికి మూన్లైటింగ్ అంటారు?. అయితే కాన్ఫరెన్స్లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్లైటింగ్) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్లైటింగ్ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్ వింటున్నట్లు వెల్లడించారు. మూన్లైటింగ్ అంటే మోసం చేయడమే ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్లైటింగ్ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ ట్విటర్లో మూన్లైటింగ్ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్లైటింగ్ చర్చంశనీయంగా మారింది. Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's - Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud Video Credit - BCI pic.twitter.com/EdvRqntXST — Bar & Bench (@barandbench) December 4, 2022 చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ -
విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ
బెంగళూరు: పారిశ్రామిక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఉత్పాదనల స్టార్టప్ సంస్థ లైన్క్రాఫ్ట్డాట్ఏఐ కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగ సంస్థ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ వెల్లడించింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడించలేదు. తమ డిజిటల్ సర్వీసులను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ సీఈవో ప్రతీక్ కుమార్ తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆటోమేషన్లో అపార అనుభవం గల లైన్క్రాఫ్ట్.. తయారీ సంస్థలు నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కావల్సిన తోడ్పాటును అందిస్తుంది. -
‘మూన్లైటింగ్’ దుమారం : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్
ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిపై ఆయా టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు పనిచేస్తున్నారంటూ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లు ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. కానీ టెక్ మహీంద్రా మాత్రం అందుకు విభిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగులకు మూన్లైటింగ్ పాల్పడటాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా మూన్లైటింగ్పై మరో కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలలో ఉద్యోగుల కోసం తన మూన్లైటింగ్ పాలసీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. వర్క్కు ఆటంకం కలగనంత వరకు గిగ్ వర్క్స్కు అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారాంతంలో లేదా వారంలో రెండు గంటలు వంటి స్వల్ప కాలానికి మాత్రమే పనిచేసేందుకు అంగీకరించనున్నట్లు సమాచారం. చదవండి👉 ‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’ టెక్ మహీంద్రా మూన్ లైటింగ్ పాలసీలో ఆఫీస్కు వర్క్తో ఎలాంటి పోటీ ఉండకూడదు. మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లేదా కస్టమర్ కాంట్రాక్ట్ కు కట్టుబడి ఉండాలి. కంపెనీ నుంచి రాతపూర్వక అనుమతి అవసరం’ వంటి సంస్థ నిర్ధిష్ట సూత్రాలను కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సోయిన్ పేర్కొన్నారు. అట్రిషన్ రేటు తగ్గుతుంది ఈ ఏడాది ఆగస్టులో స్విగ్గీ తన ఉద్యోగులను పని గంటల తర్వాత గిగ్ వర్క్స్ చేసుకోవచ్చంటూ మూన్లైటింగ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సైతం అంతకు ముందు మూన్లైటింగ్ చేసే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అది కాస్త వివాదం కావడంతో గిగ్ ఉద్యోగాలు చేసేందుకు అనుమతించింది. అయితే టెక్ సంస్థలు తీసుకునే ఈ నిర్ణయం వల్ల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూన్లైటింగ్కు పాల్పడితే శాలరీల కోసం వేరే సంస్థలోకి వెళ్లే ఆలోచనల్ని విరమిస్తారని భావిస్తున్నారు. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
కంపెనీలను మించిన వెంకన్న సంపద
న్యూఢిల్లీ: వడ్డీ కాసులవాడైన తిరుపతి గోవిందుడి సంపద .. ఇంతింతై .. అన్నట్లుగా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కు నెట్టేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐవోసీ మొదలైనవి కూడా వెంకన్న ముందు దిగదుడుపే. టీటీడీ గణాంకాల ప్రకారం ఆయన సంపద విలువ రూ. 2.5 లక్షల కోట్లు. వీటిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 16,000 కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 960 ప్రాపర్టీలు ఉన్నాయి. తిరుమల బాలాజీ సంపద నికర విలువ .. పలు దేశీ బ్లూ చిప్ కంపెనీల వేల్యుయేషన్ (ప్రస్తుత ట్రేడింగ్ ధరల ప్రకారం) కన్నా అధికం. స్టాక్ ఎక్ఛేంజీలో శుక్రవారం నాటి ముగింపు డేటా బట్టి చూస్తే విప్రో మార్కెట్ క్యాప్ రూ. 2.14 లక్షల కోట్లు కాగా అల్ట్రాటెక్ సిమెంట్ది రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది. స్విస్ బహుళజాతి దిగ్గజం నెస్లే భారత విభాగం మార్కెట్ విలువ రూ. 1.96 లక్షల కోట్లు. అటు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) విలువ కూడా బాలాజీ ట్రస్టు సంపద కన్నా తక్కువే. రెండు డజన్ల కంపెనీలకు మాత్రమే ఇంతకు మించిన మార్కెట్ వేల్యుయేషన్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.53 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ. 11.76 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 8.34 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 4.38 లక్షల కోట్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,100 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లపై రూ. 668 కోట్లు, హుండీ ఆదాయం రూ. 1,000 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. -
‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’
ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో శుభవార్త చెప్పింది. మూన్లైటింగ్ పాల్పడిన ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించిందో విధులు నిర్వహించే సిబ్బందికి చెల్లించే ప్రోత్సాహకాల విషయంలో అంతే ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విప్రోలో పనిచేస్తున్న బ్యాండ్స్ A TO B3 కేటగిరిలోని 85 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం ప్రోత్సాహకాల్ని ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. ఏప్రిల్ -జూన్ (క్యూ2)వరకు ఉద్యోగులకు అందించే ఈ బెన్ఫిట్స్ నవంబర్ పేరోల్ లో జత చేస్తామని పేర్కొంది. ఫ్రెషర్స్ నుంచి టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ పేకు అర్హులని తెలిపింది. మిగిలిన ఉద్యోగులకు మాత్రం సంస్థ నిర్ధేశించిన టార్గెట్స్ కంప్లీట్ పూర్తి చేసిన విధంగా చెల్లింపులు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్స్లో వెల్లడించింది. కంపెనీ పాలసీ ప్రకారం..ఉద్యోగి పనితీరుపై వేరియబుల్ పే 93.5% వస్తుంది. అయినప్పటికీ, మన కార్యకలాపాల్ని మెరుగుపరచడానికి, మనం సాధించిన పురోగతిని ప్రతిబింబించేందుకు ఇదొక మంచి సమయం . అందుకే..ఉద్యోగులకు 1.07శాతం అదనంగా వేరియబుల్ పే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని విప్రో ఆ మెయిల్స్లో హైలెట్ చేసింది. వేరియబుల్ పే చెల్లింపు ఎప్పుడంటే విప్రో తన ఉద్యోగులు నవంబర్ పేరోల్లో వేరియబుల్ పేను జతచేస్తామని తెలిపింది. వేరియబుల్ పే ప్రకటించడంతో పాటు అట్రిషన్ రేటును తగ్గించే ప్రయత్నం చేసింది. విప్రో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16వేల మంది ఉద్యోగుల్ని ఇంటర్నల్గా ప్రమోట్ చేసింది. వేరియబుల్ పే అంటే ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించే నెలవారీ జీతాలతో సంబంధం లేకుండా ఈ వేరియబుల్ పేని అందిస్తుంటాయి. లాభాల్ని గడించేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు వారికి సంస్థలు అందించే తాయిలాల్ని వేరియబుల్ పే అని అంటారు. ఉదాహరణకు సంస్థ విధించిన పని గంటల కంటే ఉద్యోగి ఎక్కువ సేపు పనిచేయడం, ప్రొడక్ట్ సేల్స్ను బట్టి కమిషన్, పర్ఫార్మెన్స్ ఆధారంగా బోనస్లు అందిస్తుంటాయి ఆయా కంపెనీలు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది -
గీత దాటితే అంతే, ఉద్యోగులకు భారీ షాక్..మూన్లైటింగ్పై ఐబీఎం హెచ్చరికలు
మూన్లైటింగ్ అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రెండేసి ఉద్యోగాలు చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మూన్లైటింగ్ అంశంపై ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ ఉద్యోగులకు ఇంటర్నల్గా ఓ మెయిల్ పంపారు. ఆ మెయిల్లో..సంస్థ విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించ కూడదు. సరళంగా చెప్పాలంటే మూన్లైటింగ్ అంటే రెండో ఉద్యోగంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు! తమ ఉద్యోగులు కాంపిటీటర్ లేదా ఉపాధి లేదా వ్యాపారాల్లో పాల్గొన్నకూడదు. 7.1,7.2 సంస్థ మార్గదర్శకాలు అవే చెబుతున్నాయి. సంస్థ పనివేళల తర్వాత ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం అయినప్పటికీ.. ఐబీఎంకు అవాంతరం కలిగించేలా కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. ‘ఐబీఎంలో మా వైఖరి స్పష్టంగా ఉంటుంది. మేం ప్రతి ఉద్యోగి ప్రొడక్టివితో పనిచేసేలా ప్రోత్సహిస్తాం. కళలు, నృత్యం, సంగీతం వంటి కల్చరల్ యాక్టివిటీస్లో వారిని ప్రోత్సహిస్తాం. కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ఐబీఎం ప్రయోజనాల్ని పణంగా పెట్టి మూన్లైటింగ్కు పాల్పడితే సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించినట్లే' అని మెయిల్లో పేర్కొన్నారు. ఐబీఎంలో పనిచేస్తున్న ఉద్యోగి ఖాళీ సమయాల్లో వ్యాపారం చేసేందుకునేందుకు అనమతిస్తే..ఆఫీస్లో వర్క్ ప్రొడక్టివిటీ దెబ్బ తిని విధులకు ఆటంకం కలుగుతుంది. ప్రాజెక్టులు ఇచ్చే క్లయింట్లు వారి డేటా, ఇతర ముఖ్య సమాచారం భద్రతగా ఉంచడం సంస్థ విధి. అందుకే మూన్ లైటింగ్ వంటి అంశాల్లో ఐబీఎం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ తన నోట్లో పునరుద్ఘాటించారు. చదవండి👉 టెక్ కంపెనీల్లో.. మూన్లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ.. -
ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి. ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి. ఇలా ఆఫర్ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా ‘మీరు మీ ్ర΄÷ఫైల్కు సరిపడే సర్టిఫికేషన్స్ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్ డ్రైవ్లో తమ అకడమిక్ ప్రతిభను, మార్కులను, స్కిల్స్ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ► ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఇప్పటికే ఫేస్బుక్ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రతిపాదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ► దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ► దేశీయంగానూ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. n గూగుల్ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది. మాంద్యం సంకేతాలే కారణమా! ► ఐటీలో ఆన్బోర్డింగ్ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలా΄ాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్ బోర్డింగ్లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్ బోర్డింగ్లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు. చదవండి: ‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్కి నవ్వకుండా ఉండలేరు! -
‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్జీ సంచలన వ్యాఖ్యలు
మూన్లైటింగ్కు పాల్పడుతున్నారనే కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో తమ సంస్థకు చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటీవ్ను ఫైర్ చేసినట్లు విప్రో ఛైర్మన్ రషీద్ ప్రేమ్జీ బహిర్ఘతం చేశారు. బెంగళూరు కేంద్రంగా జరిగిన నాస్కామ్ ప్రొడక్ట్ కన్క్లేవ్ కార్యక్రమంలో రషీద్ ప్రేమ్జీ మాట్లాడారు. విప్రోలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టాప్ - 20 ఎగ్జిక్యూటీవ్లలో ఓ ఉద్యోగి సంస్థ మోరల్స్ను ఉల్లంఘించారు. సంస్థకు అతని అవసరం ఎంటో బాగా తెలుసు. కానీ కొన్నిసమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేం (రషీద్ ప్రేమ్జీ) అదే చేశాం. కేవలం పదే పది నిమిషాల్లో అతన్ని విధుల నుంచి ఫైర్ చేసినట్లు చెప్పారు. సదరు సీనియర్ ఉద్యోగి మూన్లైటింగ్కు పాల్పడ్డారా? లేదంటే ఇంకేదైనా కారణంతో సంస్థ నుంచి బయటకు పంపారనే విషయంపై విప్రో ఛైర్మన్ వెల్లడించలేదు. అయితే విప్రోకు మోరల్స్ ఉన్నాయి. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించినా, లేదంటే వేధింపులకు పాల్పడితే ఎవరి ఉద్యోగం ఉండదు. అంతెందుకు నేను ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా విప్రోలో నా ఉద్యోగం కూడా ఉండదని తెలిపారు. ఉద్యోగుల తొలగింపు సెప్టెంబర్ 21 న, ప్రేమ్జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. విప్రోలో మూన్లైటింగ్కు పాల్పడిన వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తున్న మొత్తం 300 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. "వాస్తవం ఏంటంటే ఈ రోజు విప్రో కోసం పనిచేసేందుకు చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఆ ఉద్యోగులే కాంపిటీటర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో 300మందిని గుర్తించి ఇంటికి పంపించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి👉 మూన్లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, ముంబై: ప్రపంచ మాంద్యం భయాలు, మూన్లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టు ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13 శాతం జీతాల పెంపును అందించినట్టు ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులు 20-25శాతం ఇంక్రిమెంట్లు పొందినట్టు తెలిపింది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రో,తోపాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10శాతం వేతనాలు పెంపును దిశలో ఉండటం విశేషం. ఇంక్రిమెంట్లు ఉద్యోగి గ్రేడ్పై ఆధారపడి ఉంటాయయనీ, సీనియర్ మేనేజ్మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో, ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించ డానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్తోపాటు, టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10 శాతం వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసంనుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది. కాగా కరోనా సంక్షోభకాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో రెండు పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ, అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది. -
మూన్లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’
టెక్నాలజీ రంగంలో మూన్లైటింగ్ దుమారం కొనసాగుతుంది. ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో దేశీయ టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో టెక్ సంస్థ టీసీఎస్ స్పందించింది. మూన్లైటింగ్ అంశంలో ఆయా సంస్థలు ఉద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ సంస్థ ఉన్నత స్థాయి అధికారులు కోరుతున్నారు. ఇటీవల బెంగళూరు కేంద్రంగా ఓ ఐటీ ఉద్యోగికి 7 పీఎఫ్ అకౌంట్లు ఉన్నట్లు తేలడంతో ఈ మూన్ లైటింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో టెక్ కంపెనీలు ఒకటికి మించి ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై వేటు (విప్రో 300మంది ఉద్యోగుల్ని తొలగించింది) వేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి శుభం కార్డు పలుకుతున్నాయి. ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. అయితే ఉద్యోగులు మాత్రం ఆఫీస్కు వచ్చేది లేదని అంటున్నారు. కాదు కూడదు అంటే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించే సంస్థల్లో చేరుతామని తెగేసి చెబుతున్నారు. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! ఈ తరుణంలో మూన్లైటింగ్కు పాల్పడ్డ ఉద్యోగులపై సంస్థలు తీసుకుంటున్న చర్యల్ని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం ఖండించారు. మూన్లైటింగ్కు వ్యతిరేకంగా తీసుకునే చర్యలు ఉద్యోగి కెరియర్ను నాశనం చేస్తుంది. సమస్యను పరిష్కరించేటప్పుడు సంస్థలు ఉద్యోగుల పట్ల సానుభూతి చూపడం చాలా అవసరమని తెలిపారు. మూన్లైటింగ్కు పాల్పడినట్లు ఆధారాలతో బయటపడితే సంస్థలు ఉద్యోగులపై కంపెనీలు చర్యలు తీసుకోకుండా ఉండలేవు. ఎందుకంటే ఇది అగ్రిమెంట్లో ఓ భాగం. కాబట్టే రెండేసి ఉద్యోగాలు చేయడాన్ని మానుకోవాలని అన్నారు. ‘‘ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే దాని పర్యవసానంగా వారి కెరీర్ నాశనం అవుతుంది. మరో సంస్థలో ఉద్యోగం సంపాదిస్తే.. బ్యాంగ్రౌండ్ వెరిఫికేషన్లో ఉద్యోగి గతంలో మూన్లైటింగ్ పాల్పడినట్లు తేలుతుంది. అందుకే ఉద్యోగుల పట్ల మనం కొంత సానుభూతి చూపాలి’’ అని చెప్పారు. సంస్థలు ఒక ఉద్యోగిని కుటుంబ సభ్యుడిగా భావిస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ కుటుంబ సభ్యులు తప్పు దారి పట్టకుండా నిరోధించడంపై దృష్టి సారిస్తాయని ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం అన్నారు. చదవండి👉 మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! -
వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
దేశంలో కరోనా మహ్మమారి కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం (Work from Home) వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ని పక్కన పెట్టి కార్యాలయాలకు తిరిగి రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులకు మెయిల్స్ పంపాయి. అయితే యాజమాన్యాలు పంపిన మెయిల్స్కు ఉద్యోగులు ఉహించని విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ (CIEL HR) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్కు రావాలని ఒత్తిడి చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కనపెట్టి .. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్న ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారట. కాగా, వీరిలో ఎక్కువ శాతం వర్కింగ్ మదర్స్ ఉన్నారు. ఇటీవల మూన్లైటింగ్ తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. దీంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని సంస్థలు పట్టుబడుతున్నాయి.హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఐటి సంస్థలు సైతం వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!
300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విప్రో మూన్లైటింగ్కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మూన్లైటింగ్ అనైతికమని, దీన్ని ఆమోదించబోమంటూ స్పష్టం చేసిన అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ పేర్కొన్న టీసీఎస్. ఇలా దిగ్గజ ఐటీ కంపెనీలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా.. మరో వైపు మూన్లైటింగ్ పాల్పుడుతున్న ఉద్యోగుల్ని సంస్థలు విధుల నుంచి తొలగిస్తున్నాయి. నియామకాల్ని నిలిపివేసి.. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఈ అంశం ఉద్యోగులకు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధుల్ని కలవరానికి గురి చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు జల్లెడ పడుతున్నాయి. మూన్లైటింగ్కు పాల్పడిన ఉద్యోగులను, తప్పుడు పత్రాలతో చేరిన సిబ్బందిని ఏరివేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్, ప్రావిడెంట్ ఫండ్ స్టేట్మెంట్లను ఉద్యోగుల సమక్షంలో, లైవ్లో తనిఖీ చేస్తున్నాయి. స్నేహితులు, సీనియర్ల సహకారంతో గతంలో ఇంటర్వ్యూలు గట్టెక్కినవారు.. ఈ ఇంటర్యూల్లో నోరెళ్లబెడుతున్నారట. కొందరు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నట్టు బయటపడింది. బెంచ్ మీద ఉన్నవారిని క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తేనే వేతనం. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. నియామకాలు చేపట్టవద్దని.. మూడు నెలల నుంచే జల్లెడ పట్టే కార్యక్రమాన్ని కంపెనీలు ప్రాధాన్యతగా చేపట్టాయి. తప్పుడు అనుభవం, వేతన ధ్రువపత్రాలతో వందలాది మంది చేరినట్టు తేలిందని పరిశ్రమ వర్గాల సమాచారం. విధుల్లో మరొకరి సాయం తీసుకున్నట్టు కొందరిని గుర్తించారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ చేరిక తేదీని ఐటీ సంస్థలు వాయిదా వేస్తున్నాయని స్మార్ట్స్టెప్స్ కో–ఫౌండర్ నానాబాల లావణ్య కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే పరిశ్రమలో తప్పుడు సంకేతం వెళుతుందన్నారు. కాగా.. విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా బయటపడింది.. మహమ్మారి కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానం, మరికొన్ని పూర్తిగా కార్యాలయం నుంచి విధులను అమలులోకి తెచ్చాయి. కొందరు ఆఫీస్కు రాలేమని పట్టుపట్టారు. సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశంపై కంపెనీలు లోతుగా పరిశీలించాయి. వీరు మూన్లైటింగ్కు పాల్పడుతున్నట్టు తేలింది. కంపెనీలు పట్టుపట్టడంతో అధికంగా జీతం ఇచ్చే సంస్థల్లో ఇటువంటివారు చేరారు. ఆఫీస్లో ప్రత్యక్షంగా పని చేయాల్సి రావడంతో తప్పుడు అనుభవంతో చేరినవారు సాంకేతిక పరిజ్ఞానం లేక చేతులెత్తేశారు. మోసపూరితంగా చేరినవారిని రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి. చదవండి👉 డెలివరీ బాయ్లను చులకనగా చూస్తున్నారా! -
మూన్లైటింగ్పై విప్రో సీఈవో కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3శాతం క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15శాతం పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా లాభం సుమారు 4శాతం, ఆదాయం 5శాతం వృద్ధి చెందాయి. (‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్) ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్లైటింగ్పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్ ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. (క్లిక్ : అంచనాలు మించి అదరగొట్టిన హెచ్సీఎల్ టెక్) -
విప్రో లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3% క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15% పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా లాభం సుమారు 4%, ఆదాయం 5% వృద్ధి చెందాయి. ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్లైటింగ్పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు సుమారు 1% లాభంతో రూ. 407.75 వద్ద క్లోజయ్యింది. -
క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్వేర్ సేవల నంబర్వన్ కంపెనీ టీసీఎస్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్(12న), ఇన్ఫోసిస్(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్ కంపెనీ బజాజ్ ఆటో(14న), ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ నెలకు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి. రూపాయి ఎఫెక్ట్ క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్) సరఫరా కోతలతో బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు అంతర్జాతీయంగా చూస్తే యూఎస్ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ గత పాలసీ మినిట్స్ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారం మూడు వారాల డౌన్ట్రెండ్కు చెక్ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి. -
మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!
ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్లో..‘హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించే ఈ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది’ అంతేకాదు ‘మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అవలంభిస్తోంది. అక్టోబర్ 10 నుండి లీడర్షిప్ రోల్స్లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడుసార్లు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసులు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి👉 ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం! ఈ నేపథ్యంలో ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ప్రెసిడెంట్ హర్ప్రీత్ సలూజ స్పందించారు. దేశీయ టెక్ సంస్థ ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్ పంపింది. ‘కంపెనీ నెల క్రితమే మెయిల్ పంపి ఉండాల్సింది. ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది. అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని’ అన్నారు. కొద్ది రోజుల క్రితం టీసీఎస్ గత సెప్టెంబర్లో మరో ఐటీ రంగ సంస్థ టీసీఎస్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని చెప్పింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్ ఆర్ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 300 మందిపై వేటు ఐటీ కంపెనీల్లో మూన్లైటింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో తమ కాంపిటీటర్లతో కలిసి వర్క్ చేయడంపై విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యర్ధి కంపెనీల్లో సైతం పనిచేస్తుండడాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తరుణంలో విప్రో వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి పలికి ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని పిలుపునివ్వడంతో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. చదవండి👉 పదోతరగతి కుర్రాడికి అమెరికా నుండి పిలుపు -
ఫ్రెషర్స్కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్!
ఆఫర్ లెటర్లు అందుకుని ఎప్పుడెప్పుడు ఉద్యోగాలలో చేరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనిపించుకోవాలన్న ఫ్రెషర్లకు భారీ షాక్నే ఇచ్చాయి ఐటీ దిగ్గజాలు. అన్ని రౌండ్లు పూర్తి చేసి ఆఫర్ లెటర్ కూడా అందుకున్న విద్యార్ధుల ఉద్యోగాలలో జాప్యం చేసిన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి. ఫ్రెషర్స్కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. బిజినెస్లైన్ కథనం ప్రకారం.. విద్యార్థులు 3-4 నెలల క్రితమే టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత కంపెనీల నుంచి వారు ఆఫర్ లెటర్లు కూడా అందుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగే ఆన్బోర్డింగ్ ప్రక్రియను ఐటీ సంస్థలు నెలల తరబడి ఆలస్యం చేశాయి. ప్రస్తుతం విద్యార్థులు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ఆయా కంపెనీల నుంచి లెటర్స్ అందుకోవడంతో ఎంపికైన విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో కంపెనీలు వారి అర్హతా నిబంధనలు, కంపెనీ మార్గదర్శకాల అనుసరించి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపినట్లు చెబుతున్నారు. మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటివి నెలల తరబడి ఉన్న స్టార్టప్ల నుంచి దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని ఐటీ కంపెనీలపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. ప్రతికూల వ్యాపార పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేసాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇటీవల నియామకాల ప్రక్రియను నిలిపివేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: అక్టోబర్లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం!
విద్యార్ధులకు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడం అనేది ఓ డ్రీం. ఎందుకంటే ఆ రంగంలో భారీ ఎత్తున శాలరీలు తీసుకోవచ్చని. కానీ అది ఎంత వరకు నిజం? ఇటీవల బెంగళూర్కు చెందిన ‘వీక్డే’ సంస్థ దేశ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్న వారి శాలరీల డేటాను కలెక్ట్ చేసింది. ఆ డేటా ప్రకారం..సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎంత జీతం తీసుకుంటున్నారో..అదే స్థాయిలో ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం కళ్లు చెదిరేలా శాలరీలు తీకుంటున్నారనే ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. 50వేల మంది ఉద్యోగుల నుంచి బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అమిత్ సింగ్ ఐటీ ఉద్యోగ నియామకాల సంస్థ ‘వీక్ డే’ను స్థాపించారు. ఆ సంస్థ కోసం దేశ వ్యాప్తంగా 50 వేల మంది ఐటీ నిపుణుల వద్ద నుంచి సేకరించిన డేటానే అమిత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్తో పాటు ఇతర సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగుల శాలరీ కంటే..షేర్ చాట్, క్రెడ్, మీషో, స్విగ్గీతో పాటు ఇతర స్టార్టప్లలో పనిచేసే ఐటీ ఉద్యోగులు జీతాలు భారీగా ఉన్నట్లు తేలింది. ఎవరికెంత! వీక్డే సర్వే ప్రకారం..4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ( మిడ్ లెవల్) సాఫ్ట్వేర్ ఉద్యోగికి సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ అత్యధికంగా ఏడాదికి రూ.47 లక్షలు చెల్లిస్తుండగా..ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్, ఈ కామర్స్ కంపెనీ మీషో రూ.40 లక్షల నుంచి రూ.39 లక్షల ప్యాకేజీ అందిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లో ఇదే నాలుగేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం రూ.10 లక్షలుగా ఉంది.ఈ టెక్ సంస్థల్లో ఏడాదికి బేసిక్ శాలరీ రూ.7 లక్షలు. ఈ శాలరీ స్టార్టప్లు చెల్లించే వేతనం కంటే చాలా తక్కువగా ఉంది. రికార్డులను తిరిగి రాస్తున్నాయ్ ఏదైనా స్టార్టప్ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్లు అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశీయ కంపెనీలు వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. బైజూస్, ఫ్రెష్ వర్క్స్, క్విక్కర్, షాప్ క్లస్ వంటి యూని కార్న్ సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో రికార్డులను తిరగ రాస్తున్నాయి. జొమాటాలో జీతం 50వేల మంది ఐటీ ఉద్యోగుల డేటాలో.. 4 ఏళ్ల అనుభవం ఉన్న షాప్ క్లస్ ఐటీ ఉద్యోగికి ఏడాదికి రూ.12 లక్షలు, జొమాటోలో రూ.32 లక్షలు, పేటీఎంలో రూ.22 లక్షలు, ఫ్లిప్ కార్ట్లో రూ.36 లక్షలు చెల్లిస్తున్నాయి. ఐటీ కంపెనీస్ వర్సెస్ యూనికార్న్ కంపెనీలు జీతాల సంగతి పక్కన పెడితే యూనికార్న్ కంపెనీలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువ కాలం పని చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టార్టప్లలో ఉద్యోగి సగటున 1.5 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 2.4 సంవత్సరాలు, బైజూస్ కంపెనీలో పని చేసే ఇంజనీర్లు సగటున 1.4 సంవత్సరాలు, క్రెడ్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 1.8 సంవత్సరాలు ఉంటున్నట్లు వీక్ డే రిపోర్ట్లో తేలింది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకే సంస్థలో ఏళ్లకు ఏళ్లు పనిచేయడానికి కారణం.. సంవత్సరానికి సగటున 10 శాతం శాలరీ పెంపుదల ఉంటుందనే భావన ఎక్కువగా ఉందని వీక్ డే జరిపిన అనాలసిస్లో ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగుల రిజైన్కి కారణం ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఐటీ సెక్టార్లో ఉద్యోగులు ఒక సంస్థను వదిలి మరో సంస్థకు వెళ్లుతున్నారు. అందుకు కారణం.. సంస్థ మారిన ప్రతి సారి 50 నుంచి 70శాతం శాలరీ ఎక్కువగా పొందుతున్నారు. అందుకే భారత్లో ఐటీ ఉద్యోగులు తరుచు జాబ్ మారేందుకు దోహదపడుతుంది. -
విప్రో ఉద్యోగులకు దసరా కానుక, 96 శాతం కవర్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు తీపి కబురు అందించింది.విప్రోయిట్ల వార్షిక జీతాల పెంపును తాజాగా ప్రకటించింది. 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్స్ ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల జీతంతో దీన్ని ఉద్యోగులకు అందించనుంది. ఈమేరకు ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. ఈ రౌండ్ వార్షిక ఇంక్రిమెంట్లు లేదా మెరిట్ జీతాల పెంపుదల (MSI) ప్రయోజనాలను దాదాపు 96 శాతం మంది ఉద్యోగులకుఅందించనుంది. (వాళ్లంతా అలా వచ్చినవారేగా! మూన్ లైటింగ్పై సంచలన వ్యాఖ్యలు) గత త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తాము గణనీయమైన విస్తృత కవరేజీని, మార్కెట్తో సమానంగా జీతం పెరుగుదలను అందిస్తున్నామని కంపెనీ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఇమెయిల్ ద్వారా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ జీతం పెరుగుదలకు సంబంధించిన లేఖలను ఆయా ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. అలాగే జీతం పెరుగుదల పనితీరు అర్హత ప్రమాణాల ఆధారంగా 96 శాతం మంది ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. (మూన్లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు) -
వాళ్లంతా అలా వచ్చినవారేగా! మూన్ లైటింగ్పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో మూన్లైటింగ్ సమస్య ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విప్రో 300మంది ఉద్యోగులపై వేటు వేసిన తరువాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్)ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్, ఫ్లిప్కార్ట్, ఫ్రెష్డెస్క్ వంటి అనేక విజయవంతమైన కంపెనీలను స్థాపించిన వారంతా అలా ఉద్యోగాలు చేస్తూనే స్థాపించారని ఆయన పేర్కొన్నారు. (మూన్లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు) మూన్లైటింగ్ అనేది కొత్తగా వచ్చిందని కాదు అనేది ఐటీ కంపెనీల వ్యవస్థాపక చరిత్రను చూస్తే అర్థమవుతందని హర్ప్రీత్ తెలిపారు. ఇన్ఫోసిస్, ఫ్లిప్కార్ట్, జోహో వ్యవస్థాపకులు ఉద్యోగాల్లో ఉండగా అలా పనిచేసినవారే అంటూ సలుజా కమెంట్ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ను స్థాపించినప్పుడు పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్తో కలిసి పనిచేశారనీ, అదేసమయంలో, స్టార్టప్లను పరిశీలిస్తే ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ సచిన్, బిన్నీ బన్సాల్ కూడా...వారు అమెజాన్లో పని చేస్తున్నప్పుడే స్థాపించారని గుర్తు చేశారు. అలాగే గిరీష్ మాతృభూతం జోహో కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడే గత సంవత్సరం నాస్డాక్లో లిస్ట్ అయిన ఫ్రెష్డెస్క్ ను స్థాపించారన్నారు. అంతేకాదు నిజానికి ఇన్ఫోసిస్ స్థాపనకు మూన్లైటింగ్తో దగ్గరి సంబంధాలున్నాయి. కానీ మూన్లైటింగ్ వ్యతిరేకంగా ఉద్యోగులను హెచ్చరిస్తోంద న్నారు. రెండు ఉద్యోగాలు లేవు..నో మూన్లైటింగ్ అంటూ మెయిల్స్ ద్వారా ఇటీవల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను హెచ్చరించడంపై విమర్శించారు. కాగా ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్దాస్ పాయ్ కూడా ఉద్యోగి తమ ఖాళీ సమయంలో చేసే పనులకు, కంపెనీకి సంబంధం ఉండదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: IBM:ముదురుతున్నమూన్లైటింగ్వివాదం,ఐబీఎం కీలక వ్యాఖ్యలు కేంద్రఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు ఇది ఇలా ఉండగా దేశంలోని ఐటీ కంపెనీలు మూన్లైటింగ్పై సీరియస్గా స్పందిస్తుండగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉద్యోగులకు అనుకూలంగా శుక్రవారం ప్రకటన చేయయడం విశేషం. ఉద్యోగులను బెదిరించడం, నియంత్రించడం సరికాదని, వారి కలలను సాకారం చేసుకునేందుకు అనుమతించాలని ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. మూన్లైటింగ్ పై మొట్ట మొదటి సారిగా ఒక కేంద్ర మంత్రి ప్రకటన చేయటం సంచలనంగా మారింది. ఈ తరం యువతీయువకులు సొంత నైపుణ్యాలపై ఎక్కువ డబ్బు ఆర్జించాలని, మరింత వ్యాల్యూ సృష్టించాలని కోరుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులను తగ్గించాలని వారి స్వంత స్టార్టప్లో పని చేయకూడదని చెప్పే సంస్థల ప్రయత్నాలు విఫలమవుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. -
ఐటీ ఉద్యోగులకు వార్నింగ్.. రూటు మార్చిన కంపెనీలు
-
మూన్లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో మూన్లైటింగ్ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఇప్పటికే కొన్ని దిగ్గజ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కోవలో దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో ముందు వరసలో నిలిచింది. తాజాగా 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ బుధవారం స్వయంగా వెల్లడించారు. తమ కంపెనీలో పనిచేసే 300మంది అదే సమయంలో తన పోటీదారుల కోసం పనిచేస్తున్నట్లు గుర్తించామని రిషద్ ప్రేమ్జీ ప్రకటించారు. మూన్లైటింగ్ విధానం కంపెనీ నిబంధనలను, పూర్తిగా ఉల్లంఘించడమే అని మరోసారి గట్టిగా వాదించారు. AIMA ఈవెంట్లో మాట్లాడుతూ, మూన్లైటింగ్ (ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం) గురించి తీవ్రంగా విమర్శించిన ప్రేమ్జీ అటువంటి ఉద్యోగులకు కంపెనీలో చోటు లేదని స్పష్టం చేశారు. విప్రోతో కలిసి పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థుల కోసం ఏకకాలంలో నేరుగా పని చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాగా మూన్లైటింగ్ విధానం అనైతికమని, నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో ఇప్పటివరకూ లైట్ తీసుకున్న పలు ఐటీ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. -
ముదురుతున్న మూన్లైటింగ్ వివాదం: ఐబీఎం కీలక వ్యాఖ్యలు
ముంబై: ఐటీ రంగంలో మూన్లైటింగ్కు (రెండు ఉద్యోగాలు) వివాదం మరింత ముదురుతోంది. దీనికి వ్యతిరేకంగా గళమెత్తే కంపెనీల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. విప్రో, ఇన్ఫోసిస్ తర్వాత ఆ జాబితాలో తాజాగా ఐబీఎం ఇండియా కూడా చేరింది. మూన్లైటింగ్ అనైతికమని ఐబీఎం ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ సందీప్ పటేల్ వ్యాఖ్యానించారు. (ఇన్ఫోసిస్ ఉద్యోగులపైకొరడా: అతిక్రమిస్తే అంతే!) ‘ఉద్యోగులు మా దగ్గర చేరేటప్పుడు ఐబీఎం కోసం మాత్రమే పనిచేస్తామన్న ఒప్పందంపై సంతకం చేస్తారు. పని వేళల తర్వాత ఖాళీ సమయాల్లో వారు ఏదైనా చేసుకోవచ్చన్న విషయం పక్కన పెడితే, మూన్లైటింగ్ మాత్రం అనైతికమే’ అని పేర్కొన్నారు. (Bank of Baroda: ఖాతాదారులకు గుడ్ న్యూస్,రూ.2 కోట్ల వరకు) కాగా తొలుత విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ మూన్లైటింగ్ విధానం మోసపూరితమన్నారు. ఆ తరువాత ఇన్ఫోసిస్ మూన్లైటింగ్ విధానాన్ని తప్పుబట్టింది. నిబంధనలు అతిక్రమిస్తే టెర్మినేషన్ తప్పదంటూ ఉద్యోగులను తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎంలో భారత దేశంలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?) -
టీసీఎస్ క్లారిటీ: ఉద్యోగులకు పండగే
సాక్షి,ముంబై: దేశంలోని మేజర్ ఐటీ కంపెనీలన్నీ వేరియబుల్ పే విషయంలో ఉద్యోగులకు షాకివ్వగా దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. జూన్ క్వార్టర్లో సీనియర్ ఉద్యోగులకు వేరియబుల్ పే రోల్ అవుట్ను టీసీఎస్ ఒక నెల ఆలస్యం చేసిందన్న నివేదికల నేపథ్యంలో టీసీఎస్ ఈ క్లారిటీ ఇచ్చింది. పలు నివేదికల్లో తెలిపినట్టుగా 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి-జూన్ త్రైమాసికంలో సీ3ఏ, సీ3బీ, సీ 4, ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లింపు ఆలస్యం చేయడం లేదని తెలిపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వేరియబుల్ పే ఒకటి లేదా రెండు నెలల్లో చెల్లిస్తామని, ఈ ప్రక్రియలో ఎలాటి జాప్యం లేదని పేర్కొంది. 100 శాతం చెల్లిస్తామని టీసీఎస్ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. కాగా మార్జిన్లపై ఒత్తిడి, సప్లై చెయిన్ సమస్యలు, టెక్నాలజీలో కొత్త పెట్టుబడుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రోతో సహా ఇతర ఐటీ మేజర్లు కూడా తమ ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించడమో, లేదా ఆలస్యం చేసిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విప్రో సి-సూట్ స్థాయి ఎగ్జిక్యూటివ్లకు మేనేజర్ల వేరియబుల్ పేని కూడా నిలిపివేసినట్టు సమాచారం. ఫ్రెషర్స్ నుండి టీమ్ లీడర్లవరకు గ్రేడ్లలోని ఉద్యోగులు మొత్తం వేరియబుల్ పేలో 70 శాతం మాత్రమే పొందనున్నారని తెలుస్తోంది. -
లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!
ముంబై: భారతీయ ఐటీ నిపుణులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. టాప్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచనున్నాయిట. గత కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ రేటు భారీగా ఉండటంతో, ఉద్యోగులను, ముఖ్యంగా ఐటీ నిపుణులను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా తమ ఉద్యోగులను జీతాలను పెంచేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు వేతనాల పెంపు, బోనస్ చెల్లింపుల లాంటి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పటికేచ చాలా కంపెనీల్లో జాయినింగ్ బోనస్ ను భారీ ఎత్తునే ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజాలతో పాటు ఇతర టాప్ కంపెనీలున్నాయి. వ్యాపారాలు జీతాలు పెంచడం, బోనస్ సహా, ఇతర ప్రయోజనాలను అందించడం ద్వారా తమ ఉద్యోగులను నిలుపుకునేందుకు చూస్తున్నాయని మింట్ రిపోర్ట్ చేసింది. ఈ సమస్యలకు తోడు, సంస్థలో జీతాల పెంపు ఉండదనే వదంతుల నేపథ్యంలో ఈ సెప్టెంబరులోనే జీతాల పెంపు యథాతథంగా ఉంటుందని విప్రో స్పష్టం చేసింది. అంతేకాదు బెస్ట్ ఉద్యోగులకు మిడ్-మేనేజ్మెంట్ స్థాయిలో ప్రమోషన్లను కూడా ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో కూడా అట్రిషన్ రేటు ఎక్కువగానే ఉంది. ఇది కంపెనీ స్వల్పకాలిక లాభదాయకతపై ప్రభావంచూపుతుంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 27.7శాతం నుండి 28.4 శాతానికి పెరిగింది. దీన్నిగణనీయంగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. హైరింగ్ అండ్ కాంపిటేటివ్ కాంపెన్సేటివ్ రివిజన్ల ద్వారా టాలెంట్లో వ్యూహాత్మక పెట్టుబడులతో బలమైన వృద్ధిని సాధించ నున్నామని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ వెల్లడించారు. ఇది తక్షణమే మార్జిన్లపై ప్రభావం చూపినప్పటికీ, ఇది అట్రిషన్ స్థాయిలను తగ్గించి, భవిష్యత్తు వృద్ధికి మంచి స్థానాన్ని ఇస్తుందన్నారు. టీసీఎస్ దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ అధిక అట్రిషన్ రేటు 19.7గా ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు 5 నుంచి 8 శాతం వేతనాల పెంపు అఫర్ చేస్తున్నామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు. మంచి నైపుణ్యం కనబర్చిన వారికి వేతనం వృద్ధి మరింత ఉంటుందని ప్రకటించడం విశేషం. మిగిలిన టాప్ ఐటీ కంపెనీల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
విప్రో ఉద్యోగులకు శుభవార్త!
సెప్టెంబర్ 1నుంచి ఉద్యోగుల జీతాల పెంపు, హైక్స్పై ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేశంలో ఐటీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. దీంతో అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే అట్రిషన్ రేటును నియంత్రించడం, కొత్త టాలెంట్ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేలా విప్రో తన ఉద్యోగులకు బోనస్లు, ఇంక్రిమెంట్లు భారీగా పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మరికొన్ని నివేదికలు హైలెట్ చేశారు. ఈ నేపథ్యంలో జీతాల పెంపులో ఎలాంటి మార్పులు లేవని, సెప్టెంబర్ నుంచి శాలరీ హైక్ అమల్లోకి వస్తాయని విప్రో ప్రకటించింది. జూలై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు, మిడ్ నేజ్మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్లో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది' అని విప్రో తెలిపింది. -
మెప్పించని విప్రో
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది. డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది. -
ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి విప్రో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం విప్రో కంజ్యూమర్ కేర్, లైటింగ్ తాజాగా ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిరుతిళ్లు, మసాలా దినుసులు, రెడీ టు ఈట్ విభాగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యం. కాగా, సంతూర్, యార్డ్లీ, చంద్రిక, గ్లూకోవిట, సేఫ్వాష్ వంటి బ్రాండ్లను సంస్థ ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తన ఉత్పత్తులను ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. 2021–22లో విప్రో కంజ్యూమర్ కేర్ రూ.8,634 కోట్ల టర్నోవర్ సాధిచింది. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్లు,ప్రమోషన్లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!
ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజాలు అట్రిషన్ రేట్ తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. కోవిడ్-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు డిజిటల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అట్రిషన్ రేట్ తగ్గిస్తూ, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎంఫసిస్లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్ బోనస్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్(ఈఎస్ఓపీఎస్) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్లో స్మార్ట్గా చేసేందుకు సిల్స్, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు! -
ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!
కరోనా మహమ్మారికి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగింది.దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సైతం డిమాండ్ ఏర్పడింది. అయితే తమకు అర్హులైన ఉద్యోగుల్ని ఎంపిక చేయడం టెక్ సంస్థలకు కత్తిమీద సాములాగా తయారైంది. అందుకే వేలకోట్లు ఖర్చు చేసి మరీ స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. మార్కెట్లో ఉన్న డిజిటల్ స్కిల్ కొరతను అధికమిస్తున్నాయి. దీంతో టెక్ మార్కెట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో ఉద్యోగల్ని (సబ్ కాంట్రాక్టర్స్ను) నియమించుకుంటున్నాయి. స్టాఫింగ్ ఏజెన్సీలు సైతం వాళ్ల పద్దతిలో సెలక్ట్ చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాలరీ, ఇన్స్యూరెన్స్ కవరేజ్తో పాటు ఇతర బెన్ఫిట్స్ను అందిస్తున్నాయి. అయితే ఈ తరహా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెసీఎల్'లు పోటీ పడుతున్నాయి. అందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. సాధారణ ఉద్యోగుల నియామకానికి సమానంగా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇలా ఈఏడాది ఫైనాన్షియల్ ఇయర్లో టీసీఎస్ 34.2శాతం వృద్ధితో కాంట్రాక్ట్ ఉద్యోగులపై రూ.16,975కోట్లు ఖర్చు చేస్తుండగా ఇన్ఫోసిస్ 77.9శాతం వృద్ధితో రూ.12,607కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో విప్రో 30శాతం వృద్ధితో రూ.10,858 కోట్లు ఖర్చు చేయగా..23శాతం వృద్ధితో హెచ్సీఎల్ ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్మినెంట్ చేస్తున్నాయి సంస్థలు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకోవడం వల్ల డిమాండ్కు అవసరమయ్యే డిజిటల్ స్కిల్స్ను ఉపయోగించుకోవడంతో పాటు, స్కిలున్న ఉద్యోగుల్ని గుర్తించడం స్టాఫింగ్ ఏజెన్సీలకు సులభం అవుతుంది.తద్వారా సంస్థకు వస్తున్న ప్రాజెక్ట్లను తక్కువ సమయంలో పూర్తి చేయడం, ఐటీ సంస్థల్ని కుదిపేస్తున్న అట్రిషన్ రేట్ను తగ్గించుకునేందుకు సంస్థలు ట్రై-బై-అప్రోచ్ పద్దతిని అవలంభిస్తున్నాయని టెక్ అడ్వైజరీ సంస్థ క్యాటలిన్క్స్ పార్టనర్ రామ్ కుమార్ రామ మూర్తి తెలిపారు. ట్రై-బై-అప్రోచ్ పద్దతి అంటే కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగులు నియమించుకొని ప్రాజెక్ట్లు పూర్తి చేస్తున్నాయి. అవసరం అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సంస్థలు సాధారణ ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాయి. చదవండి👉సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోండి! -
లాభాల్లో విప్రో రికార్డు.. ఈసారి ఫ్రెషర్లకు భారీ ఛాన్స్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 3,093 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,974 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 28 శాతం జంప్చేసి రూ. 20,860 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 16,245 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఈ ఏడాది(2022–23) తొలి క్వార్టర్లో 1–3 శాతం వృద్ధిని ఆశిస్తోంది. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 274.8–280.3 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు(గైడెన్స్) ప్రకటించింది. పూర్తి ఏడాదికి 16–18 శాతం పురోగతికి వీలున్నట్లు అభిప్రాయపడింది. గతేడాది భళా ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు 13 శాతం ఎగసి రూ. 12,233 కోట్లను తాకింది. 2020–21లో రూ. 10,866 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 28% జంప్చేసి రూ. 79,747 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది రూ. 62,234 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది ఆదాయం10.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో ముగించడం విశేషమని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అందుకున్నట్లు వెల్లడించారు. వార్షిక ప్రాతిపదికన పరిశ్రమలోనే అత్యధికంగా 27% వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. తాజా క్యూ4 లో వరుసగా ఆరో క్వార్టర్లోనూ పటిష్ట ఆదాయ వృద్ధి(3%)ని అందుకున్నట్లు తెలియజేశారు. రికార్డు లాభం గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 1.6 బిలియన్ డాలర్ల నికర లాభం సాధించినట్లు విప్రో సీఎఫ్వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. క్లయింట్లపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా 10 కోట్ల డాలర్ల విభాగంలో 8 కొత్త కస్టమర్లను జత చేసుకున్నట్లు వెల్లడించా రు. 17.7% నిర్వహణ మార్జిన్లు సాధించినట్లు తెలియజేశారు. క్యాప్కో కొనుగోలుతో రెండంకెల వృద్ధిని అందుకుంటున్నట్లు డెలాపోర్ట్ పేర్కొన్నారు. క్యూ4లో కొత్తగా 10 కోట్ల డాలర్ల విభాగంలో ఇద్దరు, 5 కోట్ల డాలర్లలో ముగ్గురు క్లయింట్లను గెలుచుకున్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ - పోటీ సంస్థల బాటలోనే విప్రోలోనూ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 23.8%గా నమోదైంది. అయితే త్రైమాసికం వారీగా 5% తగ్గింది. - గతేడాది 19,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలిచ్చింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా మొత్తం 45,416 మందిని జత చేసుకుంది. - ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 38,000 మందికి ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. చదవండి: మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి! -
విప్రో ఇండియాకు కొత్త హెడ్ నియామకం
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ సత్య ఈశ్వరన్ను దేశీ బిజినెస్ హెడ్గా నియమించుకుంది. ఇంతక్రితం కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ సీఈవోగా వ్యవహరించిన ఈశ్వరన్ దేశీయంగా కీలక విభాగాలకు అధిపతి(ఇన్చార్జ్)గా బాధ్యతలు చేపట్టనున్నట్లు విప్రో పేర్కొంది. తద్వారా ఆయన వ్యూహాత్మక కన్సల్టింగ్, ట్రాన్స్ఫార్మేషన్, ఆధునికతకు సంబంధించిన ఎంగేజ్మెంట్స్ తదితర కీలక పారిశ్రామిక విభాగాలలో బిజినెస్ను పటిష్ట పరచనున్నట్లు తెలియజేసింది. విప్రోకు ఇండియా వ్యూహాత్మక మార్కెట్కాగా.. సత్య చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు అమిస్ సీహెచ్ పేర్కొన్నారు. అధిక విలువగల కన్సల్టింగ్ సర్వీసుల్లో ఈశ్వరన్కున్న అంతర్జాతీయ అనుభవం, సేల్స్ విజయాల ట్రాక్ రికార్డ్, పటిష్ట నాయకత్వం వంటి అంశాలు దేశీ క్లయింట్లలో విప్రోపట్ల మరింత విశ్వాసాన్ని కల్పిస్తాయని ఆసియా పసిఫిక్, ఇండియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా(ఏపీఎంఈఏ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న అమిస్ వివరించారు. క్లౌడ్, డిజిల్, డేటా, అనలిటిక్స్, ఇంజినీరింగ్ ఆర్అండ్డీ, సైబర్సెక్యూరిటీ తదితరాలలో విప్రోకున్న సామర్థ్యాలతో క్లయింట్లు ప్రయోజనం పొందేందుకు ఈశ్వరన్ సహకరించగలరని అభిప్రాయపడ్డారు. చదవండి: ఎల్అండ్టీ ఇన్ఫో, మైండ్ట్రీ విలీనం! -
విప్రో ‘సీఈవో’గా అనిస్!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో సీఈవోగా (ఆసియా పసిఫిక్, భారత్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల విభాగం – ఏపీఎంఈఏ) అనిస్ చెన్చా నియమితులయ్యారు. కన్సల్టింగ్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల్లో ఆయనకు రెండు దశాబ్దాల పైగా అనుభవం ఉందని సంస్థ వెల్లడించింది. అనిస్ ఇప్పటివరకూ క్యాప్జెమినిలో గ్లోబల్ సీఈవోగా (బిజినెస్ సర్వీసెస్ విభాగం), గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా వ్యవహరించారు. అత్యంత సమర్ధమంతులైన వారితో టీమ్లను తీర్చిదిద్దడం, సంక్లిష్టమైన మార్పులను సమర్ధంగా అమలు చేయగలగడం వంటి సామర్థ్యాలు అనిస్కు సొంతమని ఈ సందర్భంగా విప్రో సీఈవో, ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. ఇప్పటివరకూ ఏపీఎంఈఏ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ సీఈవోగా వ్యవహరించిన ఎన్ఎస్ బాలా వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో అనిస్ నియమితులయ్యారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగులకు టెక్ కంపెనీల పిలుపు!!
రండి..రండి...దయచేయండి..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ! అంటూ సుదీర్ఘ కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటికే పరిమితమైన ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ► 2ఏళ్ల నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు ఆహ్వానించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధమయ్యాయి. కోవిడ్తో చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరించాలని యోచిస్తున్నప్పటికీ, ఐటీ ఉద్యోగుల వర్క్ విషయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ► అందుకే బెంగళూరు కేంద్రంగా ఐటీ కంపెనీ విప్రో మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ మందిని మార్చి3 లోపు తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది. అయితే, ప్రస్తుతానికి విప్రో పై స్థాయి ఉద్యోగుల్ని వారానికి రెండు రోజులు మాత్రమే పిలవనుంది. ►కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్లతో పాటు ఇతర టెక్ కంపెనీలు మార్చి నెల నుంచి ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలిపిస్తున్నాం. అందుకు మీరూ సిద్ధంగా ఉండాలంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్లో పేర్కొన్నాయి. ► కాగ్నిజెంట్ సైతం ఉద్యోగులు ఏప్రిల్ నాటికి స్వచ్ఛందంగా కార్యాలయాలకు తిరిగి వచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది వరకు హైబ్రిడ్ వర్క్ మోడల్ను కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ, ఇన్ఫోసిస్ రాబోయే 3నుంచి 4 నెలల్లో ఎక్కువ మంది ఉద్యోగులతో ఆఫీస్లో కార్యకలాపాల్ని నిర్వహించనుంది. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ ఉద్యోగులు టీకాలు వేయించుకోవడంతో పాటు, కరోనా పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయడం ప్రారంభించారని టీసీఎస్ గత వారం ఉద్యోగులకు పెట్టిన ఈమెయిల్స్లో తెలిపింది. ► కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా పరిస్థితులు చక్కబడడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న 40 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు రానున్నారని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో అన్నారు. చదవండి : బంపరాఫర్!! మీ కోసమే..ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఊహించని శాలరీలు!! -
వర్క్ ఫ్రం హోంకు గవర్నమెంట్ చెక్..! ఐటీ కంపెనీల నిర్ణయం ఇలా..!
కరోనా రాకతో ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమవ్వగా ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాకతో ఐటీ కంపెనీలు సందిగ్థంలో పడిపోయాయి. దీంతో చేసేదేమీ లేక ఉద్యోగులను మళ్లీ ఇంటి నుంచే పనిచేయడంటూ ఆర్డర్స్ వేశాయి. భారత్లో కరోనా థర్డ్ వేవ్ కాస్త తగ్గిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవొచ్చునని ఐటీ కంపెనీలతో తెలిపాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు మరోసారి ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆఫీసులకు పిలిచేందుకు సిద్దం..! కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో దిగ్గజ ఐటీ కంపెనీలైన విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను వచ్చే నెలలోగా కార్యాలయాలకు పిలిపించే అవకాశం ఉన్నందున ఉద్యోగుల సిద్ధంగా ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. ► భారత ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమైంది. బెంగళూరుకు చెందిన కంపెనీ మేనేజర్స్, సీనియర్ ఉద్యోగులను మార్చి 3లోగా కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. అయితే, ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు మాత్రమే వారిని పిలుస్తారు. ఇక ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ► కాగ్నిజెంట్ తమ ఉద్యోగులను ఏప్రిల్ నాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తోంది. అయితే ఉద్యోగులను బలవంతం చేయకుండా వారిని పిలిచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ సమాచారం. 2022 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్ను కొనసాగించాలనే అంచనాతో కంపెనీ ఉన్నట్లు సమాచారం. కాగ్నిజెంట్ ఏప్రిల్ నుంచి వారానికి 3 రోజుల పాటు ఉద్యోగులను తిరిగి ప్రాంగణంలో ఉంచే ప్రణాళికలను కలిగి ఉంది ► రిమోట్ వర్కింగ్ పాలసీని తీసుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ట్రెండ్లో చేరింది. కంపెనీ అసోసియేట్స్ ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ, వారిని కంపెనీ బేస్ లొకేషన్ నుంచి పని చేయడం తప్పనిసరి చేసింది. టీసీఎస్ భారీ ఎత్తున్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇక భవిష్యత్లోనూ 25-25 శాతం మోడల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తొలుత 25/25 శాతం మంది సిబ్బందిని ఆఫీసులకు తీసుకొచ్చి క్రమంగా హైబ్రీడ్ మోడల్కు మళ్లిస్తామని తెలిపారు. ► ఇన్ఫోసిస్ రాబోయే 3-4 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కోసం కార్యాలయాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇన్ఫోసిస్లో 96 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలు కొనసాగిస్తారు. సంస్థ కూడా సిబ్బందిని ఆఫీసులకు రప్పించడానికి తొందర పడటం లేదు. కొవిడ్ కేసుల నేపథ్యంలో హైబ్రీడ్ మోడల్ పని విధానాన్నే కొనసాగిస్తామని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వ్యాఖ్యానించారు. 40-50 శాతం సిబ్బందిని ఆఫీసులకు రప్పిస్తామన్నారు. దశల వారీగా ఆఫీసులకు సిబ్బందిని తీసుకొస్తామన్నారు. చదవండి: హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్కార్డ్..! ఐటీ కంపెనీల కీలక నిర్ణయం..! -
'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు!
మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశాభంగం...రండి బాబు రండి..మా ఆఫీస్ లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదూ కూడదూ అంటే అంతకు మించి ఇస్తాం' అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. ►కోవిడ్ కారణంగా ఆయా టెక్ దిగ్గజాల్లో అట్రిషన్ రేటు (ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగికి అంతే కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తూ మరో సంస్థ ఆహ్వానించడం) విపరీతంగా కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్ నెల క్యూ4 ముగిసే సమయానికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో' కంపెనీల్లో అట్రిషన్ రేటు గడిచిన 3ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క డిసెంబర్ నెలలో ఈ మూడు కంపెనీలు మొత్తం 51వేల మందిని నియమించుకున్నాయి. ►మిగిలిన టెక్ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్లో అట్రిషన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఒక్క ఇన్ఫోసిస్లో అట్రిషన్ రేటు 25.5శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రోలో అట్రిషన్ రేటు 22.7శాతం, టీసీఎస్లో అతితక్కువగా 15.3శాతం ఉన్నట్లు రిపోర్ట్లులో పేర్కొన్నాయి. కోవిడ్తో పాటు ఇతర పరిస్థితులు కారణంగా ఉద్యోగస్తులు శాలరీ, డిజిగ్నేషన్, ఫ్యామిలీ సెక్యూరిటీ కారణంగా ఉద్యోగంలో అభివృద్ది కోరుకుంటున్నారని, కాబట్టే సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగిపోతున్నట్లు తేలింది. ►టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31) డిసెంబర్ నెల వరకు..ఈ మధ్య కాలంలో మొత్తం 43 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. క్యూ2 కంటే క్యూ3లో ఎక్కువగా 34వేల మందిని ఫ్రెషర్లను నియమించుకోగా..మిగిలిన క్వార్టర్లకంటే క్యూ4లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని ఎంపిక చేసింది. దీంతో ఆ సంస్థలో ఉద్యోగుల మొత్తం సంఖ్య 556,986కి చేరింది. కాగా ఉద్యోగుల నియమక xpheno ప్రకారం..టీసీఎస్ చివరి క్యూ4లో మొత్తం 28వేల మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ►ఈ త్రైమాసికంలో విప్రో 10,306 మంది ఉద్యోగులను నియమించుంది. దీంతో ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 231,671కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 41,363 పెరిగింది. ►ఇన్ఫోసిస్ త్రైమాసికంలో 15,125 మందిని చేర్చుకుంది. ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 292,067కి చేరుకుంది. ►ఈ మూడు టెక్ దిగ్గజ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 134,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ నియమాక దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని xpheno తెలిపింది. మూడవ త్రైమాసికంలో నికర పెరుగుదల 19శాతం ఎక్కువగా ఉంది. అట్రిషన్కు కారణం ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ టాలెంట్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని, అందులో అనుభవజ్ఞులైన ఉద్యోగులు సంస్థలు మారడం వల్ల ఆయా సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగినట్లు xpheno కోఫౌండర్ కమల్ కారంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 15-25% అట్రిషన్ రాబోయే కనీసం 2-3 త్రైమాసికాల వరకు కొనసాగవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం, దేశంలో ఉద్యోగులకు కొత్త వర్క్ మోడల్ -
ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు..!
ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు అందించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం(ఎఫ్వై23)లో కూడా 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు విప్రో బుధవారం తెలిపింది. కోవిడ్ ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కంపెనీ 'చాలా అప్రమత్తంగా' ఉన్నట్లు సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తెలిపారు. రాబోయే నాలుగు వారాలపాటు ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. ''ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగుల్లో 90 శాతం మంది ఇప్పుడు ఒక ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మాకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, 65 శాతం మందికి పైగా సెకండ్ డోస్ వేసుకున్నట్లు" సంస్థ తెలిపింది. "రెండు డోసుల టీకాలు వేసుకున్న ఉద్యోగులను హైబ్రిడ్ మోడల్లో భాగంగా కార్యాలయానికి తిరిగి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. మా ఉద్యోగుల భద్రత, క్లయింట్ ప్రాధాన్యతలు రెండింటినీ దృష్టిలో ఉంచుకొని 4 వారాలు కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించినట్లు" 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న తరుణంలో సీఈఓ పేర్కొన్నారు. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2,969 కోట్లుగా నమోదయ్యింది. (చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!) -
విప్రో క్యూ3 ఫలితాలు: ఆదాయంలో భేష్..అక్కడ మాత్రం..!
ప్రముఖ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో 2021 ఆర్థిక సంవత్సరానికిగాను మూడో త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2419.8 కోట్లను పొందింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో సంస్థ లాభాలు రూ. 2649.7 కోట్లను గడించింది. ఈ క్యూ3లో నికరలాభాలు 8.67 శాతం తగ్గాయి. ఇక కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్యూ3లో రూ.15,278 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 21.29 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ3లో ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 12, 596 కోట్లను నమోదు చేసింది. కాగా రెవెన్యూలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ రాబడిని విప్రో నివేదించింది. ఈ క్యూ3లో కంపెనీ 30 శాతం రాబడి వస్తోందని విశ్లేషకులు నివేదించారు. ► కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ. 20,313 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే 3.3 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. ► ఐటీ సేవల విభాగంలో 2.3 శాతం వృద్ధితో 2,639.7 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని విప్రో సాధించింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► మూడో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల వంటి నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ... బలమైన ఫలితాలు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బీఎస్ఈలో షేరు విలువ (0.40 శాతం నష్టపోయి రూ.691.85 వద్ద ముగిసింది. చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..! -
టాటా మరో రికార్డ్ ! చెప్పారంటే చేస్తారంతే..
దేశంలో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించిన ప్రైవేటు సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రికార్డు సృష్టించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ 2021లో ప్రకటించిన టాప్ 500 కంపెనీల జాబితాలో మహిళా ఉద్యోగుల విషయంలో టాటా కన్సల్టెన్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. టాటాయే నంబర్ వన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి ప్రపంచ వ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా ఉద్యోగుల సంఖ్య రికార్డు స్థాయిలో 1,78,357గా నమోదు అయ్యింది. దాదాపుగా 35 శాతానికి పైగా టీసీఎస్లో మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. సరిగ్గా పదేళ్ల కిందట టీసీఎస్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 30 శాతంగా ఉండేది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నా.. ఎక్కడా మహిళల శాతం తగ్గకుండా రిక్రూట్మెంట్లో జాగ్రత్తలు తీసుకుంటోంది టాటా గ్రూపు. ఇన్ఫోసిస్ది అదే బాట టాటాల తర్వాత స్థానంలో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. ఇన్ఫోసిస్లో మొత్తం 2,59,619 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో 1,00,321 మంది ఫిమేల్ ఎంప్లాయిస్ ఉన్నారు. మొత్తం ఉద్యోగులు మహిళల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే 38 శాతం ఫిమేల్ వర్క్ఫోర్స్తో ఇన్ఫోసిస్ సంస్థ టాటా కంటే ముందు ఉంది. ఇన్ఫోసిస్ తర్వాత స్థానంలో 72,000ల మంది మహిళ ఉద్యోగులతో విప్రో, 61,330 మందితో క్వెస్ కార్పోరేషన్ సంస్థలు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఐటీ విప్లవంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మహిళలు దూసుకుపోతున్నారనడానికి ఈ గణాంకాలు ఉదాహారణగా నిలుస్తున్నాయి. ఐటీ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో కూడా విమెన్ వర్క్ఫోర్స్ పెరుగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు 31,059 మంది మహిళా ఉద్యోగులతో అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాత 21,746 ఎంప్లాయిస్తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో నిలిచింది. ఇక దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్లో 2,36,334 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మహిళల సంఖ్య 19,561కే పరిమితమైంది. జెండర్ ఈక్వాలిటీలో టాటా దేశంలో అనేక వ్యాపార గ్రూపులు ఉన్నప్పటికీ టాటాది ప్రత్యేక స్థానం. విలువలు, సామాజిక బాధ్యత విషయంలో టాటాలు ఎప్పుడు ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. కాగా రతన్ టాటా హాయం నుంచి జెండర్ ఈక్వాలిటీ మీద టాటా గ్రూపు దృష్టి సారించింది. దానికి తగ్గ ఫలితాలు ఇప్పుడు టాటా గ్రూపులో కనిపిస్తున్నాయి. టాటా గ్రూపులో కింది స్థాయిలోనే కాకుండా ఎగ్జిక్యూటివ్ లెవల్లో కూడా చాలా మంది మహిళలు పని చేస్తున్నారు. చదవండి: ‘ఇది మీ ఆకాశం’.. బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా కొత్త మంత్రం -
విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..!
Wipro Acquires US-Based Leanswift To Expand Its Cloud Transformation Biz: భారత టెక్ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన లీన్స్విఫ్ట్ సొల్యూషన్స్ను సొంతం చేసుకుంది. లీన్స్విఫ్ట్ సొల్యూషన్స్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీ విప్రో బుధవారం రోజున ప్రకటించింది. ఫుల్స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్ ద్వారా క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్ను విస్తరించడానికి కంపెనీ వ్యూహానికి అనుగుణంగా విప్రో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సముపార్జన 2022 మార్చి 31తో పూర్తవుతోందని విప్రో బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది. కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ స్పేస్ రెండింటిలో లీన్స్విఫ్ట్ ఇన్ఫోర్ ఇండస్ట్రీ క్లౌడ్ సర్వీసెస్లో విప్రో స్థానాన్ని నెలకొల్పుతుందని కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. యూఎస్, స్వీడన్ , భారత్ అంతటా డెవలప్మెంట్ కార్యాలయాలను లీన్స్విఫ్ట్ కలిగి ఉంది. లీన్స్విఫ్ట్ , పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్, ఆహారం & పానీయాల పరిధిలో విస్తరించి ఉంది. ఇ-కామర్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సప్లై చైన్, వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ , ఇంటిగ్రేషన్లలో లీన్స్విఫ్ట్ సేవలను అందిస్తుంది. ఈ సముపార్జనతో క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యాపారంలో ఆయా క్లైయిట్లకు మెరుగైన క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తామని విప్రో లిమిటెడ్ అప్లికేషన్స్ & డేటా, iDEAS, ప్రెసిడెంట్ హరీష్ ద్వారకన్హల్లి అభిప్రాయపడ్డారు. చదవండి: ఎలన్ మస్క్ తర్వాత సింగ్ ఈజ్ ‘కింగ్’ అవుతాడా? -
దాతృత్వంలో దేశంలోనే అజీమ్ ప్రేమ్జీ టాప్
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాన, ధర్మాల్లో ఎప్పుడూ ముందుంటారు. 2020-2021 ఆర్ధిక సంవత్సరంలో విరివిగా దానాలు చేసి అగ్రస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2021 ప్రకారం రోజుకు సగటున రూ.27 కోట్లతో ఏడాదికి రూ.9,713 కోట్లు చొప్పున విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం దాతృత్వంతో హురున్ ఇండియా, ఎడెల్గైవ్ ఇండియా దాతృత్వ జాబితా- 2021లో అజీమ్ ప్రేమ్జీ ముందు వరుసలో నిలిచారు. ప్రేమ్ జీ తన విరాళాలను గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వరకు పెంచారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఈ మహమ్మారి అరికట్టడం కోసం విరాళాలను రెట్టింపు చేసింది హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్నాడార్ ₹1,263 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ₹577 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. తర్వాత వరుస స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ₹377 కోట్ల సహకారంతో జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఈ ఏడాది జాబితాలో ₹183 కోట్ల విలువైన మొత్తం విరాళాలతో ఐదవ స్థానానికి చేరుకున్నారు. ఇక హిందూజా కుటుంబం ₹166 కోట్ల విరాళాలతో జాబితాలో ఆరవ స్థానంలో నిలిచారు. ₹50 కోట్ల విరాళంతో మొదటిసారి ఇన్వెస్టర్ రాకేష్ ఝుంఝున్ వాలా ఈ దాతృత్వ జాబితాలోకి ప్రవేశించారు. (చదవండి: బంపర్ ఆఫర్..! రూ.101కే వివో ఫోన్..షరతులు వర్తిస్తాయి..!) వాతావరణ మార్పుల పరిష్కారాల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు మద్దతు తెలపడానికి సిరోధా సహ వ్యవస్థాపకులు నిథిన్ & నిఖిల్ కామత్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ₹750 కోట్లు ఇవ్వనున్నారు. ఈ జాబితాలో 35వ స్థానంలో ఉన్నారు. 35 ఏళ్ల నిఖిల్ నిఖిల్ కామత్ ఈ జాబితాలో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో ఈ ఏడాది తొమ్మిది మంది మహిళలు పాల్గొన్నారు. రోహిణి నీలేకని దాతృత్వాల కోసం ₹ 69 కోట్లు విరాళం ఇచ్చారు. (చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారించిన ఉబర్..!) -
మీదే ఆలస్యం..ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్
నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా ఫ్రెషర్స్ను నియమించుకోనున్నట్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు ప్రకటించాయి. మన దేశంలో ఐటీ సెక్టార్ తో పాటు డిజిటల్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో, హెచ్సీఎల్ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,20,000 ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగుల నియామకం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. టీసీఎస్ టీసీఎస్ గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాల్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను ఎంపిక తీసుకోన్నట్లు చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకున్నట్లు అవుతుందని అన్నారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ని ఉద్యోగుల అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 45 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది.ఇక సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో జూన్ చివరినాటికి 13.9 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 20.1 శాతానికి పెరిగింది. విప్రో విప్రోసైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో తన రెండవ త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా రెట్టింపు స్థాయిలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ థియరీ డెలాపోర్టే తెలిపారు. హెచ్సీఎల్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది 20వేల నుంచి 22వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని హెచ్సీఎల్ తెలిపింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) కాగ్నిజెంట్ సంస్థ భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను ఎదుర్కొంటుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 33శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 11.9%, ఇన్ఫోసిస్ 20.1%,విప్రో 20.5శాతం, టెక్ మహీంద్రా 21శాతంతో ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఫ్రెషర్స్ను నియమించుకునే పనిలో పడ్డాయి. చదవండి: తాత్కాలిక పనివారికి డిమాండ్ ! -
మన విజయగాథకు ఇదే మూలం!
దేశంలోని నాలుగు దిగ్గజ ఐటీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో లక్షమందికి పైగా ప్రొఫెషనల్స్కు ఉద్యోగావకాశాలు కల్పించాయి. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ వేగంతో ముందుకు సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. కానీ ప్రతికూల వార్తలకు, నిరాశా నిస్పృహలకు మాత్రమే విలువనిచ్చే మన సమాజం ఇలాంటి అద్భుతమైన సానుకూల వార్తను పట్టించుకోదు. మన ఐటీ కంపెనీలు కోవిడ్ మహమ్మారి కాలంలోనూ ఇంత ఘన విజయం సాధించడానికి బలమైన నాయకత్వం, పోటీతత్వమే కారణమని గ్రహించాలి. దురదృష్టవశాత్తూ, భారతదేశంలో సానుకూల వార్తలకు ఈరోజుల్లో చాలా తక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వాటిగురించి మాట్లాడేది కూడా తక్కువేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అలాంటి వార్తలు కాస్త ముందుకొచ్చినా, అవి వెంటనే మాయమైపోతుంటాయి. మరుగున పడుతుంటాయి. ప్రస్తుతం నిరాశావాదాన్ని ప్రేరేపించే నిస్పృహ కలి గించే వార్తలపై అధికంగా దృష్టి సారించే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇదే ఇప్పటి ఫ్యాషన్ అని చెప్పాలి. ప్రస్తుతం దేశ ముఖచిత్రం నుంచి ఒక గొప్ప ఉదాహరణను పరిశీలిద్దాం. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు – టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో లక్షమందికి పైగా వృత్తినిపుణులైన యువతను ఉద్యోగాల్లో నియమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 రెట్లు ఎక్కువ. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ ముందంజలో సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. టీసీఎస్లో ప్రస్తుతం 5 లక్షలమంది వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. పైన పేర్కొన్న ఇతర ఐటీ సంస్థలు కూడా లక్షలాదిమందిని ఉద్యోగాల్లో నియమించాయి. వీటిలో పనిచేసిన ప్రొఫెషనల్స్ మంచి అవకాశాలు రాగానే ఇతర కంపెనీలకు కూడా తరలి వెళ్లారు. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సిబ్బందిలో 20 శాతం మంది రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్ వంటి సుప్రసిద్ధ కంపెనీని వదిలి ఉద్యోగులు వెళ్లిపోతున్నారంటే, వారికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అర్థం. మన ఐటీ రంగంలోని కంపెనీలు అభివృద్ధి, పురోగతికి సంబంధించిన అన్ని రికార్డులను ఎలా బద్దలు చేశాయో చూపడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఒక్కటే రూ. 9,624 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,800 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇక ఇన్ఫోసిస్ తన వంతుగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 5,500 కోట్ల లాభాన్ని ఆర్జించగా, విప్రో, హెచ్సీఎల్ కూడా అసాధారణమైన ఫలితాలను సాధించాయి. ఇంత భారీ ముందంజ వేసినప్పటికీ ఇలాంటి అద్భుతమైన వార్తల పట్ల దేశం ఎలాంటి ప్రత్యేక స్పందనలను వ్యక్తీకరించడం లేదు. ఈ రోజు హింస ఎక్కడ జరిగింది, దేశం కోలుకోలేని విధంగా ఎక్కడ నష్టపోయింది వంటి వార్తలకే ప్రాధాన్యముండటం విచారకరం. అయితే, టాటా గ్రూప్ ఇటీవలే ఎయిర్ ఇండియాను రూ. 18 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి దాని కీలక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆర్జించిన అపారమైన లాభాలే కారణమని జనాం తికంగా చెప్పుకుంటున్నారు. టీసీఎస్ రెండు త్రైమాసికాల ఫలితాల దన్నుతో టాటా గ్రూప్ సులువుగా ఎయిర్ ఇండియాను కొనేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు సాధించిన అద్భుత విజయాల వెలుగులో, ఏ కంపెనీ లాభాలు ఆర్జించడంలో అగ్రస్థానంలో ఉంది, మార్కెట్లో ఏ కంపెనీకి ఎక్కువ పరపతి ఉంది అనే అంశాలపై మీరెన్నడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఏమంత కష్టమైన పని కాదు. ఉత్తమ నాయకత్వం, సరైన మార్గదర్శకత్వం కారణంగానే ఇంతటి పురోగతి సాధ్యపడింది. ఇప్పుడు టీసీఎస్ని ఉదాహరణగా తీసుకుందాం. ప్రస్తుతం ఆ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపీనాథ్ టీసీఎస్ పగ్గాలు చేపట్టడానికి ముందే టీసీఎస్ ప్రపంచస్థాయి కంపెనీగా మారింది. ఈ ఘనత మొత్తంగా ప్రస్తుత టాటా కంగ్లామరేట్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్కే దక్కాల్సి ఉంది. ఈయన 2009లో టీసీఎస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. వృత్తిపరంగా తన కెరీర్ను కూడా టీసీఎస్తోనే మొదలెట్టారు. టీసీఎస్ వ్యవహారాలను అద్భుతంగా పర్యవేక్షించి, నిర్వహించారు. నాయకత్వ నైపుణ్యాలను టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఫకీర్చంద్ కోహ్లీ నుండి చంద్రశేఖరన్ నేర్చుకున్నారు. ఈరోజు సమాచార సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ఒక నిగూఢ శక్తిగా యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. భారత ఐటీ రంగం విలువ 190 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత మాత్రం ఫకీర్ చంద్ కోహ్లీకే దక్కాలి. దేశంలోనే ఐటీ రంగానికి పునాది వేసిన వ్యక్తి ఈయన. అలాంటి కోహ్లీ, రతన్ టాటాలతో కలిసి పనిచేసిన చంద్రశేఖరన్ ఒక సృజనాత్మక సంస్కృతిని, ప్రతిభాపాటవాలను నేర్చుకున్నారు. ఇకపోతే శివ్ నాడార్ గురించి మాట్లాడుకుందాం. ఈయన తమిళనాడు లోని తంజావూర్ నుంచి వచ్చారు. ఒంటిచేత్తో హెచ్సీఎల్ టెక్నాలజీస్ని ఏర్పర్చారు. తన సుదీర్ఘ నాయకత్వంలో హెచ్సీఎల్ని అతి గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చారు. తమ గుహల్లోంచి బయటకు వచ్చి ఏదైనా విభిన్నంగా ఆలోచించాల్సిందిగా తన కంపెనీ సీఈఓలను, మేనేజర్లను ఆయన ప్రభావితం చేశారని ప్రతీతి. నాడార్ ఎల్లప్పుడూ తన ఉద్యోగులకు దన్నుగా నిలిచారు. అందుకే ఆయన కింద పనిచేసే మేనేజర్లు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఈ రోజు ఈ కంపెనీ కనీసం అరడజన్ పైగా దేశాల్లో ఉనికిలో ఉంటూ వంద ఆఫీసులను తెరిచింది. లక్షమంది ప్రొఫెషనల్ ఇంజనీర్లు ఈ సంస్థతో ముడిపడి ఉన్నారు. జేఆర్డీ టాటాలోని పోరాటస్ఫూర్తి, చురుకైన వ్యాపార తత్వం శివ్ నాడార్లో కనిపిస్తాయి. విద్య, జాతీయ నిర్మాణం పట్ల వీరిద్దరి విశ్వాసాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక ఇన్ఫోసిస్ లిమిటెడ్. దీని ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్. చరిత్ర ప్రసిద్ధుడైన నారాయణమూర్తి ఈ సంస్థకు పునాది వేశారు. ఈ క్రమంలో నందన్ నీలేకని వంటి సహచరుల సహాయం ఈయనకు లభించింది. నందన్ నీలేకని ఇప్పటికీ ఇన్ఫోసిస్ వర్కింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అర్థవంతంగా మల్చుకోవడంలో నారాయణ మూర్తి తీరిక లేకుండా ఉంటారు. మానవ జీవితం క్షణభంగురమే కావచ్చు, కానీ మనం చేసే సత్కార్యాల ద్వారా మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు. అంధకారమనే సామ్రాజ్యం ఎంత పెద్దదైనా కావచ్చు కానీ చిన్న దీపం తాను ఆరిపోయేంతవరకు ఆ అంధకారంతో పోరాటం సాగిస్తూనే ఉంటుంది. అలాగే పూల జీవిత కాలం చాలా చిన్నదే కావచ్చు కానీ తమలోని పరిమళాన్ని చివరివరకూ వెదజల్లే ధర్మాన్ని నిర్వరిస్తూనే ఉంటాయి. నారాయణమూర్తి తెలిసిగానీ, తెలీకగానీ తన జీవితాన్ని పైన పేర్కొన్న దీపం, పూవుల్లాగే మలుచుకున్నారు. మునుపెన్నడూ చేయని మంచిపనులను చేస్తూ పోవాలని ఆయన ఆకాంక్ష. అందుకే ఆయన జీవితం మచ్చలేకుండా నడిచింది. తన కంపెనీకి కొత్త దిశను కల్పిస్తూ సామాజిక శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తూపోయారు. అందుకే తనతోపాటు తన కంపెనీ ఇన్ఫోసిస్ నిరంతరం విజయసాధనను కొనసాగిస్తూ వచ్చింది. వీరందరి లాగే విప్రో లిమిటెడ్ చైర్మన్ అజీం ప్రేమ్జీ జీవితం కూడా. తనది అసాధారణ స్వభావం. అత్యున్నత విద్యాప్రమాణాలు, ర్యాంకింగ్ కలిగిన గొప్ప మేనేజర్లను ఆయన సంస్థలో చేర్చుకున్నారు. ప్రతిభాపాటవాల ప్రాతిపదికనే విప్రోలో కీలకమైన స్థానాల్లో ప్రొఫెషనల్స్ని నియమించుకున్నారు. ఈ ప్రతిభా మార్గదర్శకత్వ ఫలితంగానే విప్రో దేశంలోనే అగ్రగామి కంపెనీగా అవతరించింది. కాబట్టే, భారత ఐటీ కంపెనీల శరవేగ పురోగతితో అసంఖ్యాక యువతకు ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, దేశం భారీ మొత్తంలో ఆదాయ పన్నును, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అయితే ఈ కంపెనీలు అసాధారణ విజయాన్ని పొందటానికి బలమైన, స్ఫర్ధాస్వభావం కలిగిన నాయకత్వమే కారణమని గ్రహించాలి. -ఆర్కే సిన్హా వ్యాసకర్త సీనియర్ ఎడిటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు -
వర్క్ ఫ్రమ్ హోమ్పై దిగ్గజ ఐటీ కంపెనీల కీలక నిర్ణయం...!
TCS Wipro Infosys HCL Tech Following These Plans To Call Employees Back: కోవిడ్-19 రాకతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గుతుండంతో వర్క్ ఫ్రమ్ హోమ్పై పలు దిగ్గజ ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో, కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు క్రమంగా ఎండ్కార్ట్ పలకాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్లోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులను హైబ్రిడ్ వర్క్ మోడల్ను ఫాలో అవ్వనున్నట్లు తెలుస్తోంది.దీంతో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్కార్డ్ పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! ఈ ఏడాది చివరలో..! పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. భారత ఐటీ నెంబర్ వన్ కంపెనీ.. టీసీఎస్ తన కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 70 శాతం మేర వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసనట్లు తెలుస్తోంది. కంపెనీలో సుమారు 95 శాతం మందికి కనీసం ఒక డోస్ పడింది. ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు టీసీఎస్ ప్లాన్ చేస్తోంది. 2022 ఏడాది ప్రారంభంలోనైనా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తోంది. అయితే 2025 నాటికి తమ ఉద్యోగుల్లో 25 శాతం వర్క్ ఫ్రమ్ చేయవచ్చునని టీసీఎస్ పేర్కొనడం గమనార్హం. హైబ్రిడ్ వర్క్ మోడల్కు సై..! ప్రముఖ ఐటీ ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ మోడల్కు సై అంటోంది. కరోనా మహమ్మారి సమయంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయింది. వీటితో పాటు మారికో, విప్రో వంటి ఐటీ కంపెనీలు కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ దిశగా సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 86 శాతం మంది కనీసం ఒక డోస్ వేసుకున్నారు. 18 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులు వారానికి రెండుసార్లు కార్యాలయానికి వస్తోన్నట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ తెలిపారు. హెచ్సీఎల్ టెక్నాలజీలో సీనియర్ ఉద్యోగులు వారానికి రెండు రోజులు కార్యాలయాలకు వస్తున్నారు. ఈ ఏడాదిలోపు గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను పిలిచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు అభిప్రాయపడ్డారు. చదవండి: చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..! -
గ్రాడ్యుయేట్స్కి బంపర్ ఆఫర్.. లక్షకు పైగా ఉద్యోగాలు
దేశంలోని పలు టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీసీఎస్ 43వేల మంద్రి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని నియమించుకోగా.. ఇప్పుడు మరో 35 వేల మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీసీఎస్తో పాటు మిగిలిన టెక్ కంపెనీలు సైతం ఈ ఫ్రెషర్స్ను నియమించుకునేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఈ ఏడాది చివరి నాటికి మరో లక్షమందికి పైగా ఫ్రెషర్స్ ఉద్యోగ అవకాశాల్ని కల్పించనున్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కంపెనీలు త్రైమాసిక ఆదాయాల గణాంకాల విడుదల సందర్భంగా ఫ్రెషర్స్ నియామకంపై స్పందించాయి. వర్చువల్ వర్క్ డిమాండ్ పెరగడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు లక్షమందిని నియమించుకోనున్నట్లు తెలిపాయి. టీసీఎస్ నియామకాలు గతవారం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా మరో 35వేల మంది ఫ్రెషర్స్ ను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 78వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లవుతుంది. టీసీఎస్ ఇప్పటికే గత ఆరునెలల్లో 43వేల మందిని ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. ఇన్ఫోసిస్ నియామకాలు గతంలో ఇన్ఫోసిస్ 35వేల మందిని నియమించుంటున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస సమస్య) రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ రావు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపల మరో 10వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు చెప్పారు. విప్రో నియామకాలు రెండో ఆర్ధిక సంవత్సరంలో (ఏప్రిల్, మే,జూన్) మొత్తం 8,100 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకున్నట్లు విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్ చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మరో 25వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. హెచ్సీఎల్ లో నియామకాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్ సైతం ఈ ఏడాది చివరి నాటికి 20వేల నుంచి 22వేల మందిని, వచ్చే ఏడాదిలో మరో 30వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
విప్రో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేడెట్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 2,931 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,484 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 30 శాతం జంప్చేసి రూ. 19,667 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 15,115 ఆదాయం సాధించింది. వార్షిక ఆదాయ రన్రేటు 10 బిలియన్ డాలర్ల(రూ. 75,300 కోట్లు)ను అధిగమించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో వెల్లడించింది. దేశీయంగా వ్యాక్సినేషన్ పూర్తయిన సీనియర్ ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. అంచనాలు ఇవీ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం రూ. 19,500–19,889 కోట్ల మధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా వేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వార్షిక ఆర్డర్బుక్ 28 శాతం జంప్చేసింది. దీంతో మొత్తం ఆర్డర్బుక్ విలువ 19 శాతం బలపడి 27 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు)ను తాకింది. దీనిలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం వాటా 8 బిలియన్ డాలర్లు(రూ. 60,000 కోట్లు)గా విప్రో వెల్లడించింది. ఆదాయంలో అమెరికా, యూరప్ల వాటా అత్యధికంకాగా.. బీఎఫ్ఎస్ఐ విభాగం 35 శాతం పురోగమించింది. ఇతర హైలైట్స్ ► ఐటీ విభాగం ఆదాయం 29.5 శాతం జంప్చేసి రూ. 19,378 కోట్ల(258 కోట్ల డాలర్లు)ను తాకింది. ► క్యూ2లో 8,100 మంది ఫ్రెషర్స్ను ఉద్యోగాల్లోకితీసుకుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 25,000 మంది ఫ్రెషర్స్కు కొత్తగా ఉపాధి కల్పించనుంది. ► క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో త్రైమాసికవారీగా ఆదాయంలో 2–4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► కరెన్సీ నిలకడ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే ఇది 27–30 శాతం పురోగతికి సమానమని విప్రో పేర్కొంది. క్యూ2 ఫలితాల విడుదల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 672 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 656– 675 మధ్య ఊగిసలాడింది. వ్యూహాలు పనిచేస్తున్నాయ్ మా బిజినెస్ వ్యూహాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు క్యూ2 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. త్రైమాసికవారీగా చూస్తే వరుసగా రెండో క్వార్టర్లో 4.5 శాతం సొంత వృద్ధిని సాధిం చాం. వార్షిక ప్రాతిపదికన తొలి అర్ధభాగంలో 28 శాతం పురోగతిని చూపాం. ఈ సందర్భంగా మా కస్టమర్లు, భాగస్వాములు, సహోద్యోగులకు కృతజ్ఞతలు. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో -
భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!
నిరుద్యోగులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఉద్యోగాల నియామకాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. 2020 గణాంకాల ప్రకారం..కోవిడ్ కారణంగా ఇండియాలో 12.2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసిన సంస్థలు తిరిగి.. ఉద్యోగుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత దేశంలో థర్డ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నా..పలు సెక్టార్లకు చెందిన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది కాలంగా కరోనా ఇండియన్ జాబ్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశంపై విశ్లేషణ చేస్తున్న జాబ్ సైట్ ఇండీడ్ రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ప్రస్తుతం జాబ్ మార్కెట్లో టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. 400శాతం వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల డిమాండ్ పెరిగినట్లు ఇండీడ్ తన రిపోర్ట్లో పేర్కొంది. లింక్డ్ఇన్ జాబ్ కోసం అప్లయ్ చేస్తే టెక్ ఉద్యోగాలకు ఏ విధమైన డిమాండ్ ఉందో తెలుస్తోందని చెప్పింది. అంతేకాదు 2020లో మహమ్మారి ప్రారంభంలో పలు రంగాల్లో అనిశ్చితి నెలకొందని, జూన్ 2020లో కరోనా ఫస్ట్ వేవ్ గరిష్ట స్థాయికి చేరడానికి కొన్ని నెలల ముందు ఉద్యోగుల నియామకం 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది. వీటితో పాటు అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ఫోర్స్ డెవలపర్,సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్కు డిమాండ్ 150-300 శాతం మధ్య పెరిగింది. 70-120 శాతం జీతాల పెంపు సంస్థలు ఉద్యోగుల్ని నియమించడమే కాదు. గతేడాదితో పాలిస్తే ఇప్పుడు భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నాయి.ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఆశించడమే కాదు..అదే స్థాయిలో కంపెనీలు శాలరీలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంలేదు.పుల్ స్టాక్ ఇంజనీర్లకు కంపెనీలు 70-120 శాతం వరకు జీతాలు పెంచుతున్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల పెంపు 20-30 శాతంగా ఉంది. ఉద్యోగులకు ఇదే మంచి సమయం ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది. టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు దేశం అంతా టెక్ ఉద్యోగుల్ని భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న, మంచి ఉద్యోగం కావాలనుకునే అభ్యర్ధులకు నైపుణ్యాలు ఉంటే ఇదే మంచి సయమం. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని ఇండీడ్ తన నివేదికలో స్పష్టం చేసింది. చదవండి: నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం -
వారంలో రెండు రోజులు ఆఫీస్..!
బెంగళూరు: ప్రముఖ ఐటి సంస్థ విప్రో ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని కోరింది. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి రెండు రోజులు కార్యాలయం నుంచి పని చేస్తారు అని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషాద్ ప్రేమ్ జీ ట్విట్టర్ లో దీనికి సంబంధించి ఇలా ట్వీట్ చేశారు... "18 నెలల సుదీర్ఘ కాలం తర్వాత, మా నాయకులు @Wipro రేపు(వారానికి రెండుసార్లు) కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. పూర్తిగా వ్యాక్సిన్ ఇచ్చాము, అందరూ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు" అని అన్నారు. (చదవండి: జుకర్బర్గ్పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు) విప్రో కార్యాలయంలో ప్రవేశించేటప్పుడు ఉష్ణోగ్రత తనిఖీలు, క్యూఆర్ కోడ్ స్కాన్లతో సహా కోవిడ్-19 సంబంధిత భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. జూలై 14న జరిగిన కంపెనీ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రేమ్ జీ భారతదేశంలోని ఉద్యోగులలో 55 శాతం మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. విప్రోలో ప్రస్తుతం సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచ శ్రామిక శక్తిలో మూడు శాతం కంటే తక్కువ మంది కార్యాలయం నుంచి పనిచేస్తున్నారని ప్రేమ్ జీ పేర్కొన్నారు. After 18 long months, our leaders @Wipro are coming back to the office starting tomorrow (twice a week). All fully vaccinated, all ready to go - safely and socially distanced! We will watch this closely. pic.twitter.com/U8YDs2Rsyo — Rishad Premji (@RishadPremji) September 12, 2021 -
ఐటీ కంపెనీల్లో అత్యధిక వేతనం ఈయనకే
సాక్షి, వెబ్డెస్క్: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అత్యధిక శాలరీ ఇస్తున్న ఐటీ సంస్థగా హెచ్సీఎల్ రికార్డు సృష్టించింది. మిగిలిన ఐటీ సంస్థలను వెనక్కి నెట్టిన కంపెనీ తమ సీఈవో వియజ్కుమార్కి అత్యధిక వేతనం కట్టబెట్టింది. ఇటీవల ఆ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. సీఈవో విజయ్ కుమార్ నోయిడా కేంద్రంగా ఐటీ సర్వీసులు అందిస్తోన్న హెచ్సీఎల్ దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందింది. ఆ సంస్థకు 2016 అక్టోబరు నుంచి సీఈవోగా విజయ్కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివకుమార్నాడర్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎండీగా కూడా విజయ్కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హయ్యస్ట్ శాలరీ ఇటీవల హెచ్సీఎల్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ కంపెనీ సీఈవో విజయ్ కుమార్ మూల వార్షిక వేతనాన్ని రెండు మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కలిపితే మొత్తం వేతనం 4.38 మిలియన్ డాలర్లుకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ 32.54 కోట్లుగా ఉంది. వార్షిక వేతనంతో పాటు 31.50 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు సైతం కట్టబెట్టింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు 10.80 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియన్ కరెన్సీలో ఈ వేతనం రూ.80.19 కోట్లగా ఉంది. 2026 మార్చి వరకు ఆయన ఈ వేతనం పొందుతారు. విప్రోని దాటి ఐటీ కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు విప్రో సీఈవో థైరీ డెలాపోర్టే 8.8 మిలియన్ డాలర్ల వార్షిక వేతనమే హయ్యస్ట్. తాజాగా హెచ్సీఎల్ సీఈవో దీన్ని అధిగమించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం 6.78 మిలియన్ డాలర్లు, టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథ్ వేతనం 2.8 మిలియన్ డాలర్లుగా ఉంది. -
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు రెట్టింపు
ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జూన్లో విదేశాల్లో ప్రత్యక్షంగా పెట్టిన పెట్టుబడులు 2.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్ నాటి 1.39 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే, వార్షికంగా పెరిగినప్పటికీ నెలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది మేలో నమోదైన 6.71 బిలియన్ డాలర్ల కన్నా జూన్లో పెట్టుబడులు సుమారు 58 శాతం తక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు పూచీకత్తు రూపంలో, 1.21 బిలియన్ డాలర్లు రుణంగాను, మరో 427 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి రూపంలోను నమోదైంది. భారీ పెట్టుబడుల్లో టాటా స్టీల్ .. సింగపూర్లోని తమ అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, విప్రో తమ అమెరికా విభాగంలో 787 మిలియన్ డాలర్లు, టాటా పవర్ .. మారిషస్లోని యూనిట్లో 131 మిలియన్ డాలర్లు మొదలైన డీల్స్ ఉన్నాయి. డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ విదేశ్, పహార్పూర్ కూలింగ్ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలైనవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవి 45 మిలియన్ డాలర్ల నుంచి 56 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇది ప్రాథమిక డేటా మాత్రమేనని, అధీకృత డీలర్ బ్యాంకుల నివేదికలను బట్టి మారవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
ఐటీలో వర్క్ఫ్రం హోంకి ఎండ్కార్డ్! ఎప్పుడంటే?
దిగ్గజ ఐటీ కంపెనీలు వర్క్ఫ్రం హోంకి ఎండ్కార్డ్ పలికేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్తో ఏడాదిన్నరకి పైగా కొనసాగుతున్న విధానానికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇళ్ల నుంచి కాదు ఆఫీసుకు వచ్చి పని చేయండి త్వరలోనే చెప్పబోతున్నాయి. సాక్షి, వెబ్డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా వర్క్ఫ్రం హోం కామన్గా మారింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు అయితే వర్క్ఫ్రం హోంపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ఐటీ ప్రొఫెషనల్స్ ఆరోగ్యం, కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఇంటి నుంచి పనికే మద్దతు తెలిపాయి. అయితే క్రమంగా దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో ఇంటి నుంచి పనికి స్వస్తి పలికి ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులను కోరేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యాక్సినేషన్పైనే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటే, ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ కోరుతామంటూ విప్రో మానవ వనరుల విభాగం చీఫ్ సౌరభ్ గోవిల్ తెలిపినట్టు ‘మింట్’ పేర్కొంది. ఇటీవల జరిగిన విప్రో వార్షిక సమావేశంలో వర్క్ఫ్రంహోంపై కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ కీలక ప్రకటన చేసినట్టు మింట్ తెలిపింది. దాని ప్రకారం విప్రోకు ఇండియాలో రెండు లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మిగిలిన ఉద్యోగులకు కూడా టీకాలు ఇప్పించి ఆఫీసు నుంచి పని చేయాలని విప్రో కోరనున్నట్టు సమాచారం. ఆఫీసుకే ఓటు ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులతో దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న టీసీఎస్ కూడా వర్క్ఫ్రం హోంకి బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే టీసీఎస్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగే తీరు ఆధారంగానే నిర్ణయం తీసుకోనన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరు చివరి నాటికి తమ కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు టీకాలు పూర్తవుతాయని టీసీఎస్ హెచ్ఆర్ గ్లోబల్ ఛీప్ మిలింద్ తెలిపారు. 98 శాతం వర్క్ఫ్రం హోం ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో 98 శాతం మంది వర్క్ఫ్రం హోంలోనే ఉన్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి పని చేయాలని కోరే యోచనలో ఉంది ఇన్ఫోసిస్. సెప్టెంబరు ? ఇప్పటి వరకైతే టీసీఎస్, విప్రో కంపెనీలు సెప్టెంబరు చివరి వారం నాటికి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పని చేయాలని కోరాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ మేరకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ ఈ ఏడాది చివరి నాటికి కనీసం 30 శాతం మంది ఉద్యోగులను ఆఫీసుకుల రమ్మలాని పిలిచే అవకాశం ఉంది. కచ్చితంగా చెప్పలేం అయితే వర్క్ఫ్రం హోంకు మంగళం పాడాలా వద్దా అనే అంశంపై ఐటీ కంపెనీలు కచ్చితమైన రోడ్ మ్యాప్ను ప్రకటించకలేక పోతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం, కరోనా థర్డ్ వేవ్ ఇతర అంశాల ఆధారంగానే వర్క్ఫ్రం హోం ఎన్నాళ్లు అనేది ఆధారపడి ఉంది. -
ఫ్రెషర్లకు దేశీయ ఐటీ దిగ్గజాలు గుడ్న్యూస్..!
కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడటంతో దేశీయ ఐటీ సంస్థలు నియామక ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐటీ సంస్థలకు కొత్త కాంట్రాక్టులు వస్తుండటంతో డిమాండ్ తగ్గట్టుగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసీస్, విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. టీసీఎస్ దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని అన్నీ క్యాంపస్ ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనుంది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అవతరించిన టీసీఎస్ 2020లో క్యాంపస్ల నుంచి 40,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. "భారతదేశంలోని క్యాంపస్ ల నుంచి మేము గత సంవత్సరం 40,000 నియమించుకున్నాము. ఈ ఏడాది 40,000 లేదా అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు" ఆ కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ గత వారం చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవని ఆయన అన్నారు. గత ఏడాది, మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇన్ఫోసీస్ ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ వై22 ఆర్ధిక సంవత్సరంలో 35,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియాయమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు క్యూ1 సంపాదన ప్రకటనలో తెలిపారు. ఇన్ఫోసిస్ 2022 జూన్ త్రైమాసికం చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలు, 2021 మార్చి త్రైమాసికంలో ఈ సంఖ్య 2.59 లక్షలు. "ఇటీవలి కాలంలో డిజిటల్ సంస్థలకు డిమాండ్ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 35,000 కాలేజీ గ్రాడ్యుయేట్ల నియామక ప్రక్రియ ద్వారా ఈ డిమాండ్ ను తీర్చాలని మేం యోచిస్తున్నాం'' అని ఆయన తెలిపారు. విప్రో విప్రో ఐటీ ఉద్యోగుల సంఖ్య 2,00,000 మైలురాయిని దాటింది. విప్రో సంస్థ ఈ ఏడాది తన మొదటి త్రైమాసిక సమావేశంలో ఉద్యోగుల సంఖ్య 2,09,890కకు చేరుకున్నట్లు తెలిపింది. మొదటి త్రైమాసికంలో 10,000 కంటే ఎక్కువ ఇతర నియమకాలతో పాటు 2,000 కంటే తక్కువ ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 6,000 ఫ్రెషర్లను నియమించికొనున్నట్లు విప్రో తెలిపింది. వచ్చే ఏడాది ఎఫ్ వై23లో 20,000కి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తుంది. అయితే, విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే పెద్ద సంస్థల నుంచి కాంట్రాక్టులు రావడంతో అధిక ఒత్తిడిని నివారించడానికి విప్రో భారీ మొత్తంలో నియామక చేపట్టనున్నట్లు తెలిపారు. -
విప్రో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ విప్రో జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22) చక్కని పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ లాభం (అనుబంధ సంస్థలతో కలసి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 35.6 శాతం వృద్ధితో రూ.3,243 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,390 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆదాయ వృద్ధిని సాధించగలమన్న సానుకూల అంచనాలను కంపెనీ యాజమాన్యం వ్యక్తం చేసింది. ఆదాయం 22.3 శాతం పెరిగి రూ.18,252 కోట్లుగా నమోదైంది. ‘‘వేగవంతమైన వృద్ధి క్రమంలో ఉన్నాం. మా సరఫరా చైన్ స్థాయిని పెంచాం. అలాగే, నిపుణుల నియామకంలోనూ ప్రగతి ఉంది. ఇదే మంచి పనితీరుకు దోహదం చేసింది. వచ్చే మూడు త్రైమాసికాలకు సంబంధించి బలమైన పనితీరు నమోదు చేసేందుకు వీలుగా ఆర్డర్లు అందుకున్నాం. క్యూ1, క్యూ2 అంచనాలను గమనిస్తే.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించగలమన్నది స్పష్టమవుతుంది. క్యాప్కోను మినహాయించి చూసినా ఈ మేరకు వృద్ధి సాధిస్తాం’’ అని విప్రో సీఈవో, ఎండీ థీరీ డెలపోర్టే తెలిపారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాప్కో కంపెనీని విప్రో 1.45 బిలియన్ డాలర్లకు (రూ.10,500 కోట్లు) ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలు. క్యూ2లో 5–7 శాతం వృద్ధి జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 5.7% ఆదాయంలో వృద్ధిని నమోదు చేయగలమన్న అంచనాలను విప్రో తాజాగా వ్యక్తం చేసింది. డాలర్ మారకంలో 2,535–2,583 మిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చని ప్రకటించింది. ఇందులో దిగువ స్థాయి అంచనాల మేరకు ఆదాయం నమోదైనా.. వార్షిక ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమిస్తామని డెలపోర్టే పేర్కొన్నారు. ప్రధానమైన ఐటీ సేవల విభాగంలో ఆదాయం 2020–21 మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. 2021–22 జూన్ క్వార్టర్లో 12.2% పెరిగి 2,414 మిలియన్ డాలర్లకు చేరుకుంది. వార్షికంగా చూస్తే 25.7 శాతం పెరిగింది. 2.4 శాతం వృద్ధి ఉండొచ్చన్న గత అంచనాలతో పోలిస్తే మెరుగైన పనితీరే నమోదైంది. ‘‘మా నూతన వ్యాపార విధానం నిర్వహణ నమూనాను సులభతరం చేస్తుంది. దీనికి సంబంధించి చక్కని ఫలితాలు కనిపించనున్నాయి. అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలు మాత్రమే కాదు.. 38 క్వార్టర్లలో అత్యధిక సీక్వెన్షియల్ (త్రైమాసికవారీగా) వృద్ధి ఇది. అన్ని మార్కెట్లలోనూ బలమైన విక్రయాలు అద్భుతమైన వృద్ధికి దారితీశాయి. డిమాండ్ ఎంతో బలంగా ఉంది’’అని డెలపోర్టే కంపెనీ పనితీరును వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత విప్రో ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో షేరు రెండున్నర శాతం లాభంతో రూ.576 వద్ద ముగిసింది. నియామకాలు పెంచుతున్నాం.. అధిక అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సర్వ సాధారణమేనని డెలపోర్టే తెలిపారు. ‘‘క్యాంపస్ల నుంచి నియామకాలను రెట్టింపు చేశాం. 2021–22లో 33 శాతం ఫ్రెషర్లను (కొత్తవారిని) అదనంగా తీసుకోనున్నాం. క్యూ2లో (జూలై–సెప్టెంబర్లో) 6,000 మందికి పైగా ఫ్రెషర్లను తీసుకుంటాం’’ అని డెలపోర్టే వివరించారు. 80 శాతం ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించగా ఇది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని.. ఇది ప్రస్తుత సంవత్సరంలో రెండో పెంపుగా చెప్పారు. -
స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లు... ఈ విషయాలపై కన్నేయండి
ముంబై: కార్పొరేట్ ఫలితాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలు కూడా కీలకంగా మారొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, డాలర్తో రూపాయి మారకం, ముడిచమురు కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయగలవని విశ్లేషిస్తున్నారు. గత వారంలో సెన్సెక్స్ 98 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం ఇందుకు కారణమైంది. ‘‘స్టాక్ మార్కెట్లో స్థిరీకరణ కొనసాగవచ్చు. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. పతనమైన ప్రతిసారి కొనుగోలు తరహా విధానం నడుస్తోంది. కావున కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు మద్దతు లభిస్తోంది. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,800 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే.. ఆర్థిక గణాంకాల విడుదలతో అప్రమత్తత కేంద్రం గణాంకాల శాఖ జులై 12న సోమవారం మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడించనుంది. ఇవాళే జూన్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు జులై 14న (బుధవారం)వస్తాయి. జూన్ నెల వాణిజ్య లోటు గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. ఆర్బీఐ జూన్ 2తో ముగిసిన వారపు డిపాజిట్లు, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలను శుక్రవారం విడుదల చేయనుంది. అదే రోజున జూన్ 9వ తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను విడుదల చేయనుంది. కీలక స్థూల గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్ ఒకింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని అంచనా. ఈ వారం త్రైమాసిక ఫలితాలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత వారంలో క్యూ1 ఆర్థిక గణాంకాలను ప్రకటించి కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడిని షురూ చేసింది. ఈ వారంలో ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్అండ్టీతో సహా 75కు పైగా కంపెనీలు తమ తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. రెండో దశ కోవిడ్ కట్టడికి స్థానిక ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలతో కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అయితే ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. దొడ్ల డైయిరీ, హెచ్ఎఫ్సీఎల్, హెచ్ఎంటీ, డెక్కన్ హెల్త్ కేర్, టాటా మోటాలిక్స్, 5పైసా క్యాపిటల్, క్రాఫ్ట్మెన్ ఆటోమెషన్, ఎస్సార్ సెక్యూరిటీస్, హట్సన్ ఆగ్రో ప్రాడెక్ట్స్, ఏంజిల్ బ్రోకింగ్, ఆదిత్య బిర్లా మనీ, సియెంట్, మంగళం టింబర్ ప్రాడెక్ట్స్, టాటా ఎలక్సీ, టాటా స్టీల్, డెన్ నెట్వర్క్స్ తదితర కంపెనీలు ఇదే వారంలో క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. డెల్టా వేరియంట్ ఆందోళనలు... పలు దేశాల్లో కొత్త రకం కరోనా డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తోంది. ఈ తాజా పరిణామం జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతోంది. వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. మన దేశంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు అనూహ్యంగా పుంజుకుంటుండటంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎఫ్ఐఐలు అమ్మేస్తున్నారు బెంచ్మార్క్ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) లాభా ల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ జూలై తొలి ఏడురోజుల్లో ఎఫ్ఐఐలు రూ.2,249 కోట్ల విలువైన షేర్లను అమ్మినట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘ఇతర కరెన్సీ విలువల్లో యూఎస్ డాలర్ బలపడుతోంది. ఒపెక్ దేశాలు ఉత్పత్తికి ఆసక్తి చూపకపోవడంతో క్రూడాయిల్ ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. తర్వలో వడ్డీరేట్లను పెంచుతామని యూఎస్ ఫెడ్ కమిటీ తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు రాక పరిమితంగా ఉండొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ విక్రయాలు డౌన్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా ఉండకపోవచ్చంటూ విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రకటించింది. కరోనా రెండో దశ కారణంగా జూన్ త్రైమాసికంలో ఎన్నో సవాళ్లను చూశామని.. పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ విక్రయాలు నిదానించొచ్చని ఈ సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పట్టణ మార్కెట్లలో విక్రయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్నాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఒకే మాదిరి విక్రయాలు ఉండొచ్చని విప్రో కన్జూమర్కేర్ అంచనా వేసింది. పామాయిల్ ధరలు కాస్త శాంతించడంతో సంతూర్ సబ్బుల ధరలు పెరుగుతాయని భావించడం లేదని తెలిపింది. సబ్బుల తయారీలో పామాయిల్ను ముడిపదార్థంగా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ ఏడాది మార్చి, జూన్లో రెండు పర్యాయాలు మొత్తం మీద 8 శాతం వరకు సబ్బుల ధరలను విప్రో కన్జూమర్ పెంచడం గమనార్హం. ఆన్లైన్లో ఎఫ్ఎంసీజీ విక్రయాలు జోరుగా నడుస్తుండడంతో.. ఈకామర్స్ కోసమే ఉత్పత్తులను తీసుకురానున్నట్టు విప్రో తెలిపింది. ఆన్లైన్లో పెరిగిన విక్రయాలు ఇక ముందూ కొనసాగుతాయని అంచనా వేస్తున్నట్టు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ ఈడీ వినీత్ అగర్వాల్ తెలిపారు. ‘‘గతంలో మాదిరి కాకుండా ఈ విడత గ్రామీణ ప్రాంతాలు సైతం కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కనుక అమ్మకాల్లో వృద్ధి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒకేలా ఉండొచ్చు. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో విప్రో 17.3 శాతం వృద్ధిని నమోదు చేసింది’’ అని అగర్వాల్ వివరించారు. -
ఐటీలో భవిష్యత్ అంతా వీటిదే
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీలు, సర్వీసులే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధికి దోహదపడనున్నట్లు దిగ్గజ సంస్థ విప్రో సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. డేటా, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ వంటి విభాగాలు భారీ స్థాయిలో ఎదిగే అవకాశం ఉందని వివరించారు. ఎక్కడ నుంచి అయినా పనిచేయడం, క్రౌడ్సోర్సింగ్ తదితర విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. వృద్ధి సాధన దిశగా తమ సంస్థ అయిదు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. కీలక రంగాలపై మరింతగా దృష్టి పెట్టడం, క్లయింట్లతో భాగస్వామ్యాన్ని పటిష్టపర్చుకోవడం, ప్రతిభావంతులైన సిబ్బందిపై ఇన్వెస్ట్ చేయడం, వ్యాపార నిర్వహణ విధానాన్ని సరళతరం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు డెలాపోర్ట్ తెలిపారు. వ్యాపార వ్యూహాల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతో పాటు భారత్లో కూడా ఇతర సంస్థలను కొనుగోలు చేసినట్లు వివరించారు. క్యాప్కో సంస్థ కొనుగోలుతో అంతర్జాతీయంగా ఆర్థిక సేవల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ఆయన పేర్కొన్నారు.దీనికోసం విప్రో సుమారు 1.45 బిలియన్ డాలర్లు వెచ్చించింది. చదవండి: Gold: డిజిటల్ గోల్డ్తో.. లాభాల పంట -
విప్రో ఉద్యోగులకు శుభవార్త!
ఐటీ రంగ దిగ్గజం విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేడు (జూన్ 18) తన ఉద్యోగులలో 80 శాతం మంది వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాండ్ బి3(అసిస్టెంట్ మేనేజర్, దిగువ స్థాయి) అర్హులైన ఉద్యోగులందరికీ మెరిట్ వేతన పెంపు(ఎంఎస్ఐ)ను ప్రారంభిస్తుందని, ఇది సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాండ్ ఉద్యోగులు కంపెనీ శ్రామిక శక్తిలో 80 శాతంగా ఉన్నారు. ఈ క్యాలెండర్ లో ఉద్యోగులకు ఇది రెండవ వేతన ఇంక్రిమెంట్. ఈ బ్యాండ్ లలో అర్హులైన ఉద్యోగులకు జనవరి, 2021లో కంపెనీ వేతనాలను పెంచినట్లు ప్రకటించింది. బ్యాండ్ సీ1(మేనేజర్లు, ఆపైన) అర్హులైన ఉద్యోగులందరూ జూన్ 1 నుంచి పెంచిన వేతనాలను అందుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. విప్రో ప్రధాన పోటీదారు టీసీఎస్ మొదట ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1, 2021న వేతన పెంపును ప్రకటించింది. -
విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) థియరీ డెలాపోర్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64.3 కోట్ల (దాదాపు 8.7 మిలియన్ డాలర్లు) వేతన ప్యాకేజ్ అందుకున్నారు. 2020 జూలై 6 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్య కాలానికి డెలాపోర్ట్ ఈ వేతనాన్ని అందుకున్నట్లు సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఇందులో ఒన్టైమ్ క్యాష్, స్టాక్ గ్రాంట్, ఆర్ఎస్యూ (రిస్ట్రక్టెడ్ స్టాక్ యూనిట్స్) ఒన్టైమ్ గ్రాంట్ కలిసి ఉన్నాయని తెలిపింది. అబిదాలి నీముచ్వాలా వారసునిగా జూలై 6వ తేదీన విప్రోలో చేరారు. అంతకుముందు ఆయన క్యాప్జెమినీ ఎగ్జిక్యూటవ్గా పనిచేశారు. భారత్ ఐటీ సేవల రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్గా నిలిచారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2020-21లో రూ.49.68 కోట్లు. 2019-20లో ఈ ప్యాకేజ్ రూ.34.27 కోట్లు. ఇక టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపాలన్ వేతనం 2020-21లో రూ.20.36 కోట్లు. కాగా, విప్రో చైర్మన్ రషీద్ ప్రేమ్జీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.61 మిలియన్ డాలర్ల వేతనం తీసుకుంటే, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అందుకున్న మొత్తం 1.01 మిలియన్ డాలర్లు. చదవండి: కోవిడ్ పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్ -
డెనిమ్ గ్రూప్లో విప్రో వాటా అమ్మకం
న్యూఢిల్లీ: స్వతంత్ర అప్లికేషన్ సెక్యూరిటీ సంస్థ డెనిమ్ గ్రూప్లో పూర్తి వాటాను విక్రయించినట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. వాటాను 22.42 మిలియన్ డాలర్ల(రూ. 160 కోట్లు)కు విక్రయించినట్లు తెలియజేసింది. 2018 మార్చిలో డెనిమ్ గ్రూప్, మేనేజ్మెంట్లో 33.33 శాతం వాటాను విప్రో కొనుగోలు చేసింది. ఇందుకు 8.83 మిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇటీవల కోల్ఫైర్ సంస్థ డెనిమ్ గ్రూప్ను సొంతం చేసుకున్న నేపథ్యంలో పూర్తి వాటాను విక్రయించినట్లు విప్రో వివరించింది. దీంతో ప్రస్తుతం డెనిమ్ గ్రూప్ పెట్టుబడుల నుంచి పూర్తిగా వైదొలగినట్లు తెలియజేసింది. కాగా.. మరోవైపు యూఎస్కు చెందిన ఐటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ కంపెనీ స్క్వాడ్క్యాస్ట్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందుకు 1.2 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. తద్వారా 20 శాతానికంటే తక్కువ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. జూన్ చివరికల్లా ఈ లావాదేవీ పూర్తికానున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 539 వద్ద ముగిసింది. -
ఆ ఘనత సాధించిన మూడో ఐటీ కంపెనీగా విప్రో
ముంబై: భారత ఐటీ సంస్థ విప్రో గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.3 ట్రిలియన్ ను తాకింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన మూడవ భారత ఐటీ సంస్థగా విప్రో నిలిచింది. మార్కెట్ ప్రారంభంలో విప్రో స్టాక్ ధర రూ.550 తాకింది. బీఎస్ఈలో అంతకుముందు రోజు రూ.543.05 వద్ద ముగిసింది. ప్రస్తుతం విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.01 ట్రిలియన్. మింట్ నివేదిక ప్రకారం, థియరీ డెలాపోర్ట్ సంస్థ సీఈఓ, ఎమ్ డీగా చేరినప్పటి నుంచి విప్రో స్టాక్ పెరిగింది. డెలాపోర్ట్ నాయకత్వంలో జర్మనీ రిటైలర్ మెట్రో నుంచి ఈ సంస్థ 7.1 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఒప్పందాన్ని చేసుకుంది. భారతదేశంలో మొత్తం దీని పేరిట 13 లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. ఇవి రూ.3 ట్రిలియన్ ఎం-క్యాప్ను దాటాయి. విప్రో ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశం మొత్తంలో 14వ స్థానంలో ఉంది. విప్రో వాటా కేవలం ఒక సంవత్సరంలోనే 157 శాతం పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 40 శాతం పెరిగింది. ఒక నెలలో విప్రో స్టాక్ 11.44 శాతం పెరిగింది. రూ.14.05 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో రిలయన్స్ ఇండస్ట్రీస్, రూ.11.58 మార్కెట్ క్యాపిటలైజేషన్తో ట్రిలియన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, రూ.8.33 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశంలో అత్యంత విలువైన సంస్థలుగా ఉన్నాయి. చదవండి: వాట్సాప్ ఉపాయాలు పన్నుతోంది: కేంద్రం -
టెకీలకు బంపర్ ఆఫర్ : డబుల్ హైక్స్ కు ఐటీ దిగ్గజాల మొగ్గు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా గత ఏడాది చాలా ఐటి కంపెనీలు జీతాల పెంపును వాయిదా వేసుకున్నాయి. గత ఏడాది రెండవ భాగంలో వ్యాపారం పుంజుకున్నందున, చాలా ఐటి కంపెనీలు గత క్యాలెండర్ సంవత్సరం చివరి నుంచి లేదా ఈ ఏడాది ఆరంభం నుంచి ఇంక్రిమెంట్ ఇవ్వడం ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఐటీ దిగ్గజాలు ఇప్పటికే వేతనాలు పెంచడంతో పాటు నైపుణ్యం గల మానవ వనరులను నిలుపుకునేందుకు డబుల్ హైక్స్ కూడా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. కరోనా మహమ్మారి డిజిటల్ వాడకం పెరగడంతో పాటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గి పోయాయి. అందుకే ప్రతిభ గల ఉద్యోగులు జారీ పోకుండా ఉండేందుకు డబుల్ హైక్స్ ఇచ్చేందుకు సిద్దపడుతున్నాయి. దీంతో టెకీల్లో జోరు నెలకొంది. ఇప్పుడు ప్రతిభకు పోటీ తీవ్రతరం కావడంతో, చాలా ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్లతో మళ్లీ బహుమతి ఇస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 2 లక్షలకు పైగా ఉద్యోగులున్న యాక్సెంచర్ ఇండియా గత ఏడాదికి డిసెంబరులో ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ వేతనాల పెంపు, బోనస్, ప్రమోషన్లను ప్రకటించింది. ఏప్రిల్లో అసోసియేట్ డైరెక్టర్ స్థాయి వరకూ ఒన్ టైమ్ థ్యాంక్యూ బోనస్ ను అందచేశామని యాక్సెంచర్ ఇండియా ప్రకటించినట్టు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు. గత ఏడాది డిసెంబరులో, యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 605 మందిని ఎండికి, 63 మందిని సీనియర్ ఎండికి ప్రమోషన్ ఇచ్చింది. ఇందులో రికార్డు శాతం మహిళలు ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ ఈవీపీ & హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు హైక్స్ నిలిపివేసిన తరువాత జనవరి నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభించారు. గత సంవత్సరం పనితీరు ఆధారంగా మరో సమీక్ష ఇన్ఫోసిస్ చేస్తున్నట్లు పేర్కొంది. పనితీరు ఆధారంగా జీతం పెంపు జూలై నుంచి అమలులోకి రానుంది. రెండు ఇంక్రిమెంట్లు కలుపుకుని 10 నుంచి 14 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఇన్ఫోసిస్ ప్రధాన ప్రత్యర్థి టీసీఎస్ ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇంక్రిమెంట్లను ఇచ్చినట్లు ప్రకటించింది. టీసీఎస్ అన్ని భౌగోళిక ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్ ఇచ్చింది. చాలా మంది సీనియర్ ఉద్యోగులు 6-8 శాతం వరకు వేతన పెంపును అందుకున్నారని, ఇది సాధారణం కంటే ఎక్కువగా అని మార్కెట్ వర్గాల అభిప్రాయం. ఇక విప్రో మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో జూన్ లో వేతన పెంపును అమలు చేస్తామని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి తమ సిబ్బంది వేతనాలు పెంచినట్టు టెక్ మహీంద్ర పేర్కొంది. చదవండి: భారత్ కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్