రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన అంబులెన్స్‌ | Road Accident: Ambulance Crashes Into Culvert At Ibrahimpatnam In Krishna | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు

Published Fri, Aug 21 2020 2:51 PM | Last Updated on Fri, Aug 21 2020 3:33 PM

Road Accident: Ambulance Crashes Into Culvert At Ibrahimpatnam In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి వస్తున్న అంబులెన్స్‌ ఇబ్రహీంపట్నం కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయలయ్యాయి. వివరాలు.. కరోనా రోగులను తీసుకుని హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన అంబులెన్స్‌ ఈరోజు(శుక్రవారం) తెల్లవారు జామున సత్యనారాయణపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాడేరుకు చెందిన గ్రంధి రంగ నాయకుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement