భయానక రోడ్డు ప‍్రమాదం.. ఐదుగురు మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం | Five People Dead In Road Accident At Chhattisgarh | Sakshi

రోడ్డు ప‍్రమాదంలో ఐదుగురు మృతి.. రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

Mar 16 2022 7:08 AM | Updated on Mar 16 2022 11:26 AM

Five People Dead In Road Accident At Chhattisgarh - Sakshi

ఛత్తీస్​గఢ్: ఛత్తీస్​గఢ్​లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప‍్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోబా సమీపంలో ఓ ట్రక్కు-ట్రాకర్ట్‌ ఢీకొట్టుకున్నాయి. ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స‍్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరంతా మొహ్లాయ్‌ గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితులందరూ మజర్‌ కట్టాకు చెందినవారని వెల్లడించారు.

మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్​​ బఘేల్​ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని.. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement