ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం | Petrol Bottles Attack On House In Ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం

Jul 13 2021 11:08 AM | Updated on Jul 13 2021 11:42 AM

Petrol Bottles Attack On House In Ongole - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఒక కుటుంబంపై కొంతమంది వ్యక్తులు పెట్రోల్ ఫైర్ బీర్ బాటిల్స్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. చెన్నకేశవ కాలనీకి చెందిన కుంచాల మహేష్‌కు ఒంగోలు మంగలపాలనికి చెందిన హైపర్ అలీ,అక్రమ్ అలీ,గుంటూరు మహేష్,సుమంత్, గణేష్‌లకు మధ్యఆర్థిక  విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ గొడవ జరిగినట్లు మహేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


గతంలో ఇరువురి మధ్య జరిగిన గొడవలు నేపథ్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేసులను ఉపసంహరించుకోవాలని మహేష్ కుటుంబంపై మిగిలిన వాళ్లు ఒత్తిడి తెచ్చారు. అయితే మహేష్ కుటుంబ సభ్యులు కేసును ఉపసంహరించుకున్నప్పటికి... పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈ దాడులకు తెగ పడినట్లు మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement