
( ఫైల్ ఫోటో )
సాక్షి, తూర్పు గోదావరి : రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్మెంట్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నడింపల్లి నరసింహారాజు, వెంకటరమణమ్మగా పోలీసులు గుర్తించారు. భర్త నిడదవోలులో టీచర్ కాగా, భార్య ఉమెన్స్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్ పని చేస్తోంది. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.