Vijayawada Crime News
-
‘మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’
సాక్షి, విజయవాడ: మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హత్య, దోపిడి(మర్డర్ ఫర్ గెయిన్)తో పాటు మరణాయుధాల చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే నిందితులు ఇద్దరు ఆటోలో వచ్చినట్టు గుర్తించామని మహేష్ హత్య తర్వాత నిందితులు కారు వదిలిన ప్రాంతంలో సీసీ ఫుట్టేజ్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. (చదవండి: బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం) కాల్పుల సమయంలో మహేష్తో పాటు స్పాట్లో ఉన్న నలుగురినీ విచారిస్తున్నామని తెలిపారు. మహేష్ కుటుంబ సభ్యుల అనుమానాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, మహేష్పై నిందితులు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారని, అయిదు రౌండ్లు కాదని డీసీపీ స్ఫష్టం చేశారు. బులెట్ల ఆధారంగా నిందితులు 7.5 ఎమ్ఎమ్ బుల్లెట్లు వాడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగవంతం చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన అంబులెన్స్
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అంబులెన్స్ ఇబ్రహీంపట్నం కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయలయ్యాయి. వివరాలు.. కరోనా రోగులను తీసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ ఈరోజు(శుక్రవారం) తెల్లవారు జామున సత్యనారాయణపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాడేరుకు చెందిన గ్రంధి రంగ నాయకుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వివాహితపై సామూహిక లైంగిక దాడి
తెనాలి రూరల్: తెలిసీ తెలియని వయసులో పెళ్లి, తెలియనితనంతో వేసిన తప్పటడుగు ఓ బాలిక జీవితాన్ని అంధకారం చేసింది. ప్రియుడితో కలసి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకునే సమయం మించిపోవడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్లే క్రమంలో మరో ఇద్దరు మృగాళ్లకు చిక్కి రెండు వారాలకుపైగా నరకం అనుభవించింది. చివరకు వారి నుంచి తప్పించుకుని బయటపడి పోలీసులను ఆశ్రయించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా తెనాలి సబ్–డివిజనల్ కమాండ్ కంట్రోల్లో మంగళవారం డీఎస్పీ కె.శ్రీలక్ష్మి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలేనికి చెందిన 14 ఏళ్ల బాలికకు తండ్రి మరణించడంతో ఏడాదిన్నర క్రితం కర్లపాలెం మండలం కట్టవాద గ్రామానికి చెందిన యువకుడితో తల్లి వివాహం జరిపించింది. అక్కడ బాలికకు భర్త ఇంటి సమీపంలో ఉండే నూతలపాటి నవీన్కుమార్ అలియాస్ నవీన్ పరిచయమయ్యాడు. జూలై 25న బాలికను ఆమె భర్త తెనాలిలోని పుట్టింట్లో వదిలి వెళ్లాడు. మరుసటి రోజు మధ్యాహ్నం తెనాలి వచ్చిన నవీన్, బాలికను తన మోటారు సైకిల్పై ఎక్కించుకుని, అమృతలూరు మండలం యలవర్రు సమీప పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తెనాలి వైకుంఠపురం వద్దకు తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అప్పటికే ఆలస్యమైందన్న భావనతో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు అర్ధరాత్రి ప్రాంతంలో బాలిక ఆటోలో పేరేచర్లకు చేరుకుంది. ఆటో దిగిన ఆమెను గుంటూరుకు చెందిన హోంగార్డు (గుంటూరు అర్బన్ జిల్లా డాగ్ స్క్వాడ్) అశోక చక్రవర్తి, అతని మిత్రుడు దుర్గారావు గమనించారు. బాధితురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో తాను హోంగార్డునని అశోకచక్రవర్తి తన ఐడీ కార్డు చూపించి వివరాలు తెలుసుకున్నాడు. ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని ఇద్దరూ చెప్పి తమ వెంట గుంటూరు తీసుకెళ్లి, దుర్గారావు ఇంట్లో కొద్ది రోజులు, మరో అద్దెకు తీసుకున్న గదిలో మరికొన్నాళ్లు ఆమెను నిర్బంధించి, సుమారు రెండు వారాలకు పైగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కుమార్తె ఆచూకీ తెలియని ఆమె తల్లి ఈ నెల 11న తెనాలి వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మృగాళ్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక తెనాలి చేరుకుని, ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన ఘోరాన్ని వివరించింది. అప్పటికే వివాహిత అదృశ్యం కేసును వన్టౌన్ పోలీసులు నమోదు చేయగా, బాలిక ఫిర్యాదుతో దాన్ని కిడ్నాప్, లైంగిక దాడి సెక్షన్ల కింద మార్చి డీఎస్పీ శ్రీలక్ష్మి దర్యాప్తు చేశారు. సీఐ ఎం.రాజేష్కుమార్, మహిళా ఎస్ఐ అనంతకృష్ణ నిందితుల అచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల్లో ఒకడైన నవీన్ను పెదరావూరు జంక్షన్ వద్ద 17న, మరో ఇద్దరు నిందితులు అశోకచక్రవర్తి, దుర్గారావును గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద మంగళవారం అరెస్టుచేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
కరోనాను క్యాష్ చేసుకుంటున్న మెడికల్ మాఫియా!
సాక్షి, అమరావతిబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి కృష్ణా,గుంటూరు జిల్లాలను గడగడలాడిస్తుంటే.. మరోవైపు బాధితుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఆయా మాత్రలు, సూది మందులను తయారీ కంపెనీల నుంచి మెడికల్ ఏజెన్సీల పేర్లతో తీసుకుని మందుల దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇటీవల ఈ అక్రమ దందాల వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ముఠాలు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి దిగుమతి.. ♦ రసాయన సంస్థలు, కొన్ని కార్పొరేటు ఆస్పత్రులు మహారాష్ట్ర, గుజరాత్లోని భావనగర్, జునాగఢ్ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించుకుంటున్నాయి. ♦ అక్కడి కిందిస్థాయిఉద్యోగుల అత్యాశ కారణంగా అవి అక్రమార్కులకు చేరుతున్నాయి. ♦ 10 కిలోల ఆక్సిజన్ సిలిండర్ రూ.4,500 అసలు ధర కాగా.. కిందిస్థాయి ఉద్యోగులు రూ.5,500 నుంచి రూ.6,500 వరకూ విక్రయిస్తున్నారు. ♦ వీటిని తీసుకున్న అక్రమార్కులు రూ.10 వేల నుంచి రూ.11 వేలకు అమ్మేస్తున్నారు. ♦ రోజూ ఒక్కో కంపెనీకి నాలుగైదు లారీల ఆక్సిజన్ సిలిండర్ల లోడ్లు వస్తుండటం, వాటి లెక్కలు చూసేవారు కిందిస్థాయి ఉద్యోగులకు బాధ్యత అప్పగించడంతో ఇదంతా జరుగుతోందని సమాచారం. ♦ అయితే ఇలా చేస్తున్న వారికి ఒక్కరికి కూడా ఆక్సిజన్ సిలిండర్లు విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని తెలుస్తోంది. ఆస్పత్రుల వద్ద గుట్టుచప్పుడు కాకుండా.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెమ్డిసివెర్ తదితర మందులు తక్షణం అందజేస్తామంటూ కొందరు దుకాణాల నిర్వాహకులు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రభుత్వ, కార్పొరేట్ కోవిడ్ ఆస్పత్రుల సమీపంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి తెప్పించామని.. అందుకే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కో డోసు అమ్మినందుకు వీరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు వరకూ లాభం వçస్తుంది. ఫ్యాబిఫ్లూ మందుల్లో మాత్రం రూ.వందల్లో గిట్టుబాటు అవుతుందని ఔషధ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా మందులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు.. టొసిలీజుమాబ్ ఇంజెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు వినియోగిస్తుంటారు. వీటి ఖరీదెక్కువు. విదేశాల నుంచి ముంబైకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు వీటిని దిగుమతి చేసుకుంటారు. ప్రతి ఇంజెక్షన్ వివరాలు మా శాఖ వద్ద ఉంటాయి. మెడికల్ ఏజెన్సీలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఎనెన్ని ఇంజక్షన్లు సరఫరా చేశారు.. ఎన్నింటిని వినియోగించారు అన్న దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైనా వీటిని అధిక ధరకు విక్రయిస్తుంటే ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం ఇస్తే అక్రమార్కుల ఆట కట్టిస్తాం. – రాజాభాను, అసిస్టెంట్ డైరెక్టర్,ఔషధ నియంత్రణ శాఖ, కృష్ణా జిల్లా బ్లాక్ మార్కెట్లో ఇలా.. ♦ విజయవాడ వన్టౌన్కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అయితే అతనికి వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో బంధువులు అతన్ని గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. ♦ చికిత్సలో భాగంగా వైద్యులు ఆ రోగికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే టొసిలీజుమాబ్ 400 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ను రాసిస్తూ.. అది తమ వద్ద లేదని, బయట నుంచి తీసుకురావాలని సూచించారు. ♦ రోగి బంధువులు గుంటూరు నగరంలోని ఒక దుకాణంలో ఈ మందును తీసుకొచ్చారు. ♦ అయితే దీని ఎంఆర్పీ ధర రూ.35 వేలుగా ఉండగా ఆ దుకాణంలో రూ.90 వేలకు కొనుగోలు చేశారని తెలిసింది. ♦ అయితే సాధారణంగా ఈ మందు ప్రభుత్వ అనుమతలు పొందిన డ్రగ్ డీలర్లు.. స్పెషలిస్ట్ వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే రోగులకు విక్రయిస్తారు. అయితే రోగుల అవసరాన్ని బట్టి వీటిని అధిక ధరలకు మాత్రం విక్రయించరాదు. -
చిట్టీ వ్యాపారం.. పరారీలో కుటుంబం.?
అమరావతి,గుడివాడ: చిట్టీ వ్యాపారం పేరుతో మోసం చేసి సుమారు రూ. 4 కోట్లతో పరారీ అయిన దంపతుల ఉదంతం గుడివాడ పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడ పట్టణం 35వ వార్డు కొత్తవారి వీధిలో నివాసం ఉండే సింహాద్రి లక్ష్మణరావు, అతని భార్య సత్యవతిలు చిట్టీలు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. స్థానికంగా ఉన్న వారితో సఖ్యతగా మెలుగుతూ వారి వద్ద చిట్టీలు కట్టించుకుంటూ ఉండేవారు. వీరు సొంతంగా రూ. 2 లక్షలు, రూ.5 లక్షలు, రూ. 3 లక్షలు చిట్టీలు వేయగా.. సత్యవతి సమీపంలోని వారి వద్ద ఈమె కూడా చిట్టీలు వేసి పాడుకుంది. రెండు నెలలుగా చిట్టీలు కట్టించుకుని పాడుకున్న వారికి నగదు ఇవ్వడం లేదు. అధిక వడ్డీ ఆశ చూపి... సత్యవతి వద్ద చిట్టీలు వేసిన వారు పాడుకుంటే మీ డబ్బుకు ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపేదని బాధితులు చెబుతున్నారు. దీంతో ఆశపడిన వారు పాడిన చిట్టీ సొమ్ము మొత్తాన్ని సత్యవతికి ఇచ్చేవారు. అలాగే సత్యవతి బయట వేసిన చిట్టీలు ముందే పాడుకుని కట్టటం లేదు. అనుమానం వచ్చిన బాధితులు లక్ష్మణరావు ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అవాక్కయ్యారు. బాధితులంతా ఏకమై శుక్రవారం స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. రాత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కనిపించడం లేదని ఫిర్యాదు కాగా తమ అక్కా,బావ, ఇద్దరు పిల్లలు ఈ నెల 16 నుంచి కనిపించడం లేదని, ఫోన్ చేసినా స్పందన లేదని సత్యవతి సోదరుడు కరుణ్కుమార్ స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పడమట గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, విజయవాడ: బెజవాడ పడమట గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారిలో పండు గ్రూప్కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్, అజయ్, శంకర్, మస్తాన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఇప్పటికే పండు గ్యాంగ్లోని 26 మందిని, సందీప్ గ్రూప్లోని 24 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పండు గ్రూప్కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్పై సీపీ బత్తిన శ్రీనివాసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అదే గ్యాంగ్లోని మరో 18 మందిని సస్పెక్ట్ చేస్తూ.. మరో 8 మందిపై పడమటి పోలీసులు రౌడీ షీట్ కేసులు తెలిచారు. మరోసారి స్ట్రీట్ ఫైట్లకు దిగి బెజవాడ ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చదవండి: విశాఖలో మరో గ్యాంగ్వార్ కలకలం -
నేడు పోలీస్ కస్టడీకి ‘మోకా’ నిందితులు
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసు దర్యాప్తులో బందరు పోలీస్లు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఓ మైనర్తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితులిచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ హత్యలో కుట్రదారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. కొల్లుతో సహా నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6న మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేడు మచిలీపట్నం కోర్టుకు ఏ–1, ఏ–2 నిందితులు ఇందుకోసం ఈ కేసులో ఏ–1గా ఉన్న చింతా నాంచారయ్య (చిన్న), ఏ–2గా ఉన్న చింతా నాంచారయ్య (పులి)లను మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో ఆర్ పేట పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు పోలీసుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. మూడు రోజుల కస్టడీ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చింతా చిన్న, చింతా పులిలను శనివారం మచిలీçపట్నం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హత్య ఘటనలో చింతా నాంచారయ్య (పులి) పాల్గొనగా, హత్యానంతరం అతడిని తన బులెట్పై ఎక్కించుకుని చిన్న పరారైనట్లు వీడియో పుటేజ్ ఆధారంగా ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కీలకమైన ఈ ఇరువుర్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీకి తీసుకుంటున్న నిందితులిద్దర్ని రానున్న మూడు రోజులూ వివిధ కోణాల్లో విచారించనున్నారు. లోతుగా విచారణ మోకా హత్యకు ఎప్పటి నుంచి పథక రచన చేశారు? ఎన్నిసార్లు భేటీ అయ్యారు? ఎక్కడ భేటీ అయ్యారు? ఆ భేటీలో మాజీ మంత్రి కొల్లు ఎన్నిసార్లు పాల్గొన్నారు. హత్య విషయంలో ఎలాంటి సూచనలు చేశారు. అనంతరం ఆయనకు ఏ విధంగా సమాచారం చేరవేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారితో పాటు ఇంకా ఎవరెవరు సహకరించారు. ఈ హత్య విషయంలో ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు జరిగాయి. ఎంత చేతులు మారాయి? ఇలా వివిధ కోణాల్లో నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు లోతుగా విచారించనున్నారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. సయ్యద్ ఖాజాను విచారించిన పోలీసులు ఇదిలా ఉండగా హత్యకు సరిగ్గా పదిహేను రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో నిందితుడు చిన్నాతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఖాజాను కూడా శుక్రవారం ఆర్ పేట పోలీసులు విచారించారు. హత్య జరిగిన తర్వాత పరారీలో ఉన్న ఖాజా అరెస్ట్ల పర్వం పూర్తి కాగానే నగరానికి చేరుకున్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి..పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి..ఒక్కొక్కడికి తాట తీస్తాం. మోకా బాచీ (మోకా భాస్కరరావు)..!నీకు కరెక్ట్ మొగుడు మ్ఙాచింతా చిన్న యే..ఇక్కడే ఉన్నాడు కంగారు పడకు..నీ సంగతి చూస్తాడు..గుర్తించుకో’అంటూ ఆ ప్రెస్మీట్లో ఖాజా చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానంతో పోలీసులు ఖాజాను సుమారు ఐదు గంటల పాటు విచారించారు. తనకే పాపం తెలియదని, రాజకీయంగా విమర్శలు చేసేనే తప్ప ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కు రావాల్సి ఉంటుంది. నగరం విడిచి వెల్లేందుకు వీల్లేదని షరతు విధిస్తూ ఆయన్ని పంపారు. 3 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం మోకా హత్య కేసులో కీలక నిందితులైన చిన్నా, పులిలను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం. కోర్టు అనుమతితో శనివారం మచిలీపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం.– ఎం.రవీంద్రనాథ్బాబు, జిల్లా ఎస్పీ -
మదమెక్కిన తాతయ్య మృగాడిగా మారాడు..
మనవరాలని ఆప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధుడు.. మదమెక్కిన మృగాడిగా మారాడు. తాతయ్యా అనే పిలుపుతో ఆనందాన్ని పొందాల్సిన వయసు.. పసిమొగ్గపై పైశాచికంగా ప్రవర్తించాడు. కమ్మని కథలు చెప్పి పిల్లల స్వచ్ఛమైన నవ్వుల్లో సంతోసాన్ని వెతుక్కోవాలిసిన మదిమిలో కామపిశాచి అయ్యాడు. తేలప్రోలు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉంగుటూరు(గన్నవరం): మండలంలోని తేలప్రోలు గ్రామానికి చెందిన బాలిక(5) తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు చిన్నారులను ఆటలతో దగ్గర చేసుకున్నాడు. ఇంతలో వృద్ధుడి మృగాడు బయటి వచ్చాడు. ఆటలు ఆడిస్తున్నట్లు నటించాడు. దగ్గర ఉన్న ఇసుక గుట్ట వద్దకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమీపంలో ఉన్న కొందరు స్థానికులు చూశారు. ఇంతలో పాపకు ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లైంగిక దాడికి ప్రయత్నించినట్లు నిర్ధారించుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ వి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యాంకర్లు బస చేసిన హోటల్స్పై దృష్టి
సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ తరహా విష సంస్కృతి విస్తరిస్తుందన్న కథనం రాజకీయ, పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు సీరియస్గా తీసుకున్నారు. లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బందరు డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన చిలకలపూడి పోలీసులు నగరంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. యాంకర్లు బస చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన హోటల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంత కాలం క్రితం వచ్చారు. ఎందుకొచ్చారు. ఎన్ని రోజులున్నారో ఆరా తీశారు. మరొక వైపు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లలో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ జరుపుతున్నాం: రవీంద్రనాథ్బాబు, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన బందరు నగరంలో హైటెక్ వ్యభిచారం జరిగే అవకాశాలు లేవు. సాక్షిలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరపుతున్నాం. ప్రత్యేక బృందాలతో నగరంలోని లాడ్జీలు, అపార్టుమెంట్లు సోదాలు చేస్తున్నారు. -
కలకలం రేపిన వృద్ధురాలి హత్య
కోడూరు(అవనిగడ్డ): డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిని దుండగులు వారం రోజుల క్రితం హత్య చేసి డ్రెయిన్ పక్కన తాటిబొందల్లో పడవేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో దివిసీమలో తీవ్ర కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి గ్రామానికి చెందిన మట్టా వీరమ్మ (65) భర్త, ఇరువురు కుమారులు గతంలోనే మృతిచెందడంతో వ్యవసాయ పనులకు వెళ్తూ మరో కుమారుడు బసవమాణిక్యాలరావు వద్ద్ద ఉంటోంది. కూలి పనులకు వెళ్లిగా వచ్చిన డబ్బులను కుదవపెట్టి వీరమ్మ ఇరుగుపొరుగు వారికి వడ్డీకి ఇస్తోంది. వీరమ్మకు గ్రామ సమీపంలోని పొలాల్లో అడపాదడపా జరిగే పేకాట శిబిరాల వద్దకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ పేకాటరాయుళ్లకు కూడా వీరమ్మ నగదును పెట్టుబడి పెడుతుందని గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరమ్మ వారం రోజుల నుంచి కనిపించకుండా పోగా.. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని రత్నకోడు (తాలేరు) డ్రెయిన్ పక్క తాటిబొందల్లో శవమై కనిపించింది. హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు.. గురువారం మధ్యాహ్నం డ్రెయిన్ గట్టు వెంట ఉన్న తాటిబొందల ఆకులను నరికేందుకు గ్రామస్తులు వెళ్లగా అక్కడ తీవ్రమైన దుర్వాసన రావడంతో వెళ్లి పరిశీలించడంతో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామ వీఆర్వో మేడికొండ బాబురావు ఫిర్యాదు మేరకు తొలుత గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం వీరమ్మ కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తుపట్టడంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. వీరమ్మ వారం రోజుల కితం పేకాట శిబిరం వద్దకు వెళ్లగా అక్కడ పేకాటరాయళ్లు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరమ్మ మెడలో ఉన్న బంగారపు నానతాడు, చెవిదిద్దులతో పాటు పెద్దమొత్తంలో డబ్బును దుండగులు అపహరించి, ఎవరికి తెలియకుండా హత్య చేసి ఇలా తాడిబొందల్లో పడేశారనే కోణంతో దర్యాప్తు జరుపుతున్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీం తనిఖీలు వీరమ్మ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సవాల్గా తీసుకున్నారు. మచిలీపట్నం నుంచి డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను తీసుకువచ్చి ఘటనాస్థలంలో సోదాలు చేశారు. డాగ్స్క్వాడ్ గ్రామంలోని పలువురు గృహాల వద్దకు వెళ్లగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అవనిగడ్డ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే కుళ్లిపోయిన వీరమ్మ మృతదేహాన్ని శవపంచనామా అనంతరం ఘటనాస్థలంలోనే అవనిగడ్డ ప్రభుత్వ వైద్యాధికారి కృష్ణదొర పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ చెప్పారు. ఎస్ఐ రమేష్, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
-
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
సాక్షి, కృష్ణా: నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో బుధవారం ఘరానా మోసం బట్టబయలైంది. హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ కోట్ల రూపాయలను ఖాచేసి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. రూ. 1,56,56,897 కోట్ల ఖాతాదారుల నగదును బ్యాంక్ నుంచి కాచేసి చేతి వాటం చూపించాడు. దీనిపై బ్యాంక్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ.. రవీతేజ 2017లో నుంచి బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాగా ఖాతాదారుల నగదును, ఫిక్సిడ్ డిపాజిట్లను తన అకౌంట్కు బదిలీ చేసుకున్నట్లు క్యాష్ తనిఖీలో వెల్లడైందని ఆయన తెలిపారు. వెంటనే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా రవీతేజకు ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆటలకు అలవాడు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణతో తెలింది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రవీతేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మా.. నేనూ నీవెంటే!
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నవ మాసాలు కనిపెంచిన తల్లి దూరమైందనే ఆవేదన... ఇన్ని నాళ్లు తన ఆలనా పాలనా చూసిన తల్లి విగత జీవిగా పడి ఉండటం ఆ బాలుడిని కలచి వేసింది. తల్లి లేని జీవితం వద్దనుకుని ఇంటిలోకి వెళ్లి బంగారం శుద్ధి చేసే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వారం రోజులలో పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబంలో ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రోజు వ్యవధిలోనే తల్లీ, బిడ్డ ఆత్మహత్యకు పాల్పడటంతో కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కాలనీ బ్లాక్ నెం: 134కు చెందిన షేక్ షంషుద్దీన్, కరీమా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు నూరుద్దీన్ (16) భవానీపురం నేతాజీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు, లాక్డౌన్కు ముందు పెద్ద కుమార్తె రుకియాకు వివాహం చేయడం, రెండు నెలలుగా పనులు లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కరీమా ఆందోళన చెందుతూ వస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె బంగారం మెరుగు పెట్టే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడింది.(ఎంత పనిచేశావు తండ్రీ!) తల్లి మరణం తట్టుకోలేక... తల్లితో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉండే నూరుద్దీన్ తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. సోమవారం తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా.. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాడు. తెల్లవార్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. మంగళవారం ఉదయం తల్లి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండటంతో తండ్రి, ఇతర బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఇంట్లో తన ఇద్దరు అక్కలతో ఉన్న నూరుద్దీన్కు మధ్యాహ్నం సమయంలో తల్లి మృతదేహం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తున్నారనే విషయం తెలిసింది. దీంతో ఇంటిలోని బాత్రూంలోకి వెళ్లి తల్లి తాగిన రసాయనాన్ని తాను కూడా తాగి బయటకు వచ్చాడు. కొద్దిసేపటికే నూరుద్దీన్ నోటి నుంచి నురగలు రావడంతో ఇంటిలో ఉన్న ఇద్దరు అక్కలు వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే మార్గమధ్యంలో ఉన్న వారు కరీమా మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చే సరికి నూరుద్దీన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే నూరుద్దీన్ను భవానీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నూరుద్దీన్ మృతిచెందాడు. (సడలింపులు.. ‘తొలి’ కేసు ) తల రాతను మార్చిన ప్రమాదం.. ముగ్గురు పిల్లలు, చేతి నిండా పని, ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం వారి గతినే మార్చేసింది. గత ఏడాది షంషుద్దీన్ భార్యతో కలిసి మచిలీపట్నం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం కారణంగా భార్యకు మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. అప్పటి నుంచి అప్పులు, మానసిక ఆందోళనలు పెరిగిపోయాయి. ఇటీవల పెద్ద కుమార్తెకు రుకియాకు వివాహం చేశారు. వివాహానికి అప్పు చేయడం, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు రెండు నెలలుగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ పరిస్థితిపై ఆందోళన చెందుతూ వస్తోంది. ఇప్పుడు రెండు మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మిత్ర ద్రోహి.. స్నేహితుడి సోదరిని..
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియురాలితో మాట్లాడేందుకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన ప్రియురాలి అన్నను హతమార్చిన ఘటన మచిలీపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్నం అమృతపురం జెండాసెంటర్కు చెందిన యర్రంశెట్టి సాయి (21) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ యాసిన్లు స్నేహితులు. యాసిన్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సయ్యద్ యాసిన్ సాయి కోసం ప్రతిరోజు ఇంటికి వెళుతుంటాడు. అలా యాసిన్ సాయి సోదరిని ప్రేమలోకి దింపాడు. విషయం తెలిసిన సాయి యాసిన్ను తన చెల్లెలితో తిరగవద్దని, మాట్లాడవద్దని పలుమార్లు హెచ్చరించినా మానలేదు. ఈ విషయమై ఇరువురి మధ్యా పలుమార్లు గొడవలు, కొట్లాటలూ జరిగాయి. తన ప్రేమ వ్యవహారానికి సాయి అడ్డు వస్తున్నాడని పగ పెంచుకున్న సయ్యద్ యాసిన్ మంగళవారంమధ్యాహ్నం సాయిని పార్టీ పేరుతో ఆంధ్ర జాతీయ కళాశాల వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆహ్వానించాడు. అక్కడ ఇరువురూ కలసి మద్యం సేవిస్తుండగా పథకం ప్రకారం యాసిన్ సాయి గ్లాసులో సైనెడ్ను కలిపి సాయికి ఇచ్చాడు. విషయం తెలియని సాయి మందును సేవించి కొద్దిసేపటికి అపస్మారకస్థితికి చేరుకుంటుండగా యాసిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా విషయాన్ని గ్రహించిన స్థానికులు ఎండ దెబ్బకు నీరసంపడి ఉంటాడని భావించారు. సమీపంలోని ఆటోలో వైద్యం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సాయి మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. సాయి తల్లి ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
హవాలా హవా!
బెజవాడలో హవాలా, జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. వన్టౌన్, కొత్తపేట, భవానీపురం, గవర్నర్పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, కృష్ణలంక ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారం చేసే ఏజెంట్లు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈ అక్రమ దందా బాగోతం జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకుతెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విజయవాడ కొత్తపేట పరిధిలోని గణపతిరోడ్డులో కేఆర్ ఫ్యాషన్ వరల్డ్ అనే వస్త్ర దుకాణం ఉంది. దీనిని రాజస్థాన్కు చెందిన జగదీష్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే బుధవారం రాత్రి అతను షాపులో డబ్బు లెక్కిస్తుండగా రూ. 35లక్షల నగదును కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదుకు షాపు లావాదేవీలకుఎలాంటి ఆధారాలు దొరకలేదు. విచారిస్తే ఈ మొత్తం డబ్బు హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు తెలిసింది. సాక్షి, అమరావతిబ్యూరో: ఎందుకు.. ఏమిటీ అన్న వివరాలు అవసరం లేదు.. బ్యాంకు ఖాతాతో పనేలేదు... ఇన్కంట్యాక్స్ బాధా లేదు. ఆ రూట్లో అంతా నోటిమాటపైనే పని జరుగుతుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బు పంపిస్తారు.. అదే హవాలా దందా..! ముంబై తర్వాత వాణిజ్య నగరంగా పేరుగాంచిన విజయవాడలో ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది. నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. రూ. కోట్లల్లో లావాదేవీలు జరుగుతుండటంతో వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు కట్టాల్సిన పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకును ‘జీరో’కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును సైతం హవాలా మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు. పైనే పేర్కొన్న రెండు ఉదంతాలు ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చాయి. ఐరన్ వ్యాపారం మాటున.. నగరంలో బంగారం జీరో దందా ఒక ఎత్తయితే.. ఐరన్ వ్యాపారం మరో ఎత్తు. ఈ వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఐరన్ చానళ్లు, షీట్లు, యాంగ్లర్లు తదితరాలను లారీల్లో దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ సరుకును తెచ్చే సమయంలో ఐరన్ ముడి సరుకును సరఫరా చేసే వ్యాపారులు రెండు రకాల బిల్లులను లారీ డ్రైవర్లకు ఇచ్చి పంపుతున్నారు. లారీలో తచ్చే స్టాకు వివరాలు తెలుపుతూ ఒరిజినల్ బిల్లును సీల్డ్ కవర్లో డ్రైవర్కు అందజేస్తారు. రెండో బిల్లులో స్టాకుకు.. వాటి విలువలో భారీ వ్యత్యాసం ఉంటోంది. వాణిజ్య ఇతరత్రా చెక్పోస్టు తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడకుండా సాఫీగా సాగిపోతే.. డ్రైవర్ తెచ్చిన ఒరిజినల్ బిల్లును మళ్లీ తిరిగి సరఫరా దారుడికి అందజేస్తాడు. రెండో బిల్లు విజయవాడలోని వ్యాపారికి అందజేసి సరుకు దించేస్తారు. ఉదాహరణకు రూ. 12 లక్షల సరుకును విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి పంపితే.. ఎక్కడా తనిఖీల్లో చిక్కకుండా సాఫీగా దుకాణానికి సరుకు చేరుకుంటే.. ఒరిజినల్ బిల్లు రూ. 12 లక్షల స్థానంలో రూ. 1.20 లక్షల బిల్లును తిరిగి పంపి.. పాత బిల్లులను కంప్యూటర్లో డీలిట్ చేసేస్తారు. ఇలా రూ. 12 లక్షల సరుకు సంబంధించి సరఫరాదారుడికి రూ. 1.20 లక్షలు వ్యాపారం జరిగినట్లు లెక్కల్లో చూపుతాడు. అలాగే వ్యాపారి నుంచి మిగితా మొత్తం రూ. 10.80 లక్షలు హవాలా మార్గం ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ విజయవాడలో కూడా ఇదే తరహాలో వ్యాపారులు దందా సాగిస్తున్నారు. ఈ తరహా దందా వన్టౌన్, కొత్తపేట, భవానీపురం, ఆటోనగర్ ప్రాంతాల్లో ఉండే ఐరన్ దుకాణాల్లో నిత్యకృత్యమైందనే ఆరోపణలున్నాయి. -
‘గొల్లాస్ గ్యాంగ్’ అరెస్ట్
సాక్షి, అమరావతిబ్యూరో: పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం దోపిడీ దొంగలు జన నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట ఆ ఇళ్ల తలుపులు పగులగొట్టి ఇంట్లో నిద్రిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు పాల్పడేవారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాల్లో పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ ముందువరుసలో ఉంటుంది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈ ముఠాలు దోపిడీలకు తెగబడేవి. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ఆ ముఠా తరహాలోనే విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరు మండలం కాటూరులో ఈ నెల 10న అర్ధరాత్రి ఓ ఇంట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 62 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదుతోపాటు ఓ సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేసి తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్కు చెందిన ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉయ్యూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తలుపులు పగలగొట్టి బీభత్సం.. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు, చేతులకు గ్లౌజులు, నిక్కర్లు ధరించి ఇంటి తలుపును గునపాలు, బండరాయితో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు బద్ధలవుతున్న శబ్దం విన్న రజనీకాంత్ అతని భార్య హాలులోకి వచ్చేసరికి దోపిడీ దొంగలు వారిని కత్తులు, గునపాలతో బెదిరించి చేతులు కట్టేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. తమ వద్ద ఉన్న 62 గ్రాముల బంగారు ఆభరణాలు ఇవ్వగా.. కోళ్లఫారం వ్యాపారివి నీ వద్ద ఇంతేనా ఉండేదని ప్రశ్నించగా.. రజనీకాంత్ తనకు కోళ్లఫారం లేదని.. పక్కింట్లోని వ్యక్తిదని పేర్కొనడంతో దొంగలు కొంత శాంతించారు. తర్వాత బంగారు ఆభరణాలతోపాటు ఒక ఐఫోన్ను రూ. వెయ్యి నగదును తీసుకెళ్లిపోయారు. చివరగా దొంగల సృష్టించి భయోత్పాతానికి రజనీకాంత్ దంపతులు తమ వద్ద ఉన్న వెండి ఆభరణాలు ఇవ్వగా వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు. ఆధారాలు సేకరించి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరు పరిశీలించారు. ఘటనా స్థలం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సేకరించిన వివరాలను విశ్లేషించారు. దొంగల పాద ముద్రలు దొరికాయి. బాధితుల చెప్పిన వివరాల మేరకు దోపిడీకి వచ్చిన నేరగాళ్లు వచ్చిరాని తెలుగులో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు. మిర్యాలగూడ దోపిడీతో కేసు కొలిక్కి.. కాటూరులో దోపిడీ ఏ ముఠా చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అచ్చం ఈ తరహా దోపిడీనే డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగినట్లు తెలిసింది. వెంటనే సీసీఎస్ పోలీసులు అక్కడకు వెళ్లి బాధితులతో మాట్లాడగా.. అక్కడ కూడా నలుగురు వచ్చీరాని తెలుగులో మాట్లాడారని, ఒక్కడు మాత్రం కోస్తా యాసలో స్పష్టమైన తెలుగు మాట్లాడినట్లు వారు తెలిపారు. దీంతో ఈ తరహా దొంగతనాలు చేసే ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని దర్యాప్తు చేపట్టి.. చివరకు ఈ దోపిడీకి పాల్పడింది తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ అని గుర్తించారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి.. దీంతో ఈ ముఠా సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు? అని పరిశోధించగా చివరకు తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో పాల శివ, అతని కుమారుడు పాల వేణు, తమ్ముడు పాల లక్ష్మినారాయణ, పెనుమాక మహేష్, మేకల ఏసు, దొడ్డి పోతురాజులు అద్దెకు ఇల్లు తీసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. దోపిడీ వీరి పనేని తేలడంతో పోలీసులు వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా పాల లక్ష్మినారాయణ పరారీలో ఉన్నాడు. పాల శివపై 35 వరకు దోపిడీ కేసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పక్కా రెక్కీ.. అనంతరమే దోపిడీ.. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో కోళ్లు, గొర్రెలు, మేకలు, బడ్డీ కొట్లు వంటి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠాకు పాల శివ నేతృత్వం వహిస్తాడు. కాటూరు గ్రామంలో నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీకాంత్ ఇంటిని టార్గెట్గా చేసుకున్నారు. రెక్కీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అందరూ పాల శివ ఆటోలో బయలుదేరి వెళ్లారు. ఆటోను రజనీకాంత్ ఇంటి సమీపంలో ఉన్న కోళ్లఫారం దగ్గర ఉన్న వెంచర్లో పార్క్ చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ ఇంటి ప్రహరీ గోడను దూకి మొదట గునపంతో తలుపు తీయడానికి యత్నించారు. సాధ్యపడకపోవడంతో ఇంటి వెనుకవైపు ఉన్న పెద్ద బండరాయితో తలుపును బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. -
గుట్టుగా గం‘జాయ్’!
ఎక్కడో పుడుతుంది.. ఎక్కడో పెరుగుతుంది.. ఊరిలోకి వస్తుంది.. తైతక్కలాడిస్తోంది! అదే గ‘మ్మత్తు’ గంజాయి. మన్యం ప్రాంతాల్లో సాగవుతూ రాష్ట్రం అంతటా రవాణా అవుతూ.. యువతను తనకు బానిసలుగా మార్చేసుకుంటోంది. దీనిని అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటంతో తేలిగ్గా పాగా వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో గంజాయి దందా మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్న చందంగా సాగిపోతోంది. అంతేకాక ఇతర ప్రాంతాల రవాణాకూ నగరమే అడ్డాగా మారుతుండటం ఆందోళన కల్గిస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో: ఉత్తరాంధ్ర, తెలంగాణలోని దండకారణ్యం నుంచి గంజాయి బెజవాడను ముంచెత్తుతోంది. నగరంలో అనూహ్యంగా పట్టుబ డుతున్న గంజాయి పోలీసులను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు గుట్కా, నకిలీ నెయ్యి, కాల్మనీ కేసుల విచారణకే పరిమితమైన సిటీ పోలీసులకు గంజాయి మాఫియా సవాల్గా మారింది. కృష్ణలంక, వన్టౌన్, టూటౌన్, రైల్వేస్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో పనిపాటలేనివాళ్లు గంజాయి సేవనం నిత్యకృత్యం. రూ. పాతిక ఇస్తే చిటికెడు గంజాయిని పొట్లాల్లో విక్రయిస్తుంటారు. చెత్త ఏరేవారు, యాచకులు, రిక్షా, ముఠాకూలీ కార్మికులు, నదిగట్లపై బైరాగులు గంజాయికి నిత్య వినియోగదారులు. వివిధ రూపాల్లో దీనిని వినియోగిస్తూ మత్తులో తేలిపోతుంటారు. యువత చిత్తు.. సాధారణ యువత, విద్యార్థులు సైతం ఇటీవల సంవత్సరాల్లో గంజాయికి దాసోహమవుతున్నారు. గతేడాది కాలంలో నగరంలో గంజాయి కొనుగోలు చేస్తూ కొందరు.. గంజాయిని విక్రయిస్తూ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులకు నగర పోలీసులకు పట్టుపడ్డారు. అలాగే ఇటీవల ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు విశాఖ నుంచి గంజాయి తెస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇలా నగర శివార్లలో ఉన్న కళాశాలల్లో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు సమాచారం. దీంతో గంజాయి విక్రేతలు నగరంలోని కాలేజీల వద్దే విక్రయాలు సాగిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసులు పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో జరిగే చెల్లర నేరాలకు గంజాయే కారణం. బ్లేడుబ్యాచ్లకు ప్రధాన మత్తు ఆదాయ వనరు ఇదే. విశాఖపట్నం అటవీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు తెప్పించి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఇందులో ఆధిపత్య పోరు తరచూ కొట్లాటలు, కొన్నిసార్లు హత్యలకు దారితీస్తోంది. జాతీయ రహదారిపై దర్జాగా.. తాజాగా పట్టుబడిన గంజాయి.. నగరం దీని రవాణాకు ఒక కేంద్రంగా మారిందనేది చెబుతోంది. ఏలూరు మీదుగా విజయవాడ, గుంటూరుకు, అటు నుంచి హైదరాబాద్కు, బెంగళూరు, చెన్నైలకు గంజాయి నిత్యం పెద్ద మొత్తాల్లో అక్రమ రవాణా అవుతోంది. పండ్లు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఇతరత్రా వస్తువుల లోడ్ల కింద గంజాయిని దాచి జిల్లాలను దాటిస్తున్నారు. కోల్కతా–చెన్నై జాతీయ రహదారి పొడవునా ఉన్న రవాణా, పోలీసు, వాణిజ్య పన్నుల చెక్పోస్టుల్లో నిర్లక్ష్యం, అవినీతి వల్ల పట్టుబడడం చాలా తక్కువ. గంజాయి ఘాటైన వాసన వస్తుంది. కాబట్టి దానిని పకడ్బందీగా ప్యాక్ చేసి ట్రక్కులు, మినీ లారీల్లో సరుకుల కింద ఉంచుతారు. అంత లోతుగా తనిఖీ చేసే ఓపిక లేక, లేదా భారీ ముడుపులకు లొంగిపోయిన సిబ్బంది వీటిని వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్ర అడవుల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. అక్కడ కిలో రూ. ఐదు వేలు పలికే గంజాయి మెట్రో నగరాల్లో రూ. 60 వేలకు చేరుతుంది. స్థావరంగా బెజవాడ! మెట్రో నగరాల సంగతి పక్కన పెడితే విజయవాడ గంజాయి నెట్వర్క్ సురక్షిత స్థావరంగా ఉందన్నది తాజా ఘటనల సారాంశం. వన్టౌన్, భవానీపురం, ఇబ్రహీపట్నం, లారీ టెర్మినల్, పటమట, పెనమలూరు ప్రాంతాల్లో గంజాయి మాఫియా గోదాములు నిర్వహిస్తోన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో గోదాములపై ఎలాంటి నిఘా లేదు. వివిధ సరుకుల మాటున తెప్పించే గంజాయిని ఇక్కడే నిల్వ చేసి కావలసిన వ్యక్తులకు, ప్రదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాల అనుమానం. ముడి గంజాయిని ఇక్కడ శుభ్రంగా ప్రాసెస్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో ఇతర ఉత్పత్తుల మాటున నగరాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్య రైళ్లు, బస్సుల్లో ఉత్తరాంధ్ర నుంచి ట్రావెల్బ్యాగుల్లో తెచ్చి విక్రయించే వ్యక్తులకు లెక్కలేదు. నిఘా పెట్టాం.. విజయవాడలో గంజాయి విక్రయ ముఠాల కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడకు గంజాయి సరఫరా అవుతోంది. అక్కడి మూలాల్ని గుర్తించే పనిలో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విక్రయదారులను కట్టడి చేసే పనిలో ఉన్నాం. విజయవాడ కేంద్రంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు గంజాయి సరఫరా అవుతోందని గుర్తించాం. సిటీ పోలీసులకు అందుతున్న సమాచారం మేరకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు. శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్లో రెండు బ్యాగుల ద్వారా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శుక్రవారం సైతం 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.– ద్వారకా తిరుమలరావు,నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
పద్మావతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకు గురైన యేదుపాటి పద్మావతి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. గత నెల 31వ తేదీన పట్టపగలే ఆమెను హత్య చేసి నగలు దొంగతనం చేయడాన్ని సవాలుగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలను దర్యాప్తుకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణా ల్లో జల్లెడ పట్టి చివరకు హంతకుడి ఆచూకీ కనుగొన్నట్లు సమాచారం. పక్కా ప్రొఫెషనల్.. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు లభించకుండా కారం చల్లడం.. చేతి వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి గమనించిన ఇది పక్కా ప్రొఫెషనల్ పనిగా భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దొంగతనానికి వచ్చిన ఆగంతకుడు క్షణాల వ్యవధిలో పని ముగించుకొని వెళ్లడానికి వచ్చాడని తెలుస్తోంది. అందువల్లే ఆమె మెడలో ఉన్న గొలుసు, నల్లపూసల దండ, చేతికి ఉన్న నాలుగు గాజులను మాత్రమే తీసుకెళ్లడం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాటతో హత్య.. పక్కాగా రెక్కీ చేసికుని దొంగతనానికి వచ్చిన ఆగంతకుడికి.. మృతురాలు పద్మావతికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి. జనవరి 31వ తేదీన చివరగా మృతురాలు, ఆమె భర్త వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్ జరిగిన ఫంక్షన్కు హాజరై ఇంటికొచ్చారు. ఆ తర్వాత ఆమె భర్త పనిపై బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగను చూసిన పద్మావతి తీవ్రంగా ప్రతిఘటించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. చివరకు ఆమె అరుపులతో చుట్టుపక్కల వారు వస్తే తన పనైపోతుందనే కారణంతోనే దొంగ పద్మావతిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు వినియోగించిన ఆయుధం కూడా అతనిదేనని పోలీసు లు అంచనాకు వచ్చినట్లు సమాచారం. పక్క జిల్లాలకు పరారీ.. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొన్నట్లు సమాచారం. అతనిది విజయవాడేననీ.. హత్య చేసి నగలు దోచుకున్న వెంటనే నగరాన్ని వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతాల్లోనూ తలదాచుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.సాంకేతిక అంశాల ఆధారంగా చివరకు నిందితుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఏమార్చి.. రూటు మార్చి..
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ దుకాణం నుంచే లిక్కర్ తరలించుకుపోతోంది. ఆదివారం విజయవాడ నగరంలో ప్రభుత్వ మద్యం షాపు నుంచి ఓ ప్రైవేటు బార్ యాజమాన్యం సరుకును తరలించింది. పట్టపగలే ఈ తంతు జరిగినా ఆ ప్రభుత్వ మద్యం షాపుకు కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా.. ఎక్సైజ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో బెజవాడలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్న 344 షాపులను కుదించి వాటి స్థానంలో 275 మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందులో విజయవాడ పరిధిలో 135 ప్రభుత్వ షాపులు.. మచిలీపట్నం పరిధిలో 140 ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 148 బార్ అండ్ రెస్టారెంట్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వమే ఏపీఎస్బీసీఎల్ గోదాముల నుంచి మద్యం విక్రయిస్తోంది. అయితే ప్రభుత్వ మద్యం షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయించే మద్యం ధరల్లో వ్యత్యాసం చాలా ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కొందరు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే వారితో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమంగా తరలింపు.. విజయవాడ నగరం టిక్కిల్ రోడ్డులో గత నెల 21న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని(06449) ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. గతంలో ఇక్కడ హాంగోవర్ పేరిట సూపర్ మార్కెట్ తరహాలో ఓ ప్రైవేటు మద్యం దుకాణం ఉండేది. ఆ షాపు నిర్వాహకులకు నగరంలో పలు బార్లు కూడా ఉన్నాయి. గతంలో హాంగోవర్లో పనిచేస్తున్న సిబ్బందినే ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణంలో నియమించారు. వీరందరూ కుమ్మక్కై ఆదివారం మధ్యాహ్నం 1.40 గంట సమయంలో 06449 నంబరు మద్యం షాపునకు సంబంధించిన బీరు, మద్యం బాటిళ్ల బాక్స్లను ఆటోలో లోడు చేస్తున్న దృశ్యం ‘సాక్షి’ కంట పడింది. అనుమానంతో సాక్షి ప్రతినిధి ఆ ఆటోను అనుసరించగా ఆ ఆటో నేరుగా పంట కాలువ రోడ్డులోని ‘చిల్లీస్ రెస్టారెంట్ అండ్ బార్’ వద్ద ఆగింది. అనంతరం ఆటోలో ఉన్న మద్యాన్ని దించి బార్లోకి తరలించారు. మద్యం షాపు వద్ద లోడు నింపిన దగ్గర నుంచి బార్ వద్ద లోడును దించిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఈ తరలింపు తంతు కేవలం అరగంటలోపు పూర్తి చేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రభుత్వ మద్యం షాపు నుంచి సరుకును ఒక బార్ అండ్ రెస్టారెంట్కు తరలిస్తున్నా ఎక్సైజ్ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలు ఉంటాయ్.. ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉన్న సరుకును ఎవరైనా బెల్టు షాపులకు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లకు కానీ విక్రయించరాదు. అలా చేస్తే దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే కొనుగోలు చేసిన బార్ యజమానులపై కఠినంగా వ్యవహరిస్తాం. బార్ను సీజ్ చేస్తాం. రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం. – మురళీధర్, ఎక్సైజ్ డీసీ, కృష్ణా జిల్లా -
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం!
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): గొల్లపాలెంగట్టు జోడు బొమ్మల సెంటర్లో ఓ చిన్నారిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం వన్టౌన్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం జోడు బొమ్మల సెంటర్లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వెనుక నడుచుకుంటూ వస్తుండగా, జోడుబొమ్మల ప్రాంతానికి చెందిన ఎం. ఉదయ్కికణ్ ఆ చిన్నారిని ఆడిస్తున్నట్లు నటిస్తూ చీకటి సందులోకి తీసుకెళ్లాడు. తమతో పాటు వస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెనక్కి వెళ్లి చూశారు. అయితే, చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ యువకుడు కనిపించాడు. దీంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ తెలిపారు. -
ప్రియుడే కాల యముడయ్యాడా..?
కృష్ణాజిల్లా, కలిదిండి (కైకలూరు): కలిదిండి శివారు బరింకలగరువు గ్రామ నివాసి కటికతల కృపారాణి (25) హత్యోదంతంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మౌనం వీడక పోవడంతో బంధువులు, గ్రామస్తులు, దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఉప్పుటేరులో శుక్రవారం శవమై తేలిన కృపారాణి హత్యకు గురైందని, నిందితులను పట్టుకుంటామని గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం ప్రకటించి రెండు రోజులు గడుస్తోంది. శనివారం రాత్రి కృపారాణి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా రాత్రివేళ ఖననం చేశారు. కాగా దీనిపై తల్లిదండ్రులు బుజ్జి, ఏసమ్మను ప్రశ్నించగా వారు కొన్ని వివరాలను అందించారు. ఆ వివరాల మేరకు.. భర్తకు దూరమైన తర్వాత ఇందిరాకాలనీకి చెందిన అజయ్ (30) అనే వివాహితుడితో కృపారాణి సహ జీవనం చేస్తోంది. అతను స్థానిక చికెన్ సెంటర్లో పని చేసేవాడు. ఇందిరా కాలనీలో నివసించే అతను భార్యపిల్లలను పట్టించుకోకపోవడంతో వారు విజయవాడ వెళ్లిపోయారు. కృపారాణి కూడా ఇందిరా కాలనీలో అద్దెకు ఉంటూ అతనికి దగ్గరైంది. ఏడాది కాలంగా వీరి పరిచయం కొనసాగింది. రెండు నెలలుగా అజయ్కి కృపారాణి దూరంగా ఉంటోంది. అయితే, కృపారాణి అత్తవారి గ్రామమైన కొత్తపల్లిలో అజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆమె తరచూ కృపారాణికి ఫోన్ చేసి అజయ్ని వదిలేయక పోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానని హెచ్చరించేది. కృపారాణి హత్యకు ముందు మూడు రోజుల నాడు అంటే మంగళవారం కూడా కృపారాణి ఇంటికి అజయ్ వచ్చాడు. ఆ తర్వాత ఘటన జరగడంతో ఈ హత్యలో అజయ్ ప్రమేయం ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలియజేసినట్లు చెప్పారు. మృతురాలి పిల్లలు, తల్లిదండ్రులు పలు అనుమానాలు.. ఇదిలా ఉండగా హత్యకు ముందు రోజు గురువారం సాయంత్రం కృపారాణి ఆటోలో ఏలూరుపాడు బట్టల షాపునకు వెళ్లిందని, అదే రాత్రి హత్యకు గురైందని, తన కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసి, హత్యచేసి ఉంటారని తల్లి ఏసమ్మ ఆరోపించింది. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ జీవిస్తున్న కృపారాణి దూరం కావడంతో పిల్లలు తట్టుకోలేక పోతున్నారని వాపోయింది. కృపారాణి కొంకేపూడిలో ఉద్యోగం చేస్తోంది. మూడు నెలల క్రితం కుమారుడు శ్యాంబాబు (20) (కృపారాణి తమ్ముడు) అనారోగ్యంతో మృతి చెందగా, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి (బుజ్జి) ని, తననూ పోషిస్తున్న కృపారాణిని దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఏసమ్మ విలపించింది. ‘హత్య చేయవలసినంత తప్పు కృపారాణి ఏమి చేసిందయ్యా, చిన్నారులకు ఎవరు దిక్కు’ అంటూ కన్నీటి పర్యంతమైంది. కృపారాణి పిల్లలకు, వృద్ధాప్యంలో ఉన్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఏసమ్మ వేడుకుంటోంది. కాగా, కృపారాణి హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని కలిదిండి ఎస్ఐ జనార్థన్ తెలిపారు. అయితే, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న అజయ్ కూడా వీరిలో ఉన్నాడని తెలుస్తోంది. -
కొండ మృతదేహం లభ్యం
గుంటూరు, తంగెడ(దాచేపల్లి) : హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనానికి కట్టి కృష్ణానదిలో పడవేశారు. మూడు రోజులుగా నదిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం మృతదేహం లభ్యమైంది. లభించిన మృతదేహంను మాచవరం మండలం వేమవరానికి చెందిన మాగంటి కొండగా గుర్తించారు. సంఘటన స్థలంను పిడుగురాళ్ల సీఐ సురేంద్రబాబు, మాచవరం ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి సందర్శించారు. కొండ అదృశ్యంపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు విచారణ చేయగా కొండను హత్యచేసి తంగెడ కృష్ణానదిలో పడవేసినట్లు అంగీకరించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కృష్ణానదిలో గత మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేసిన మృతదేహం ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో తంగెడలో ఉన్న మత్యకారుల సహకారాన్ని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ తీసుకున్నారు. నదిలో ఉన్న మృతదేహంను గుర్తించేందుకు మత్యకారులు ప్రత్యేకంగా లంగర్లు తయారు చేయించారు. శుక్రవారం ఉదయం తంగెడ కృష్ణానది బ్రిడ్జికి తూర్పువైపు 65 అడుగుల లోతులో ఐదుసార్లు లంగర్లు వేసినా ఆచూకీ లభించలేదు. ఆరోసారి లంగరు నదిలోకి వదలటంతో తీగెలాగుతుండగా బరువు తగిలినట్టుగా గుర్తించారు. లంగరు జారిపొకుండా పటిష్టపరచి బయటకు తీశారు. మృతదేహంను గోతంలో పెట్టి మూటకట్టి ద్విచక్రవాహనంకు కట్టేసి ఉండటాన్ని గమనించారు. ద్విచక్రవాహనంను, మృతదేహంను బయటకు తీశారు. మూటలో కట్టిన మృతదేహం నుంచి తీవ్ర దుర్వాసన వచ్చింది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహం, ద్విచక్రవాహనంను పరిశీలించారు. కృష్ణానది వద్ద మృతదేహంను శచపంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి గోతంలో పెట్టారు. కృష్ణానది వద్దకు చేరుకున్న కొండ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): ‘ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.. మా పెళ్లిని సమాజం హర్షించదు. కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’ అని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్లోని ఓ హోటల్లో చోటుచేసుకుంది. ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28), వెంట్రప్రగడకు చెందిన లోకేశ్(19) ఇద్దరు సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గౌతమి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుండగా, లోకేశ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉండగా క్రిస్మస్కి దుస్తులు కోసమని చెప్పి గురువారం ఉదయం గాంధీనగర్లో ఒక హోటల్లో రూం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్ వెళతామని హోటల్ నిర్వాహకులకు చెప్పి ఆ సమయంలో కాలింగ్ బెల్ పెట్టాలని కోరారు. రాత్రి అయినా వారు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐలు సత్యనారాయణ, విమల ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలకొట్టారు. లోపల వారు మంచంపై గౌతమి విగతాజీవిగా పడిఉండగా, యువకుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలం నుంచి యువతిని పోస్టుమార్టానికి తరలించగా లోకేశ్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గౌతమి అంత్యక్రియలు పూర్తి తెంపల్లె (గన్నవరం రూరల్): మండలంలోని తెంపల్లెలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన నాగబోయిన గౌతమి (28) విజయవాడలోని లాడ్జిలో విషం తీసుకుని మృతి చెందటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన రైతు నాగనబోయిన వెంకటరావు కుమార్తె గౌతమి చిన్నతనం నుంచి అందరితో ఎంతో మర్యాదగా నడుచుకునేదని స్థానికులు బెబుతున్నారు. ఎంటెక్ చదివి ఉద్యోగం చేసుకుంటూ ఎంతో వినయంగా ఉండే గౌతమి మృతి చెందటాన్ని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటరావుకు ఇద్దరు సంతానం కాగా గౌతమి కుమార్తె. ఆమెకు అన్నయ్య ఉన్నాడు. గత నవంబరు నెలలో ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెల వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఇంతలో ఈ విధంగా జరగటంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గౌతమి విషం తీసుకుని చనిపోయిందని పోలీసుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు నివ్వెరపోయారు. హుటాహుటిన విజయవాడకు వెళ్లారు. తెంపల్లెకు సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తోంది. అయితే వివాహం విషయంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు నచ్చకపోవటమే గౌతమి మృతికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. గౌతమి మృతదేహానికి శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
బాలికపై రౌడీషీటర్ లైంగికదాడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలికపై ఓ రౌడీషీటర్ లైంగిక దాడి చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన బాలిక ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీసెంట్ రోడ్డుకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రోడ్డులోని రాజ్ టవర్స్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న గుణదలకు చెందిన రౌడీషీటర్ చిన్నిరాజా(వరుణ్కుమార్) బాలికను తన బైక్పై ఎక్కించుకు వెళ్లాడు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ వెనుక భాగంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి స్నేహితులను ఆరా తీశాడు. బైక్పై వెళ్లిందని తెలుసుకుని వెతకడం ఆరంభించాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఆమె ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆయన అక్కడకు వెళ్లడంతో బాలిక జరిగిన విషయం ఆమె తండ్రికి వివరించింది. బాలిక తండ్రి నేరుగా గవర్నర్పేట పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిపై మాచవరం పోలీసుస్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు, రూ.16 లక్షలు స్వాధీనం
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మారుతినగర్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ... ఈ ముఠాను ప్రసాదరావు అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మొత్తం 19 మంది ఉన్న ఈ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వీరినుంచి లెన్త్ బాక్స్, 19 సెల్ఫోన్లు, 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ లెన్త్ బాక్స్ నుంచి అందరూ కాన్పరెన్స్ ద్వారా బెట్టింగ్కు పాల్పడుతూ.. ప్లేయింగ్, ఈటింగ్, ఫ్యాన్సీ, 48.. 50 అనే కోడ్ భాషతో బెట్టింగ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్కు సంబంధించిన మూలాలు పూర్తి స్థాయిలో దొరకలేదని అన్నారు. ఈ బెట్టింగ్ విజయవాడలోనే కాక హైదరబాద్, ముంబైలలో ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారమని అందినట్లు తెలిపారు. ఇక నగదు బదిలీ అంతా ఆన్లైన్ ద్వారా ఎక్కువగా జరుపుతూ చాలా పకడ్బందీగా ఈ బెట్టింగ్ వ్యవహరాన్ని నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. -
బాలుడి ప్రాణం తీసిన నాటువైద్యం
సాక్షి, విజయవాడ: యూట్యూబ్ ద్వారా బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు ఇచ్చిన ప్రకటన చూసి.. తమకు ఉన్న జబ్బులు నయమవుతాయని ఎంతో ఆశగా నగరానికి వచ్చిన వారికి నిరాశే మిగిలింది. చికిత్స కోసం బెజవాడ వచ్చిన రోగులకు.. ఇచ్చిన నాటువైద్యం వికటించడంతో.. ఒక అమాయకపు బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం గవర్నర్పేటలోని గంగోత్రి లాడ్జిలో చోటు చేసుకొంది. బుద్ధి మాంద్యానికి చికిత్స తీసుకున్న బాలుడు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి పరిస్థితి విషమంగా మారడంతో బాధితులను వెంటనే విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. నాటువైద్యంతో బాలుడి ప్రాణాలు బలిగొని.. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసిన భూమేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మృతి చెందిన బాలుడిని కడప జిల్లాకు చెందిన హరనాథ్గా పోలీసులు గుర్తించారు. మొత్తం పది మందికి పైగా చికిత్స పొందేందుకు నగరానికి వచ్చినట్లు బాధితులు తెలిపారు. కృష్ణాజిల్లా ఏఎమ్డీఏ అసోసియేషన్ ద్వారా బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలకు చెందిన 11మంది చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారని సమాచారం. ఇదే లాడ్జిలో మూడు గదులు తీసుకుని నాలుగు రోజులుగా సదరు నాటు వైద్యుడు చికిత్సలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. -
కూతురిని చూసుకునేందుకు వస్తూ..
సాక్షి, ఇబ్రహీంపట్నం(విజయవాడ) : వారం రోజల క్రితం భార్య పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో, కూతురును తొలిసారిగా చూసుకునేందుకు ఆతృతగా వస్తున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాను డ్రైవ్ చేసుకుంటూ వస్తూ వేరే వాహనాన్ని ఢీకొని కారు పల్టీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఇబ్రహీంపట్నం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్లోని కర్ణాటక బ్యాంక్లో మేనేజర్గా పని చేస్తున్న భవానీపురానికి చెందిన ఒమ్మి హరి ఉదయప్రసాద్ యాదవ్ (28) చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకుకు శని, ఆదివారం సెలవులు రావటంతో ఉదయప్రసాద్ యాదవ్ తన కారులో శుక్రవారం ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యలో ముగ్గురు ప్రయాణికులను కూడా కారులో ఎక్కించుకున్నాడు. ఇబ్రహీంపట్నం సమీపంలోకి వచ్చే సమయానికి కారు గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపక్కన పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉదయప్రసాద్ యాదవ్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్క సీట్లో ఉన్న విశాఖపట్నంకు చెందిన కొడగల మునీంద్ర తలకు బలమైన గాయమైంది. వెనక సీట్లో కూర్చున్న అక్కిరెడ్డి శేఖర్ (విశాఖపట్నం), బెజ్జం నాగరాజు (గుంటూరు)కు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఏడాది క్రితం వివాహమైంది. భార్య వారం రోజుల క్రితం ఆడ పిల్లకు జన్మనిచ్చింది. భార్య, కుమార్తెను చూసేందుకు వస్తుండగా ఉదయప్రసాద్ యాదవ్ మృత్యువాతకు గురి కావటంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ పోలీసులు అరెస్టు
సాక్షి, విజయవాడ(నూజివీడు) : పోలీసులమని చెప్పి డబ్బు వసూలు చేసిన నకిలీ పోలీసులను అరెస్టు చేసినట్లు హనుమాన్జంక్షన్ సీఐ డి.వి.రమణ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జి.కొండూరు మండలం కందులపాడుకు చెందిన నాగారపు సురేష్బాబు, గణేష్ కలసి బత్తులవారిగూడెం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సీతారామపురం గ్రామం చివర పోలీస్ స్టిక్కర్లతో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు వెనుకగా వచ్చి ఆపారు. ‘మేము పోలీసులం బైక్ ఆపమంటే ఆపకుండా వస్తున్నావు అని బెదిరించి రూ.5,900 లాక్కోని నూజివీడు వైపు వెళ్లారు. దీనిపై నాగారపు సురేష్బాబు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలిపి శనివారం ఆగిరిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శోభనాపురం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ లేని వాహనాన్ని నడుపుతూ అనుమానాస్పదంగా ఉన్న మైలవరం మండలం గణపవరానికి చెందిన బెల్లంకొండ నాగరాజు(33), బెల్లంకొండ వంశీ(19)లను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు వసూలు చేసినట్లు నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్.ఐ పి.కిషోర్, ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జిల్లాల పాత నేరస్తుడి అరెస్ట్
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం, గుంటూరు) : దొంగతనాలకు పాల్పడిన అంతర్జిల్లాల పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు వివరాలు వెల్లడించారు. చల్లపల్లి మండలం రామనగరానికి చెందిన ముచ్చు సీతారామయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పేకాట, కోడిపందేలు, చిత్తులాటలతో పాటు మద్యానికి బానిసయ్యాడు. అవసరాల కోసం చోరీలకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నాడు. తొమ్మిదేళ్లలో చల్లపల్లి, మచిలీపట్నం, గుడివాడ, విజయవాడలతో పాటు గుంటూరు జిల్లాలోనూ పలు చోరీలకు పాల్పడ్డాడు. అనేక కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. దీంతో చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు ఆ బాధ్యతను సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు ఏఎస్పీ చెప్పారు. చాకచక్యంగా అరెస్ట్.. నేరస్తుడి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం సంతసెంటర్ టర్నింగ్ వద్ద సీతారామయ్యను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సీతారామయ్య ఇంటి పెరట్లో దాచి ఉంచిన సుమారు రూ.17 లక్షలు విలువ చేసే 358.084 గ్రాముల బంగారు ఆభరణాలు, 236.500గ్రాముల వెండి వస్తువులుతో పాటు ఎల్ఈడీ టీవీ, రూ.18,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో బందరు సీసీఎస్ ఇన్చార్జి డీఎస్పీ అజీజ్, సీఐ బీవీ సుబ్బారావు, చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ పి.నాగరాజు, అవనిగడ్డ సీసీఎస్ ఎస్ఐలు శ్రీనివాస్, సత్యనారాయణ, మచిలీపట్నం ఎస్ఐలు హబీబ్బాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి
బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం (మైలవరం) : బైకును లారీ డీకొన్న ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించే నిమిత్తం విస్సన్నపేట వెళ్లి తిరిగి వస్తూ తండ్రీ, కూతురు అసువులు బాయటం ఆ కుటుంబాన్ని కలచివేసింది. సేకరించిన వివరాల మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరావు (30) పూల వ్యాపారం చేస్తాడు. ఇటీవల కాలంలో తన పదేళ్ల కుమార్తెకు చేయి విరగటంతో విసన్నపేటలో నాటువైద్యం చేయించేందుకు తన బైకుపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదుగా వస్తుండగా ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకునే సమయానికి వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన లారీ వీరి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రరక్తస్రావానికి గురైన కుమార్తె తిరపతమ్మ (10)ను ట్రాఫిక్ పోలీసులు తమ పెట్రోలింగ్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. గొల్లపూడి ఆంధ్రా వైద్యశాలలో చికిత్స పొందుతూ బాలిక కూడా మరణించినంది. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం..
ఉంగుటూరు (గన్నవరం) : డబ్బు ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తుంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన అకీస్ (8నెలలు) అపహరణ. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ప్లాజా వద్ద సోను, పూలుబాయి దంపతులు తమ బంధువులతో కలసి మట్టి పాత్రలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కాగా సోను తన సోదరి వద్ద రూ.36 వేలు అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో అతని సోదరి మాయ ఆమె భర్త చానులు కలసి ఈ నెల 17న పూలుబాయి వద్ద నుంచి అకీస్ను తీసుకొని జైపూర్ వెళ్లారు. దీంతో పూలుబాయి ఆత్కూరు పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదుతో పోలీసులు బృందంగా ఏర్పడి వారితో పాటు అకీస్ తండ్రిని తీసుకొని జైపూర్ వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా జైపూర్లో నిందితులను 40 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లి తన కొడుకు కోసం విజయవాడలో సంతోషంతో ఎదురు చూస్తోంది. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
సాక్షి, విజయవాడ(నందిగామ) : ఒంటరిగా ఉంటున్న మహిళను యువకుడు మాయ మాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసి ముఖం చాటేయటంతో బాధిత మహిళ బంధువులతో కలసి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన తోట లక్ష్మీప్రసన్నకు మూడేళ్ల క్రితం కంచికచర్ల పట్టణానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వెల్లంకి గ్రామానికి చెందిన షేక్ సలీం ఆమెకు దగ్గరయ్యాడు. వీరిరువురు కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు రెండేళ్ల నుంచి ఇబ్రహీంపట్నంలో సహజీవనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సలీం కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆమెతో సంబంధం సాగించాడని మహిళ చెబుతోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భివతినని న్యాయం చేయాలని మహిళ కోరుతోంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామగణేష్ గ్రామానికి చేరుకుని మహిళ, బంధువులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించివేశారు. -
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ రూ.15లక్షల టోకరా
అతనో ఉపాధ్యాయుడు, తన కొడుకు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థితిలో ఉండాలని కోరుకున్న ఓ తండ్రి కూడా. అయితే ఆ తండ్రి ఆశను ఓ మోసగాడు అడ్డంగా వాడుకున్నాడు. నీ కొడుక్కి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించి లక్షల్లో సొమ్ము కాజేశాడు. భవిష్యత్తులో కొడుకు డాక్టర్ అవుతాడన్న ఆనందంలో అసలు మోసాన్ని గ్రహించలేని ఆ తండ్రి మాయగాడి ఉచ్చులో పడి దశలవారీగా లక్షలకు లక్షలు అతని ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అసలు మోసం తెలిసి ఆవేదనతో అక్కడే కుప్పకూలాడు. మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకుని దర్యాప్తుకు రంగం సిద్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సాక్షి కోనేరుసెంటర్ (విజయవాడ) : పెడనకు చెందిన కట్టా నాగమోహనరావు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు ఇంటర్ పూర్తి చేసి ఇటీవల ‘నీట్’ రాశాడు. 406 మార్కులు సాధించాడు. ఊహించిన స్థాయిలో మార్కులు రాకపోవటంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు. అయితే కలకత్తా నేషనల్ మెడికల్ కళాశాల నుంచి పంకజ్కుమార్శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను మెడికల్ కళాశాలలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నానని నాగమోహన్రావుకు చెప్పాడు. రూ.15 లక్షలు ఫీజు చెల్లిస్తే సీటు కేటాయిస్తామంటూ నమ్మించాడు. దీంతో నాగమోహనరావు దశలవారీగా అతను చెప్పిన 062422010028920 బ్యాంక్ అకౌంట్లోకి సొమ్ము జమ చేశారు. మొదటిగా గత నెల 17వ తేదీన రూ.45 వేలు, 21న రూ.4.50 లక్షలు, 27న మరో రూ.4.50 లక్షలు, 30వ తేదీన మరో రూ.5 లక్షలు జమ చేశాడు. దీంతో పంకజ్కుమార్శర్మ తన కుమారుడికి సీటు కేటాయించినట్లు చెప్పాడు. ఈ నెల 6వ తేదీన కళాశాలలో ప్రారంభమయ్యే తరగతులకు పంపాలని చెప్పాడు. నాగమోహనరావు తన కుమారుడిని వెంటబెట్టుకుని కలకత్తాలోని నేషనల్ మెడికల్ కళాశాలకు వెళ్లి సీటు కోరగా పంకజ్కుమార్శర్మ అనే వ్యక్తి అక్కడ ఎవరూ లేరని తేలింది. గతంలో ఇలానే కొంత మంది అతని చేతిలో మోసపోయినట్లు యాజమాన్యం నాగమోహనరావుకు చెప్పారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న నాగమోహనరావు తిరిగి మచిలీపట్నం వచ్చేశాడు. దర్యాప్తు చేపట్టిన చిలకలపూడి పోలీసులు జరిగిన మోసంపై నాగమోహనరావు బుధవారం రాత్రి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంకజ్కుమార్శర్మ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు చూపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. -
దొంగలు దొరికారు
సాక్షి, విజయవాడ, గుంటూరు : నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను బందరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీసీఎస్ బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన డేరంగుల రాజేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వ్యసనాలకు బానిసైన రాజేష్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. భార్య లక్ష్మితో పాటు బంధువులైన మల్లెల సురేష్, తురక సురేష్, తురకా మమత, బత్తుల రేణు, తమ్మిశెట్టి బాలవీరాస్వామిలకు ఈజీ మనీ ఆశ చూపించి అతనితో కలుపుకున్నాడు. నేరాలు చేసేందుకు చేయి కలిపిన బంధువులతో కలిసి జనాన్ని మోసగించడం ప్రారంభించాడు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చిత్రీకరించి అమాయకులను అడ్డంగా దోచేయడం ప్రారంబించాడు. అలా జూన్ మాసంలో పెడన మండలం సింగరాయపాలెంలో బం«ధువులతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందరూ కూలి పనులు చేసుకుంటున్నట్లు గ్రామస్తులను నమ్మించారు. జూన్ 21న సింగరాయపాలెంకు చెందిన దుర్గాభవానీ అనే మహిళను కలిసి తనకు బంగారం బిస్కెట్ దొరికిందని నమ్మించాడు. అది అమ్మడం తనకు కష్టమని చెప్పి అతి తక్కువ ధరకు దొరికిన బిస్కెట్ అమ్మేస్తానంటూ అమాయకంగా నటించాడు. రాజేష్ మాటలు నమ్మిన దుర్గాభవానీ తన ఒంటిపై ఉన్న బంగారు నానుతాడు, చెవిదిద్దులతో పాటు రూ. 20వేల నగదును అప్పజెప్పి బిస్కెట్ను తీసుకుంది. అనుకున్న విధంగా పని ముగియడంతో రాజేష్, అతని బంధువులు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. అసలు విషయం తెలుసుకున్న దుర్గాభవానీ జరిగిన ఘటనపై పెడన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రాజేష్, అతని బంధువులు చిలకలపూడి రైల్వేస్టేషన్లో అదే తరహాలో ప్రయాణికులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడిచేశారు. నిందితుడు రాజేష్తో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిని విచారణ చేసి 24 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ముఠాను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన సీసీఎస్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు హబీబ్బాషా, వెంకటేశ్వరరావులను అబ్దుల్ అజీజ్ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఎస్ఐ హనుమంతరావు, పెడన ఎస్ఐ మురళి, జి. సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!
సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో వంచించి.. యువతి నగ్న చిత్రాలను తీసి లొంగదీసుకున్న కేసులో సూత్రధారి వంశీకృష్ణ అరెస్టుకు విజయవాడ నగర పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో చదువుతున్న అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ పుట్టిన రోజు పార్టీలో పరిచయమైన యువతిని మాచవరంలో ఉంటున్న వంశీకృష్ణ మాయ మాటలతో లొంగదీసుకుని.. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నాడు. తరువాత అతడు ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అతడు ఆ వీడియోలను ప్రస్తుతం అరెస్టు అయిన స్నేహితుడు జగదీష్కు పంపించాడు. అప్పటి నుంచి అమ్మాయిని జగదీష్ లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ దుర్ఘటన జరగడానికి కారకుడైన జగదీష్ స్నేహితుడు వంశీకృష్ణను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని ఇక్కడికి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం ముందుగా జిల్లా కోర్టులో ఓపెన్ డేటెడ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ తరువాత సీఐడీ ద్వారా రెడ్కార్నర్ నోటీసు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగదీష్ వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ను పోలీసులు విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాగే ఇంకా ఎవరినైనా బెదిరించి నగ్న చిత్రాలు తీశాడా? అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్ను సైబర్ ఫోరెన్సిక్కు పంపించే యోచనలో ఉన్నారు. వంశీకృష్ణ, జగదీష్లతోపాటు ఇంకా ఎవరైనా ఇలా వ్యవహరించారా కోణంలో పరిశీలిస్తున్నారు. వారిద్దరి స్నేహితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వారి ద్వారా మరింత కూపీ లాగాలని యత్నిస్తున్నారు. చదవండి: ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..! -
ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!
సాక్షి, అమరావతి: ఓ యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత తరచూ వేధింపులకు ఒడిగడుతున్న ఓ యువకుడిని విజయవాడ నగర పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మూడేళ్లుగా బెదిరింపుల పర్వం కొనసాగుతుండగా యువతి గత శుక్రవారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు విజయవాడ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తద్వారా మాచవరం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే రోజు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విషయాలేమీ తెలియని ఆ యువకుడి తల్లిదండ్రులు సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో తమ కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేయడం గమనార్హం. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రేమ పేరుతో నయవంచన.. విజయవాడలో మాచవరం ప్రాంతంలో ఉన్న రితేశ్(పేరు మార్చాం)కు ఉమ్మడి స్నేహితుల ద్వారా ఓ పుట్టిన రోజు వేడుకలో ఒక యువతితో 2017లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి ఆ యువకుడిని నమ్మడంతో.. ఇద్దరూ హద్దులు దాటారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత రితేశ్ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రితేష్ గతంలో తాము తీసుకున్న చిత్రాలను తన స్నేహితుడు భార్గవ్(పేరు మార్చాం)కు ఫోన్లో షేర్ చేసి.. నయ వంచనకు పాల్పడ్డాడు. స్నేహితుడి బెదిరింపులు.. ఆస్ట్రేలియాలో ఉన్న రితేష్ స్నేహితుడు భార్గవ్ కూడా యువతికి ఫ్రెండ్ కావడంతో ఓ రోజు యువతికి భార్గవ్ ఫోన్ చేసి తన దగ్గర ఉన్న ఫొటోల వివరాలు చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే మీ అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరింపుల పర్వానికి తెరదీశాడు. ఒంటరిగా కలవాలని సూచించాడు. దీంతో చేసేది లేక భార్గవ్ చెప్పినట్లుగానే యువతి ఒంటరిగా కలిసింది. ఆ సమయంలో బెదిరించి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తరచూ కలవాలని వేధించ సాగాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. అలా రూ. 3 లక్షలు వరకూ యువతి భార్గవ్కు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో.. తాళలేక చివరకు జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన మా చవరం పోలీసులు సోమవారం భార్గవ్ను అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే ఆస్ట్రేలి యాలో ఉన్న రితేష్పై కూడా కేసు నమోదు చేశారు అరెస్టును అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీ విశ్వప్రయత్నం! యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసి.. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎంపీ పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ యువకుడిని అరెస్టు చేయకుండా కాపాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పదేపదే నగర కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఫోన్లు చేశారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి ద్వారా కూడా సిఫార్సు చేయించినట్లు సమాచారం. అయితే ఎంపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. -
బెజవాడలో తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టు...
సాక్షి, విజయవాడ: అర్ధరాత్రి వాహనాలను దగ్ధం చేసి జనం గుండెల్లో దడ పుట్టించిన తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టయింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఉదంతం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. ఇందుకు సంబంధించి .ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు చోట్ల వాహనాలపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన చేసిన విషయం తెలిసిందే. నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ విజయరావు మాట్లాడుతూ.. పార్క్ చేసి ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన కేసులో రాజరాజేశ్వరి పేటకు చెందిన సంజయ్తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుమ్మడి సంజయ్కు చదువు అబ్బలేదు. అడిగేవారు లేకపోవటంతో చెడు దారి పట్టి వ్యసనాలకు బానిస అయ్యాడు. నిత్యం ఇద్దరు బాలురితో కలిసి మద్యం మత్తులో జోగి తప్పతాగి తిరిగే వాడు. అయితే మత్తులో ఉన్న కారణంగా వారు ఈ నేరానికి పాల్పడ్డారని డీసీపీ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవటం వల్లే మద్యానికి బానిసలై నేర ప్రవృత్తి వైపు మళ్లారని డీసీపీ అన్నారు. విజయవాడలో నేరాల అదుపుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసామని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, ఆకతాయి పనులు చేసినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. -
వివాహితను రక్షించబోయి..ప్రాణాలు కోల్పోయాడు
సాక్షి, విజయవాడ: వివాహితను రక్షించబోయి ఇద్దరు యువకులు గల్లంతు అయిన ఘటన విజయవాడలోని గుణదలలో చోటుచేసుకుంది. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుణదలకు చెందిన రాణి అనే ఓ మహిళ మంగళవారం గుణదల రైవస్ కాల్వలో దూకేసింది. అదే సమయంలో అక్కడ ఉన్న అయిదుగురు యువకులు గమనించి ఆమెను రక్షించేందుకు కాలువలోకి దూకారు. వీరిలో ముగ్గురు యువకులు రాణిని రక్షించి బయటకు తీసుకొని రాగా, మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాగా గల్లంతైన యువకులను వడుగు శివరామకృష్ణ (నాని), తాడేపల్లి సాయి అజయ్గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. గాలింపులో భాగంగా గల్లంతు అయిన శివరామకృష్ణ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవాళ సాయంత్రం ఒడ్డుకు చేర్చింది. మహిళను రక్షించబోయి ప్రాణాలు పోగొట్టుకున్న శివరామకృష్ణ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతమయ్యారు. -
కసితోనే భార్య తల నరికాడు
సాక్షి, అమరావతి: అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో తలెత్తిన విభేదాలు, మనస్పర్థల కారణంగానే భార్య మణిక్రాంతిని కసితోనే కడతేర్చాడని విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ–2 విజయరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీనగర్కాలనీ 4వ లైనులో భర్త చేతిలో మణిక్రాంతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్కుమార్ను, అతడికి సహకరించిన కారు డ్రైవర్ భవానీ ప్రసాద్ను శుక్రవారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ విజయరావు ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ విజయరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘విజయవాడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మణిక్రాంతి, ప్రదీప్కుమార్ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి కాపురం బాగానే ఉంది. 2017లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రదీప్ అతడి కుటుంబ సభ్యులపై మణిక్రాంతి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో 2018లో ఫిర్యాదు చేయగా 498(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత వివిధ సందర్భాల్లో అదే పోలీసు స్టేషన్లో మరో మూడు సార్లు మణిక్రాంతి ఫిర్యాదు చేయగా ప్రదీప్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో మూడు కేసులు.. మాచవరం పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. సదరు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేశారు. మణిక్రాంతి పెట్టిన కేసులలో ప్రదీప్కుమార్, అతడి కుటుంబ సభ్యులు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఇటీవల సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో పెండింగ్లో ఉన్న వారెంట్ ఆధారంగా ఈ నెల 6వ తేదీ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 7వ తేదీ ప్రదీప్ బెయిల్పై బయటకొచ్చాడు. నీవెంతంటే.. నీవెంత.. ఈ నెల 7వ తేదీన విజయవాడలోని కోర్టు ఆవరణలో భార్యభర్తల మధ్య కోర్టు ఆవరణలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. నీవెంత అంటే నీవెంత అనే స్థాయిలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి స్నేహితుడు మధురానగర్ 7వ లైనుకు చెందిన గరికపాటి భవానీప్రసాద్ సహకారం తీసుకున్నాడు. హత్య జరిగిన ముందు(10.8.19) రోజు శ్రీనగర్ కాలనీకి భవానీప్రసాద్కు చెందిన కారులో వెళ్లి రెక్కీ నిర్వహించారు. 11వ తేదీ మధ్యాహ్నం మళ్లీ భవానీప్రసాద్ తన కారులో ప్రదీప్ను శ్రీనగర్ కాలనీకి తీసుకొచ్చి మణిక్రాంతి ఇంటి ముందు అతడిని దించి తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ తన పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో మణిక్రాంతి వద్దకు వెళ్లి ఆమెను కాళ్లపైనా, మెడపైన విచక్షణా రహితంగా నరుకుతుండగా ఆమె కేకలు వేసింది. అది విని మృతురాలి తల్లి, చెల్లి బయటకు వచ్చి చూడగా వారిని బెదిరించాడు. తలను వేరు చేసి చేతిలో పట్టుకుని వెళ్తుండగా అడ్డువచ్చిన ఆమె తల్లి, చెల్లితోపాటు స్థానికులను ప్రదీప్ కత్తితో బెదిరించి పారిపోతూ సమీపంలోని ఏలూరు కాలువలో తలను, కత్తిని, ఫోన్ను పడేశాడు. ఈ నేపథ్యంలో డెయిల్ 100కు వచ్చిన సమాచారం మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కారు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో.. నిందితుడు మృతురాలి తలను వేరు చేసి కాలువలో పడేశాడు. ఆ తల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నాం. కాలువ మార్గంలో ఉన్న పోలీసుస్టేషన్లకు సమాచారం అందించాం. స్థానిక పోలీసులు వెతుకుతున్నారు. అయితే తల కనబడకపోయినా.. కేసుకు సంబంధించి బలమైన సాంతికేక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీ సేకరించాం. హతుడు ఉపయోగించిన కత్తికి సంబంధించిన పిడికిలి లభ్యమైంది. రక్త నమానాలు తీసుకున్నాం. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కారును సీజ్ చేశాం. వీటన్నింటీ ఆధారంగానే చార్జీషీటు దాఖలు చేసి నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని విజయరావు వివరించారు. సమావేశంలో ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్, ఏసీపీ షేక్ షరీఫుద్దీన్, సీఐ బాలమురళీ కృష్ణ, ఎస్ఐ సత్యానారాయణ పాల్గొన్నారు. -
సోదరుడిపై దాడి చేసి...యువతిని..
సాక్షి, కృష్ణలంక(విజయవాడ తూర్పు) : ఆరుగురు వ్యక్తులు అర్ధరాత్రి ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె సోదరులపై దాడిచేసి గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కొత్తపేట శ్రీనివాసమహాల్ ప్రాంతానికి చెందిన యువతి(20) ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె ఇద్దరు సోదరులు కాసుల రాజేష్, ఏసు బుధవారం రాత్రి 12.30 సమయంలో ఆటోలో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. అనంతరం టిఫిన్ చేసేందుకు పండిట్ నెహ్రూ బస్స్టేషన్ వద్ద హోటల్కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ వాహనంలో వచ్చిన ఆరుగురు యువకులు ఒంటరిగా టిఫిన్ చేస్తున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పక్కనే ఉన్న సోదరులు అడ్డుకోబోయారు. వారిపై దాడిచేసి గాయపరిచి అక్కడ నుంచి వాహనంలో పరారయ్యారు. ఈ ఘటనపై ఆమె కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయడంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. -
ఎస్సైపై గృహహింస కేసు నమోదు
సాక్షి, కృష్ణా : గుడివాడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తు ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వీఆర్లోకి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్పై అతని కోడలు గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమటలో నివాసం ఉండే శిరీషా, భాస్కర్కు 2013లో వివాహం అయింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద ఐదున్నర లక్షలు, 15 సవర్ల బంగారం, అర ఎకరం పొలంతో పాటు, అడపడుచు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చారు. తన బాబును చూడనివ్వటం లేదని, పైగా తన బ్యాంకు అకౌంట్నుంచి లోన్లు తీసుకుని, తనను వేధిస్తున్నారని శిరిషా విజయవాడలో ‘స్పందన’ కార్యక్రమంలో కమిషనర్కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ సూచన మేరకు గురువారం పటమట పోలీసులకు అమె ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం అలా వేసుకు తిరిగితే ఎలా?..
సాక్షి, నూజివీడు: పోలీసులమని చెప్పి ముగ్గురు ఆగంతుకులు వృద్ధురాలి నగలు దోచుకెళ్లిన ఘటన నూజివీడు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు.. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి కోవెల వెనుక భాగాన ఉన్న సాయితేజ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్లో రిటైర్డ్ ఏఓ ప్రత్తిపాటి రాజకుమారి(68) నివసిస్తున్నారు. ఆమె కూరగాయల నిమిత్తం రైతు బజారుకెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 12.40గంటల సమయంలో వెంకటేశ్వరస్వామి కోవెల వద్దకు రాగానే ముగ్గురు సివిల్ డ్రెస్లలోనే ఉండి ‘మేము పోలీసులమని, బంగారు గొలుసులు వేసుకుని తిరిగితే ఎలాగని.. వాటిని తీసి సంచిలో వేసుకుని వెళ్లమని’ సూచించారు. దీంతో ఆమె మెడలోని రెండు పేటల తాడును తీయగా, దానిని కాగితంలో పొట్లం కట్టి ఇస్తామని చెప్పి, చేతులకున్న రెండు గాజులు కూడా తీసివ్వమని కోరగా వాటిని తీసిచ్చింది. ఆభరణాలను కాగితంలో పొట్లం కట్టినట్లే కట్టి పొట్లంను ఆమె బ్యాగ్లో వేశారు. ఆ తరువాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తరువాత వృద్ధురాలు బ్యాగ్లో పొట్లం కోసం వెతకగా అది లేదు. దీంతో తాను మోసపోయాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు పది కాసులు ఉంటాయని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. సీఐ పీ రామచంద్రరావు, ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. అలాగే రైతుబజారు నుంచి ఘటన జరిగిన ప్రాంతం వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..
సాక్షి, తిరువూరు(కృష్ణా): ఏ కొండూరు పోలీసుస్టేషను పరిధిలోని కంభంపాడులో ఐదు రోజుల క్రితం బాలికను కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు మోసగించిన కేసును ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ డీఎస్పీ విజయరావు ఆదివారం విచారణ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వల్లంపట్లకు చెందిన ఎం.గోపికృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వివాహం అయింది. ఆషాఢ మాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లాడు. ఆ అధ్యాపకుడిని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఏకొండూరు పోలీసుస్టేషనుకు తీసుకొచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారిణ చేసి పోలీసులు బాలికను తిరువూరులోని స్వధార్హోంకు తరలించారు. ఫోక్సా చట్టం కింద నమోదైన కేసును డీఎస్పీ విచారణ చేస్తున్నారు. ఏ కొండూరు పోలీసుస్టేషనులో ఉన్న నిందితుడిని కూడా డీఎస్పీ ప్రశ్నించారు. తిరువూరు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, నూజివీడు టౌన్, తిరువూరు సెక్టార్ 2, ఏ కొండూరు ఎస్ఐలు కనకదుర్గ, అవినాష్, ప్రవీణ్కుమార్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. -
నమ్మించాడు.. ఉడాయించాడు!
సాక్షి, సత్యనారాయణపురం (విజయవాడ): నమ్మి ఐదు లక్షల విలువైన సరుకు పంపిస్తే గుట్టుచప్పుడు కాకుండా దుకాణం మూసివేసి యజమాని పరారైన సంఘటన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు వీధికి చెందిన గోపరాజు వెంకట శంకర్ కేసరీ పుడ్ ఫీడ్స్ పేరిట మొక్కజొన్నలు, వంట నూనెలు విక్రయిస్తుం టాడు. ఆయనకు 2016లో రాకేశ్రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో రాకేశ్కు గాయత్రినగర్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఉన్న రక్షా ఇన్ఫ్యాక్ట్స్ దుకాణానికి సరుకును పంపించమన్నాడు. ఆదిలో వ్యాపార లావాదేవీలు సక్రమంగానే సాగినా తర్వాతి కాలంలో 5 లక్షల విలువైన సరుకు పంపించగా అందుకు సంబందించిన ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిచిపోయాయి. ఈమేరకు డబ్బును వెంకట శంకర్ అడుగుతుండగా రాకేశ్రెడ్డి వాయిదా వేస్తూ వ చ్చాడు. ఈక్రమంలో వెంకట శంకర్కు పలువురు దుకాణం నడవడం లేదని, రాకేశ్ కని పించడం లేదని చెప్పడంతో పరిశీలించి చూడగా దుకాణం మూసివేసి పరారయ్యాడని గమనించాడు. దీంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో కుచ్చుటోపీ!
సాక్షి, అమరావతి : అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. లక్షలు ముట్టజెప్పితే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువతను అడ్డంగా మోసగించారు. మోసపోయిన ఒక అభ్యర్థి ధైర్యం చేసి తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాలకు చెందిన నరాల శివనాగార్జునరెడ్డి కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలానికి చెందిన చాకలి మనోహర్కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.80 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్గా నకిలీ అపాయింట్మెంట్ లెటర్ను సృష్టించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.30 వేలు అడ్వాన్స్గా తీసుకున్నారు. లెటర్ అందజేసి మిగిలిన మొత్తాన్ని తీసుకోవాలని పథకం రచించారు. ఈ లెటర్పై అనుమానం రావడంతో మనోహర్ ఈ నెల 16న విషయాన్ని సచివాలయ అధికారుల దృష్టికి తేసుకెళ్లాడు. వారు దాన్ని నకిలీ అపాయింట్మెంట్ లెటర్గా ధృవీకరించడంతో మోసపోయానని గ్రహించి తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రధాన నిందితుడు మాజీ మంత్రి మనవడు గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు నిందితులను గురువారం ఉదయం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రెడ్డి గౌతమ్ టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు. మిగిలిన ముగ్గురు నరాల శివనాగార్జునరెడ్డి, సతీష్, మిథున్ చక్రవర్తి టీడీపీ నాయకులు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్తో తీసుకున్న ఫొటోలను ఎరగా వేసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు మొత్తం ఏడుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తుళ్లూరు ఎస్ఐ వెంకటప్రసాద్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని విచారించగా ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి వీరు దందా మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
క్యాషియర్పై దాడి చేసిన దొంగలు దొరికారు
సాక్షి, అమరావతి : విజయవాడలో గత శనివారం ప్రగతి ట్రాన్స్పోర్టు కార్యాలయంలో క్యాషియర్పై కర్రలతో దాడి చేసి నగదును కాజేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి పథక రచన చేసిన సూత్రధారితోపాటు దోపిడీలో పాల్గొన్న ముగ్గురిని 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సూర్యారావుపేట స్టేషన్ కార్యాలయంలో డీసీపీ–2 విజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. స్నేహితుడే కానీ.. విజయవాడ నగరం 2వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని పంజా సెంటర్, పాడి వీధిలో ప్రగతి ట్రాన్స్పోర్టును సంతోష్ కుమార్ త్రిపాఠి నిర్వహిస్తున్నారు. ఆ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్గా త్రిపాఠి స్నేహితుడు ఎదుబోస్లే వేణుగోపాల్ పనిచేస్తుండేవాడు. కొంత కాలం తర్వాత వ్యాపార లావాదేవీల్లో తేడాలు వచ్చి వేణుగోపాల్ త్రిపాఠి వద్ద పనిచేసి సొంతంగా మరొక కంపెనీ ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహించాడు. ఆ వ్యాపారంలో నష్టం రావడంతో తన స్నేహితుడు త్రిపాఠిపై వేణుగోపాల్ కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో వేణుగోపాల్ అనారోగ్యం పాలయ్యాడు. ఈ సమయంలో ప్రగతి ట్రాన్స్పోర్టులో దొంగతనం చేయాలని పథకం వేశాడు. ఇందుకు తన భార్య అక్క కొడుకు విశాల్ రాజ్కుమార్ కోయిల్ సాయం తీసుకున్నాడు. విశాల్ ప్రగతి ట్రాన్స్పోర్టులోనే కిరాయి ఆటోను పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. పక్కా స్కెచ్.. ప్రగతి ట్రాన్స్పోర్టు కార్యాలయంలో రోజూ రూ.5 లక్షలకు పైగా నగదు ఉంటుందనే విషయాన్ని గ్రహించారు. ముందుగానే పథక రచన చేశారు. క్యాషియర్గా పని చేస్తున్న ప్రదీప్ పాండే ట్రాన్స్పోర్టు కార్యాలయంలో రాత్రి 9.30 గంటల అనంతరం ఒక్కడే ఉండే విషయాన్ని తెలుసుకొని కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. దోచుకోవడం విశాల్ ఒక్కడి వల్ల కాదనే భావనతో అతడి స్నేహితులైన మహారాష్ట్ర లాథూర్ జిల్లా దేవిని మండలం బొరొల్ గ్రామానికి చెందిన కోపె మాధవ్ త్రయంబక్, సందీప్ పాండురంగ యంకురేలను నగరానికి రప్పించాడు. ఈనెల 13వ తేదీ రాత్రి దోపిడీకి సిద్ధమయ్యారు. విశాల్ స్నేహితులు కొత్తపేట చేపల మార్కెట్ వద్ద ఉన్న షాదీఖానా ప్రాంతంలోని మేదర్ల వద్ద రెండు వెదురు కర్రలు కొన్నారు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ట్రాన్స్ పోర్టులో ఉన్న సిబ్బంది కూడా వెళ్లి పోయిన తర్వాత కార్యాలయంలోకి చొరబడి క్యాషియర్పై కర్రలతో దాడి చేసి రూ. 3.50 లక్షల నగదును దోచుకెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా.. దోపిడీ జరిగిన తర్వాత క్యాషియర్ ప్రదీప్పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ తీరును పరిశీలించారు. ఆధారాలను సేకరించారు. అలాగే ప్రగతి ట్రాన్స్పోర్టు కార్యాలయంలోకి నిందితులు చొరబడిన తీరు సీసీ కెమెరాల ఫుటేజ్లో నమోదైంది. దాని ఆధారంగా విశాల్ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో సూత్రధారి వేణుగోపాల్ను.. దోపిడీలో పాల్గొన్న మరో ఇద్దరి కోసం మహారాష్ట్రకు ప్రత్యేక బృందాన్ని పంపించి వారిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారి వద్ద నుంచి రూ. 3.50 లక్షల నగదుతోపాటు దోపిడీకి వినియోగించిన బైక్, వెదురు కర్రలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. పోలీసులకు అభినందనలు.. దోపిడీ జరిగిన వెంటనే రెండు రోజుల్లోనే కేసును ఛేదించడమే కాకుండా మహారాష్ట్రకు వెళ్లి నిందితులను అరెస్టు చేసిన ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్తోపాటు వెస్ట్జోన్ ఏసీపీ సుధాకర్, టూటౌన్ సీఐ ఉమర్, ఎస్ఐలు కృష్ణ, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఖాదర్, నాంచారయ్య, అజయ్, రాజేష్లను డీసీపీ విజయరావు అభినందించారు. -
డ్రైయినేజీలో ఆలయ హుండీలు!
సాక్షి, కోనేరు(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని చిలకలపూడి ఎఫ్సీఐ గోదాము సమీపంలోని డ్రెయినేజీలో రెండు హుండీలు దర్శనమిచ్చాయి. రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్లో పలువురు యానాదులు ఇనుపముక్కల కోసం వెతుకుతుంటారు. దీనిలో భాగంగా బుధవారం యానాదులకు డ్రెయిన్లో పగులకొట్టి ఉన్న రెండు కానుకల హుండీలు దొరికాయి. విషయాన్ని గ్రహించిన స్థానికులు హుండీలను పక్కనపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హుండీలను పరిశీలించి ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దుండగులు హుండీలోని నగదును అపహరించి వాటిని డ్రెయిన్లో పడవేసినట్లుగా భావిస్తున్నారు. -
బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!
సాక్షి, మైలవరం: కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. బంధాలు భారమవుతున్నాయి..క్షణికావేశంలో బంధాలు తెంచుకుంటున్నారు.. చిన్నచిన్న విషయంలో పట్టింపులకు పోతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు వెనకడం లేదు.అన్నపై దాడి చేస్తున్నాడని ప్రశ్నించిన పాపానికి బాబాయిని అన్న కొడుకు కొట్టిచంపిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రీకొడుకులు గొడవ పడుతున్న నేపథ్యంలో అడ్డుగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన చెర్వుమాధవరం గ్రామంలో బుధవారం తెల్ల్లవారుజామున చోటుచేసుకొంది. ఎస్ఐ రాంబాబు అందించిన వివరాలు... జి.కొండూరు మండల పరిధిలోని చెర్వుమాధవరం గ్రామానికి చెందిన ఓర్సు బాబు, కొడుకు నాగరాజుకి జీవనోపాధి కోసం ఆటో కొని ఇచ్చాడు. అయితే మద్యానికి బానిసైన నాగరాజు ఆటోని సక్రమంగా నడపకుండా అప్పులు చేస్తుండడంతో తండ్రి మందలించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగరాజు తండ్రిని కొట్టాడు. ఇది గమనించి బాబు తమ్ముడు ఓర్సు నరసింహారావు(37) అడ్డుగా వెళ్లాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు బండరాయి తీసుకొని బాబాయి నరసింహారావు తలపై మోదాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ శ్రీను, ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిలాడీ ‘యాప్’తో జర జాగ్రత్త!
సాక్షి, అమరావతి : సైబర్ నేరాల్లో సరికొత్త బురిడీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో బహిర్గతమైంది. ‘ఎనీ డెస్క్’ యాప్తో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే నేరాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భవానీపురం వాసిని సైబర్ నేరస్తులు ఇదే తరహాలో మోసం చేసి రూ.68 వేలు కొల్లగొట్టారు. బాధితుడి చరవాణిలోకి చొరబడి బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డారు. నకిలీ కస్టమర్ కేర్ నంబరుతో వల విజయవాడ భవానీపురానికి చెందిన ఓ యువకుడు గత ఫిబ్రవరి 25వ తేదీన తన ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు ఆంధ్రా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నించాడు. అందులో విఫలం కావడంతో ఇంటర్నెట్లో ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ ఫోన్ నంబరు కోసం వెతికాడు. సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్కేర్ నంబరును ఇంటర్నెట్లో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు.. ఆ నంబర్కు ఫోన్ చేశాడు. అదే అదనుగా బాధితుడికి ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ 9939017073 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశారా?’ అని ప్రశ్నించగా భవానీపురం వాసి ‘అవును’ అని సమాధానం ఇవ్వగా.. ‘మీకు ఫోన్పే, గూగుల్పే యాప్స్ ఉన్నాయా?’ అని అటు నుంచి మళ్లీ అడిగారు. ‘గూగుల్పే లేదు నా ఫోన్లో ఫోన్పే మాత్రమే ఉంది’ అని వివరించాడు. అయితే ఆ సమయంలో బాధితుడి ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం అతడి తమ్ముడి ఫోన్లో నుంచి కస్టమర్కేర్ సభ్యుడితో మాట్లాడుతూ అతడు చెప్పినట్లు ఫోన్పే ఆపరేట్ చేస్తుండగా.. ‘మీకు ఆపరేట్ చేయడం సరిగా రావడం లేదు’ అంటూ బాధితుడి ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్ను నిక్షిప్తం చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. ఆ తరువాత ఎనీడెస్క్ యాప్ ద్వారా వచ్చే కోడ్ను చెప్పమని నేరస్తుడు చెప్పడంతో అలాగే చేశారు. అనంతరం ఐదు నిమిషాలకే బాధితుడికి చెందిన యాక్సిస్, ఆంధ్రాబ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు మాయమైపోయింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.43 వేలు, మళ్లీ నిమిషానికి ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 వేలు, మరొకసారి రూ.5 వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్ చొరబడితే అంతే.. అంతర్జాల సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎనీడెస్క్ యాప్ను నిక్షిప్తం చేస్తే ఇక అంతే సంగతులు అని సైబర్క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ ఏ ఫోన్లో ఉంటుందో.. అందులోని సమస్త సమాచారాన్ని సైబర్ నేరస్తులు వీక్షించే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో బాధితుల ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల క్రమంలో చరవాణికి వచ్చే వన్టైమ్ పాస్వర్డ్లూ నేరస్తులకు కనిపిస్తాయి. అందుకే ఆ యాప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో నిక్షిప్తం చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. -
ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధానిలో కిరాయి హంతక ముఠాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. చాప కింద నీరులా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై పోలీసు శాఖ నిఘా పెట్టడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుండటంతో వీరి ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో వ్యాపారి రాంప్రసాద్ను హత్యలో గుంటూరు, విజయవాడకు చెందిన రౌడీషీటర్ల హస్తం ఉండటం రాజధానిలో కలకలం రేపుతోంది. పోలీసుల వైఫల్యం.. వ్యాపారి రాంప్రసాద్ హత్య వ్యవహారంలో విజయవాడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రౌడీషీటర్లపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. గుంటూరు, విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికిపై రౌడీషీటర్లు ఉన్నారు. ఈ నగరాల్లో ఏ కేటగిరీ వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వీరి కదలికలపై కమిషనర్ టాస్క్ఫోర్స్, సంబంధిత స్టేషన్ల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడ నగరంలో.. ముఖ్యంగా విజయవాడ నగరంలో పలుకుబడి కలిగిన రౌడీషీటర్లు చాలా మంది నెలల తరబడి సంబంధిత స్టేషన్లకు రాకపోయినా పోలీసులు స్పందించడం లేదు. ‘ఏ’ కేటగిరీ రౌడీషీటర్ల విభాగంలో ఉన్న కోగంటి సత్యం ఈ ఏడాది జనవరి నుంచి పటమట స్టేషన్కు రాకపోయినా పట్టించుకోలేదు. నేరాభియోగాలు ఎదుర్కొంటూ రౌడీషీట్ ఉన్న వ్యక్తి చాలా కాలం నుంచి స్టేషన్కు ఎందుకు రావడం లేదన్న దానిపై కనీసం దృష్టి కూడా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకపోతే ఏదైనా కుట్రకు పాల్పడుతున్నాడా? అన్న కోణంలో కూడా చూడలేదు. సత్యం కదలికలపై కూడా నిఘా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకుండా ఉండడానికి ఏమైనా మినహాయింపు తీసుకున్నారా? అన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ సమయంలో ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? అన్న అంశాలపై హైదరాబాద్ పోలీసులు పరిశీలిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. శ్యామ్ సుందర్పైనా నిఘా లేదు.. రాంప్రసాద్ను తానే చంపానని హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్యామ్, బెజవాడ వాసి. గతంలో రాజరాజేశ్వరీపేటలో కేబుల్ ఆపరేటర్గా పని చేశాడు. ఇతడితో కోగంటి సత్యం కృష్ణలంకలోని బందరు లాకుల ఎదుట తన కార్యాలయం ప్రాంగణంలోనే ‘కె వాటర్‘ పేరుతో నీటి ప్లాంటు పెట్టించాడు. ఆయనపై విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. 2013లో రాంప్రసాద్ హత్యాయత్నం, కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ కేసులో అప్పట్లో కోగంటి సత్యంతో పాటు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. రాంప్రసాద్ హత్యకు ఉపయోగించిన కత్తులను ఈ ప్లాంటులోనే తయారు చేయించాడు. గత కొన్ని నెలలుగా శ్యామ్ కూడా బయటకు రాకుండా ఉన్నాడు. రౌడీషీట్ ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లాడంటే ఏదో కుట్రకు ప్రణాళిక రచిస్తున్నాడేమోనన్న అనుమానం కూడా పోలీసులకు రాకపోవడం గమనార్హం. తనపై ఎలాంటి పోలీసుల నిఘా లేకపోవడంతో రాంప్రసాద్ హత్యకు ప్లాన్ చేసి అమలు చేశాడు. అందరూ విజయవాడ వాసులే.. కేసులో ఏ2గా ఉన్న టెక్కం శ్యామ్ సుందర్తో పాటు రాంప్రసాద్ హత్యలో పాల్గొన్న నిందితుల్లో చాలా మంది విజయవాడ వాసులే. రాంప్రసాద్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఏ3గా ఉన్న పులివర్తి బాల నాగాంజనేయ ప్రసాద్, ఏ4 మండే ప్రీతం, ఏ5 పులివర్తి రాములుది గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామం. వీరు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం కృష్ణలంకలో నివాసం ఉంటున్నారు. ఏ6 తిరుపతి సురేష్ భవానీపురం నివాసి. ఇతడిపై భవానీపురం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతడు కోగంటి అనుచరుడు. 2003లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో వన్టౌన్ స్టేషన్లో షీట్ తెరిచారు. ఈ స్టేషన్ నుంచి భవానీపురం స్టేషన్ను విడగొట్టడంతో ఇక్కడికి బదిలీ అయింది. సురేష్కు అనుచరుడిగా ఏ10 పత్తిపాటి నరేష్ కొనసాగుతున్నాడు. ఏ7 చండిక ఆనంద్, ఏ8 శ్రీరామ్ రమేష్, ఏ9 షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, ఏ11 వెంకట్ రాంరెడ్డిలు కూడా విజయవాడకు చెందిన వారిగా హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. -
14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!
సాక్షి, మధురానగర్ (విజయవాడ): బాలికను వృద్ధుడు వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన నున్న రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్నగర్కు చెందిన జాన్ బాబు(74) అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు జాన్బాబును హెచ్చరించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాక పోగా బాలిక స్కూలుకు వెళ్లే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లి మంగళవారం నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
క్యాషియర్పై దాడి చేసి దోపిడీ
సాక్షి, విజయవాడ: లారీ ట్రాన్స్పోర్టు కార్యాలయంలోని క్యాషియర్పై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి రూ.నాలుగు లక్షల నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజా సెంటర్లోని ఇస్లాంపేటలోని ఓ ప్రయివేటు ట్రాన్స్పోర్టు కార్యాలయంలో అలహాబాద్కు చెందిన ప్రదీప్ పాండే రెండేళ్లగా క్యాషియర్గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటాడు. శనివారం కావడంతో వారంలో ఎక్కువ మొత్తం కలెక్షన్ రావడంతో ఆ డబ్బులు లెక్కించుకునే క్రమంలో రాత్రి ఆలస్యం అయింది. రాత్రి 10 గంటల సమయంలో బయట వర్షం కురుస్తున్న తరుణంలో ముగ్గురు వ్యక్తులు కార్యాలయం లోపలకు వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి ఉండటం, చేతిలో కర్రలో ఉండటంతో పాండే గట్టిగా కేకలు వేశాడు. అప్పటికే లోపలకు వచ్చిన ఆ యువకులు పాండేపై దాడి చేసి క్యాష్ కౌంటర్లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బాధితుడిపై దాడి చేసే క్రమంలో కార్యాలయంలోని సామగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. ముసుగు వ్యక్తుల దాడిలో తీవ్రగాయాలైన పాండే వెంటనే కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. ట్రాన్స్పోర్టు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా నిందితులు ధైర్యంగా లోపలకు ప్రవేశించి దాడి చేయడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్పోర్టు కార్యాలయం గురించి బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పని చేసే 12 మంది సిబ్బంది వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిర్లక్ష్య‘భటులు’..!
సాక్షి, అమరావతి బ్యూరో : కొద్ది రోజుల కిందట విజయవాడ, కుమ్మరి వీధిలోని ఓ ఇంట్లో 120 కాసులకు పైగా బంగారాన్ని దొంగలు కాజేశారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా శనివారం రాత్రి ఇస్లాంపేటలోని ఓ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో ముగ్గురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలోనే నిత్యం రద్దీగా ఉండే పంజా సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. ఈ రెండు ఘటనలు విజయవాడ కమిషనరేట్లోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనివే కావడం గమనార్హం. నిఘా వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్న ఆరోపణలు వస్తుండగా.. ఈ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డే లేదన్న వాదనా బలంగా వినిపిస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమంగా గుట్కా, కోడి పందెలు, క్రికెట్ బెట్టింగ్లు, పేకాట శిబిరాలను నిర్వహిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నా పోలీసులు దాడులు చేసిన సందర్భాలు కనిపించవు. కేవలం టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి చేసి ఆ స్టేషన్లో అప్పగిస్తేనే కేసులు నమోదు చేసే పరిస్థితి. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యహరిస్తున్న అక్కడి సిబ్బంది, అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. కొరవడిన నిఘా.. కొత్తపేట స్టేషన్ పరిధిలో ఓ సీఐతో పాటు నలుగురు ఎస్ఐలు బా«ధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు సీనియర్ కాగా మిగిలిన ముగ్గురు ఎస్ఐలు కొత్తగా వచ్చిన వారు. దీంతో కొత్త వారందరూ స్టేషన్లోని కేసుల విచారణకే పరిమితం అవుతున్నారు. వాస్తవానికి ఎస్ఐలందరికీ స్టేషన్ని ప్రాంతాల వారీగా విభజించి పరిధులు కేటాయించారు. కేసుల విరాచణతో పాటు ఎస్ఐలు వారికి కేటాయించిన పరిధిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. కానీ ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి లేని వైనం. మరో వైపున స్టేషన్ పరిధిలో ఆకతాయిలు, మద్యం బాబుల గోడవలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. అసలు నిందితులను వదిలేసి ఫిర్యాదీదారులని వేధింపులకు గురిచేస్తున్న సందర్భాలున్నాయి. దాడులన్నీ టాస్క్ఫోర్స్ సిబ్బందివే.. స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పేకాట, అక్రమ మద్యం విక్రయదారులపై జరిగిన దాడులన్ని టాస్క్ఫోర్స్ సిబ్బంది ఖాతాలోకే చేరుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల కాలంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ నెయ్యి, కోడి పందెలు, పేకాట శిబిరాలు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై స్టేషన్ అధికారులు సరైన నిఘా పెట్టకపోవడంతో వాళ్లు యథావిధిగా తమ కార్యకలపాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతా తానైన ‘షాడో సీఐ’! కాగా, స్టేషన్లో షాడో సీఐగా పేరుగాంచిన ఓ ఎస్ఐ స్టేషన్ పరిధిలోని అక్రమార్కుల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు స్టేషన్లో ప్రచారం జరుగుతుంది. తనకు అడ్డుగా ఉన్నారనే కారణంగా కొంత మంది సిబ్బందిని తన పలుకుబడి ఉపయోగించి ఇతర స్టేషన్లకు బదిలీ చేయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో..
సాక్షి, కలిదిండి(కైకలూరు): లైంగిక వేధింపులతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని పోతుమర్రు పంచాయతీ గొల్లగూడెంలో దళితవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ ఎఫ్ఏగా పనిచేస్తున్న చిన్నం శ్రీకాంత్ (28), భార్య శైలజ(25) ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన కురేళ్ల రమేష్ కన్ను శైలజపై పడింది. ఆమెను లైంగికంగా వేధించ సాగాడు. స్వగ్రామం కలిదిండి శివారు ఇందిరాకాలనీకి చెందిన శైలజ ఈనెల 11న కలిదిండి వచ్చి, తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడి ఉండగా తన ఆటో ఎక్కమని శైలజను రమేష్ ఒత్తిడి చేశాడు. దీంతో అవమానానికి గురైన శైలజ భర్తకు చెప్పి కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్న విషయానికి తనపై కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న రమేష్ 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో భర్త ఇంట్లో లేని సమయం చూసి శైలజ కాళ్లు చేతులు కట్టివేసి వేధించాడు. భర్త శ్రీకాంత్ ఇంటికి వచ్చే సమయానికి శైలజ సృహలో లేదు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి వికటించడంతో పోలీసులను పిలిపించారు. తనను రమేష్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. అనంతరం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. శైలజకు బాబు(5), పాప(3) ఉన్నారు. కలిదిండి ఎస్ఐ వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేరు తేడా.. పెళ్లి ఆపేసింది!
కృష్ణాజిల్లా, క్రోసూరు(పెదకూరపాడు): వధువు తమ కులానికి చెందినది కాదంటూ ముహూర్త సమయంలో వివాహం రద్దు చేసుకున్న వరుడిపై క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ పి.జనార్ధన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గాదెవారిపాలెం గ్రామానికి చెందిన వధువు (బీసీ) తో సత్తెనపల్లి మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఈనెల 22 న పెదకాకాని శివాలయంలో వివాహం జరగాల్సి ఉండగా, ముహూర్త సమయంలో వధువు తండ్రి ఆధార్ కార్డులోని పేరు, పెండ్లి పత్రికల్లో ఉన్న పేరు తేడా ఉండటాన్ని గుర్తించి.. వరుడు, వరుడి బంధువులు.. వధువు తమ సామాజిక వర్గానికి చెందినది కాదంటూ వివాహం రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీనిపై వధువు తండ్రి ఆదివారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, క్రోసూరులో ఫిర్యాదు చేయమని చెప్పి పంపారు. దీంతో వధువు తండ్రి సోమవారం క్రోసూరు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. సీఐ వెంకట్రావు ఇరు కుటుంబాలను కౌన్సెలింగ్కు పంపించాలని ఆదేశించినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే వరుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యను కడతేర్చిన భర్త
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట : భార్యను కట్టుకున్న భర్త కడతేర్చిన ఘటన పట్టణంలోని వైవై కాలనీలో బుధవారం అర్థరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే మాడావత్ యలమంద నాయక్ భార్య రత్నకుమారి (40) నటరాజ్ సెంటర్లో నూడిల్స్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహమైన కుమార్తె ఉంది. అయితే ఇటీవల యలమంద నాయక్ హోటల్ విక్రయించాడు. దీంతో భార్యాభర్తల మధ్య నగదు విషయమై వారం రోజులుగా గొడవ జరుగుతోంది. హోటల్ విక్రయించిన నగదు తనకు ఇవ్వాలని భార్యను యలమంద నాయక్ తీవ్ర వత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకు బెడ్రూంలో భార్య ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నావంటూ అడిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మంచంపై ఉన్న కండువాను భార్య మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. కొద్దిసేపటికి భార్య రత్నకుమారి అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందింది. ఏం చేయాలో తెలియక ఇంటికి తలుపులు వేసి బైకుపై సమీపంలోని వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి భార్యను హత్య చేశానని భయంగా ఉందని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వారు ఖమ్మంలో ఉంటున్న మృతురాలి కుమార్తెకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అబ్దుల్ నబీ, ఎస్ఐలు ధర్మరాజు, తాతాచార్యులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి సోదరి బాణావత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు లొంగుబాటు.. భార్యను హత్య చేసిన భర్త యలమంద ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగా తనకు ఇద్దరు భార్యలున్నారని చెప్పారు. మృతి చెందినది మొదటి భార్య కాగా, రెండవ భార్య మిర్యాలగూడలో ఉంటుందని చెప్పారు. కానీ తరచూ ఇరువురి భార్యలు ఘర్షణ పడేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
అయ్యో..పాపం
అందరూ హాయిగా నిద్రిస్తున్నవేకువజాము వేళ.. వేగంగాదూసుకెళుతున్న బస్సు..మరో నాలుగు గంటల్లోఅంతా గమ్యస్థానాలకు చేరుకుంటారు.. ఈలోపు ఒక్కసారిగాపెద్ద కుదుపు.. ఉన్నట్టుండిబస్సు గాలిలోకి ఎగిరింది..ఏమైందో అర్థమయ్యేలోపేబస్సులో ఉన్న వారినందిరినిక్షతగాత్రులుగా మార్చేసింది..ఆర్తనాదాలు, హాహాకారాలతోఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితిఆవరించింది. యానం నుంచిహైదరాబాద్ వెళ్తున్న రమణ ట్రావెల్స్ బస్సు పెనుగంచిప్రోలుమండలం నవాబుపేట వద్దజాతీయ రహదారిపైసోమవారం తెల్లవారుజాము2.45 గంటలకు ఘోర రోడ్డుప్రమాదానికి గురైంది. కృష్ణాజిల్లా : నవాబుపేట క్రాస్రోడ్స్ (పెనుగంచిప్రోలు): పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రమణ ట్రావెల్స్కు చెందిన బస్సు బోల్తా కొట్టింది. సోమవారం తెల్లవారు జామున 2.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది పిల్లలు సహా 32 మందికి గాయాలయ్యాయి. రమణ టూర్స్, ట్రావెల్స్కు సంబంధించిన ఏపీ05 టీఎల్ 1430 నంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి ఆదివారం రాత్రి 9గంటలకు హైదరాబాద్కు బయలుదేరింది. హైదరాబాద్ సోమవారం ఉదయానికి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా నవాబుపేట వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడి బోల్తా కొట్టింది. తూర్పు గోదావరి వాసులే.. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన 108 అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మందపాటి చిన్ని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. బస్సులోని మిగిలిన ప్రయాణికులను పోలీసులు పలు వాహనాల్లో వారి ప్రాంతాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని నందిగామ ఆర్టీఓ మూర్తి, జగ్గయ్యపేట ఎంవీఐ రాజులు సందర్శించి వివరాలు సేకరించారు. గాయపడిన వారి వివరాలు.. ♦ గాయపడిన వారిలో ప్రమాదం జరిగిన సమయంలో బస్సు నడుపుతున్న తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరానికి చెందిన షేక్ వలీ, మరో డ్రైవర్ ముమ్మడివరం గ్రామానికి చెందిన షేక్ సుభాని ఉన్నారు. అలాగే బస్సులోని ప్రయాణికులు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలం దాక్షారామంకు చెందిన సుందరపల్లి రమేష్, టేకు గ్రామానికి చెందిన గుత్తుల శ్రీనివాస్, ఐ.పోలవరం మండలం పసుపులంక గ్రామానికి చెందిన వైదాడి మాణిక్యాలరావు, నెరటూరు గ్రామానికి చెందిన కడలి వేణు, అదే గ్రామానికి చెందిన అడసూరి శ్యామల, సీహెచ్ అంజి, పీతాని రాఘవేంద్ర, చోడె అనిత అన్నారు. ♦ కె. గంగవరం మండలం వాసాలరేవుకు చెందిన రచ్చ వీరరాజు, పాలూరు గ్రామానికి చెందిన బోడపాటి సావేరి, సత్యవాడ గ్రామానికి చెందిన మందపాటి చిన్ని, మండగండె గ్రామానికి చెందిన చిన్నవరకుమార్, పెంటపాడుకు చెందిన అడప హరీష్ గాయాల పాలయ్యారు. ♦ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన కనికల్ల అప్పారావు, పోరుమిల్లి గ్రామానికి చెందిన పేరాబత్తుల నాగేశ్వరరావు, మండపేటకు చెందిన పీ సాయిదుర్గ, నాగతిప్ప గ్రామానికి చెందిన కె సూర్యారావు, టేకి అబ్బాయి గాయాల పాలయ్యారు. అలాగే అదే మండలం పాలూరు గ్రామానికి చెందిన చింతపల్లి అనంతలక్ష్మీ, నిడసనమెట్ల గ్రామానికి చెందిన ఎస్. వెంకటరమణ, ఎడిద గ్రామానికి చెందిన టేకు దేవి, తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన కేమిశెట్టి రమ్య, నెలటూరు గ్రామానికి చెందిన బి. లావణ్యలు ఉన్నారు. ♦ అలాగే హైదరాబాద్, అమీర్పేట్కు చెందిన బి. పార్వతి, తాడేపల్లిగూడెంకు చెందిన కడలి రాజేంద్రప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ♦ కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన కె. గోవింద్, భార్య కుమారి, కాజులూరు మండలం నామావానిపాలెం గ్రామానికి చెందిన బి. మాధురి, మండలపేట మండలం ఎడిద గ్రామానికి చెందిన టేకు దివ్య, అదే గ్రామానికి చెందిన టేకు వెంకన్న, ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు..... తెల్లవారు జామున జరిగిన ఈబస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బస్సులో ఇరుక్కు పోయిన వారు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. నందిగామ డీఎస్పీ బోస్, జగ్గయ్యపేట సీఐ నబీ, పెనుగంచిప్రోలు, చిల్లకల్లు ఎస్ఐలు నాగదుర్గారావు, చిరంజీవులు సిబ్బందితో పాటు హైవే పెట్రోలింగ్ వారంతా బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయ సహకారాలు అందజేశారు. రెండు గంటలపాటు.. డ్రైవర్ వలీ బస్సులో ఇరుక్కొని పోవటంతో సుమారు రెండు గంటలపాటు కష్టపడి గ్యాస్ కట్టర్స్ సహాయంతో ఇనుప కడ్డీలు కట్చేసి అతనిని బయటకు తీశారు. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపారు. బస్సులో ఉన్న ప్రయాణికుల లగేజిని పోలీసులు వారికి అప్పగించారు. కానీ ప్రయాణికుల్లో ఒకరు సెల్ఫోన్ దొరకలేదని, కొందరు నగదు లేదని, మరి కొందరు లగేజి కనిపించటం లేదని చెప్పటం గమనార్హం. గతంలోనూ ఇదే ప్రాంతంలో.. గతంలో ఇక్కడికి కొద్ది దూరంలోనే జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు గోతిలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. అలాగే గత నెల 16న తెలంగాణ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందటంతో పాటు 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాజాగా సోమవారం తెల్లవారు జామున ఆ ప్రమాదానికి కొద్ది మీటర్ల దూరంలోనే బస్సు పల్టీ కొట్టి 32 మంది గాయపడటంతో స్థానికులు భయకంపితులయ్యారు. అయితే పెద్ద ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నబీ తెలిపారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రులు.. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రమాదంలో గాయపడిన 18 మందిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వారిలో కె. వేణు (12) బాలుడికి ఛాతీలో గాయమైనట్టు గుర్తించి కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం ఇక్కడ లేనందున గుంటూరు తరలించారు. కాగా గాయాలై ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారిలో బి. సవేరి, ఎ. శ్యామల, కె. రవి, జి. రమ్య, సీహెచ్ మాధురి, ఎ. హరీష్, ఎస్. రమేష్, ఎస్కే సుభానీ, చిన్ని, అప్పారావు, టి. దేవి, టి. దివ్య, పద్మ, శ్రీనివాస్, టి. వెంకన్న, సాయిదుర్గ, సత్యలు ఉన్నారు. వీరిలో ఒకరికి గుంటూరు తరలించగా, మరో 14 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. కాగా తలకు బలమైన గాయాలైన బాలిక చిన్ని, శ్రీనివాస్, రమ్యలు ప్రస్తుతం ట్రామాకేర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా వీరి ముగ్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వారికి వైద్యసేవలు అందిస్తున్న న్యూరోసర్జన్ డాక్టర్ గొల్ల రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే కారణం.. మండల పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన రమణ టూర్స్, ట్రావెల్స్ బస్సుకు అన్ని రకాల పర్మిట్లు ఉన్నాయని నందిగామ ఆర్టీఓ సూర్యనారాయణ మూర్తి తెలిపారు. అలాగే బస్సు కూడా పూర్తి కండిషన్లో ఉందని, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. -
ఎమ్మెస్కే ప్రసాద్ పేరు చెప్పి మోసం
-
కటకటాల పాలైన క్రికెటర్
గుణదల (విజయవాడ తూర్పు): అతను ఉన్నత విద్యావంతుడు. దానికితోడు మంచి క్రికెటర్. పేద కుటుంబం నుంచి వచ్చి ప్రతిభ చూపి రంజీ క్రికెట్ మ్యాచ్లు ఆడే స్థాయికి ఎదిగాడు. 82 గంటలపాటు క్రికెట్ ఆడటం ద్వారా గిన్నిస్ బుక్లో కూడా స్థానం సంపాదించాడు. అయితే, బుద్ధి వక్రించడంతో కటకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ ఏసీపీ వైబీసీసీఏ ప్రసాద్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరి నాగరాజు (24) పేద కుటుంబానికి చెందిన యువకుడు. ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడ గాయత్రీనగర్లో ఉంటున్న నాగరాజు ఎంబీఏ వరకు చదువుకున్నాడు. చిన్ననాటి నుంచి క్రికెట్పై ఆసక్తి పెంచుకుని గేమ్లో చక్కని ప్రతిభ కనబరిచేవాడు. 2006లో విశాఖ అండర్–14 కు ఎంపికయ్యాడు. ఆపై వరుసగా 7 సంవత్సరాలపాటు వివిధ జోన్ల తరఫున ఆడుతూ చక్కని ప్రతిభ కనబరిచాడు. 2014 లో ఆంధ్రా తరఫున రంజిలో కూడా ఆడాడు. 2016లో 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. నాగరాజు ఆటను చూసి అతనిని ప్రోత్సహించే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వచ్చిన సంపాదనతో జల్సాలకు అలవాటు పడ్డాడు. మరింత డబ్బు సంపాదించి విలాసవంతంగా గడపాలనే దురుద్దేశంతో ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ఓ సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. ఈ క్రమంలో గత యేడాది నందం వేణుగోపాల్ అనే వ్యక్తిని మోసం చేసి రూ.22,300 నగదు తీసుకున్నాడు. ఈ ఘటనపై సదరు వేణుగోపాల్.. నాగరాజుపై విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే అలవాటుగా మారిన నాగరాజు ఈ యేడాది ఫిబ్రవరిలో టి–20 టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి మనోజ్ అనే వ్యక్తిని మోసం చేసి అతని వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేశాడు. ఇటీవల తాను ఎమ్మెస్కే ప్రసాద్నని నమ్మబలికి హైదరాబాద్కు చెందిన మురళీ అనే వ్యక్తి నుంచి రూ.2,88,000 వసూలు చేసి మోసం చేశాడు. ఇదే పంథాలో విజయవాడకు చెందిన రామకృష్ణ హౌసింగ్ సొసైటీ నిర్వాహకులకు ఫోన్ చేసి రూ.3,88,000 నగదు వసూలు చేశాడు. ఈ విధంగా ఎమ్మెస్కే ప్రసాద్ పేరును వాడుకుని డబ్బు వసూలు చేస్తూ జల్సాలకు అలవడిన నాగరాజుపై మాచవరం పోలీస్ స్టేషన్లో గత నెల 22వ తేదీన కేసు నమోదు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో నిందితుడు ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజును గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1,80,500 నగదు, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మాచవరం సీఐ జి శ్రీనివాస్, ఎస్ఐ సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరిని కబళించిన లారీ
కె.అగ్రహారం (జగ్గయ్యపేట) : వరిగడ్డి లోడు ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళకు తీవ్ర గాయాలైన ఘటన గ్రామంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని ధర్మవరప్పాడు తండాకు చెందిన రూపావత్ లాలు (40), గుగులోతు బాలాజీ (31), బాణావత్ బాలనాగమ్మ తెలంగాణలోని నల్గొండ జిల్లా జాన్పాడులో వరి గడ్డి కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్పై వెళ్లారు. వరి గడ్డి కొనుగోలు చేసుకుని ట్రాక్టర్పై తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోని రెండవ మలుపు వద్దకు వచ్చేసరికి రామాంజనేయ ట్రాన్స్పోర్టుకు చెందిన లారీ జగ్గయ్యపేట నుంచి సిమెంట్ కర్మాగారానికి వెళ్తోంది. లారీ వేగంగా ట్రాక్టర్ను ఎదురుగా ఢీకొట్టటమే కాకుండా ట్రాక్టర్ ఇంజిన్పైకి ఎక్కింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ లాలు ఇంజిన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే కూర్చున్న బాలాజీ, నాగమ్మ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొందరు 108కు సమాచారమివ్వటంతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం వారిని విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలాజీ ఆదివారం ఉదయం మృతి చెందాడు. బాలనాగమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. ప్రమాద ప్రాంతంలో చేతికందే ఎత్తులో 11 కేవీ విద్యుత్ తీగలుండటం గమనార్హం. చిల్లకల్లు ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారే.. మృతి చెందిన లాలు, బాలాజీ, బాలనాగమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. డ్రైవర్గా పని చేస్తున్న లాలు ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మరో మృతుడు బాలాజీ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మృతులకు భార్య, పిల్లలు ఉన్నారు. ధర్మవరప్పాడు తండాలోవిషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో పాటు మరొకరు తీవ్ర గాయాల పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పశువులకు వరి గడ్డి కొనుగోలు చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువాత పడటంతో గ్రామస్తులను సైతం కంట తడి పెట్టించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ కమిటీ కన్వీనర్ తన్నీరు నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ఫోన్లో పరామర్శించారు. -
పెళ్లింట విషాదం
కృష్ణాజిల్లా, భవానీపురం(విజయవాడ వెస్ట్): ఒక వైపు పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఇల్లు. మరో వైపు కుటుంబ సభ్యులు, బంధువుల సందడి. ఇంకో వైపు వివాహ వేదిక దగ్గరకు వెళ్లేందుకు హడావుడి. ఇంతలోనే ఓ పిడుగులాంటి దుర్వార్త తెలిసి అక్కడికి వచ్చిన వారంతా నిశ్చేష్టులైయ్యారు. మనుమడి పెళ్లి వేడుకలకని బయలుదేరిన ఒక వృద్ధురాలిని బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన భవానీపురం బైపాస్ రోడ్లో గురువారం వేకువ జామున చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. సీపీఐ సీనియర్ నాయకుడు, పంచాయితీరాజ్ శాఖ విశ్రాంత ఉద్యోగి బాపనపల్లి వీరంజనేయులు, చిట్టెమ్మ దంపతులు భవానీపురం హౌసింగ్బోర్డ్కాలనీ ఎంఐజీ 187/5లో నివసిస్తున్నారు. గురువారం తెల్లవారు జామున తన మనుమడు వివాహానికి ముహూర్తం ఉండటంతో కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి 3.30 గంటల సమయంలో బైక్లపై కల్యాణమండపానికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భార్య చిట్టెమ్మ(60) పెద్ద అల్లుడు గద్ద సూరిబాబు బైక్పై ఎక్కింది. అందరి కంటే వెనుకగా వెళుతున్న వీరి బైక్ను తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ హైర్ బస్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి కిందపడిపోయిన చెట్టెమ్మ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సూరిబాబు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నలుగురు పాత నేరస్తుల అరెస్టు
విజయవాడ : నగరంలో దొంగతనాలకు పాల్పడే నలుగురు పాత నేరస్తులను సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.74 లక్షలు విలువ చేసే బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి బందర్ రోడ్డులోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ బి. రాజకుమారి వివరాలను వెల్లడించారు. సీసీఎస్ పోలీసులు కంకిపాడు మండలం పునాదిపాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు పట్టుబడ్డారు. వారిని సీసీఎస్ సిబ్బంది విచారించారు. గతంలో వారు పాత నేరస్తులుగా గుర్తించారు. మొత్తం ఏడుగురు బృందంగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో సత్యనారాయణపురానికి చెందిన తుమ్మల మనోజ్కుమార్, తుమ్మల రాజేశ్, అజిత్సింగ్నగర్కు చెందిన గోవిందరాజులు అలియాస్ రాజాసాయి, రామవరప్పాడుకు చెందిన తుమ్మల విఘ్నేశ్వరరావులుగా గుర్తించి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి స్నేహితులైన షేక్ బాషా, రెహమతుల్లా అలిĶæహహ్ అక్తర్, అఫ్జల్ పరారీలో ఉన్నారు. వీరందరు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు ఓ ముఠాగా ఏర్పడి విశాఖపట్నం, నర్సీపట్నం దగ్గర మారుమూల గ్రామంలో గంజాయి కొని విజయవాడకు తీసుకువచ్చి చుట్టపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నిందితులు కంకిపాడు పోలీసు స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, సత్యనారాయణపురం ఏరియా మధురానగర్లో మరొక గొలుసు దొంగతనం, అజిత్ సింగ్నగర్ ఏరియాలో ఒక మోటారు సైకిల్, నూజివీడు ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లిలో ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు క్రైం డీసీపీ రాజకుమారి చెప్పారు. ఈ కేసును సీసీఎస్ ఏసీపీ కె. ప్రకాశరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి. బాలమురళీ, ఎస్ఐ మోహన్కుమార్, కంకిపాడు ఎస్ఐ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కృష్ణలంక(విజయవాడ తూర్పు): అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రీ కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంకాబత్తుల తారకరాము (రాము)కు విద్యాధరపురానికి చెందిన స్రవంతి(28)తో తొమ్మిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరు ఐదేళ్ల పవిత్ర, మూడేళ్ల ఉపాసనల సంతానంతో కృష్ణలంక రాణిగారితోటలో నివాసముంటున్నారు. రాము కూల్డ్రింక్స్ డిస్టిబ్యూషన్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల చెడు వ్యసనాలకు బానిస అయ్యి అప్పులపాలయ్యాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ తరచూ భార్య స్రవంతితో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం స్రవంతి తండ్రి నూతన గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా రాముకు ఫోన్ చేసి ఆహ్వానించిన క్రమంలో తనకు రూ. 2లక్షలు ఇస్తేనే వస్తానంటూ తేల్చిచెప్పాడు. ఈ విషయంపై భార్య, భర్తలకు తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రీ 11గంటల సమయంలో రాము ఇంటికి రాకపోవడంతో అతని ఇంటి పైఅంతస్తులో నివాసముండే అతని సోదరుడు వెళ్లి తలుపు కొట్టడంతో రాము కూతురు తలుపు తీసింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సహాయంతో కిందికి దించి దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి భర్త రాముతోపాటు వారి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుధారాణిలను అదుపులోకి తీసుకుని 498 సెక్షన్కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది ముమ్మాటికీ హత్యే.. మృతురాలి భర్త రాము చెడు వ్యసనాలకు బానిస అవ్వడంతో పాటు ఇటీవల ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు, దీనిపై తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, భార్య అడ్డు తొలగించుకునేందుకు అతనే తన బిడ్డను దారుణంగా కొట్టి హత్యచేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తన బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
బాలికకు గర్భం.. యజమాని కొడుకు పనే..?
మచిలీపట్నం టౌన్ : కృష్ణా జిల్లా గిలకలదిండికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చింది. గిలకలదిండిలోని మునిసిపల్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక కడుపు నొప్పిగా ఉందని తల్లికి చెప్పటంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేయగా గర్భం ధరించినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి అదే ప్రాంతానికి చెందిన సుభద్రమ్మ అనే మహిళ ఇంట్లో రెండేళ్లుగా పనికి వెళుతోంది. ఆమె వెంట బాలిక కూడా తరచూ పనికి వెళ్లేది. అయితే, సుభ్రదమ్మ కుమారుడు స్వామి లైంగిక దాడికి పాల్పడిన కారణంగానే గర్భం దాల్చిందని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుణ్య నియామకం.. కాగా, తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవటంతో ఆయన ఉద్యోగం కొడుకు స్వామికి వచ్చింది. స్వామికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం కైకలూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి తరచూ గిలకలదిండి వచ్చేవాడని, ఈ సందర్భంలో తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు చేసింది. బాలిక గర్భం ధరించటంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మచిలీపట్నం సీఐ వాసవి, ఎస్సై దుర్గాప్రసాద్, సిబ్బంది ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. బాలిక, ఆమె తల్లి వాంగ్మూలం నమోదు చేశారు. -
ఈవ్టీ(నే)జర్స్!
మహిళలు, యువతుల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడంలేదు. వారు ఇంటా, బయటా,ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. స్కూళ్లు, కళాశాలలకువెళ్లే యువతులే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వీరినిఅదుపు చేసేందుకు పోలీసులుఅన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. పరిస్థితి అదుపులోకిరావడం లేదు. మరోవైపు ఈవ్టీజింగ్ కేసుల్లో ఎక్కువగామైనర్లే పట్టుబడుతుండటంఆందోళన కల్గించే అంశం. సాక్షి, అమరావతి బ్యూరో : బెజవాడ నగరంలో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోకిరీల ఆటకట్టించి, కటకటాల వెనక్కి నెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘శక్తి’ బృందాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మఫ్టీలో పోలీసులున్నా.. బస్టాపులు, రైల్వేస్టేషన్, స్కూల్స్, కాలేజీలు, మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలను, అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలు, ఈవ్టీజింగ్ చేస్తున్న ఆకతాయిల బెడద ఇటీవల ఎక్కువైంది. దీంతో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఇలాంటి ఆకతాయిలఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో కమిషనరేట్ పరిధిలో వేధింపులకు గురవుతున్న మహిళలు వెంటనే పోలీసులను ఆశ్రయించడానికి, ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక వాట్సాప్ నంబరు అమల్లోకి తెచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల శక్తి బృందాలు, పోలీసులు అరెస్టు చేస్తున్న పోకిరీలు, ఆకతాయిల్లో ఎక్కువగా మైనర్లే పట్టుబడుతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పోలీసులు తల్లిదండ్రులను స్షేషన్కు పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. బాలికలను టీజింగ్ చేస్తున్న మైనర్లు.. బెంజి సర్కిల్ సమీపంలోని ప్రైవేటు కళాశాల ల విద్యార్థినులు సాయంత్రం అక్కడి బస్టాపులో ఇళ్లకు వెళ్లేందుకు వేచి ఉంటున్నారు. ఈ సమయంలో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు ధైర్యం చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. క్షణంలో తప్పించుకుని బైక్పై ఉడాయించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం, వన్టౌన్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పోకిరీల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. వీరి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు. ‘శక్తి’కి ఇటీవల వచ్చిన ఫిర్యాదులు.. ⇔ కళాశాలకు వచ్చి, వెళ్లే సమయాల్లో కొందరు అబ్బాయిలు మమ్మల్ని టీజింగ్ చేస్తున్నారంటూ బీఆర్టీఎస్ రహదారిలో పెట్రోలింగ్ చేస్తున్న ‘శక్తి’ టీం సిబ్బందికి శారదా కళాశాల విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. మరుసటి ఉదయం కళాశాల వద్ద ‘శక్తి’ బృంద సభ్యులు కాపు కాసి అమ్మాయిలకు ఇబ్బంది కల్గిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ⇔ సింగ్నగర్లోని వివేకానంద స్కూల్వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను వేధిస్తున్నారంటూ ఓ పౌరుడు వాట్సాప్కు మెస్సెజ్ చేశాడు. దీనికి స్పందించిన ‘శక్తి’ బృందం సభ్యులు మఫ్టీలో స్కూల్వద్ద నిఘా పెట్టి ఈవ్టీజింగ్ చేస్తున్న 5 మంది మైనర్లను అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. 626 మందికి కౌన్సెలింగ్ ఆరు నెలల కాలంలో మహిళ రక్షణ విభాగం పోలీసులు 626 మంది ఈవ్టీజర్లకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. గత ఏడాది డిసెంబర్ 12న నుంచి శక్తి బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ బృందా లు వచ్చాక విజయవాడలో సినిమా హాల్స్, పార్కు లు, బస్టాపులు, కృష్ణానది ఘాట్లవద్ద తిరుగుతూ మహిళలను ఈవ్టీజింగ్ చేస్తున్న 190 మందిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. 61 మంది కటకటాలు.. గత రెండేళ్లలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థినుల పట్ల, వేధింపులు, అసభ్యం, అశ్లీలంగా వ్యవహరించిన కేసులు 1,958 వరకు నమోదు అయ్యాయి. అయితే వీటిలో చాలా వరకు కేసులు భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కేసుల్లో 90 శాతం పైగా రాజీ అయ్యారు. వీటిలో ఈవ్టీజింగ్ కేసులు, ఫొక్సో చట్టం కింద నమోదైన కేసులు, రేప్ అనంతరం హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో న్యాయస్థానం 61 మందికి జైలు శిక్ష విధించింది. -
పెంచలేక చంపేసింది..!
కృష్ణాజిల్లా, పెడన : ఆర్థిక కారణాలతో పెంచలేక ఆ తల్లి తన కుమార్తెను కడతేర్చింది. భర్త చనిపోవడంతో పోషించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆమె తన కుమార్తెకు విషమిచ్చి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు విగతజీవులుగా మారిన చిన్నారుల ఘటన వెనుక కారణం ఆర్థిక పరిస్థితులేనని తెలుస్తోంది. చిన్నారి మోకా ప్రశాంతికి (5) మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహంలోని కొన్ని శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అయితే, విషం ఇచ్చి చంపినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు సమాచారం. నివేదిక వచ్చేందుకు నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టుమార్టం పూర్తయిన చిన్నారి ప్రశాంతి మృతదేహానికి స్థానికులు, బంధువులు ఘనంగా అంత్యక్రియలను నిర్వహించారు. డీఎస్పీ మహబూబ్బాషా ఆరా... మచిలీపట్నం డీఎస్సీ మహబూబ్బాషా బుధవారం పెడన పోలీస్ స్టేషన్కు వచ్చి చిన్నారుల మృతిపై ఆరా తీశారు. జరిగిన ఘటనలను ఎస్ఐ అభిమన్యు డీఎస్పీకి వివరించారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మచిలీపట్నం, పెడన అర్బన్ సూపర్వైజర్ విజయలక్ష్మి, 15వ వార్డు అంగన్వాడీ ఆయాతో కలిసి పోలీస్ స్టేషన్లో ఉన్న చిన్నారుల తల్లి నాంచారమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారులు ఏ విధంగా చనిపోయారనే దానిపై వారు ప్రశ్నలను అడిగి పలు విషయాలను రాబట్టినట్లు సమాచారం. చాలా సేపు నోరు విప్పని నాం చారమ్మ చివరికి పెంచుకోలేక పిల్లలను చంపుకున్నాననే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులే కారణమా..! మోకా రామాంజనేయులు ఉరఫ్ సుబ్బారావు, నాంచారమ్మలది ప్రేమ వివాహం. రామాంజనేయులు స్వస్థలం బందరు మండలం పోలాటితిప్ప. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడిపోతుండటంతో ఆటోను నడుపుకుంటూ పెడనలో ఉండే నాంచారమ్మను వివాహం చేసుకున్నా డు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు... ప్రశాంతి (5), దివ్య (3). భర్త తాగుడుకు బానిస కావడంతో నాంచారమ్మ కూడా కలంకారీ పనికి వెళ్తోంది. మద్యానికి బానిసైన రామాంజనేయులు ఈ ఏడాది జనవరి ఒకటిన చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక కలంకారీ పనికి వెళ్లేందుకు నాంచారమ్మ సిద్ధమైంది. అయితే భర్త చనిపోయిన భార్యకు మూడు నెలల వరకు వారి సంప్రదాయం ప్రకారం కలంకారీ పనికి రానీయలేదని సమాచారం. దీంతో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతుండటంతో నాంచారమ్మ ఇద్దరు ఆడ పిల్లలతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. అదీ కాకుండా పెద్ద పిల్ల ప్రశాంతి ఎప్పుడూ నాన్న ఏడీ, నాన్న ఏడి.. అంటూ కోరుతుండటంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో తల్లి మానసిక క్షోభను అనుభవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేం కూడా చనిపోతామనే విషయాన్ని చెప్పుకుని బంధువుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఉరేసుకునేందుకు ప్రయత్నించి విఫలం.. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలి నాంచారమ్మ ఉరేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైందని బంధువులు చెబుతున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఏమైనా సాయం కావాల్సి వస్తే చేస్తామని నాంచరమ్మ సోదరీమణులు భరోసా ఇచ్చారు. అదీ కాకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ ఆయాలు సైతం కలిసి పిల్లలను ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, లేనిపక్షంలో చిల్డ్రన్స్ హోంకు పంపించాలని కూడా సూచించారు. పిల్లలను చూసుకుంటానని చెప్పిన నాంచారమ్మ ఆ తర్వాత ఏం చేసిందనేది మిస్టరీగానే ఉంది. మానసిక పరిస్థితి బాగోలేక పిల్లలకు విషమిచ్చి చంపేసిందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
చిన్నారుల అనుమానాస్పద మృతి.. తల్లి పనేనా..?
కృష్ణాజిల్లా, పెడన: ఒకరి తర్వాత ఒకరు 48 గంటల్లో అక్కాచెల్లెళ్లు చనిపోవడం పెడన పట్టణంలో సంచలనం కలిగించింది. వివరాలిలా ఉన్నాయి. మోకా రామాంజనేయులు, నాంచారమ్మలకు ఇద్దరు ఆడ పిల్లలు. పెడన చేపల మార్కెట్లోని నిరుపయోగంగా ఉన్న దుకాణాల్లోని ఒకదాంట్లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన రామాంజనేయులు ఈ ఏడాది జనవరి 1న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి నాంచారమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. మంచిచెడ్డ అంతా బంధువులే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కిందట చుట్టుపక్కల వారితో పాటు, బంధువుల వద్ద కూడా మేం కూడా చనిపోతాం.. అని అంటోంది. అయితే, శనివారం రాత్రి వీరి చిన్న కుమార్తె మోకా దివ్య (3) చనిపోయింది. ఆదివారం ఉదయం అందరికి తెలిసి పరామర్శించడానికి వెళ్లిన వారికి అనారోగ్యంతో చనిపోయిందని, విరేచనాలు, జ్వరం వచ్చిందని, మంచి వైద్యుడికి చూపించడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదనే విషయాన్ని చెప్పింది. దీంతో చుట్టుపక్కల వారు, వివిధ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొంత ఆర్థిక సాయం చేసి పెద్ద పాప మోకా ప్రశాంతి పేరు మీద డిపాజిట్ చేస్తామని నాంచారమ్మకు హామీ ఇచ్చారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని కొంత నగదును కూడా చేతికి అందజేశారు. అయితే, సోమవారం ఉదయం పెద్ద పాప మోకా ప్రశాంతి (5) కూడా చనిపోవడంతో స్థానికులకు, బంధువులకు సైతం అనుమానాలు వెల్లువెత్తాయి. వారం నుంచి మేం చచ్చిపోతామంటున్న తల్లి నాంచారమ్మ కావాలనే ముందుగా పిల్లలను చంపేసిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రశాంతికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల అంతకుముందే స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యుడికి కూడా చూపించారు. ఆయన కూడా పాప ఆరోగ్యంగానే ఉందని, ఫుడ్ పాయిజన్ ఏమైనా అయి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. పోలీసుల రంగ ప్రవేశం.. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీఐ బి రవికుమార్, ఎస్ఐ బి అభిమన్యుతో సిబ్బంది వచ్చి మార్కెట్లో అందరిని విచారించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నాంచారమ్మ ఉంటున్న ఇంటిని (దుకాణాన్ని) సైతం పరిశీలించారు. బియ్యం, బంగాళాదుంపలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు తదితర ఆహార పదార్థాలు సైతం కుళ్లిపోయి ఉన్నట్లు గుర్తించారు. నాంచారమ్మను కూడా పోలీసులు విచారించారు. ప్రశాంతి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. పీఎం నివేదికను బట్టి పూడ్చిన మృతదేహానికి కూడా...? చిన్న పాప మోకా దివ్యను ఆదివారం శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. 48 గంటల్లోగా దివ్య అక్క ప్రశాంతి కూడా చనిపోవడంతో అనుమానంపై పోలీసులు ప్రశాంతికి పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆ నివేదికలో విష ప్రయోగం ఏమైనా జరిగిందా లేక ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే విషయాలు వెల్లడి కానున్నాయి. విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ అయితే చిన్నపాప మోకా దివ్య మృతదేహాన్ని కూడా వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుందనే వాదన వ్యక్తమవుతోంది. పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పీఎం నిర్వహించాలంటే మండల మేజిస్ట్రేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రశాంతి పోస్టుమార్టం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సిబ్బంది పరుగులు... చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం.. ఫు డ్ పాయిజన్ అని అనుకోవడంతో వైద్య, ఆరో గ్య సిబ్బంది పరుగులు పెట్టారు. చేపల మార్కెట్ వద్ద పరిస్థితి గమనించి ఎలా జరిగిందో ఆరా తీ యడంతో పాటు ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నా రు..తదితర విషయాలను నమోదు చేసుకున్నారు. -
సభ్య సమాజం తలదించుకునేలా..
ఉయ్యూరు(పెనమలూరు): నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచి జన్మనిచ్చిన కన్నతల్లినే చెరబట్టాడు ఓ ప్రబుద్ధుడు. మద్యం మత్తులో తల్లిని చిత్రహింసలకు గురిచేసి ఆమెపై అత్యాచార యత్నం చేసి పైశాచికత్వం ప్రదర్శించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉయ్యూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు (86) తన చిన్నకుమారుడు శివయ్యతో కలసి ఉంటుంది. లారీ డ్రైవరుగా పని చేస్తున్న శివయ్యకు తల్లితో అభిప్రాయ భేదాలు ఉండేవని తెలిసింది. ఆస్తి వివాదమే గతంలో తల్లీకొడుకులు ఇద్దరూ వివాదం పడి పోలీసులను ఆశ్రయించారు. తల్లిని ప్రేమగా చూసుకుంటానని చెప్పి తన వద్దే ఉంచుకుంటున్న ఆ కసాయి తనయుడు.. మద్యం మత్తులో ఇటీవల అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బంధువులు సోమవారం వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆరా తీయటంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సీఐ కాశీ విశ్వనాథం సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యాచారయత్నం, చిత్రహింసల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా వృద్ధురాలైన తల్లిపై ఆమె చిన్న కుమారుడు అత్యాచారానికి పాల్పడలేదని, శివయ్య బంధువులు తెలిపారు. -
అనుమానంతో భార్యపై కత్తితో దాడి
పోలంపల్లి(వత్సవాయి): భార్యపై అనుమానంతో కొబ్బరిబొండాలు నరికే కత్తితో భర్త దాడిచేశాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలంపల్లి గ్రామానికి చెందిన కొయ్యల బాలకృష్ణకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన మహేశ్వరితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9 సంవత్సరాల కుమార్తె ఉంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ రెండేళ్లుగా గ్రామాన్ని విడిచి బయటే ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పోతుండేవాడు. గ్రామానికి వచ్చినప్పుడల్లా భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన బాలకృష్ణ భార్యతో గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొబ్బరిబొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేశాడు. కాళ్లు, చేతులపై నరికాడు. అనంతరం స్వయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ పి. ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని మహేశ్వరి పరిస్థితిని గమనించగా ఆమె ఊపిరితో ఉంది. వెంటనే 108 వాహనంలో జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తను చంపిన అల్లుడు అరెస్టు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్పడమే ఆమె చేసిన పాపం. తన బిడ్డ జీవితం నాశనం కాకుండా చూడాలన్న అత్త (మేనత్త) ను దారుణంగా రాయితో కొట్టి చంపిన చిన్న అల్లుడిని కొత్తపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వించిపేట ఫ్లోర్మెన్ బంగ్లా ప్రాంతానికి చెందిన షేక్ కరిమా, ఇస్మాయిల్ భార్యాభర్తలు. వీరి చిన్న కుమార్తెను మేనల్లుడైన టిప్పు సుల్తాన్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే కొంత కాలంగా టిప్పుసుల్తాన్ చెడు అలవాట్లకు బానిసై భార్యను వేధింపులకు గురి చేయసాగాడు. అత్త కరీమా వారించింది. దీంతో తన ఆనందానికి అడ్డుగా ఉన్న అత్తను ఎలా అయినా సరే అడ్డు తొలగించుకోవాలనే భావనతో గత నెల 29వ తేదీన తోపుడు బండ్లు ఇస్తున్నారని చెప్పిన టిప్పుసుల్తాన్ అత్తను తనతో పాటు తీసుకువెళ్లాడు. రాత్రి చీకటి పడే వరకు నగరంలో అక్కడక్కడ తిప్పి అర్ధరాత్రి నైనవరం ఫ్లై ఓవర్ దిగువన ఉన్న రైలు పట్టాల వద్దకు కరీమాను తీసుకువెళ్లాడు. రాయి తీసుకుని అత్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భార్య కనిపించకపోవడంతో కరీమా భర్త ఇస్మాయిల్ 30వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారుజామున రైల్వే ట్రాక్ వద్ద మహిళను హత్య చేసి పడేశారని తెలుసుకున్న ఇస్మాయిల్, ఇతర కుటుంబీకులు అక్కడకు వెళ్లి కరీమాను గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి టిప్పుసుల్తాన్ కోసం వెతుకులాడారు. ఫ్లోర్మెన్ బంగ్లా వద్ద మంగళవారం మధ్యాహ్నం నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ ఉమర్ పేర్కొన్నారు. -
రిటైర్డు లెక్చరర్ ఇంట్లో చోరీ
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం): తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం బచ్చుపేటకు చెందిన పింగళి విజయసూర్యనారాయణ అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలకు పెళ్లిళ్లు అయిపోవటంతో భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. ఇటీవల సూర్యనారాయణ మనుమరాలి ఫంక్షన్ నిమిత్తం బ్యాంకు నుంచి కొంత సొమ్మును డ్రా చేశారు. ఫంక్షన్లో ఖర్చుకాగా మిగిలిన రూ.1.50 లక్షలను బీరువాలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణ భార్య అస్వస్థతకు గురికావటంతో ఆదివారం ఉదయం చికిత్స నిమిత్తం ఇంటికి తాళాలు వేసి ఇద్దరూ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. లోనికి వెళ్లి చూడగా వెనుక భాగంలోని తలుపులు తెరిచి ఉన్నాయి. బెడ్రూంలోని బీరువా కూడా తెరిచి ఉంది. అందులో రూ.1.50 లక్షల నగదు కనిపించలేదు. హాలులోని మరో అలమారాలో పెట్టిన 6 కాసుల బంగారు గొలుసు కూడా కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన బాధితుడు చిలకలపూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిలకలపూడి ఎస్సై గజపతిరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడితో మాట్లాడారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర చోరీ జరిగినట్లు తేలింది. క్లూస్టీం సిబ్బంది నిందితుల వేలిముద్రలు సేకరించారు. -
‘కోతముక్క’ జూదరులు అరెస్టు
సాక్షి, అమరావతిబ్యూరో : కోతముక్క పేకాటలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలను మోసం చేసి రూ. లక్షలు దండుకోవడానికి సిద్ధమైన ఓ ముఠాను విజయవాడ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదివారం రాత్రి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో లోన బయట(కోతముక్క) ఆటను ఆడేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతుండటాన్ని గుర్తించిన ఓ ముఠా ఆ ఆట కోసం ప్రత్యేకంగా రూపొందించిన చీటింగ్ యాప్ను ఢిల్లీ నుంచి కార్గో సర్వీస్ ద్వారా నగరానికి తరలించారు వారిని గన్నవరం ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన గుడివాడ నవీన్, ఏలూరుకు చెందిన యండ్ల అశోక్కుమార్, గుంటూరు జిల్లా కోనూరు గ్రామం విద్యానగర్కు చెందిన షేక్జానీ భాషా, అదే జిల్లాలో ఇస్లాంపేటకు చెందిన మహబుగోరి, విజయవాడ పటమటకు చెందిన మెరుపు సందీప్లు గత కొంతకాలంగా ఢిల్లీ నుంచి కోతముక్కకు సంబంధించిన యాప్ కిట్ను తెప్పించుకుంటున్నారన్నారు. దీని ద్వారా కోతముక్క ఆడే ఆటగాళ్లను మోసం చేస్తూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. పక్కా నిఘా పెట్టి.. ముందుగానే స్కాన్ చేసిన ప్లేయింగ్ కార్డుల ద్వారా కోతముక్క ఆటలో ఏ కార్డు ఏవైపు పడుతుందో తెలుసుకుని పెద్ద మొత్తంలో జూదం కాస్తూ పేకాటరాయుళ్లను దోచుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారం తెలిసి చాలా రోజులుగా వారిపై నిఘా పెట్టి, ఆదివారం వారిని గన్నవరం ఎయిర్పోర్టు పరిసరాల్లో అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 2.80 లక్షల విలువైన నాలుగు సీవీకే–458 చీటింగ్ యాప్ కిట్, రహస్య కెమెరాలు కలిగిన రెండు సెల్పోన్లు, మరో ఐదు సాధారణ సెల్ఫోన్లు, రెండు మొబైల్ స్కానింగ్ వ్యాచ్లు, నాలుగు మైక్రో ఇయర్ ఫోన్లు, 168 స్కాన్ ప్లేయింగ్ కార్డు ప్యాకెట్స్తోపాటు బ్యాటరీలు, రిమోట్లు, కేబుళ్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి పేకాట జూదరుల బారిన పడొద్దని సీపీ హెచ్చరించారు. సమావేశంలో టాస్క్పోర్స్ ఏసీపీ రాజీవ్కుమార్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు
కృష్ణాజిల్లా, గుణదల (విజయవాడ తూర్పు) : మసాజ్ సెంటర్ల ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతులను, విటులను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బందరు రోడ్డు పీవీపీ మాల్లోని ఓ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో మసాజ్ చేస్తున్న థాయ్లాండ్కు చెందిన నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకుని మాచవరం స్టేషన్కు తరలించారు. లాల్ పంతులంగి (మిజోరాం), అకుసరథా (థాయ్లాండ్), సుత్వింగ్ నుజారి (థాయ్లాండ్), ఎల్మోన్టీపికున్కౌ (థాయ్లాండ్) యువతులతో పాటు బలేశ్వర పటేల్ (బీహార్), జి చక్రధర్ (విజయవాడ), ఎ శివప్రసాద్ (తుళ్లూరు) అనే విటులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.98 వేల నగదు, 9 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా మసాజ్ సెంటర్ నిర్వాహకుడు అరుణ్కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
లేడీ డాన్ హల్చల్!
కృష్ణాజిల్లా, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): రాజధాని పరిధిలోని తాడేపల్లి మున్సిపాలిటీలో ఓ లేడీ డాన్ హల్చల్ చేస్తోంది. దాదాపుగా రెండు ప్రాంతాల్లో చక్రం తిప్పుతూ తనదైన శైలిలో దౌర్జన్యం చేస్తూ, పేద బలహీన వర్గాల వారిని టార్గెట్ చేస్తోంది. అవసరాల నిమిత్తం రూ.10 వేలు, రూ.20 వేలు ఇచ్చి వడ్డీకి చక్రవడ్డీ వేసి రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తోంది. సకాలంలో ఇవ్వకపోతే వారిపై దౌర్జన్యం చేయడమే కాకుండా చితకబాది మరీ వారి వద్ద ఉన్న ఆస్తులను కబ్జా చేసి తన వశం చేసుకుంటోంది. ఇలాంటి సంఘటనే తాజాగా నులకపేటలో సదరు లేడీ డాన్ దెబ్బకు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను అప్పజెప్పి, ఏం చేయాలో అర్థంకాక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల ప్రకారం.. నులకపేట ప్రాంతంలో నివసించే నాంచారయ్య వద్ద డ్రైవర్గా పనిచేసే విజయ్, అతని స్నేహితుడు సదరు మహిళ వద్ద రూ.10 వేలు నగదు తీసుకున్నారు. సకాలంలో ఆ నగదు చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం విజయ్ తోలుతున్న ఆటోను సదరు మహిళ లాక్కొని, వడ్డీతో సహా రూ.20 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్ విజయ్ జరిగిన విషయాన్ని ఆటో యజమాని నాంచారయ్యకు చెప్పగా, నాంచారయ్య నా ఆటో నాకు ఇవ్వాలని సదరు లేడీ డాన్ను అడగ్గా, ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నీకు చేతనైంది నువ్వు చేస్కో అని తేల్చి చెప్పింది. జరిగిన సంఘటనపై నాంచారయ్య శుక్రవారం నుంచి ఆది వారం వరకు తాడేపల్లి పోలీస్స్టేషన్లో పడిగాపులు గాచినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్, అతని స్నేహితుడు డబ్బులు తీసుకుంటే మేమేం చేయాలి.., మా ఆటో లాక్కోవడం ఏమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేదని నాంచారయ్య తెలియజేశాడు. గతంలో ఈ మహిళ నులకపేట ప్రాం తంలో ఓ ఆటో ఓనర్ను కరెంటు స్తంభానికి కట్టేయగా, పోలీసులు వెళ్లడంతో అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు కూడా ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు మహిళ నులకపేట, పరిసర ప్రాం తాల్లోని రోజువారీ కూలీలు, కార్మికులను టార్గెట్ చేసి, వారి అవసరాల దృష్ట్యా రూ.10 వేలు, రూ. 20 వేలు ఇచ్చి, వారానికి రూ.10 వేలైతే రూ.1000 వడ్డీ, రూ.20 వేలైతే రూ.2000లు వడ్డీ వసూలు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దృష్టికి వచ్చినా మీరెందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా అస్వస్థత చేసినప్పుడు, ఆటోలు రిపేర్ అయినప్పుడు ఆమె బారిన పడక తప్పట్లేదని, అయితే ఆమె చెప్పిన నగదు మొత్తం చెల్లిస్తున్నప్పటికీ 2, 3 రోజులు ఆలస్యమైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతోందని స్థానికులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న లేడీ డాన్పై రాజధాని పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేక ఎందుకొచ్చిందిలే అని వదిలేస్తారో వేచిచూడాల్సిందే. -
కోడలిపై మామ వేధింపులు
నరసరావుపేట రూరల్: మామ వేధింపులు తాళలేక కోడలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్సప్పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది జూన్లో తన కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెప్పలేదు. అయితే రానురాను మామ వేధింపులు ఎక్కువ కావడంతో గురువారం రూరల్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ షఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్!
సాక్షి, అమరావతిబ్యూరో : ‘గత మూడేళ్లుగా నగరంలో సైబర్ నేరాలు పెరిగాయి. ముఖ్యంగా ఓటీపీ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బు డ్రా చేసుకునేందుకు వస్తున్న కొంత మందికి సాంకేతిక అంశాలపై అవగాహన లేకపోవడంతో ఇతరులపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు నేరాగాళ్లు బ్యాంకు ఏటీఎం కార్డులను తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక రకంగా ఆందోళనకరమే. అయితే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి నేరాలు జరగకుండా చూడొచ్చు.’ అని బెజవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పోలీసు కమిషరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సైబర్ నేరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పోలీసు–బ్యాంకు విభాగాల మధ్య సమన్వయం..’ తదితర అంశాలపై సీపీ ద్వారకా తిరుమలరావు చర్చించి పలు సూచనలు చేశారు. ‘బ్యాంకుల వద్ద సెక్యూరిటీని నియమించుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. అవసరమైన సందర్భాల్లో పోలీసులు కోరిన విధంగా అకౌంట్లను ప్రీజ్ చేయాలని కోరారు. వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. మోసం జరిగిన వెంటనే డయల్ 100కు గాని, ఫోర్త్ లయన్ యాప్ ద్వారా గాని, విజయవాడ సిటీ పోలీసు వాట్సప్ 7328909090కి గాని, ‘చేరువ’ నేర నియంత్రణ సిబ్బందికిగాని, ఇంటర్సెప్టార్ వాహన సిబ్బందికిగాని సమాచారం అందిస్తే త్వరితగతిన నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని సీపీ చెప్పారు. సైబర్ నేరాలు పెరిగాయి... ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ.. నగరంలో సైబర్ నేరాలు పెరిగాయని అంగీకరించారు. విదేశీయులు అధికంగా చేస్తున్నారని.. మోసం చేసిన నేరగాళ్లు దేశం వదిలి పారిపోతున్నారని వివరించారు. మూడేళ్లలో సైబర్ నేరాలకు సంబంధించి 193 కేసులు నమోదు కాగా.. కేవలం 15 శాతం కేసులను మాత్రం చేధించామని చెప్పారు. సమావేÔ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ద్వారకా తిరుమలరావుèæంలో డీసీపీలు రాజకుమారి, వెంకట అప్పలనాయుడు, గజరావు భూపాల్, ఉదయరాణి పాల్గొన్నారు. -
అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న ఇద్దరి అరెస్టు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : ‘మావద్ద అమ్మాయిలు ఉన్నారు... మీకు కావాలంటే ఈ ఫోన్ నెంబర్లలో సంప్రదించండి..’ అంటూ కొంత మందిని చీట్ చేసిన బెంగళూరుకు చెందిన రక్షిత్ (24), మంజు (32) అనే ఇద్దరు యువకులను పటమట పోలీసులు శనివారం రాత్రి బెంగళూరులో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన రక్షిత్, మంజు మొదట ‘మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు.. కావాలా...’ అంటూ కొన్ని నెంబర్లకు ఫోన్ చేస్తారు. అలాగే, ఇందుకుగాను ప్రత్యేకంగా ఇంటర్నెట్లో ఓ సైట్ను కూడా నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా కాంటాక్ట్లోకి వచ్చిన వారికి ఫలానా అడ్రస్లో అమ్మాయి ఉంటుంది. కావాలంటే కొంత మొత్తం చెల్లించాలి అని నమ్మిస్తారు. వారి వద్ద నుంచి తమ అకౌంట్లోకి సొమ్మును బదిలీ చేయించుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి ఉన్న అడ్రస్ ఇస్తారు. అయితే, సొమ్ము చెల్లించిన వారు ఆ అడ్రస్కు వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇలా సొమ్ము చెల్లించి మోసపోయిన న్యూ ఆర్టీసీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్టోబరు 24 న పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీస్లు వివిధ కోణాల్లో, పలు ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు. చివరకు శనివారం రాత్రి 7 గంటలకు బెంగళూరులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని ఇక్కడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించినట్టు సీఐ కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కృష్ణాజిల్లా, ముసునూరు (నూజివీడు) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్త మామలు, తోటి కోడలు, బావగార్లు మూకుమ్మడిగా పెడుతున్న వేధింపులకు తాళలేక ఓ మహిళ పురుగు మందు తాగి తనువు చాలించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడుకు చెందిన ఎలికే అనిల్ భార్య వెంకటేశ్వరమ్మ (25) భార్యా భర్తలు. వీరు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరమ్మ ఆదివారం ఉదయం పురుగు మందు తాగింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్లో ప్రథమ చికిత్స అందించి, అనంతరం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తుండగా, అల్లుడు, అత్తింటివారే తమ బిడ్డను అంతమొందించినట్లుగా మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గోగులంపాడులోని ఇంటివద్ద అత్త, స్థానికులను ఎస్ఐ విచారించి ఆధారాలు సేకరిస్తున్నారు. నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. మృతురాలి తల్లిదండ్రులు కొండలరావు, రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
'వల'పుబాణంతో.. 'వెబ్'చారం
నాగరికత పెరుగుతున్న కొద్దీ.. విశృంఖల పోకడలు కూడా దానితో పాటు పోటీపడుతున్నాయి. టెక్నాలజీని తప్పుదారి పట్టించడంలో వ్యభిచార ముఠాలు ముందుంటున్నాయి. ఇటీవల కాలంలో ఏది కొనాలన్నా.. తినాలన్నా.. చూడాలన్నా అంతా ఆన్లైన్లోనే జరిగిపోతోంది. సరిగ్గా దీనినే కొందరు ఆసరాగా తీసుకుని హైటెక్ వ్యభిచారానికి తెరతీస్తున్నారు. వెబ్సైట్లు క్రియేట్ చేసుకుని వ్యాపార ప్రముఖుల పిల్లలు, పెద్దింటి యువకులే లక్ష్యంగా సొషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని దందా సాగిస్తున్నారు. ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ తదితర మెట్రో నగరాలకే పరిమితమైన ఈ తరహా వ్యవహారం విజయవాడలోనూ కొరలు చాచుతోంది. వీటిపై పోలీసుల నిఘా కొరవడటంతో యువత తప్పుదారి పడుతోంది. సాక్షి, అమరావతిబ్యూరో : బెజవాడ నగరంలో వ్యభిచార ముఠాలు బరితెగిస్తున్నాయి. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఇంటర్నెట్ ద్వారా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. చిన్న సెర్చ్ చాలు.. గూగుల్లో ఒక్కసారి సెర్చ్చేస్తే పదుల సంఖ్యలో వ్యభిచార వెబ్సైట్లు మహిళల చిత్రాలు, చిరునామాలతో సహా దర్శమిస్తాయి. నచ్చితే ఫొన్ నంబర్లలో సంప్రదించాలని మెసేజ్లు కనిపిస్తాయి. అంతే కాక ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను కూడా ముఠాలు ఉపయోగిస్తున్నారని సమాచారం. ఆ గ్రూపుల్లో అమ్మాయిల ఫొటోలు పెడుతూ.. నచ్చితే సంప్రదించమని కోరుతుంటారని తెలుస్తోంది. దీనికోసం వారు కుటుంబం, వ్యాపారం, కన్సల్టెన్సీ తదితర పేర్లతో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత నివాస గృహాలను అద్దెకు తీసుకుంటూ.. విటుల్ని, అమ్మాయిల్ని అక్కడికే పిలిపిస్తుంటారు. నగరంలో నున్న, సింగ్నగర్, కృష్ణలంక, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో పట్టపగలే వ్యభిచార ముఠాలు విజృంభిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిగో ఇలా వల.. హైటెక్ వ్యభిచార ముఠాలు తమ వ్యవహారాల్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నాయి. ముందుగా వెబ్సైట్లో దరఖాస్తును ఉంచుతారు. ఆసక్తిగలవారు దాన్ని పూర్తి చేయాలి. ఫోన్ నంబర్లు ఇతరత్రా పూర్తిగా సేకరించిన సమాచారంతో దరఖాస్తుదారుడి గురించి ముఠా సభ్యులు విచారణ చేస్తారు. అనుమానాస్పద వ్యక్తులు కాదని నిర్థారించుకున్న తర్వాత అతన్ని కలుసుకుంటారు. అప్పటికీ అతన్ని పూర్తిగా నమ్మరు. ఒకట్రెండు చోట్లకు తిప్పుతారు. అవతలి వ్యక్తిపై పూర్తిగా నమ్మకం కలిగిన పిమ్మటే ఇంటికి తీసుకెళతారు. 20 నుంచి 25 ఏళ్ల యువకులే ఈ ముఠాల వలలో చిక్కుతున్నారు. విటులకు ఇల్లుతో సహా సకల సౌకర్యాలు కల్పిస్తారు. స్నేహహస్తమంటూ ఉచ్చు.. ఇంటర్నెట్లో కొందరు మహిళల స్నేం చేస్తామంటూ ఫొటోలు, వివరాలు ఉంచుతున్నారు. యువకులు కదా అని వారికి ఫోన్ చేస్తే వారి ఉచ్చులో చిక్కుకున్నట్లే. ముందుగా స్నేహం, ఆ తర్వాత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక కాల్గరల్స్ అంటూ వెబ్సైట్లలో ఉంచుతున్న ఫొటోలు చాలామటుకు తప్పుడివే ఉంటాయి. అందమైన అమ్మాయిల ఫొటోలు ఉంచి యువతను మోసం చేస్తున్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దాడులు మానేసిన పోలీసులు.. నగరంలో వ్యభిచార ముఠాల ఆగడాలపై పోలీసులు నోరుమెదపడం లేదు. నిత్య వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులకు ఇతర ముఖ్యమైన పనులు అప్పగించారు. ఇది చాలా చిన్న వ్యవహరమంటూ వ్యభిచార గృహాలపై దాడులు చేసే పనిని స్థానిక పోలీసులకే అప్పజెప్పారు. అప్పటి నుంచి వ్యభిచార ముఠాల జోరుకు పగ్గాల్లేకుండా పోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక పోలీసులకు తమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసన్న వాదన వినిపిస్తోంది. కానీ ఎప్పుడూ దాడులు చేసింది లేదు. పోలీసుల నిర్లిప్తత వల్ల వేలాది మంది బాలికలు, మహిళల జీవితం నరకకూపంలో మగ్గిపోతున్నాయి. అయితే ఇంటర్నెట్ వ్యభిచార గుట్టును రట్టు చేసినా నిర్వాహకులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండటం వల్ల వారిపై చర్యలు తీసుకోవడం కష్టమే అవుతోందంటున్నారు ఓ సీనియర్ పోలీసు అధికారి. ఇలాంటి కేసులను దర్యాప్తు చేయడానికే ప్రత్యేకంగా ‘సైబర్సెల్’ను ఏర్పాటు చేశారు. ఖరీదైన కాలనీల్లో తిష్టవేసే ఈ ముఠాలు అపార్టుమెంట్ల కన్నా వ్యక్తిగత నివాసాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
బాలికపై లైంగిక దాడికి యత్నం
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మదాంధుడు అభం శుభం తెలియని ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లితండ్రులు జరిగిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం గోపాల్నగర్కు చెందిన దొండపాటి నాగబాబు అలియాస్ స్వామి పశువులకు పలుపుతాళ్ళు అల్లుతుంటాడు. మిగిలిన సమయాల్లో ఇతర పనులకు వెళ్తుంటాడు. అతను ఎదురింట్లో ఉంటున్న ఏడేళ్ళ బాలికపై కన్నేశాడు. మంగళవారం బాలిక తల్లితండ్రులు పనులకు వెళ్ళిపోయారు. మూడో తరగతి చదువుతున్న బాలిక స్కూలు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో విషయం తెలుసుకున్న నాగబాబు బాలికను స్వీట్లు పెడతాను రమ్మంటూ పిలిచాడు. ఇంట్లోకి వెళ్ళగా నాగబాబు అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. భయంతో బాలిక పారిపోయింది. మరుసటి రోజు స్కూలుకు రెడీ చేసేందుకు తల్లి స్నానం చేయిస్తుండగా బాలిక చాతి నొప్పితో బాధ పడుతుండటాన్ని గమనించిన తల్లి విషయం అడిగింది. జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. దీంతో బాలిక తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించి నాగబాబుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల కింద కేసులు నమోదు చేసినట్లు బందరు డీఎస్పీ మహబూబ్బాషా తెలిపారు. -
ఇంటి దొంగల ఆట కట్టు
కృష్ణాజిల్లా, నాగాయలంక (అవనిగడ్డ): ఇంటి దొంగల ఆటకు పోలీసులు బ్రేక్ వేశారు. అతి తక్కువ కాలంలోనే ఓ చోరీ కేసును ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నాగాయలంక పోలీసు స్టేషన్లో అవనిగడ్డ డీఎస్పీ వీ.పోతురాజు సామవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి.. నాగాయలంక ఏడో వార్డు నివాసి నాగిడి హరిప్రసాద్, అతని స్నేహితులైన మైనర్లు ఇద్దరు చెడు వ్యసనాలకు బానిసయ్యారు. విలాసాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా ఓ బైక్ కొనాలని అనుకున్నారు. గత నెల 26న ఓ మైనర్ స్నేహితుడి తల్లిదండ్రులైన కొక్కిలిగడ్డ సోమశేఖరరావు దంపతులు కార్తీక నోముల కోసం సమీపంలోని అవనిగడ్డ మండలం వేకనూరుకు వెళ్ళారు. ముగ్గురు స్నేహితులు అదే అదనుగా భావించారు. చల్లపల్లి వెళ్లి తాళాలు కోసే వ్యక్తిని కలిశారు. తమ ఇంట్లోని బీరువా తాళాలు పోయాయని, కోసి పెట్టాలని కోరారు. అతన్ని తీసుకొచ్చి ఇంట్లో గోడకు అమర్చి ఉన్న చెక్కపెట్టె తాళాలు కోయించారు. అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత చెక్క పెట్టెలోని 77 గ్రాముల బంగారం, 82 గ్రాముల వెండి ఆభరణాలను, రూ.10 వేల నగదును తస్కరించారు. చోరీ సొత్తును హరిప్రసాద్ ఇంటి పక్కన ఉన్న వనమాలి తులసమ్మ ఇంట్లో ఎవరూ చూడకుండా దాచిపెట్టారు. కార్తీక నోముల నుంచి తిరిగొచ్చిన సోమశేఖరరావు దంపతులు దొంగతనం జరిగినట్లు గుర్తించి ఇరుగు పొరుగు వారిని విచారించారు. అయితే, కొడుకు, అతని స్నేహితులే ఇక్కడ తిరిగినట్లు వారు చెప్పారు. దీంతో వారిని గట్టిగా మందలించడంతో అసలు విషయం బయటపెట్టారు. అయితే తాళాలు కోయించి కొంత సొమ్మునే తస్కరిం చినట్లు, మిగతాది తమకు తెలియదంటూ బుకాయించారు. దీంతో గత్యంతరం లేక పోలీసు స్టేషన్లో సోమశేఖర్ ఫిర్యాదు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్న ల్స్, చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అపహరణకు గు రైన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎ స్పీ వివరించారు. అయితే, ఫిర్యాదులో పేర్కొన్న దానికంటే స్వాధీనం చేసుకున్న సొత్తు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మైనర్లను జువైనల్ కోర్టులో, హరిప్రసాద్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని చెప్పారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన అవనిగడ్డ ఎస్ఐ సందీప్, సీఐ ఏఎన్ఎన్ మూర్తిలను అభినందించారు. సమావేశంలో నాగాయలంక ఎస్ఐ కే.రాజారెడ్డి, ఏఎస్ఐ వీరాంజనేయులు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
పక్కా స్కెచ్తో హత్య!
సాక్షి, అమరావతిబ్యూరో : తనఖా పెట్టిన ఆస్తిని తమ తండ్రికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫైనాన్స్ వ్యాపారి గగారిన్పై కక్ష కట్టారు మద్దాల సోదరులు సురేష్, సుధాకర్. తమ తండ్రిని మోసం చేసి రూ.కోటి విలువైన భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడని వారు రగలిపోయారు. అతనితో గొడవలు పడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయినా ఆస్తి తగాదా తీరలేదు. దీంతో ఫైనాన్స్ వ్యాపారిని అంతమొందిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు భావించారు. గవర్నర్పేటలో అతను ఉంటున్న కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 22న రెక్కీ నిర్వహించారు. 23వ తేదీ మధ్యాహ్నం 1:40 గంటల ప్రాంతంలో ఇద్దరు సోదరులు బైక్పై మూన్మూన్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. రవితేజ ఫైనాన్స్ సంస్థ కార్యాలయానికిచేరుకున్న మద్దాల సురేష్ అక్కడ ఉన్న గగారిన్పై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. అనంతరం అతని సోదరుడు కూడా మరోమార్గంలో అక్కడి నుంచి జారుకున్నాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గగారిన్ మృతి చెందాడు. నగరంలో సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్లోని సౌత్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఏసీపీ జీవీ రమణమూర్తి వివరించారు. తనఖా తెచ్చిన తంటా.. మొగల్రాజపురానికి చెందిన మద్దాల ప్రసాద్ అనే వ్యక్తి బ్యాంకు రుణం తీసుకుని శిఖామణి సెంటర్లో ఓ భవనం నిర్మించారు. సకాలంలో రుణం చెల్లించలేకపోవడంతో బ్యాంకు ఆ భవనాన్ని 2016లో వేలానికి పెట్టింది. ఇదే సమయంలో ఆ భవనాన్ని బ్యాంకు తనఖా నుంచి విడిపించేందుకు మధ్యవర్తి ద్వారా మద్దాల ప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ను కలిశాడు. గగారిన్ వద్ద సంబంధిత ఆస్తిని తనఖా పెట్టాడు. ఈ నేపథ్యంలో గగారిన్ రూ.40.75 లక్షలకు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ ఒప్పంద పత్రాలపై ప్రసాద్తో సంతకాలు పెట్టించాడు. ఆ తర్వాత ప్రసాద్కు తెలియకుండా గగారిన్ తన భార్య పేరుమీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది తెలిసి ప్రసాద్ కుమారులు మద్దాల సురేష్, సుధాకర్ తండ్రిని నిలదీశారు. తాను ఇంటిని విక్రయించలేదని.. గగారిన్కు కేవలం తనఖా పెట్టి రూ.30 లక్షలు తీసుకున్నానని కుమారులకు వివరించాడు. ఈ క్రమంలో ఆ భవనం తమదంటే తమదంటూ గగారిన్, ప్రసాద్ కుమారులు పలుమార్లు గొడవ పడ్డారు. ఇరువురు ఒకరిపై ఒకరు మాచవరం పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కక్ష కట్టి కడతేర్చారు.. ప్రసాద్ కుమారుల్లో సురేష్ బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో నివసిస్తుండగా.. అతని సోదరుడు సుధాకర్ శిఖామణి సెంటర్లో ఉన్న వివాదాస్పద భవనంలోనే ఉంటున్నాడు. ఈ భవనం విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు ఇటీవల తారస్థాయికి చేరాయి. సుధాకర్, సురేష్ ఇళ్ల వద్దకు వెళ్లి గగారిన్ బెదిరించాడు. సురేష్ భార్య ఈ విషయంలో గగారిన్పై హనుమాన్ జంక్షన్ పరిధిలోని వీరవల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ విలువైన ఆస్తిని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా దౌర్జన్యానికి దిగుతున్న గగారిన్పై సోదరులు ఇద్దరు కక్ష కట్టారు. గగారిన్ను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళిక రూపొందించుకుని 23వ తేదీ మధ్యాహ్నం సురేష్ కొబ్బరిబోండాలు నరికే కత్తి, పెట్రోల్ డబ్బాను తీసుకుని తిప్పనగుంట నుంచి బయలుదేరి గవర్నర్పేటలోని మూన్మూన్ ప్లాజా వద్దకు చేరుకున్నాడు. సుధాకర్ అప్పటికే అక్కడికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:40 గంటల ప్రాంతంలో గగారిన్ ఉంటున్న రవితేజ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలోకి సురేష్ వెళ్లి అక్కడ ఉన్న గగారిన్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటల్లో చిక్కుకున్న గగారిన్ రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేస్తూ ప్లాజా నుంచి రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో సురేష్ కూడా పారిపోతూ బైక్ తాళాల్ని సోదరుడు సుధాకర్కు ఇచ్చి వెళ్లిపోయాడు. పారిపోయే క్రమంలో సురేష్ బ్యాగ్లో ఉన్న కత్తి కింద పడింది. స్థానికులు తీవ్రగాయాలైన గగారిన్ను ఆంధ్రా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గగారిన్ ఈ నెల 26వ తేదీ మృతి చెందాడు. అత్యంత రద్దీగా ఉండే గవర్నర్పేట ప్రాంతంలో అలజడి సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు సూర్యారావుపేట ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా గురువారం ఓల్డ్ గవర్నమెంట్ ఆస్పత్రి వద్ద ఉన్న సురేష్, సుధాకర్ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా హత్యానేరాన్ని ఒప్పుకున్నారని ఏసీపీ రమణమూర్తి వివరించారు. నిందితులను అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
అత్తింటివారే హత్యచేశారు.?
కృష్ణాజిల్లా, పెనమలూరు: రెండు రోజుల క్రితం యనమలకుదురులో అదృశ్యమైన నల్లబోతుల ప్రత్యూష కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నేతలు పెనమలూరు పోలీస్స్టేషన్ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. అత్తింటి వారే ప్రత్యూషను హత్యచేసి కనిపించకుండా చేశారని ఆరోపిస్తూ పోలీసులు నిందితులకు మద్దతుగా ఉన్నారంటూ వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష తల్లి నిర్మల స్పృహ కోల్పోవడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పందించిన పోలీసులు కేఈబీ కెనాల్ను జల్లెడపట్టారు. చివరికి ప్రత్యూష మృతదేహాన్ని చోడవరం గ్రామం వద్ద గుర్తించారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. అజిత్సింగ్నగర్కు చెందిన ప్రత్యూష (20)కు యనమలకుదురు మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు నల్లబోతుల విజయ్కిరణ్తో 2016లో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. విజయ్కిరణ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొంత కాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న భార్యభర్తల మధ్య మరోసారి వాగ్వివాదం జరిగింది. అదే రోజు రాత్రి ప్రత్యూష కేఈబీ కెనాల్లో దూకి గల్లంతైంది. ఈ ఘటనకు ముందు ఆమె తల్లితో ఫోన్లో మాట్లాడింది. ఆ తరువాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అదే రోజు అర్ధరాత్రి భర్త విజయ్కిరణ్ ప్రత్యూష కనబడటంలేదని అత్త నిర్మలకు చెప్పి మౌనంగా ఉండి పోయాడు. కేఈబీ కెనాల్ నుంచి మృతదేహాన్ని తీస్తున్న దృశ్యం మిస్సింగ్ కేసు నమోదుపై వివాదం కాగా ప్రత్యూష కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యూష తల్లి అల్లుడిపై అనుమానం వ్యక్తంచేసినా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం వివాదంగా మారింది. గత మంగళవారం నుంచి ప్రత్యూష కనిపించకపోయినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, అత్తింటి వారికి మద్దతుగా ఉన్నారని ఆరోపిస్తూ శుక్రవారం ప్రత్యూష కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా çసంఘాల నేతలు పోలీస్స్టేషన్కు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ప్రత్యూష తల్లి నిర్మల పోలీస్స్టేషన్ వద్ద స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. -
మహిళలకు ఫోన్లు చేసి అసభ్యపద జాలంతో..
నగరంలో రెండో పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 1.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగింది. దీంతో ఆ కంపెనీ పేరిట రికవరీ ఏజెంట్ ఒకరు ఫోన్ చేసి పేపర్లో రాయడానికి వీలుకాని భాషలో తిట్టి భయభ్రాంతులకు గురిచేశారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న మరో మహిళకు సైతం ఇలాగే ఫోన్లు చేసి బెదిరించారు. నీ అప్పు నేను కడుతాను.. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు.. అంటూ చెప్పుకోలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రతిరోజూ ఇలా ఫోన్లు చేస్తుండటంతో ఆ మహిళ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసింది. అయినా వదలని రికవరీ ఏజెంట్లు ఇంటికెళ్లి బెదిరించడం కొసమెరుపు.రూటు మార్చిన ‘కాల్’నాగులు ఏజెంట్ అవతారంలో సాగిస్తున్నకీచకపర్వనానికి ఉదాహరణలు ఇవి. సాక్షి, అమరావతిబ్యూరో: నగరంలో కీచకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. గతంలో కాల్మనీ వ్యాపారం పేరిట కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, డబ్బున్నవారు కుమ్మక్కై నిర్లజ్జగా జనం మానప్రాణాలతో ఆడుకున్నారు. రూ. 100కి రూ. 20 వడ్డీ వసూలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేశారు. అప్పులిచ్చి మహిళలను బెదిరించి లైంగికంగా వేధించారు. ఈ కాల్మనీ సెక్స్రాకెట్ కుంభకోణంతో ఇప్పటికే విజయవాడ పరువు చిన్నబోయింది. అనంతరం ఈ రాకెట్ గుట్టు రట్టవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ వ్యాపారులు ఇప్పుడు మళ్లీ కొత్త అవతారం ఎత్తారు. ఆధీకృత వడ్డీ డీలర్ల వద్ద 20 శాతం కమీషన్ తీసుకుని బకాయిలు వసూలు చేసే పనికి దిగారు. అయి తే ఇక్కడా బలవంతపు వసూళ్లు, లైంగిక వేధింపులకు దిగడం మాత్రం మానకపోవడం విశేషం. పోలీసుల నిర్లిప్తత.. రికవరీ ఏజెంట్ల ముసుగులో ఉన్న కాల్మనీ ముఠా సభ్యుల ఆగడాలపై స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. ఫైనాన్స్ కంపెనీల ఆగడాలపై 10 రోజుల కిందట లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మాకు న్యాయం చేయమంటూ స్టేషన్కు వెళితే.. ‘వారిని పిలిపిస్తాం. రేపు రా, ఎల్లుండి రా..’ అంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. పైగా నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రికవరీ ఏజెన్సీల యాజమాన్యాల వెనుక అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో రికవరీ ఏజెంట్లపై కేసులు పెట్టిన బాధితులపైనే పోలీసులు ఉల్టా కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కొందరు బాధితులు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తే.. అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని నిందితులకు వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. రూటు మార్చేసి.. కాల్మనీ సెక్స్రాకెట్ గుట్టు రట్టు కావడం.. పోలీసులు కాల్మనీ రాకెట్లో పెద్ద చేపల్ని వదిలి చిన్న చేపల్ని పట్టుకోవడంతో ఊపిరి తీసుకున్న అధికారపార్టీ నేతల అండడండలున్న బడా వ్యాపారులు కొంత కాలంపాటు తమ కార్యకలాపాలను పక్కనపెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగేళ్లు గడిచాయి.. మళ్లీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారులు కొత్త అవతారం ఎత్తి.. ఫైనాన్స్ కంపెనీలు బకాయిల వసూళ్ల కోసం నియమించుకునే రికవరీ ఏజెన్సీల యజమానులుగా రూపాంతరం చెందారు. ఇప్పుడు వారి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు ఫైనాన్స్ కంపెనీలకు, బ్యాంకులకు సరిగా బకాయిలు చెల్లించని వినియోగదారులను టార్గెట్గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రూ. 20 వడ్డీ వ్యాపారం నిర్వహించే కాల్మనీ వ్యాపారులు.. ఇప్పుడు బకాయి వసూలు చేసి ఇస్తే అధికారికంగా రూ. 100కి 20 శాతం కమీషన్ వస్తుండటంతో ఈ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం కాల్మనీ వ్యాపారాలను సహించం. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు వినియోగదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరాదు. బకాయిల వసూళ్ల కోసం బెదిరింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – ద్వారకాతిరుమలరావు, నగర సీపీ -
మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠా గుట్టు రట్టు
విజయవాడ: విజయవాడలో గుట్టుగా సాగుతున్న మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నగరంలో పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 30 ఎం.జి. పోర్ట్విన్ (మత్తు) ఇంజక్షన్లు 75, నగదు రూ.7,480, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం.. బిహార్కు చెందిన విశ్వరూప్ బారిక్ (36) 13 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చి, అరండల్పేటలో నివాసం ఉంటున్నాడు. తనకు పరిచయం ఉన్న అరండల్పేటకు చెందిన తంగిళ్ల హరికృష్ణతో కలిసి మత్తు ఇంజక్షన్లు ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు చేస్తున్నాడు. వారిద్దరు కాల్వగట్టుపై నివాసం ఉంటున్న కందుకుట్ల నాగమణి అనే మహిళకు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. పోర్ట్విన్ ఇంజక్షన్ అసలు ధర రూ.5.30 కాగా నాగమణికి దీన్ని రూ.100కు విక్రయిస్తున్నారు. అదే ఇంజక్షన్ నాగమణి మారుబేరానికి రూ.200కు విక్రయిస్తోంది. నాగమణి వద్ద చిట్టినగర్కు చెందిన పిళ్లా మహేష్కుమార్, పాతరాజరాజేశ్వరీపేటకు చెందిన పైడి దీపక్ ఇంజక్షన్లు కొనుగోలు చేసి మరికొంత మంది వ్యక్తులను తీసుకువచ్చి వారితో కూడా ఇంజక్షన్లు కొనుగోలు చేయిస్తున్నారు. పోర్ట్విన్ ఇంజక్షన్ సాధారణంగా శస్త్ర చికిత్సలు చేసే సమయంలో మానసిక రోగులకు వైద్యుని పర్యవేక్షణలో వినియోగించాల్సి ఉంది. వైద్యుల అనుమతి లేకుండా మత్తు ఇంజక్షన్లు విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు నిఘా వేసి ముఠాను పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్కుమార్, సీఐ ఆర్.సురేష్రెడ్డి, సిబ్బంది ఇంజక్షన్ల ముఠాను అరెస్టు చేసి సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు. -
సిటీబస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు
కృష్ణాజిల్లా, సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): బందరురోడ్డులో సిటీ బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. పటమట కరణంవారి వీధికి చెందిన ఎస్.కె.గౌస్ ఆహ్మద్ పంట కాలువరోడ్డులోని ఒక హోటల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు అబ్దుల్ రహీం (12),అబ్దుల్ రేహాన్ (10) ఇద్దరు కుమారులు. వీరు ఒన్టౌన్లోని స్కూల్లో చదువుతున్నారు. ప్రతిరోజు ఆటోలో స్కూల్కు వెళ్లి వచ్చే వీరికి ఉదయం ఆటో రాకపోవడంతో స్కూల్లో దింపి రమ్మని మేనల్లుడు ఎస్కె.నిసార్బాబు చెప్పాడు. తన ద్విచక్రవాహనంపై ఇద్దరిని తీసుకుని వస్తుండగా ఉయ్యూరుకు డిపోకు చెందిన సిటీ బస్సు బెంజిసర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్తూ ఆర్టీఏ బస్టాప్ వద్ద స్పీడుగా ఎడమ వైపుగా రావడంతో ద్విచక్ర వాహనం హ్యాండిల్కు బస్సు తగిలి ముగ్గురూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు.. అబ్దుల్ రేహాన్ కుడిభుజానికి తీవ్ర గాయ మై పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సూర్యారావు పేటలోని ఆంధ్రా హాస్పటల్ కు తరలించారు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. నిసార్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
కృష్ణాజిల్లా , పొన్నూరు: ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పొన్నూరు పట్టణంలో మంగళవారం కలకలం రేపింది. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన అద్దంకి వీర ప్రసాదరావు కుమార్తె అమదాలపల్లి సునీత(35) నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జిపై నుంచి తుంగభద్ర డ్రెయిన్లో దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డ్రెయిన్లోకి దిగి ఆమెను బయటకు తీసి నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలి సిన పట్టణ సీఐ ఎం.నాగేశ్వరావు, ఎస్ఐ డి.కిషోర్బాబులు ఆస్పత్రికి బాధితురాలిని సందర్శించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. మృతిరాలు తండ్రి అద్దంకి వీరప్రసాదరావు మాట్లాడుతూ తన కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 2 నెలల క్రి తం అల్లుడు వద్ద నుంచి ´న్నూ రు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నామని తెలిపారు. రో గం తగ్గకపోవటంతో మనస్తాపానికి గురై ఓవర్ బ్రిడ్జి పై నుంచి దూకి మృతి చెందిం దని ఆయన పోలీసులకు తెలిపారు. వీరప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.కిషోర్బాబు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. -
మృత్యు శకటాలు
కోస్తాంధ్ర నడిబొడ్డుగా, నవ్యాంధ్ర రాజధానిగా ఉన్న కృష్ణా జిల్లా గుండా నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. రవాణా రంగానికి జీవనాడిగా ఉన్న ఈ హైవేలు.. ప్రమాదానికీ అంతే హేతువులవుతున్నాయి. వాహన చోదకులు వే బేలు ఉన్నచోట కాకుండా తమకు నచ్చిన చోట రోడ్డుపైనే లారీలు, ట్రాలీలు నిలుపుతున్నారు. వెనుక నుంచి వస్తున్న చిన్న వాహనాలు వీటిని ఢీకొని ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారింది. వీరిని హైవే అథారిటీ, పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. ఈ మృత్యు పరంపర మూలాలు, కేంద్రాలు, పరిష్కార మార్గాలపై ‘సాక్షి’ కథనం. సాక్షి, అమరావతిబ్యూరో : వాహన రాకపోకల క్రమమైన నియంత్రణతోపాటు ప్రమాదాల్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా జాతీయ రహదారుల్ని విస్తరించింది. ఆచరణలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఉద్దేశాలు నెరవేరడం లేదు. జిల్లా పరిధిలో చెన్నై–కోల్కతా, మచిలీపట్నం–హైదరాబాద్, పామర్రు–కత్తిపూడి, మచిలీపట్నం–తిరువూరుల జాతీయ రహదారులే ఇందుకు నిదర్శనం. హైవేలపై ఎలాంటి అవరోధాలు లేకుండా ఉంటేనే రాకపోకలు వేగవంతంగా సాగుతాయి. కానీ జాతీయ రహదారులపై గల్లీ రోడ్ల కంటే దారుణంగా వాహనాలను నిలుపుతున్నారు. చెన్నై–కోల్కతా రహదారిలో ప్రసాదంపాడు నుంచి గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం, బొమ్ములూరు వరకు ఇదే పరిస్థితి. అవే మృత్యు నెలవులు.. హోటళ్లు, మద్యం షాపులు, రెస్టారెంట్లు, పెట్రోలు బంకుల వద్ద డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుండటంతో అక్కడే వాహనాలను రోడ్డుపైన నిలుపుతున్నారు. ఇవే ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. చిల్లకల్లు సైడ్ ట్రాక్ వద్ద భద్రత లేక చోరీలు జరుగుతుండటంతో వాహనాలు ఆపటం లేదు. గరికపాడు, అనుమంచిపల్లి శివారులో, అనుమంచిపల్లి క్రాసింగ్, షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు, చిల్లకల్లు, గౌరవరం, నవాబుపేట అడ్డురోడ్డు, మునగచర్ల అడ్డురోడ్డు హోటళ్ల వద్ద, నందిగామ, కంచికచర్ల మెయిన్రోడ్డు, బైపాస్ రోడ్లలో, అనాసాగరం అడ్డరోడ్డు, కీసర, కంచికచర్ల, పరిటాల, ఎంవీఆర్, అమృతసాయి ఇంజినీరింగ్ కళాశాలల క్రాస్రోడ్ల వద్ద, మూలపాడు, కేతనకొండ, ఇబ్రహీంపట్నం ఆర్టీ చెక్పోస్టుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టించుకునే నాథుడేడి? ట్రక్ వే బైలు ఉన్నచోట మినహా హైవేలపై వాహనాలను నిలుపరాదనేది నిబంధన. కానీ ఆచరణలో ఇది ఎక్కడ అమలు కావడం లేదు. హైవే అథారిటీ, పోలీసు శాఖకు చెందిన పెట్రోలింగ్ సిబ్బందికి ఈ పర్యవేక్షణ నిమిత్తం వాహనాలను సమకూర్చినా వారు సరిగ్గా తిరగడం లేదని జరుగుతున్న ప్రమాదాలే రుజువు చేస్తున్నాయి. పోలీ సు పెట్రోలింగ్ వారు జంతువులు, సరుకు అక్రమ రవాణా చేసే వారి నుంచి మామూళ్లు వసూలు చే సుకోవడానికే పరిమితమయ్యారన్న ఆరోపణలున్నాయి. దుర్ఘటనలకు కేంద్ర బిందువులు భారీ వాహనాలను జాతీయ రహదారులపై నిలుపుతున్నందున వెనక నుంచి వచ్చే కార్లు వీటిని ఢీకొనడంతో ప్రమాదాలు సంభవిస్తున్నా యి. కనీసం రేడియం స్టిక్కర్లు కూడా సరిగ్గా ఉండక దగ్గరకు వచ్చే వరకూ ఆపి ఉన్న వాహనాలు కనపడక అధికశాతం అనర్ధాలు జరుగుతున్నాయి. వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి విజయవాడ–హైదరాబాద్, విజయవాడ–కోల్కతా మార్గంలో చిల్లకల్లు, మూలపాడు, ఎనికేపాడు తదితర ప్రాంతాల్లో నిర్మించిన ట్రక్ లే బైలు వద్ద కనీస సౌకర్యాలు సరిగా లేవు. లేబేల ఉద్దేశమే విశ్రాంతి కోసం అయినప్పుడు.. అక్కడ మూ త్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి హాలు తప్పనిసరి. కాగా.. చాలాచోట్ల అవేమీ లేని కారణంగా వే బైలు వద్ద డ్రైవర్లు వాహనాలు నిలపట్లేదు. ఎనికేపాడులోనూ అంతే.. మూలపాడు వద్ద రెండు వైపులా ట్రక్ వే బైలు ఉన్నా ఇక్కడ వాహనాలు నిలపట్లేదు. -
తప్పిపోయిన చిన్నారి నిమిషాల్లోనే అప్పగింత
విజయవాడ : పోలీస్ వాట్సాప్ నంబర్కు అందిన సమాచారంతో తప్పిపోయిన 4 ఏళ్ల బాలిక ఆచూకీని నగర పోలీసులు కనుగొన్నారు. ఆ చిన్నారిని 20 నిమిషాల్లో క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి రమణారెడ్డి తన భార్య, 4 ఏళ్ల చిన్నారితో కలిసి సోమవారం విజయవాడ ప్రకాష్నగర్ పైపుల రోడ్డులో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం హడావిడిలో నాలుగేళ్ల చిన్నారి అరుణ ఇంటి బయటకు వచ్చి దారి తెలియక తప్పిపోయింది. కొద్దిసేపటికి గుర్తుకు వచ్చిన రమణారెడ్డి తన కుమార్తె అరుణ కోసం వెతకటం ప్రారంభించారు. ఆమె కనపడలేదు. దాంతో విజయవాడ పోలీస్ వాట్సాప్ నెం.70289 09090 కు మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చారు. వాట్సాప్ సమాచారంతో అప్రమత్తమైన నగర పోలీసులు వైర్లెస్ సెట్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు, రక్షక్, బ్లూకోట్స్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నున్న రక్షక్ మొబైల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అక్కడి స్థానికుల సహాయంతో చిన్నారిని కనుగొన్నారు. ఇరవై నిమిషాల వ్యవధిలోనే చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు. -
అవమానించారు.. ఆత్మహత్య చేసుకుంది!
సాక్షి, అమరావతి బ్యూరో : మచిలీపట్నం శివారుల్లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో సీటు వస్తే చాలు విద్యార్థులు సంబరాలు చేసుకుంటారు. అంతటి చరిత్ర గల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదివే ఓ విద్యార్థిని 15 రోజుల కిందట ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ సైతం రాసింది. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం రూరల్ మండలంలోని ఓ విద్యార్థిని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. గత నెల రెండో వారంలో సహా విద్యార్థిని కోరిక మేరకు ఆమె రాసిచ్చిన లేఖను ఓ విద్యార్థికి అందజేసింది. ఈ విషయం అధ్యాపకులకు, యాజమాన్యానికి తెలిసింది. ఇద్దరు ప్రేమికుల మధ్య రాయభారం నడిపిందన్న కారణం చూపుతూ.. ఆమె పేరును నోటీసు బోర్డుకెక్కించారు. అంతటితో ఆగకుండా ఆ యువతిని క్లాసు క్లాసుకు తిప్పి.. ఆమె చేసిన తప్పిదాన్ని సహ విద్యార్థులందరికీ వివరించి అవమానించారు. టీసీ ఇస్తామంటూ బెదిరింపులు.. తల్లిదండ్రులను పిలిపించి టీసీ ఇచ్చి పంపించేస్తామంటూ బెదిరించారు. అప్పటికే తమ కుమార్తెకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు టీసీ ఇవ్వాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మానసిక వేదనకు గురైన ఆ విద్యార్థిని 15 రోజుల కిందట ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయకుండా మౌనం దాల్చారు. కేసు ఎందుకు నమోదు చేయలేదు? స్థానికంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం పోలీసులకు ఎందుకు తెలియలేదు? ఒకవేళ తెలిస్తే కేసు నమోదు చేయకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది. పైగా విద్యార్థిని సూసైడ్ నోట్ ఏమైంది.? కుమార్తె మరణించినా తల్లిదండ్రులు ఎందుకు మౌనం దాల్చారు? అసలు విషయాలు బయటకు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? అన్నవి తేలాల్సి ఉంది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తునాయి. పోలీసులకు విషయం తెలిసినా కేసు నమోదు చేయకుండా అటు తల్లిదండ్రులకు.. ఇటు కళాశాల యాజమాన్యానికి రాజీ కుదర్చడం.. రూ.లక్షలు చేతులు మారడంతోనే ఈ విషయం వెలుగులోకి రాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మృత్యువులోనూ వీడని స్నేహం
కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ఆ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.. కలిసి బడికి వెళ్ళారు... కలిసి ఆడుకున్నారు... కలిసే పెరిగారు... ఎక్కడి వెళ్ళినా కలిసే వెళ్లేవారు. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా కలిసే పాల్గొనేవారు. ఒకరంటే ఒకరికి నమ్మకం... అలాంటి ఆ స్నేహితులకు మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. క్షణాల్లో వారిపైకి దూసుకువచ్చింది. అప్పటి వరకు ఏమరుపాటుగా ఉన్న ఆ ముగ్గురూ ఎదురుగా వచ్చిన మృత్యువును చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయవిదారకర ఘటన బందరు మండలం చిన్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బందరు మండలం వాడపాలెం పంచాయతీ శివారు వెంకటదుర్గాంబపురానికి చెందిన ఒడుగు కుమార్స్వామి, మోకా సహదేవుడు (19), ఒడుగు సాయికుమార్ (20) స్నేహితులు. కుమార్స్వామి కృష్ణా యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. సహదేవుడు పవిత్ర డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు. సాయికుమార్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం చేపల చెరువుపై ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. చిన్ననాటి స్నేహితులైన వీరు ముగ్గురూ ఎక్కడికైనా కలిసే వెళ్తుంటారు. సహదేవుడికి ఎగ్జామ్ ఉండటంతో బుధవారం బైక్పై ముగ్గురూ బందరు బయలుదేరారు. చిన్నాపురం శివారు శ్మశానం సమీపంలోని మలుపు వద్ద భీమవరం నుంచి కోన చేపల చెరువు వద్దకు వెళ్తున్న లారీ వేగంగా వారి బైక్పైకి దూసుకువచ్చింది. అకస్మాత్తుగా లారీ మీదకు దూసుకురావటంతో కుమార్స్వామి బైక్ను తప్పించే ప్రయత్నం చేశాడు. అప్పటికే లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సహదేవుడు, సాయికుమార్లకు రోడ్డు దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయారు. బైక్ నడుపుతున్న కుమార్స్వామి కాళ్ళు, చేతులకు బలమైన గాయాలై రోడ్డు పక్క పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి.. స్థానికులు 108కు ఫోన్ చేసి ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సహదేవుడు, సాయికుమార్ క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. కుమారస్వామి కొనఊపిరితో కొట్టుకుంటుండగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కదిలొచ్చిన రెండు గ్రామాలు.. విషయం తెలుసుకున్న వెంకటదుర్గాంబపురం, పోలాటితిప్ప గ్రామస్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. చేతికి అందిన బిడ్డలు శవాలుగా మారటాన్ని చూసిన తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు సైతం బోరున విలపించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. చిన్నాపురంలోని ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకోవాలని బందరు రూరల్ పోలీసులకు సూచించారు. ఆయనతోపాటు బందరు డీఎస్పీ మహబూబ్బాషా, బందరు రూరల్ సీఐ బి. రవికుమార్ ఉన్నారు. నాయకుల పరామర్శ.. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల బంధువులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఎల్ ఎన్ ప్రసాద్, ఇతర నాయకులు ఉన్నారు. -
విద్యార్థుల గ్యాంగ్ వార్
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ఆడుతూ..పాడుతూ చదువుకోవాల్సిన వయసులో స్కూల్ విద్యార్థులు గ్యాంగులుగా ఏర్పడి తోటి వారిపై దాడిచేసి గాయపరచిన ఘటన విజయవాడ వన్టౌన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్కు నాయకుడిగా చెప్పుకుంటున్న విద్యార్థి తన స్నేహితుల సాయంతో షార్ప్నర్ బ్లేడ్తో దాడిచేసి ఐదుగురు విద్యార్థుల చేతులను గాయపరిచాడు. వన్టౌన్ కేటీ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ఈ ఘటన కొద్దిరోజుల కిందట చోటుచేసుకుంది. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని స్నేహితుల వద్ద చెప్పాడు. ఆ మాట చివరకు స్కూల్లో అందరికీ తెలియడంతో బాలిక చదువుతున్న తరగతిలోని విద్యార్థులు ఆ బాలుడిని ప్రశ్నించారు. అంతే కాకుండా విషయాన్ని 9వ తరగతి స్కూల్ టీచర్కు తెలియజేశారు. ఈ విషయంపై విద్యార్థిని మందలిండచంతోపాటు మరో మారు ఇటువంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన ప్రేమ వ్యవహారం బయటకు రావడానికి కారణమైన 8వ తరగతి విద్యార్థులపై కక్షతో 9వ తరగతి విద్యార్థి ఓ గ్యాంగ్ను తయారు చేశాడు. 8వ తరగతి విద్యార్థులను పట్టుకుని చేతులపై షార్ప్నర్ బ్లేడ్ సాయంతో గాయపరిచారు. విషయం ప్రిన్సిపాల్కు చేరడంతో గ్యాంగ్ను ఏర్పాటు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఓ విద్యార్థి తండ్రి ఘటనపై ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొత్తపేట ఎస్ఐ తిరుపతిరావు స్కూల్కు వచ్చి ఆరా తీశారు. అయితే ఘటనపై పోలీసులకు రాత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో మరో మారు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి తెలిపినట్లు కొత్తపేట సీఐ జె.మురళీకృష్ణ చెప్పారు -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
కృష్ణాజిల్లా, ఎర్రబాలెం(మంగళగిరి): మండలంలోని ఎర్రబాలెంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బండివారి వీధి సెంటర్లో ప్రధాన రహదారి వెంట ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం నగదు చోరీ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి చొరబడి సీసీ కెమెరాలను పగులకొట్టారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పథకం ప్రకారమే హత్య!
కృష్ణాజిల్లా, కోడూరు (అవనిగడ్డ) : కోడూరు 14వ నెంబర్ పంట కాల్వలో కనిపించిన గుర్తు తెలియని మృతదేహం విజయవాడకు చెందిన గాదె బాజిరెడ్డి (35) దిగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం బాజిరెడ్డి మృతదేహం కాల్వ వెంట కోడూరుకు కొట్టువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికల్లో కథనాలు చూసిన బంధువులు ఇక్కడకు వచ్చి మృతుడు బాజిరెడ్డిగా వారు నిర్థారించారు. ఫైనాన్స్ దగ్గర మొదలైన వివాదం.. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయవాడ రాణిగారితోటకు చెందిన రామలింగారెడ్డి – తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న వాడైన బాలకిషోర్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా, బాజిరెడ్డి గుంటూరులోని వెంకట ధనలక్ష్మి ఆటో ఫైనాన్స్లో పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. బాజిరెడ్డికి 11 ఏళ్ల క్రితం బాలకోటేశ్వరితో వివాహం కాగా, వీరికి వెంకటసాయి మణిదీప్రెడ్డి (7) అనే కుమారుడు ఉన్నాడు. రెండు నెలల కితం బాజిరెడ్డి ఆటో ఫైనాన్స్ ద్వారా తమ గ్రామానికి చెందిన కుర్రా లక్ష్మణరావుకు ఫైనాన్స్లో ఆటోను ఇప్పించాడు. అయితే లక్ష్మణరావు కిస్తీలు సక్రమంగా జమ చేయలేదు. దీంతో లక్ష్మణరావును ఆటో తిరిగి ఇచ్చేయాలని బాజిరెడ్డి కోరాడు. లక్ష్మణరావు ససేమిరా అనడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం లక్ష్మణరావు నేరుగా బాజిరెడ్డి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఆ సమయంలో వీరి మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. అడ్డు వచ్చిన బాజిరెడ్డి తల్లి తిరుపతమ్మకు కూడా గాయాలయ్యాయి. వివాహేతర సంబంధం కూడా కారణమేనా?.. బాజిరెడ్డికి యనమలకుదురు లాకులు సమీపంలోని లక్ష్మీదుర్గాభవానితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బంధువులే చెబుతున్నారు. అయితే ఆమెకు రాణిగారి తోటకు చెందిన జినుపల్లి దుర్గారావుతో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు బాజిరెడ్డి కుటుంబసభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో బాజిరెడ్డి, దుర్గారావు తరచూ ఘర్షణ పడేవారు. అయితే 15 రోజుల క్రితం బాజిరెడ్డి తనని కొడుతున్నాడంటూ దుర్గాభవాని యనమలకుదురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదంతా జరుగుతుండగా ఈ నెల 25న బాజిరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కృష్ణలంక పీఎస్లో ఫిర్యాదు చేశారు. హత్య చేశారంటూ బంధువుల ఆరోపణ.. ఆటో ఫైనాన్స్ డబ్బులు కట్టమని అడిగినందుకు లక్ష్మణరావు, అతని తల్లి ఆవులమ్మ, లక్ష్మీదుర్గాభవాని, దుర్గారావు సహాయంతో బాజిరెడ్డిని హత్య చేసి కాల్వలో పడవేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ జరిగినప్పుడు పీఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీం తో తమ కుమారుడు హత్యకు గురయ్యాడంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. అభం శుభం తెలియని తన కుమారుడికి తండ్రి లేకుండా చేశారంటూ బాలకోటేశ్వరి ఘటనా స్థలిలో రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం.. బాజిరెడ్డి మృతదేహాన్ని కోడూరు వీఆర్వో వేణగోపాలరావు ఫిర్యాదు మేరకు కాల్వలో నుంచి పోలీస్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. ఘటన కృష్ణలంక పీఎస్కు సంబంధించింది కావడంతో వారికి కేసును రిఫర్ చేసినట్లు ఇక్కడి ఎస్ఐ ప్రియకుమార్ చెప్పారు. దీంతో కృష్ణలంక ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రి సూపరింటెం డెంట్ కృష్ణదొర ఘటపా స్థలంలోని మృతదేహా నికి పోస్టుమార్టం నిర్వహించారు. కొన్ని అవయవ భాగాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిం చారు. అనుమానాస్పద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, మృతుడి బైక్ యనమలకుదురు లాకుల వద్ద ఉన్నట్లు సమాచారం. -
లంకల్లో పోలీసుల తనిఖీలు
కృష్ణాజిల్లా, యనమలకుదురు (పెనమలూరు) : యనమలకుదురు కృష్ణా నది లంకల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడకు కొందరు వ్యక్తులు వచ్చి కోడి పందేలు, పేకాట, మద్యం సేవించి నదీ పరివాహక ప్రాంతంలో హడావుడి చేస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో ఆది వారం లంకల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేశా రు. యనమలకుదురు లంక కృష్ణా నది ఏటిపా య సమీప ప్రాంతం కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులకు అడ్డాగా మారింది. ఇక్కడ భారీగా కోడి పందేలు, పేకాట ఆడుతున్నారు. లంకల్లోకి పోలీ సులు తనిఖీలకు వస్తే సమాచారం ఇచ్చేందు కు పేకాటరాయుళ్లు నది ఒడ్డున ఇన్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులు వస్తున్న సమాచారం తెలియగానే తప్పించుకుంటున్నారు. కాగా ఆదివారం కూడా లంకల్లో పేకాట, కోడి పందేలు ఆడుతున్నారని సమాచారం రావటంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సమాచారం మందుగానే తెలుసుకున్న జూదరులు తప్పించుకున్నారు. అయితే పోలీసుల తనిఖీల్లో భారీగా మద్యం ఖాళీ బాటిల్స్ కనిపించటంతో కంగుతిన్నారు. ఇకపై ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని సీఐ దామోదర్ తెలిపారు. -
ఐదుగురు పాత నేరస్తుల అరెస్టు
విజయవాడ : వేర్వేరు కేసులో ఐదుగురు పాత నేరస్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్షలాది రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను బందర్ రోడ్డులోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ రాజకుమారి వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. సీసీఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు బీసెంట్ రోడ్డు పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పలు దొంగతనం కేసుల్లో పాత నేరస్తులైన ఇద్దరు నిందితులు రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకుని పక్కనే ఉన్న వ్యక్తులు ఏమరుపాటులో ఉండగా బ్యాగులు కత్తిరించటం, పర్సులు అపహరించటం చేస్తుంటారు. వీరు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన దేవర శాంతకుమారి, దేవర సువార్త పాత నేరస్తులుగా గుర్తించారు. వీరి నుంచి 19 కేసులకు సంబంధించి రూ.7 లక్షల విలువగల బంగారు ఆభరణలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6, టూ టౌన్ ఏరియాలో 1, గవర్నర్పేటలో 1, సత్యనారాయణపురం ఏరియాలో 4, కృష్ణలంక పరిధిలో 4, నున్న పోలీస్ స్టేషన్ ఏరియాలో 1, పటమట ఏరియాలో 1, ఉయ్యూరులో 1.. మొత్తం 19 నేరాలకు పాల్పడినట్లు డీసీపీ వివరించారు. పైకేసుల్లో నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఇంటి దొంగతనాలకుపాల్పడిన ఇద్దరు అరెస్టు.. కాగా, వేర్వేరు కేసుల్లో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో ఇద్దరు నిందితులను సీసీఎస్ సిబ్బంది అరెస్టు చేశారని ఆమె చెప్పారు. సోమవారం మాచవరం, గవర్నర్పేట ఏరియాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. విజయవాడ గిరిపురానికి చెందిన సత్తా సుధాకర్, తోట శివనాగరాజులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు కేసులకు సంబంధించి రూ.3.24 లక్షలు విలువగల 122 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీలు మక్చుల్, వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. మరో పాత నేరస్తురాలి అరెస్టు.. ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రాంతాల్లో బస్సులు, ఆటోల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తోటి ప్రయాణీకుల బ్యాగులు కోసి బంగారు ఆభరణలు అపహరించిన ఓ మహిళా పాత నేరస్తురాలిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి ఏడు కేసుల్లో రూ.6 లక్షల విలువ చేసే 164 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీదు మండలం శివాపురం గ్రామానికి చెందిన ద్వారకాచర్ల గిరిజాకుమారి అనే పాత నేరస్తురాలు నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకుని విచారించారు. ఆమె నగరంలోని వన్ టౌన్, గవర్నర్పేట, కృష్ణలంక ఏరియాల్లో 7 దొంగతనాలకు పాల్పడింది. ఈ కేసుల్లో రూ.6 లక్షల విలువ గల బంగారు ఆభరణలను స్వాధీనం చేసుకున్నారు. -
బైక్ను ఢీకొన్న కారు : ఇద్దరు విద్యార్థుల మృతి
కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ) : బైక్ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన ఆదివారం కంచికచర్ల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రికి చెందిన బొడ్డు ఉమేష్ (17) పరిటాల అమ్రితసాయి ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కన్నా మహేష్ అదే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరు ఆదివారం బంధువులను చూసేందుకు ఫెర్రి నుంచి బైక్పై కునికెనపాడు గ్రామానికి వెళ్లారు. కొంతసేపు బంధువులలో మాట్లాడి అనంతరం అదేరూట్లో తిరిగి ఇంటికి బయలుదేరారు. మండలంలోని నక్కలంపేట సమీపంలోకి రాగానే విజయవాడ వైపు నుంచి హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ఉమేష్ అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసమని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డీ చంద్రశేఖర్ తెలిపారు. ఫెర్రీలో విషాదచాయలు ఇబ్రహీంపట్నం (మైలవరం) : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. కంచికచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందటంతో ఆ కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిలింది. గ్రామానికి చెందిన బొడ్డు ఉమేష్వర్మ, కన్నా మహేష్ చిన్ననాటి నుంచి స్నేహంతో మెలిగారు. విధి వంచనతో మృత్యువులో కూడా ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కన్నా రామయ్య తాపీ పనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులను చదివిస్తున్నాడు. కంచికచర్ల అమృతసాయి కళాశాలలో పెద్ద కుమారుడు మహేష్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చుట్టపుచూపుగా బంధువుల ఇంటికెళ్లి ప్రమాద రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మరో వ్యక్తి బొడ్డు నాగార్జున స్థానిక ఎన్టీటీపీఎస్లో రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు ఉమేష్వర్మ అమృతసాయి కళాశాలలో డిప్లమో సెకండ్ ఇయర్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులై ఆదుకుంటారని భావించిన తల్లిదండ్రులను విద్యార్థుల మరణవార్త విషాదంలోకి నెట్టింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ కుటుంబాల సభ్యులను ఓదార్చటం ఎవరితరం కావటం లేదు. -
తొమ్మిది నెలల గర్భిణిని చంపిన భర్త
కృష్ణాజిల్లా, గన్నవరం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతని వివాహేతర సంబంధం విషయమై గట్టిగా ప్రశ్నించినందుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి హతమార్చా డు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు గ్యాస్ ట్రబు ల్తో భార్య చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇది స్థానిక ఉపాధ్యాయనగర్లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఈడే రాణి (24) మర్డర్ మిస్టరీ. తనకన్నా రెండేళ్ళు పెద్దదైన రాణిని ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న భర్త ఈడే వెంకటరాంప్రసాద్ అత్యంత కర్కశంగా హత్య చేసిన విషయం సంచలం సృష్టించింది. నాలుగేళ్ల క్రితం వివాహం జరిగినప్పటికి వీరి మధ్య తరచూ మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఏడాదికి పెద్ద మనుషుల పంచాయితీతో విడిపోయారు. అయితే రెండు నెలలు తర్వాత తిరిగి కలుసుకుని కాపురం చేసుకుంటున్నప్పటికి రాంప్రసాద్ వివాహేతర సంబం ధం విషయమై వీరి మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది నెలలు నిండిన గర్భిణి అయిన ఆమెకు ఈ నెల 10వ తేదీ డెలివరీ డేట్గా వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన భర్తను రాణి గట్టిగా నిలదీయడంతో వీరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన రాంప్రసాద్ నిండు గర్భిణీని గోడ వైపునకు నెట్టి చేతి వేలిముద్రలు పడకుండా నైటీతో ఆమె గొంతును నులిమి చంపేశాడు. అనంతరం తెలివిగా భార్య గ్యాస్ ట్రబుల్తో చనిపోయిందని ఆమె బంధువులకు కబురు చేయడంతో పాటు అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి చేసిన హత్యను స్వయంగా రాంప్రసాదే అంగీకరించడంతో పోలీసులు అతనిపై మర్డర్ కేసు నమోదు చేశారు. మృతురాలికి ఆదివారం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఆమె కడుపులో మృతి చెందిన తొమ్మిది నెలల ఆడ శిశువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో రాణితో పాటు మరో ఐదు రోజుల్లో భూమి మీదకు రానున్న శిశువు కూడా అసువులు బాయడం అందరిని కలచివేసింది. -
ప్రతిభను గుర్తించలేదని విద్యార్థిని ఆత్మహత్య
కృష్ణాజిల్లా, చాట్రాయి : ప్రతిభకు తగిన గుర్తింపు పొందనందుకు మనస్థాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాట్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుచ్చకాయల మంజు (17) చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి పరీక్షా ఫలితాల్లో 10కి 10 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం చాట్రాయి వికాస్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా అవార్డుల్లో తన పేరు లేకపోవడం, ట్రిపుల్ ఐటీలో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది గురువారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి పుచ్చకాయల రఘుపతిరెడ్డి సేద్యం పనులు చేస్తుంటారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు స్థానికంగా 9వ తరగతి చదువుతున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె విగతజీవురాలై కనిపించడంతో తల్లిదండ్రులు తీరనిదుఃఖంలో మునిగిపోయారు. పోలీసులకు సమాచారాన్ని అందించారు. -
కొట్టి చంపేశాడు!
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : పెళ్లై 26 ఏళ్లు గడిచినా ఆ అభాగ్యురాలు ఒక్కరోజూ సంతోషంగా గడిపింది లేదు.. మూడు ముళ్ళు వేయించుకున్నందుకు పెళ్లైన రోజు నుంచి కన్నుమూసే క్షణం వరకు భర్త వేధింపులను భరిస్తూనే వచ్చింది.. కట్టబెట్టిన పాపానికి భర్తను వదిలేయమని కన్నవాళ్ళు ఎన్నిసార్లు ప్రాధేయపడినా వివాహ బంధానికి విలువనిచ్చి దశాబ్దాలపాటు అతనితోనే అడుగులు వేసింది.. చివరికి అదే దుర్మార్గుడి పైశాచికానికి ఆ అభాగ్యురాలు బలైపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన ఈ నెల 1వ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చోటు చేసుకోగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమాయకురాలిని విచక్షణారహితంగా కొట్టి చంపిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.దీనికి సంబంధించిన వివరాలను గురువారం టౌన్ సీఐ కె. వాసవి మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వ్యసనాలకు బానిసై.. మచిలీపట్నం రామానాయుడుపేటకు చెందిన కురుచేటి త్రివిక్రమశ్రీనివాసప్రసాద్ వెండి వ్యాపారం చేస్తుంటాడు. ఏలూరుకు చెందిన శివనాగకనకరాజకుమారి (40)తో 1996లో పెద్దల సమక్షంలో పెళ్లైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు నిఖిల్ విజయవాడలో సీఏ చదువుతున్నాడు. కుమార్తె మౌనిక పంజాబ్లో ఎంబీఏ చదువుతోంది. ఇదిలా ఉండగా పెళ్ళైన నాటికే వ్యసనాలకు బానిసైన శ్రీనివాసప్రసాద్.. రాజకుమారిని నిత్యం వేధిస్తూ ఉండేవాడు. రోజూ మద్యం సేవించి ఆమెతో ఘర్షణ పడుతుండేవాడు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండేవాడు. అది నచ్చని రాజకుమారి తల్లితండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని అతనిని పలుమార్లు వేడుకున్నారు. అనేకమార్లు పంచాయితీలు పెట్టారు. అయినా మార్పు రాలేదు. అతని పైశాచికాన్ని భరించలేక, కూతురు జీవితాన్ని కాపాడుకోవాలనే తపనతో ఆ తల్లితండ్రులు భర్తను వదిలేసి వచ్చేయమని పలుమార్లు బతిమలాడారు. అయినా ఆమె 26 ఏళ్లుగా భరిస్తూ అతనిని అంటిపెట్టుకునే ఉంది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు. శ్రీనివాసప్రసాద్ వేధింపులు భరించలేని రాజకుమారి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది, రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో కొంత కాలం శ్రీనివాసప్రసాద్ భార్యతో సజావుగా మెలిగాడు. తిరిగి సైకోలా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. పరువు తీశావంటూ కక్ష సాధింపు చర్యలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శ్రీనివాసప్రసాద్ ఆమెపై మరింత కక్ష పెంచుకున్నాడు. చదువుల నిమిత్తం పిల్లలు ఇద్దరు వేర్వేరు చోట్ల ఉండటం, రెండు నెలల క్రితం అతని తల్లి కాలం చేయటంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్యపై శ్రీనివాసప్రసాద్ వేధింపులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఆమెను విచక్షణారహితంగా చితకబాదాడు, అతని దెబ్బలకు ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రెండు గంటల పాటు ఇంట్లో శవాన్ని ఉంచిన అతను సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళగా రాజకుమారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శవాన్ని ఇంటికి తీసుకువచ్చి మెట్లపై జారి పడి చనిపోయిందంటూ పిల్లలకు, బంధువులకు చెప్పి నమ్మించాడు. అనుమానంతో కేసు పెట్టిన కుమారుడు.. తల్లి మరణవార్త విని చలించిపోయిన కొడుకు అఖిల్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ముందు రోజు వరకు బాగానే ఉన్న తల్లి ఒక్కసారిగా చనిపోవటం ఏంటనే అనుమానం వచ్చింది. పైగా తండ్రి ప్రవర్తనపై అనుమానం ఉన్న అఖిల్ తల్లి శవాన్ని పరీక్షగా చూశాడు. ఆమె ఒంటిపై రక్తపు గాయాలు కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాసప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ వాసవి తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో మచిలీపట్నం, ఆర్పేట ఎస్సైలు దుర్గాప్రసాద్, హబీబ్బాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కూతుర్ని ప్రేమించాడని..
కృష్ణలంక(విజయవాడ తూర్పు): తన కూతురును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడితోపాటు అతని స్నేహితుడిని అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి యత్నించి పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కిడ్నాప్ ఘటన ఈ నెల 16న జరగ్గా పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను 17న అరెస్టు చేశారు. కోరువాడ శ్రీనివాసరావు జెంట్స్ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ విజయవాడ చుట్టుగుంటలో నివాసముంటున్నాడు. కొడుకు నాగసాయి నూజివీడులోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ప్రసాదంపాడుకు చెందిన వడ్ల శ్రీనివాసరావు కుమార్తె, నాగసాయి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తండ్రి తన కూతురును, నాగసాయిని మందలించాడు. నాగసాయి తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని’ హెచ్చరించాడు. నాగసాయిని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన యువతి ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నాగసాయి అమ్మాయికి ఫోన్ చేయగా.. తాను అమ్మవారి గుడివద్ద ఉన్నానని తెలియజేయడంతో నాగసాయి, అతని స్నేహితుడు మణిదీప్, తండ్రి కలసి అక్కడకు వెళ్లి అమ్మాయిని తీసుకుని ఆమె తండ్రికి ఫోన్చేసి సమాచారమిచ్చారు. ఇదంతా చేసింది నాగసాయేనంటూ దుర్భాషలాడుతూ అమ్మాయి తండ్రితోపాటు మరికొంతమంది యువకులు అతడిని ఇష్టానుసారంగా కొట్టారు. అంతటితో ఆగకుండా నాగసాయితోపాటు అతని స్నేహితుడిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అబ్బాయి తండ్రి కోరివాడ శ్రీనివాసరావు తన కొడుకును కొంతమంది కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారధి వద్ద కారును గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు దాన్ని అడ్డగించి కృష్ణలంక పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నాగసాయి, అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు, తల్లి చంద్ర, సుబ్రమణ్యం, వేణు, శివ, జగదీష్, రూపేష్సాయి, సాయివివేక్, ధీరజ్లను అరెస్టు చేశారు. -
నిన్ను ప్రేమించాను.. నన్ను పెళ్లి చేసుకో
కృష్ణాజిల్లా, కొణిజెర్ల (గంపలగూడెం) : కొణిజెర్లలో మంగళవారం రాత్రి మృతి చెందిన ఝాన్సీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, అదే సామాజిక వర్గానికి చెందిన వారు బుధవారం ఆందోళనకు దిగారు. మృతురాలు ఝాన్సీని వేధింపులకు గురిచేసిన నంభూరి గోపి ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కాగా గ్రామ పెద్దలు, యాదవ సంఘం నాయకులు కలిసి రాజీ చేయడంతో బుధవారం సాయంత్రం ఆందోళనకారులు ఆందోళన విరమించారు. సంఘటనకు దారితీసిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘నేను నిన్ను ప్రేమించాను.. నన్ను పెళ్లి చేసుకో’ అంటూ గోపి కొంతకాలంగా వెంటబడి వేధిస్తూ బెదిరింపులకు సైతం పాల్పడిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఝాన్సీ మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనపై మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జోనెబోయిన శ్రీనివాసరావు ద్వితీయ కుమార్తె జోనెబోయిన ఝాన్సీ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తోటమూలలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఆమె డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. రెండేళ్లుగా కొణిజెర్లకు చెందిన నంభూరి గోపి యువతి వెంటపడుతున్నాడు. ప్రతి రోజులాగే ఝాన్సీ మంగళవారం కళాశాలకు వచ్చి క్లాసులు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గంలో గోపి అడ్డగించి వేధించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. బస్ ఎక్కిన తర్వాత కూడా అందరూ చూస్తుండగానే మళ్లీ ఝాన్సీని కొట్టాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఝాన్సీ పొలానికి బండిమీద వెళుతుండగా బీసీ కాలనీ వద్ద కలిసి తనను పెళ్లి చేసుకోమని లేకుంటే తన కుటుంబ సభ్యులను కూడా చంపుతానంటూ బెదరించాడు. ఈ పరిస్థితిలో ఝన్నీ పొలం వద్ద పురుగుల మందు తాగి తిరిగి బైక్పై వస్తూ కిందపడిపోయింది. అటుగా వెళుతున్న వారు చూసి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. తన కుమార్తె మరణానికి నంభూరి గోపి వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ షాకీరున్నీసాబేగం, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సోమేశ్వరరావు పంచనామా చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపింది. యుక్తవయస్సుకు వచ్చిన కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరై రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
వాట్సప్ చాటింగ్తో చీటింగ్
భవానీపురం (విజయవాడ పశ్చిమం): వాట్సప్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆ తరువాత చాటింగ్తో సన్నిహితమై చివరికి చీటింగ్ చేసిన ఘటనపై సోమవారం భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం మేరకు భవానీపురంలోని అట్కిన్సన్ స్కూల్ ప్రాంతంలో నాగేంద్రకుమార్, ప్రత్యూష దంపతులు నివసిస్తున్నారు. టీవీ సీరియల్స్లో నటించే రవికృష్ణ అనే వ్యక్తి ప్రత్యూషకు వాట్సప్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ప్రతి రోజూ చాటింగ్ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన రవికృష్ణ ఆమెకు ఫోన్చేసి తన స్నేహితుడికి ఆరోగ్యం బాగోక హాస్పటల్లో ఉన్నాడు కొంత డబ్బు కావాలని అడిగాడు. దీంతో ప్రత్యూష పోలిశెట్టి కసి అనే వ్యక్తి ఎకౌంట్లో రూ.10 వేలు జమ చేసింది. ఈ నెల 3వ తేదీన రవికృష్ణ మళ్లీ ఫోన్చేసి మరో రూ.10 వేలు కావాల్సి వచ్చిందని అడిగాడు. ఈ సారి కోన శివ అనే వ్యక్తి ఎకౌంట్లో డబ్బు వేయమని చెప్పటంతో ఆమె వేసింది. తిరిగి 4వ తేదీన ఫోన్ చేసి అర్జంట్గా రూ.30 వేలు కావాలి, మొత్తం రూ.50 వేలు త్వరలోనే పంపిస్తానని చెప్పాడు. అంత మొత్తం తన వద్ద లేవని ప్రత్యూష చెప్పటంతో నువ్వు నాతో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ చేసిన మెసేజ్లు తన వద్ద ఉన్నాయని వాటిని బయటపెడతానని ఆమెను బెదిరించాడు. తాను మోసపోయానని గుర్తించిన ఆమె భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మోహన్రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే కారణంతో పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. యువతి సాదం సంధ్య (20) మృతి చెందగా యువకుడు షేక్ సాదిక్ విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. సాధిక్ బీటెక్ పూర్తి చేశాడు. వీరిద్దరి కుల, మతాలు వేరు కావటంతో ఇరు వైపులా పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. సంధ్య తల్లిదండ్రులు ఆమెకు వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ బలవన్మరణానికి యత్నించారు. కృష్ణాజిల్లా, అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు): ప్రేమికులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. యువతి మృతి చెందగా యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ అవినాష్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సాదం సంధ్య (20), షేక్ సాధిక్ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సాధిక్ బీటెక్ పూర్తి చేయగా, సంధ్య పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. వీరిద్దరి మతాలు వేరు కావటంతో ఇంట్లో పెళ్లికి అంగీకరించలేదు. గురువారం రాత్రి కలుసుకున్న వీరిద్దరు పురుగుల మందు తాగి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. సాధిక్ ఇంట్లో వాంతులు చేసుకోవటంతో కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స కోసం విజయవాడ తరలించారు. సంధ్య అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. అయితే ఘటనపై కేసులు నమోదు చేసేందుకు ఇరు కుటుంబాలు ముందుకు రాలేదు. -
మహిళ దారుణ హత్య
భర్త చనిపోయి ఇంటిలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన పాయకాపురంలో గురువారం చోటుచేసుకుంది. అజిత్సింగ్నగర్(విజయవాడ సెంట్రల్): భర్త చనిపోయి ఇంటిలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన పాయకాపురంలో గురువారం చోటుచేసుకుంది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం పాయకాపురం పెట్రోల్బంకు పక్క రోడ్డుకు చెందిన కారుమూరి అంజలి దేవి(52)కి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోగా, పిల్లలిద్దరికి పెళ్లిళ్లు చేసి సమీపంలోనే వారికి రెండు ఇళ్లు ఇవ్వడంతో అప్పటినుంచి వారు వేరుగా ఉంటున్నారు. తనకున్న రెండంతస్తుల భవనంలో కింది గదులను అద్దెలకు ఇచ్చి భవనం పైభాగంలో ఆమె ఒక్కతే నివసిస్తుంది. అయితే బుధవారం రాత్రి ఇంటిపక్కన వారితో మాట్లాడి టీవీ చూసి నిద్రపోతానంటూ ఇంటిలోకి వెళ్లిపోయింది. అయితే గురువారం మధ్యాహ్నం అయినా కూడా ఆమె గదిలో నుంచి బయటకు రాకపోవడం, ఎంత పిలిచినా పలుకకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కన అద్దెకుంటున్న వారు తలుపులు పగలకొట్టి చూడగా ఇంటిలోని మంచంపై ఆమె విగతజీవిగా మారి కనిపించింది. బీరువాలోని దుస్తులన్నీ కిందపడేసి ఉండడం, ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురై ఉండడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. పాతనేరస్తులా.. తెలిసినవారి పనా..? సమాచారం అందుకున్న నున్న రూరల్ పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. బీరువాలో పెట్టిన 17 కాసుల బంగారం, కొంత నగదుతో పాటు మృతురాలి ఫోను కూడా మాయం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పాతనేరస్తులు చేసిన పనా, లేక ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ మహిళ హత్య విషయాన్ని తెలుసుకున్న డీసీపీ నవాబ్జాన్, నార్త్ జోన్ ఏసీపీ శ్రావణిలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి వివరాలు అడిగి తెలుసుకొని హత్యకు కారణాలపై సిబ్బందిని, స్థానిక ప్రజలను ఆరా తీశారు. హత్యకు కారణాలు తెలుసుకుంటున్నామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు. -
భార్యను కడతేర్చిన భర్త
కృష్ణాజిల్లా, రావిరాల (జగ్గయ్యపేట) : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను మందలించినా వినకపోవటంతో విసుగు చెందిన భర్త ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన మండలంలోని జయంతిపురం గ్రామ పంచాయతీ రావిరాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇనుపనుర్తి సుందర్రావు గ్రామంలోని సిమెంట్ కర్మాగారం మైనింగ్లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి 30 ఏళ్ల క్రితం వీరులపాడు మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కమలమ్మ (47) తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి వివాహాలు కూడా అయ్యాయి. అయితే కొన్ని నెలలుగా కమలమ్మ ఫోన్లో తరచూ మాట్లాడటం, కూలీ పని ఉందని బయటకు వెళ్తుండటంతో భర్త సుందర్రావుకు అనుమానం వచ్చి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గమనించి వారం రోజుల క్రితం భార్యను హెచ్చరించాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగటంతో కమలమ్మ పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం భర్త, కుమారుడు తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం పని నుంచి వచ్చిన సుందర్రావు ఇంట్లో భార్య లేకపోవటంతో పాటు కోడలు పుట్టింటికి వెళ్లటంతో డ్యూటీలో ఉన్న కుమారుడికి ఫోన్ చేశాడు. ‘మీ అమ్మ ఎక్కడకెళ్లింది’ అని అడిగాడు. కుమారుడు కూడా తెలియదని చెప్పాడు. రాత్రి 8 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లావని అడగటంతో రాత్రి ఒంటి గంట వరకు ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఆగ్రహించిన సుందర్రావు మంచంపై పడుకుని ఉన్న కమలమ్మను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఇనుప రాడ్డును అటకపై పడేసి తన ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఎస్ఐ దుర్గాప్రసాద్, సీఐ జయకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త నేరం అంగీకరించటంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పోలీసుల వైఖరికి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న తన భార్య ఆత్మహత్యకు కారణమైన సహ ఉద్యోగిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త గళ్ల నాగరాజు (34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న గల్లా నాగమణి (29), భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు వర్షిత్ (5), దీపేష్ (2) లతో కలిసి కృష్ణలంక బాలాజీనగర్లోని మొదటి లైన్లో నివాసముంటున్నారు. గత మార్చి 19వ తేదీ రాత్రి డ్యూటీ అనంతరం ఉదయం భర్త నాగరాజు నాగమణిని ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం పిల్లలను స్కూల్లో దించి కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి చూస్తే భార్య నాగలక్ష్మి బెడ్రూంలో చీరతో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని నిర్జీవంగా వేలాడుతూ కనిపిం చింది. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో కిం దికి దించి చూడగా అప్పటికే ఆమె చనిపోయింది. ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు అయితే భర్త నాగరాజు ఇటీవల లారీలు కొనుగోలు చెయ్యడంతో వ్యాపారంలో నష్టం వాటిల్లిందని, దీనిపై భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవలు జరుగుతున్నాయని, సున్నిత మనస్తత్వంగల నాగమణి దీని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, స్థానికులు, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో భార్యభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆమె మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉండవచ్చని, ఆ దిశగా దర్యాప్తు చెయ్యాలంటూ కోరారు. బాధితుడి ఫిర్యాదు బుట్టదాఖలు.. తన భార్య నాగలక్ష్మి మృతికి వన్ టౌన్లోని సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న సహ ఉద్యోగి జె.నాగరాజు వేధింపులే కారణమని భర్త పోలీసులకు చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేసి అనుమానితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. భార్య మృతి చెంది ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అందుకు కారణమైన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చావుకు గల కారణాలను తెలియజేస్తూ పోలీసు శాఖ డీజీపీకి సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నోటి నుంచి నురుగులు కక్కుతూ అపస్మారక స్థితిలో పడిన అతన్ని చూసి కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతన్ని నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పెళ్లికూతురిపై అనుమానం.. ఆగిన పెళ్లి
సాక్షి, కృష్ణజిల్లా : పెళ్లి పీటల దాకా వచ్చి చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన జిల్లాలోని తోట్లవల్లూరులో చోటు చేసుకుంది. పెళ్లి కూతురుపై అనుమానంతో చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పీటలపై నుంచి లేచిపోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే పామర్రు మండలం నిభానిపూడికి చెందిన నాగశ్రీనుకి తోట్లవల్లూరు వాసి దివ్యకు రెండు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. సెప్టెంబర్ 2న పెళ్లి కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం పెళ్లి పీటలకు వరకు వచ్చిన నాగశ్రీను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి కూతరు కుటుంబ సభ్యులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు వాళ్ల తల్లితండ్రులు మాటలు విని తనపై లేనిపోని అబాండాలు మోపి, అనుమానపడి పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోయాడని పెళ్లికూతురు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బంధువులతో కలిసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. -
విల్లు వీరుడికి కన్నీటి వీడ్కోలు!
కన్నా..బంగారుకొండ వంశీ పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు హాస్పటల్కి తీసుకెళ్తారురా? మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ తల్లి లక్ష్మీ ఎస్ఐ వంశీధర్ మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మాకు దిక్కెవరయ్యా..! అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పొగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ విలపించిన తీరు కలిచివేసింది. పేదరికాన్ని సైతం తన తెలివితేటలు, విలువిద్యతో జయించి లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న వంశీధర్ కేఈబీ కెనాల్లో గల్లంతయి శవమై తేలడంతో ఇస్మాయిల్బేగ్పేట బోరుమన్నది. వేలాది మంది ప్రజలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు విల్లు వీరుడు వంశీధర్కు కన్నీటివీడ్కోలు పలికారు. కోడూరు (అవనిగడ్డ) : కోడూరుకు చెందిన ఎస్ఐ కోట వంశీధర్ ఆదివారం కేఈబీ కెనాల్లో శవమై తెలడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఇస్మాయిల్బేగ్పేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం మధ్యాహ్నం తన తల్లి లక్ష్మికి విజయవాడలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోడూరుకు వస్తున్న వంశీధర్ ఘంటసాల మండల పాపవినాశనం దగ్గరకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి పల్టీ కొట్టిన సంగతి విదితమే. ఈ ఘటనలో తల్లి లక్ష్మి ప్రాణాలతో బయటపడగా ఎస్ఐ మాత్రం కాలువ ప్రవాహంలో గల్లంతయ్యారు. అయితే వంశీధర్ కోసం 15 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ శాఖాధికారులకు ఆదివారం ఉదయం 7 గంటల సమీపంలో అన్నవరం–మంగళాపురం కాలువలో వంశీధర్ మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ఐ గల్లంతైన ప్రాంతానికి మృతదేహం లభ్యమైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ శవపంచనామ అనంతరం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన ఇస్మాయిల్బేగ్పేటకు తీసుకెళ్లారు. ‘బంగారు కొండా పైకి లేవరా’..కలచివేసిన తల్లి రోదన కళ్ల ముందే కాలువలో కొట్టుకుపోయిన కుమారుడు శవమై ఇంటికి రావడంతో తల్లి లక్ష్మి రోదనను ఎవరూ ఆపలేకపోయారు. ‘బంగారుకొండా వంశీ.. పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు ఆస్పత్రికి తీసుకెళ్తారురా.. ఇంకా మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ లక్ష్మి కుమారుడు వంశీధర్ మృతదేహంపై పడి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఎస్ఐగా చేరిన తరువాత నిన్ను చూసి చాలా మంది గొప్ప కొడుకును కన్నావంటూ నన్ను మెచ్చుకున్నారు రా.. ఇప్పుడు హఠాత్తుగా మముల్ని వదిలి వెళ్లిపోతే మాకు దిక్కెవరు..’ అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పోగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ మృతదేహం ముందు కూర్చొని విలపించిన తీరు కలచివేసింది. గ్రామం నుంచి ఏకైక ఎస్ఐ.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కుమారులిద్దరికి ఉన్నత చదువులు చెప్పించారు. అయితే వంశీధర్కు చిన్నప్పటి నుంచి ఎస్ఐ అవ్వాలని ఆసక్తి ఉండడంతో దానిని జయించేందుకు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాడు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించాడు. అర్చరీ క్రీడతో పాటు గజఈ తగాళ్లకు పోటీగా ఈదేవాడు. ఇవన్నీ వంశీధర్కు ఎస్ఐ ఉద్యోగం వచ్చేందుకు దోహదపడ్డాయి. 2012లో ఎస్ఐగా విధుల్లో చేరిన వంశీధర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఇస్మాయిల్బేగ్పేట గ్రామం నుంచి ఎస్ఐ ఉద్యోగం సాధించిన ఏకైక వ్యక్తి వంశీధర్ మాత్రమే కావడంతో గ్రామస్తులు సైతం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఉద్యోగంలో చేరిన ఆరేళ్లకే వంశీధర్ ఇలా మరణించడం గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారిగా వం శీధర్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. కోడూరు : ఎస్ఐ కోట వంశీధర్ అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం కోడూరులో పోలీసు లాంఛనాల మధ్య నిర్వహించారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్ దళం ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించింది. చివరి వరకు అక్కడే ఉన్నవైఎస్సార్సీపీ నేత రమేష్బాబు.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబుకు వంశీధర్ వరుసకు మేనల్లుడు కావడంతో గల్లంతైన దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. తల్లిదండ్రులను ఓదారుస్తూ, వంశీధర్తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, విజయనగరం ఏఆర్ డీఎస్పీ బి.మెహర్, అవనిగడ్డ, రామచంద్రాపురం సీఐలు జేవీవీఎస్ మూర్తి, శ్రీధర్కుమార్, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, పెద్దాపురం, ఐనవోలు ఎస్ఐలు మణికుమార్, రాజారెడ్డి, ప్రియకుమార్, షణ్ముఖసాయి, భగవాన్, జాన్బాషాతో పాటు వివిధ స్టేషన్ల సిబ్బంది మృతదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కడవకొల్లు నరసింహరావు, పూతబోయిన చినవెంకటేశ్వరరావు, యూత్, టౌన్ కన్వీనర్లు యాదవరెడ్డి సత్యనారాయణ, బడే గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరా వు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల బసవయ్య, మాజీ సర్పంచి దాసరి విమల, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించినవారిలో ఉన్నారు. వంశీధర్కు ప్రత్యేక పోలీసు దళం నివాళి -
చెవులు చిల్లులు పడేలా బైక్ రైడ్లు..
బెజవాడలో బైకర్లు బీభత్సం సృష్టిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా రయ్..రయ్ మంటూ చెవులు చిల్లులు పడేలా బైకులపై దూసుకెళ్తూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ.. పొగలు విరజిమ్ముతూ నగర రహదారులపై నానా యాగీ చేస్తున్నారు. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తున్న కొందరు యువకులు కనీస నిబంధనలు పాటించకుండా నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిజేస్తున్నారు. మిన్ను విరిగి మీద పడేలా శబ్దం చేస్తూ ధ్వని కాలుష్యానికి కారకులవుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమకేమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరస్థాయిలో బైక్ రేస్లు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సాక్షి, అమరావతిబ్యూరో : చెవిలో కర్ణభేరి సైతం పగిలిపోయేంతలా శబ్దాలు చేస్తూ జనం బెంబేలెత్తేలా మోటర్ సైకిళ్లపై కుర్రాళ్లు వాయువేగంతో దూసుకుపోతున్నారు. సంపన్న వర్గాలకు చెందిన కొందరు యువకులు రూ.లక్షలు వెచ్చించి అత్యాధునిక బైక్లు కొనుగోలు చేస్తున్నారు. 550 సీసీ సామర్థ్యం ఉన్న వాహనాలు నడుపుతూ నగరంలో హల్చల్ చేస్తున్నారు. నగరంలో ద్విచక్రవాహనాలు 5,05,424 ఉంటే.. వాటిలో 150 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినవి సగానికి పైగా ఉన్నాయని సమాచారం. బెంజ్సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, రాఘవయ్యపార్కు, పంటకాలువ రహదారి ప్రాంతాల్లో అధిక శబ్దం చేసుకుంటూ ప్రయాణిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులే చెబుతున్నారు. చాలా చోట్ల ఫంక్షన్హాళ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకుంటున్న చర్యలు లేవనే విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా బందరు, ఏలూరు, 65 జాతీయ రహదారులపై ఉదయం, రాత్రి వేళల్లో బైక్రేస్లు నిర్వహిస్తూ యువకులు రెచ్చిపోతున్నారు. సైలెన్సర్లు మార్చేసి.. చాలామంది యువత తమ వాహనాలకు సైలెన్సర్లను మార్చేందుకు ఇష్టపడుతున్నారు. ద్విచక్రవాహనదారులు, కార్లు ఇతర వాహనదారులు కంపెనీతో వచ్చే సైలెన్సర్లను తొలగించి ప్రత్యేకంగా రూపొందించిన వాటిని అమర్చి ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్నారు. నగరంలో ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు వాటిని గుర్తించి పట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ ఏ పోలీసైనా అలాంటి వాహనదారులను నిలిపే ప్రయత్నం చేసినా.. వారు తేలిగ్గా తప్పించుకుంటున్నారు. వాస్తవానికి చట్టప్రకారం వారికి శిక్షపడేలా చేయాలన్నా.. శబ్ద కాలుష్యానికి పాల్పడే తీరును సాంకేతికంగా చూపాల్సి ఉంటుంది. ఆ సాంకేతిక పరికరాలు మన వద్ద లేకపోవడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. అందుకే నిర్లక్ష్య డ్రైవింగ్ అంటూ కేసులు పెడుతున్నారు. మోత మోగించినా... కేవలం వాహనాలే కాకుండా సౌండ్ బాక్సులు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేసే వాటిపైనా పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతానికి వివిధ పండగ కార్యక్రమాల సమయంలో, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల విషయంలో ఉపయోగించే డీజేలపై మాత్రమే పోలీసులు షరతులు పెట్టి అనుమతులిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం.. వాణిజ్య సముదాయ ప్రాంతంలో 65 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ధ్వని ఉండకూడదు. నివాస ప్రాంతాల్లో, ధ్వని రహిత ప్రాంతాల్లో 50 డెసిబుల్స్కు మించకుండా ఉండాలి. చెవులకు చిల్లులు పడేలా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు విజయవాడ కమిషనరేట్ పరిధిలో దాదాపు లేవనే చెప్పొచ్చు. శబ్ద కాలుష్య యంత్రాలేవి? నగరంలో శబ్దరహిత ప్రాంతాలుగా ఇప్పటికే ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఉన్నతస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నమోదు యంత్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాంటి యంత్రాలు లేని కారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను పట్టుకున్నా కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఉంది. పెద్దగా హారన్లు మోగించేవారిని గుర్తించి మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశమున్నా ట్రాఫిక్ పోలీసులు ఆ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం. -
పెట్రోలు బంకులో మీటరు మాయాజాలం!
గుణదల (విజయవాడ తూర్పు): నిత్యం వందలాది వాహనాలతో కిటకిటలాడే ఒక పెట్రోలు బంకులో మీటర్ మాయాజాలం బట్టబయలైంది. లక్షలాది రూపాయాలు అక్రమంగా దండుకుంటున్న వ్యవహారం శనివారం రాత్రీ గుణదలలోని పడవలరేవు పెట్రోలు బంకులో వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. పడవలరేవు కూడలివద్ద దాదాపు మూడు దశాబ్దాలుగా విజయలక్ష్మీ ఎంట్రర్ప్రైజెస్ పేరుతో పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న ఏలూరురోడ్డుపై ఈ పెట్రోలు బంకు ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వందలాదిగా వినియోగదారులు ఇక్కడ పెట్రోలు కొట్టిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ వినియోగదారుడు పెట్రోలు తీసుకుంటుండగా పంపు తీయగానే మీటర్ రీడింగ్ రూ. 14గా నమోదైంది. దీంతో తనకు పెట్రోలు ఇవ్వకుండానే మీటర్ రీడింగ్పై నగదు నమోదవ్వడాన్ని సదరు వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. ఇంతలో మరో వాహనచోదకుడికి ఇలాగే జరిగింది. పెట్రోలు బండిలో కొట్టకుండానే రూ.5 బిల్లు మానిటర్పై వచ్చేసింది. దీంతో వినియోగదారులకు బంకు సిబ్బందికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో మాచవరం ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వివరాలు సేకరించారు. గతంలో మూసివేత.... కల్తీ పెట్రోలు అమ్మకం, రీడింగ్లో అవకతవకల కారణంగా గతంలో రెండుసార్లు ఈ బంకుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అవకతవకలు బట్టబయలు కావటంతో రెండు సార్లు ఈ బంకు మూతపడింది. ఇటీవలే మరలా బంకును పునఃప్రారంభించారు. అదే తరహాలో మోసం బయటపడటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆందోళన చేసినా బంకు యాజమాన్యం రాకపోగా, పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు. -
పాశవిక హత్యాయత్నం !
జిల్లాలోని హనుమాన్జంక్షన్లో ఓ బ్యూటీషియన్పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు, మెడ కోశాడు. కాళ్లను వైర్తో కట్టేసి ఊడిపోకుండా ట్యాగ్లు వేశాడు. ముఖాన్ని కవర్తో ముసుగు వేసి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వాళ్లకు కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. హనుమాన్జంక్షన్ రూరల్ : హనుమాన్ జంక్షన్లో ఓ బ్యూటీషియన్పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. కాళ్లు కట్టేసి, చేతులను కత్తితో అత్యంత క్రూరంగా నరికి వేయటం, ముఖానికి పూర్తిగా కవర్ చుట్టి వేసిన అఘాయిత్యం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇరుగుపొరుగు వాళ్లకు ఆమె కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పైశాచికంగా హత్యాయత్నం చేశారు. మహిళ శరీరంపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచి శాడిజాన్ని చూపించారు. హత్యాయత్నం చేసిన వారు పరారైన తర్వాత బాధితురాలు రక్తపు మడుగులో దాదాపు 36 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజమండ్రికి చెందిన పల్లె పద్మ, సూర్యనారాయణలకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్న వీరు ఆ తర్వాత జంక్షన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సూర్యనారాయణకు ఉద్యోగం రావటంతో ఇక్కడకు మకాం మార్చారు. పద్మ కూడా ఏలూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంది. అప్పటి వరకూ సాఫీగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో భర్తతో విభేదించిన పద్మ కొద్దికాలంగా ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్ అనే వ్యక్తితో సహ జీవనం చేస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్లో పద్మ బ్యూటీషియన్గా పని చేస్తుండగా, నూతనకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో వీళిద్దరూ కలిసి అద్దెకు దిగారు. ఈ నెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గరే ఉంటున్న తన పెద్ద కూతురుతో ఫోన్లో పద్మ ఆ రాత్రే చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె తన తండ్రి సూర్యనారాయణకు విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు శనివారం ఉదయం వచ్చి తలుపులు తీయటంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. జంక్షన్ పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన 108 అంబులెన్స్లో పద్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికివేయటం, కాళ్లు రెండు వైర్తో కట్టేసి, మళ్లీ ఆ వైర్ ఊడిపోకుండా ట్యాగ్లు వేయటం, ముఖానికి కవర్తో ముసుగు వేయటం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల పైశాచికత్వాన్ని తెలియజేస్తున్నాయి. పద్మ పడి ఉన్న గదిలో ఇంజక్షన్లు, సిరంజన్లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశ్యంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా 24వ తేదీ ఉదయమే హత్యాయత్నం జరిగి ఉండవచ్చని ఘటనాస్థలిలో ఎండిపోయిన రక్తపు మరకలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ హత్యాయత్నంపై జంక్షన్ సీఐ వైవీవీఎల్. నాయుడు, ఎస్ఐ వి.సతీష్ ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పద్మతో కలిసి సహజీవనం చేస్తున్న ఏలూరుకు చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో ఆ అనుమానానికి మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ సహ జీవనం ప్రారంభించిన తర్వాత నూతనకుమార్ వ్యవహారంతో విసుగు చెందిన పద్మ గతంలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే నిందితుడిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
బైక్ ఇవ్వలేదని కుమార్తె ఆత్మహత్య
కృష్ణా ,కంకిపాడు: కోచింగ్కు బైక్పై వెళ్లేందుకు తండ్రి అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కోళ్ల శ్రీమంగాభవాని(20) బీఎస్సీ పూర్తి చేసింది. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్ కోసం విజయవాడ వెళుతోంది. ఈ క్రమంలో విజయవాడ వెళ్లేందుకు బైక్ కావాలని తండ్రి శ్రీనివాసరావును అడిగింది. అందుకు ఆయన అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలో కూరగాయలు ఇచ్చేందుకు శ్రీమంగాభవాని అన్నయ్య ఇంటికి వచ్చాడు. తలుపులు తెరుచుకోకపోవటంతో కిటికీలో నుంచి చూసేసరికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే విషయాన్ని స్థానికంగా ఇనుప దుకాణంలో ఉన్న తల్లిదండ్రులకు తెలియజేశాడు. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి భవానీ మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్ఐ షరీఫ్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికా డాలర్లకు కక్కుర్తి..
అమెరికన్ డాలర్లకు ఆశపడి ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మోసపోయిన ఘటన విజయవాడలోని పటమట దర్శిపేటలో వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి కోసం అమెరికన్ డాలర్లు పంపిస్తామని యూఎస్కే చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఆరు నెలల కిందట ఆ ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. దీంతో రూ.28 లక్షలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి మోసపోయాడు. ఆటోనగర్(విజయవాడ): ‘మా వద్ద రెండు లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి.. మీకు పెట్టుబడిగా ఆ డబ్బును సమకూరుస్తాం.. మీరు ఏదైనా వ్యాపారం మొదలెట్టండి.. లాభాల్లో మీకు వాటా ఇస్తాం..’ అంటూ ఓ రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగికి 6 నెలల కిందట అమెరికాకు చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఫేస్బుక్ వీడియో కాల్ వచ్చింది. ముందు వెనుకా ఆలోచించకుండా ఆ ఉద్యోగి ఆమె చెప్పిన విధంగా రూ. 28 లక్షలు వారు తెలిపిన అకౌంట్లో జమ చేశాడు. ఆ తరువాత అటువైపు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని శుక్రవారం పటమట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు ఫిర్యాదు పేర్కొన్నట్లుగా వివరాలు ఇలా ఉన్నాయి.. పటమట దర్శిపేట చెందిన వెంకట సత్యప్రసాద్ ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి. ఇతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఫేస్బుక్ వీడియో కాల్ వచ్చింది. తన వద్ద 2 లక్షల అమెరికా డాలర్లు ఉన్నాయని.. మీకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించుకోవచ్చని నమ్మబలికింది. దీంతో సత్యప్రసాద్ ఆమెతో పలు దఫాలు డాలర్ల విషయమై ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేయడం.. మాట్లాడం జరిగింది. ఆ తర్వాత అతనితో అమెరికాకు చెందిన మ్యాత్యు టేలర్తోపాటు అజయ్ అనే మరొ వ్యక్తి కూడా ఫోన్ ద్వారా పరిచయమయ్యారు. వారు ముగ్గురు కలిసి మీకు డబ్బులు పంపిస్తాం కానీ పెట్టుబడుల పెట్టే నిమిత్తం కొంత డబ్బు పన్ను రూపేణ చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. అకౌంట్ నెంబరు కూడా ఇచ్చింది. అన్నింటికీ అంగీకరించిన ఆ ఉద్యోగి పలు దఫాలుగా రూ. 28 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత వారి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడం.. ఫేస్బుక్ నుంచి కూడా చాటింగ్లు నిలిచిపోవడంతో ఆత్యాశకుపోయి ‘బుక్కయ్యాను’ అనుకున్న సత్యప్రసాద్ శుక్రవారం పటమట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కూలుకు డుమ్మా కొట్టేందుకు..
అమరావతి, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : స్కూల్కు డుమ్మా కొట్టేందుకు అక్కాతమ్ముడు ఓ కట్టు కథ అల్లారు. కొందరు యువకులు తమపై బ్లేడుతో దాడి చేశారంటూ చెప్పడంతో కథ కొంత సేపు రక్తికట్టింది. అయితే, అప్పటికే ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు ఘటనపై నిశితంగా దృష్టి సారించడంతో ఎక్కడో తేడా కొట్టినట్లైంది. దీంతో ఇద్దరినీ రకరకాలుగా విచారించడంతో అసలు వ్యవహారం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గురువారం అక్కాతమ్ముళ్లపై బ్లేడు దాడి జరిగిందన్న ఘటన కలకలం సృష్టించింది. ఈ దాడికి పాల్పడింది ఇరువురు యువకులు అంటూ అక్కాతమ్ముళ్లు చెప్పటంతో నిందితులను పట్టుకునేం దుకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లతో పాటు సందులు గొందుల్లో సైతం తిరిగారు. దాడికి పాల్పడిన యువకుల ఆచూకీ లభించకపోవటంతో పాటు అక్కాతమ్ముళ్లు చెప్పిన వివరాలపై నిశితంగా దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు చేసేదిలేక జరిగిన విషయాన్ని మీడియా ముందు పెట్టి ముక్కున వేలేసుకున్నారు. అక్కాతమ్ముళ్లు చెప్పిన కథనం ప్రకారం.. మచిలీపట్నం సర్కిల్పేటకు చెందిన చిలకలపూడి నగేష్, ఝాన్సీ భార్యభర్తలు. నగేష్ వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప రామకృష్ణ పబ్లిక్ స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాబు 8వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే గురువారం ఉదయం 9 గంటల సమయంలో అక్కాతమ్ముళ్లు స్కూలుకు బయలుదేరారు. స్కూలు సమీపానికి చేరుకున్న సమయంలో ఇరువురు యువకులు బుల్లెట్పై వచ్చి అక్కా తమ్ముళ్లపై బ్లేడుతో దాడి చేశారు. ఇరువురి ఎడమ చేతి మణి కట్టుపై గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. భయంతో అక్కాతమ్ముళ్లు ఇంటికి పరుగు పెట్టారు. జరిగిన విషయాన్ని తల్లి ఝాన్సీకి చెప్పారు. గాయాలపాలైన అక్కాతమ్ముళ్లను చికిత్స నిమిత్తం తల్లితండ్రులు హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కాతమ్ముళ్ల నుంచి వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఆ ప్రాంతంలో విద్యార్థులపై దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలుగానీ, సమాచారంగానీ పోలీసులకు చిక్కలేదు. దీంతో దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్కూలుకు బురిడీ కొట్టేందుకే.. విద్యార్థులపై జరిగిన బ్లేడు దాడికి సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం ఇనగుదురుపేట సీఐ ఎస్కే నభీ జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. బ్లేడు దాడిలో గాయపడిన అక్కాతమ్ముళ్లు పధకం ప్రకారం ఈ సాహసానికి ఒడిగట్టినట్లు తేలిందని సీఐ తెలిపారు. స్కూలుకు డుమ్మా కొట్టేందుకు తమ్ముడు ఇచ్చిన సలహా మేరకు ఇరువురు ఈ సాహసానికి తెగించినట్లు చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరిన అక్కాతమ్ముళ్లు స్కూలు సమీపంలో బ్యాగులోని పదునైన వస్తువుతో ఒకరి చేతులు ఒకరు కోసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేవలం స్కూలు ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఈ అనాలోచిత సాహసానికి ఒడిగట్టారే తప్ప బ్లేడు బ్యాచ్ దాడి, యువకుల దాడి కాదని తేల్చి చెప్పారు. తల్లితండ్రులు, పోలీసులు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై ఈశ్వర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్కూలుకు డుమ్మా కొట్టేందుకు విద్యార్థులు ఇంతటి సాహసానికి ఒడిగట్టడమంటే అనుమానించాల్సిన విషయమేనంటూ పోలీసుల వివరణపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియురాలి భర్తపై హత్యాయత్నం
గుంటూరు, తెనాలిరూరల్: వివాహేతర సంబంధానికి ప్రియురాలు ఒప్పుకోకపోవడానికి ఆమె భర్తే కారణమని భావించిన ప్రియుడు అతడిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో భర్త చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణ రజకచెరువు ప్రాంతానికి చెందిన దామిశెట్టి రమేష్ వెండి బంగారు వర్తక సంఘంలో అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. అతడి భార్యకు గంగానమ్మపేటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనుతో సుమారు ఐదున్నరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ప్రవర్తనను మార్చుకోవాలని భర్త సూచించడంతో కొంతకాలంగా ఆమె శ్రీనుకు దూరంగా ఉంది. రమేష్ కారణంగా తన ప్రియురాలు దూరంగా ఉంటోందని, అతడి అడ్డు తొలగించాలని భావించిన నిందితుడు శ్రీను శనివారం రాత్రి ఇంటికి వెళుతున్న రమేష్పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాధితుడు రమేష్ ఫిర్యాదును టూ టౌన్ ఎస్ఐ పి. సురేష్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగికదాడికి యత్నం
వత్సవాయి(జగ్గయ్యపేట): మనుమరాలి వయస్సు ఉన్న ఒక బాలికపై 45 ఏళ్లు ప్రబుద్ధుడు లైంగికదాడికి యత్నించాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటకు చెందిన ఎస్కే మస్తాన్ జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లుకు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. రోజుమాదిరిగానే జగ్గయ్యపేట బస్టాండ్ వద్ద ఆటో నిలిపి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా జగ్గయ్యపేటకు చెందిన బాలిక (14) పెనుగంచిప్రోలులోని తన అమ్మమ్మ వద్దకు వెళ్లేందుకు ఆటోస్టాండ్ వద్దకు వచ్చింది. పెనుగంచిప్రోలు వరకు నేరుగా వెళ్లే ఆటో దొరకకపోవడంతో చిల్లకల్లు వరకు వెళ్తున్న మస్తాన్ ఆటో ఎక్కింది. ఆటోలోని ప్రయాణికులు కొందరు చిల్లకల్లులో దిగారు. వారితోపాటు బాలిక దిగగా నేను పెనుగంచిప్రోలు వెళుతున్నాను ఎక్కు అని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకుని మస్తాన్ బయలుదేరాడు. మక్కపేట దాటిన తరువాత శింగవరం వెళ్లే డొంక రహదారిలోకి తీసుకువెళ్లి బాలికపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమెపై దాడిచేశాడు. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల పొలాల్లోని కొందరు రైతులు అక్కడికి చేరుకుని మస్తాన్ను పట్టుకుని మక్కపేటకు తరలించారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో ఏఎస్ఐ ప్రభాకరరావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మస్తాన్కు స్టేషన్కు తరలించారు. ఎస్ఐ పి. ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. -
కళ్లముందే ‘మాయం..!
అజిత్సింగ్నగర్(విజయవాడ సెంట్రల్): టెక్నాలజీతోపాటు మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలకు మించిన మోసాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుండటంతో సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా నివ్వెర పోతున్నారు. సింగ్నగర్ నందమూరినగర్ ప్రాంతంలో గంజాం గీతా మహాలక్ష్మీ, రాధాకృష్ణ రమేష్బాబులు నివాసం ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రమేష్బాబు కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. వారికి తెలిసిన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి ప్రవీణ్కుమార్ అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలం తరువాత వడ్డీ కట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. మే నెలలో తమ పిల్లల ఉన్నత చదువులకు డబ్బులు అవసరమని, మీకు ఇచ్చిన రూ.20 లక్షలు ఇవ్వమని కోరారు. దీనికి ప్రవీణ్కుమార్ నా దగ్గర మొత్తం ఇప్పుడు లేవని, ప్రస్తుతానికి రూ.10 లక్షలు చెక్ రాసి ఇస్తానని, దాన్ని ఆగస్టులో బ్యాంకులో వేసుకోవచ్చని చెప్పి వారి కళ్లముందే సంతకాలు పెట్టి ఇచ్చాడు. అతను అంతలా నమ్మకంగా చెప్పడంతో బాధితులు కూడా ఇంకా మూడు నెలలే కదా ఆ తరువాత చెక్ వేద్దామని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఆగస్టు 4న చెక్ను బ్యాంకులో వేయగా దానిపై సంతకం లేదని చెక్ రిటర్న్ వచ్చింది. సంతకం లేకపోవడం ఏమిటని చెక్ను పరిశీలించి చూడగా దానిపై ప్రవీణ్కుమార్ పెట్టిన సంతకం మాయమైంది. బాధితులు విషయాన్ని ప్రవీణ్కుమార్కు చెప్పగా నేను కావాలనే మాయమయ్యే పెన్నుతో సంతకం చేసి ఇచ్చానని, డబ్బులు కావాలంటే ఇంకొంతకాలం వేచిచూడాలని సమాధానం చెప్పాడు. దీంతో తాము మోసపోయామని గమనించిన బాధితులు జరిగిన మోసాన్ని వివరిస్తూ సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. -
కడలి తీరంలో కన్నీటి ఉప్పెన
మూడేళ్ల దాంపత్యంలో ఆప్యాయతల నవ్వులేగానీ.. ఏ రోజూఅపార్థపు అరుపులు వినబడలేదు. అనురాగపు మాటలేగానీ.. అప్పుల కుంపట్లు రగల్లేదు. ముద్దులొలికే బాబు రాకతో మురిపెం రెట్టింపయ్యిందేగానీ.. వివాదాల ముసురు కమ్ముకోలేదు. ఇలాంటి అన్యోన్య కుటుంబంపై విధి విషం చిమ్మింది. మృత్యువు ముంచుకొచ్చిందో, క్షణికావేశమే కాలనాగై కాటు వేసిందో తెలీదుగానీ కొడుకుసహా దంపతులిద్దరినీ బలి తీసుకుంది. మూల స్తంభమైన భర్త ఆయువు ఉరికొయ్యకు వేలాడింది. ఇంటి దీపమైన జ్యోతి జీవితం మృత్యు చీకట్లలో కలిసిపోయింది. ధ్రువతారగా ప్రకాశిస్తాడనుకున్న బిడ్డ నూరేళ్ల జీవితం ఏడాదిన్నరకే ముగిసిపోయింది. మచిలీపట్నం కడలి తీరాన మంగళవారం జరిగిన ఈ విషాద ఘటన ప్రతి హృదయంలో కన్నీటి ఉప్పెనై ద్రవించింది. కృష్ణా జిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం): ఓ ధాన్యం వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. బందర్ డీఎస్పీ మహబూబ్బాషా కథనం ప్రకారం.. మచిలీపట్నం రాజుపేటకు చెందిన పద్మనాభుని సుధీర్ (30) స్థానికంగా తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. అతనికి మూడేళ్ల క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన జ్యోతితో వివాహమైంది. ఈ దంపతులకు ఏడాదిన్నర కుమారుడు ధృవ ఉన్నాడు. తల్లిదండ్రులు కింది పోర్షన్లో ఉంటుండగా సుధీర్ రెండో అంతస్తులో నివసిస్తున్నాడు. మంగళవారం సుధీర్ ఎంతకీ కనిపించకపోవడంతో తండ్రి నాగేశ్వరరావు పై అంతస్తులోకి వెళ్లి తలుపుతట్టినా స్పందన రాలేదు. దీంతో అనుమానమొచ్చిన ఆయన కిటికీ అద్దాలు పగులగొట్టి లోనికి చూడగా సుధీర్ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. నాగేశ్వరరావు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా పక్క గదిలో సుధీర్ భార్య జ్యోతి, కుమారుడు ధృవ నిర్జీవంగా కనిపించారు. దీంతో నాగేశ్వరరావు తన మిగిలిన ముగ్గురు కుమారులతోపాటు బంధువులకు విషయం చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బందర్ డీఎస్పీ మహబూబ్బాషా, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆకుల రఘు, ఇనగుదురుపేట సీఐ ఎస్కే నబీ, ఎస్ఐ కుమార్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. జ్యోతి తండ్రి తంగిశెట్టి సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బందర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ మహబూబ్బాషా మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. -
చిన్న పిల్లలే... టార్గెట్..!
చిన్న పిల్లలు ఇష్టంగా తినే కుర్కురే వంటి పదార్ధం, పాప్కార్న్, బంగాళా దంప చిప్స్, చాకెట్లు, రేగు పండు జామ్. ఇలా ఒకటేమిటి.. అన్నీ నాసిరకమే. చూడగానే ఆకట్టుకునే ప్యాకింగ్. ప్యాకెట్ విప్పగానే తినేయాలపించేలా రంగులు. మళ్లీ మళ్లీ కొనిపించే గిఫ్ట్ ప్యాక్లు. రూపాయి ప్యాకెట్ నుంచి ఐదు రూపాయల ప్యాకెట్ వరకు తయారీ చేసి మార్కెట్ చేస్తున్నారు.. కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాసిరకం తినుబండారాలు సరఫరా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీపై అధికారులు సోమవారం దాడులు చేసి సంస్థ యజమాని, అతని అల్లుడిని అదుపులోకి తీసుకుని కంపెనీని సీజ్ చేశారు. చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): కొత్తపేట జోడు బొమ్మల సెంటర్ ప్రాంతానికి చెందిన ఒగ్గు మురళీకృష్ణ కేఎల్రావు పార్కు రోడ్డులో ఆర్కే ప్రొడక్ట్ పేరిట చిన్నపిల్లల తినుబండారాలను తయారు చేస్తుంటాడు. మురళీకృష్ణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్లను సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు ఆహార పదార్థాల తయారీలో నాణ్యతను పాటించడం లేదనే సమాచారం ట్రాస్క్ఫోర్స్ ఏసీపీ జి.రాజీవ్కుమార్కు అందింది. సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం యూనిట్పై ఏసీపీ రాజీవ్కుమార్, ఫుడ్ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావు, కొత్తపేట సీఐ మురళీకృష్ణలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. పామాయిల్తో పాటు చిన్నపిల్లలు తినే కుర్కురే వంటి పదార్థం, పాప్కార్న్లతో రేగిపండు జామ్లను తనిఖీ చేశారు. అందులో వాడే రంగులు, రసాయనాలను పరిశీలించారు. ప్యాకింగ్ యూనిట్లో ఉన్న మురళీకృష్ణ అల్లుడు వినోద్ను సైతం అధికారులు ప్రశ్నించారు. ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులను ఎక్కడి నుంచి తీసుకువస్తావనే వివరాలను ఎంత అడిగినా వారు చెప్పలేదు. రెన్యూవల్ లేకుండానే.. కంపెనీ నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు 2016లోనే ముగిసినప్పటికీ రెన్యూవల్ చేయించకపోవడం, ట్యాక్స్లు సక్రమంగా చెల్లించకపోవడం తదితర విషయాలను టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించి ఆయా విభాగాల అధికారులకు సమాచారం అందించారు. కంపెనీలో ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నట్లు లేబర్ లైసెన్సులో ఉండగా, వాస్తవానికి కంపెనీలో 50 మందికి పైగా పనివారు ఉన్నట్లు గుర్తించారు. ఇక సరుకులను మేడపైకి చేరవేసేందుకు ఉపయోగించే లిఫ్టుకు ఎటువంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం, భవనంలోని మూడు అంతస్తులలో ఎక్కడా ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. కంపెనీ ఒక చోట.. సరుకు మరోచోట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో అతని కంపెనీ వద్ద లారీతో సరుకు దిగుమతి అవుతుంది. సరుకు తాలుకు బిల్లులను డ్రైవర్ నుంచి తీసుకుని అధికారులు తనిఖీ చేశారు. సరుకును సూరంపల్లిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కంపెనీలో దిగుమతి చేయాల్సి ఉండగా కేఎల్రావు నగర్లో దిగుమతి చేస్తున్నారు. సుమారు రూ. 10 లక్షల విలువ గల సరుకులు ఇక్కడ ఎందుకు దిగుమతి చేస్తున్నారని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో అధికారులు బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రెండు సార్లు దాడులు రెండేళ్లలో ఈ కంపెనీపై విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు విజిలెన్స్, టాస్క్ఫోర్సు అధికారులు దాడులు చేశారు. ఒక దఫా కార్పొరేషన్ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్ సమక్షంలో దాడులు నిర్వహించారు. అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కంపెనీలో అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించి కంపెనీని సీజ్ చేశారు. సోమవారం కూడా టాస్క్ఫోర్స్ అధికారులు అన్నిరకాల ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించడంతో పాటు కేసు నమోదు చేసి కంపెనీని సీజ్ చేశారు. రవాణాకు సిద్ధంగా ఉన్న రూ. 10 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్ల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇక.. ఆ కుటుంబంలో ఎవరూ లేరు!
కృష్ణాజిల్లా, పెనమలూరు: తల్లి ఎప్పుడో మృతిచెందింది. తండ్రి, కుమారుడు కలిసి ఉంటున్నారు. ఆ తండ్రి కూడా అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తండి మృతిచెందిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వారం రోజుల పాటు ఇంటిలోనే ఉంచి పూజలు చేశాడు కుమారుడు. రెండు నెలల క్రితం కానూరులో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న కుమారుడు కూడా గురువారం అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో ఎవ్వరూ లేకుండా పోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. కానూరు వృద్ధుల ఆశ్రమం రోడ్డులో విశ్రాంత ఇంజినీర్ కొండూరు కోటేశ్వరరావు, కుమారుడు రామలింగేశ్వరరావుతో కలిసి జీవిస్తున్నాడు. కోటేశ్వరరావు రెండు నెలల క్రితం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. మానసిక స్థితి సరిగాలేని అతని కుమారుడు రామలింగేశ్వరరావు (45)తండ్రి చనిపోయినా ఎవ్వరికీ చెప్పకుండా మృతదేహానికి పసుపు, కుంకుమ రాసి కాళ్లకు స్కేటింగ్ షూస్ వేసి ఇంట్లోనే వారం రోజుల పాటు శవాన్ని ఉంచుకున్నాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి కోటేశ్వరరావు మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నేటికీ కోటేశ్వరరావు ఎలా మృతిచెందాడనేది తెలియరాలేదు. ఇప్పుడు రామలింగేశ్వరరావు కూడా... తండ్రి కోటేశ్వరరావు మరణం తరువాత రామలింగేశ్వరరావుకు చికిత్స చేయించేందుకు మేనమామలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ అతనిని విశాఖపట్నం తీసుకువెళ్లారు. అక్కడ అతనికి చికిత్స చేయించారు. ఈనెల మొదటివారంలో రామలింగేశ్వరరావు కానూరు వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 7న మేనమామలు వచ్చి రామలింగేశ్వరరావును చూసి వెళ్లారు. మరలా గురువారం మేనమామలు ఇంటికి వచ్చి చూడగా రామలింగేశ్వరరావు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదుచేశారు. -
300 కిలోల గంజాయి స్వాధీనం
పెదకాకాని (పొన్నూరు) : ఎవరికీ అనుమానం రాకుండా కారులో రాష్ట్రం దాటిస్తున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు రట్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు 300 కిలోల గంజాయితో బయలు దేరిన కారును నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కారుతో పాటు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12 లక్షల వరకూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పెదకాకాని పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి బైపాస్ నుంచి ఓ వాహనంలో గంజాయి సరఫరా అవుతున్నట్టు పెదకాకాని సీఐ పి.శేషగిరిరావుకు సమాచారం అందింది. దీంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో కాపు కాసి తనిఖీలు చేయగా ఏపీ 03 పి 0333 నంబరు గల కారులో ఒక్కోటి రెండు కిలోల బరువు కలిగిన 150 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. కారుతో పాటు యజమాని, డ్రైవర్గా ఉన్న కేపీ రాజా, సెంగుత్తవాన్ బాలును అదుపులోకి తీసుకున్నారు. కారునంబరు వాస్తవానికి టీఎన్ 25 యూ 8989 కాగా గంజాయితో బయలుదేరే ముందు కత్తిపూడిలో నంబరు ప్లేట్ మార్చి నకిలీ నంబరు ప్లేటు బిగించారు. గంజాయి తరలించేందుకు కేపీ రాజా లక్ష రూపాయలు కిరాయి మాట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. ఈ గంజాయిని విశాఖపట్నం జిల్లా కేడీ పేట సమీప ప్రాంతాల్లో సేకరించి అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గంజాయి తరలింపులో కీలక పాత్రధారులు మధురైకి చెందిన రాజేంద్రన్, విశాఖపట్నం జిల్లాకు చెందిన నూకయ్యనాయుడుగా గుర్తించారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులు సెంగుత్తవాన్ బాలు, కేపీ రాజాలను గురువారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ పి.శేషగిరిరావు, ఎస్ఐ ఆరోగ్యరాజు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ యానాదిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో సీఐ పి.శేషగిరిరావు, ఎస్ఐలు సత్యనారాయణ, ఆరోగ్యరాజు, సిబ్బంది ఉన్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం
చిట్టినగర్ (విజయవాడ వెస్ట్): మార్కులు సరిగా రాకపోవడంతో మానసికంగా కుంగిపోయిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మాకిన వారి వీధికి చెందిన చోడవరపు జ్యోతి ప్రకాష్ ఆర్ఎంపీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. జ్యోతి ప్రకాష్ భార్య రాజరాజేశ్వరి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ కాగా కుమార్తె హిమజా(22) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుంది. రెండో సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ఇటీవల సప్లిమెంటరీ రాసింది. అందులో కూడా మార్కులు సరిగా రాలేదు. దీంతో కొంత కాలంగా మానసికంగా కుంగి పోయింది. ఈ నేపథ్యంలో హిమజా బుధవారం సాయంత్రం 5 గంటలకు యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చిం ది. అప్పుడు తండ్రి జ్యోతిప్రకాష్ క్లినిక్ వెళ్లేందుకు బయలుదేరారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న హిమజా కొంత సేపటి తర్వాత లోపలకు వెళ్లి ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత పక్క వీధిలో నివాసం ఉండే అక్క ప్రియాంక ఇంటికి వచ్చి చూడగా చెల్లెలు ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే తన భర్తకు ఫోన్ చేయగా, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటేనే తండ్రికి సమాచారం ఇచ్చి హిమజాను కిందకు దింపి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే హిమజా మృతి చెందినట్లు గుర్తించారు. కొత్తపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఘటనకు సంబంధించి వివరాలను నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హత్యాయత్నమా?... ఆత్మహత్యాయత్నమా...?
కంకిపాడు (పెనమలూరు) : రక్తపు మడుగులో ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఘటన మండల కేంద్రమైన కంకిపాడులో మంగళవారం చోటు చేసుకుంది. హత్యాయత్నం జరిగిందా?, లేక ఆత్మహత్యాయత్నం చేశాడా? కారణాలు ఏమిటి? అన్నవి ప్రశ్నలుగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని లాకురోడ్డు మద్యం దుకాణం వెనుక రోడ్డులో రియల్ వెంచర్ ఉంది. ఈ వెంచర్లోని ఓ ఖాళీ రేకుల షెడ్డులో రక్తపు మడుగులో ఓ యువకుడు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు రక్తపు మడుగులో ఎడమ చెవికి గాయమై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మద్యం అధికంగా సేవించి ఉన్నట్లు నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి (30) ని 108 అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు లభ్యం కాలేదు. హత్యాయత్నమా?... ఆత్మహత్యాయత్నమా...? ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించేందుకు తరచూ ఇక్కడ ఉన్న వెంచర్లోకి మందుబాబులు వెళ్తుంటారు. అలాగే వెళ్లిన వ్యక్తుల్లో మద్యం తాగాక ఘర్షణ ఏర్పడి దాడికి దారి తీసిందా?, లేక మద్యం మత్తులో తనకు తాను గాయపర్చుకున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మద్యం దుకాణం వద్ద, లాకు రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సేకరిస్తే కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తెలివిలోకి వస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
నోటికి ప్లాస్టర్లు వేసి.. దుప్పట్లలో చుట్టి..
-
అనూష.. ఏమైపోయింది!
పెనమలూరు : యనమలకుదురు గ్రామానికి చెందిన బాలిక అనూష అదృశ్యం మిస్టరీగా ఉండి పోయింది. ఆమె జాడ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు వారం రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ తెలియలేదు. ఘటన వివరాల్లోకి వెళితే.. యనమలకుదురుకు చెందిన నేలటూరి దుర్గ (36) అపార్టుమెంట్లలో పని చేస్తుంటుంది. భర్త నారాయణరావు ఆమెను వదిలేయడంతో కొద్ది కాలంగా మచ్చా దుర్గాప్రసాద్ (25) తో కలిసి ఉంటోంది. అయితే దుర్గకు అనూష (15) అనే కుమార్తె ఉంది. ఆమె విజయవాడ మొగల్రాజపురంలో 9వ తరగతి చదువుతోంది. ఆమెను స్కూల్ నుంచి తీసుకు వస్తానని దుర్గాప్రసాద్ గత నెల 27వ తేదీన బైక్పై వెళ్లాడు. అయితే అతను ఇంటికి తిరిగి రాలేదు. అతనితో పాటు అనూష కూడా ఇంటికి రాలేదు. అయితే అతని బైక్, సెల్ఫోన్ యనమలకుదురు చిన్న వంతెన వద్ద దొరికాయి. ఇద్దరూ ఎటు వెళ్లారో తెలియకపోవడంతో అనూష తల్లి దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. కాల్వలో దుర్గాప్రసాద్ శవం.. కాగా చోడవరం గ్రామ పరిధి కేఈబీ కాల్వలో దుర్గాప్రసాద్ శవం లభ్యమైంది. అయితే అనూష ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. దీంతో అనూష జాడ కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. వారు బోట్ల సహాయంతో కాల్వల్లో గాలించారు. అయినా అనూష జాడ తెలియలేదు. ఇప్పటికీ ప్రత్యేక బృందాలు కాల్వ దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. అయినా, ఆమె ఆచూకీ తెలియడం లేదు. బాలిక ఏమైనట్లు..? స్కూల్కు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి కాకుండా ఏమైపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఆమెను స్కూల్ నుంచి తీసుకు వస్తానని వెళ్లిన దుర్గాప్రసాద్ కాల్వలో శవమై కనిపించాడు. అనూష ఎక్కడ ఉంది తెలియడం లేదు. కాల్వలో దుర్గాప్రసాద్ శవం దొరకటంతో అనూష కూడా కాల్వలో దూకిందేమోనని పోలీసులు భావిస్తున్నారు. అసలు వీరు కాల్వలో ఎందుకు దూకాల్సి వచ్చిందనే ప్రశ్నకు పోలీసులకు సమాధానం దొరకటం లేదు. ఇప్పటికే అనూష తల్లిని పోలీసులు పలు దఫాలుగా విచారణ చేశారు. ఆమె కూడా ఏమీ చెప్పలేకపోతోంది. కేసు విచారిస్తున్నాం.. అనూష కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నాం. దుర్గాప్రసాద్ శవం కాల్వలో దొరకటంతో అనూష కూడా కాల్వ లో దూకి ఉండవచ్చని వెతుకుతున్నాం. దుర్గాప్రసాద్ ఎందుకు చనిపోయాడు, అనూష ఏమైపోయిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. – దామోదర్, సీఐ -
సెటిల్మెంట్ ఖాకీ !
జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి సెటిల్మెంట్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రౌడీగ్యాంగ్లను ప్రోత్సహిస్తూ యథేచ్ఛగా సివిల్ పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేత, రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి అండదండలతోనే ఆయన చెలరేగిపోతున్నారని పలువురు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయినా వెళ్లకుండా తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్నారంటే ఆ అధికారి ఏ స్థాయి వ్యవహారపరుడో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలోని రెండు నియోజకవర్గాలను ఓ పోలీసు అధికారి హడలెత్తిస్తున్నారు. రాజకీయ అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిత్యం సెటిల్మెంట్లు..ఇసుకదందాలు..అక్రమ కేసులు..రౌడీ గ్యాంగ్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. బదిలీ అయిన రెండేళ్లకే మళ్లీ అక్కడికే పోస్టింగు తెచ్చుకునేంత లాబీయింగ్ నడపగల స్థాయి ఆ అధికారిది. జిల్లా ఉన్నతాధికారినే ఆయన ఖాతరు చేయడం లేదు. ఓ పోలీసు అధికారికి ఓ స్థానం ఒకసారి పనిచేసిన తరువాత మళ్లీ ఆదే హోదాతో అక్కడ సహజంగా పోస్టింగు ఇవ్వరు. కానీ ఈ మధ్యస్థాయి ఉన్నతాధికారి ఆ నిబంధనకు అతీతుడు. ఆయనకు జిల్లా కీలక నేత అండదండలున్నాయి. పోలీసు అధికారి అండ.... అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లూ, చెవులుగా పనిచేసే రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారి దన్ను పుష్కలంగా ఉంది. అందుకే ఆయన ఒకే హోదాతో ఒకే స్థానంలో నాలుగేళ్లలో రెండుసార్లు పోస్టింగు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జిల్లాలో కీలకమైన పోస్టింగు దక్కించుకున్నారు. ఆయన పరిధిలోకి రెండు నియోజకవర్గాలు వస్తాయి. అందులో ఒకటి జిల్లా కీలక నేత సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఆ స్థానంలో దాదాపు రెండేళ్లు ఆయన యథేచ్చగా చెలరేగిపోయారు. అనంతరం హైదరాబాద్కు బదిలీ చేశారు. ఏడాదిన్నరలోనే జిల్లాలోని తన పాత స్థానానికే ఆయనకు పోస్టింగు తెప్పించుకోవడం పోలీసువర్గాలనే విస్మయపరిచింది. అంతగా రాజకీయ అండ ఉన్న ఆయనకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆయన యవ్వారాలకు సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇవిగో.. ♦ ఆయన పనిచేసే కేంద్రంలోఓ వ్యాపారి కుటుంబ వివాదంలో ఈ అధికారి సెటిల్మెంట్ దందాకు తెరతీశారు. పెట్రోల్ బంకు, క్వారీలు, భూములు ఇలా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులపై బాబాయి, అబ్బాయిల మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. అబ్బాయికి అనుకూలంగా కేసును సెటిల్ చేసేందుకు ఆ పోలీసు అధికారి డీల్ కుదుర్చుకున్నారు. ఆ సివిల్ కేసును కాస్తా క్రిమినల్ కేసుగా మలచారు. బాబాయిని పోలీస్స్టేషన్కు పిలిపించి తాను చెప్పినట్లు సెటిల్ చేసుకోవాలని వేధించారు. బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించారు. ఆ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించినట్లు నిగ్గుతేలిందని సమాచారం. కానీ ఆ అధికారి రాజకీయ పరపతికి తలొగ్గి ఉన్నతాధికారులు చర్య తీసుకోనేలేదు. ♦ ఆ పోలీసు అధికారి సెటిల్మెంట్ల కోసం ఏకంగా ఓ గ్యాంగ్నే ఏర్పాటు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఆయన రెండోసారి ఆ స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్న తరువాత పలువురిపై రౌడీషీట్లు తొలగించారు. వారు ఓ ముఠాగా తయారై సెటిల్మెంట్లు చేస్తూ హల్చల్ చేస్తుండటం గమనార్హం. ఆ పోలీసు అధికారి అండతోనే ఇదంతా సాగుతోందన్నది నియోజకవర్గంలో బహిరంగ రహస్యంగా మారింది. ♦ ఈ అధికారి గతంలో తెలంగాణలో పని చేశారు. అప్పట్లో పోలీసుల అండతో నయిం గ్యాంగ్ చేసిన దందాలపై ఆయనకు అవగాహన ఉంది. అదే రీతిలో జిల్లాలో గ్యాంగ్ సంస్కృతికి ఈయన తెరతీశారు. హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించిన ఓ రౌడీని కూడా ఇక్కడకు రప్పించారు. ♦ ఓ మహిళను మాయమాటలతో మోసం చేసి ఆమెకు చెందిన భూమిని రాయించుకోవడంతోపాటు దాదాపు రూ.కోటి వరకు నగదు తీసుకున్నారని సమాచారం. మోసపోయానని గ్రహించిన ఆమె తన భూమి, నగదు వెనక్కి ఇవ్వమని ఎంతగా అడిగినా ససేమిరా అన్నారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ♦ జిల్లా నుంచి హైదరాబాద్కు ఇసుక అక్రమరవాణాకు ఆయన అండదండలున్నాయి. ఆయన పరిధిలోని నియోజకవర్గాల నుంచే రోజుకు వందలసంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తన మాట వినడం లేదని ఓ సర్కిల్ స్థాయి అధికారిపై ఆయన ఈయన బహిరంగంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయంలో ఆయన్ని కట్టడి చేయడం జిల్లా ఉన్నతాధికారితరం కూడా కావడం లేదు. -
బందరులో మరో కాల్మనీ
కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : మచిలీపట్నంలో కాల్మనీ వ్యవహారం మరో మారు తెరపైకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో అప్పు చేసిన ఓ మహిళ నుంచి వ్యాపారి అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేయటమే కాకుండా ఆలస్యం అయితే తన కోరిక తీర్చమంటూ వేధింపులకు గురి చేశాడు. లేనిపక్షంలో వ్యభిచారం చేసైనా తన అప్పు తీర్చమంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో దిక్కుతోచని బాధితురాలు వడ్డీ వ్యాపారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వడ్డీ వ్యాపారిని అదుపులోకి తీసుకుని శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించాలని ఏఎస్పీ సోమంచి సాయికృష్ణ డీఎస్పీ మహబూబ్బాషాకు సూచించారు. ఏం జరిగిందంటే.. బాధితురాలి కథనం ప్రకారం మచిలీపట్నం మాచవరానికి చెందిన తాహెరున్నీసా, కరీముల్లా భార్యాభర్తలు. వీరికి ఒక పాప ఉంది. కరీముల్లా 2013లో పనుల నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న తాహెరున్నీసా ఏదో ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచన తట్టటంతో ఫ్యాన్సీ షాపు పెట్టేందుకు నిర్ణయించుకుంది, తన వదిన ఉన్నీసా ద్వారా పట్టాభిపురానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద 2014లో రెండు దఫాలుగా రూ.1,30,000లను అప్పుగా తీసుకుంది. నూటికి రూ.7 ల చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. వ్యాపారం నష్టపోవటంతో అప్పు తీర్చటం కష్టంగా మారింది. దీంతో తాహెరున్సీసా వదిన అప్పు నిమిత్తం ఆమె నుంచి ఆరు ఖాళీ చెక్కులతో పాటు ప్రామిసరీ నోటులు తీసుకుంది. ఇదిలా ఉండగా వడ్డీ వ్యాపారి ఒత్తిళ్ళు తట్టుకోలేని తాహెరున్నీసా అతని అప్పు తీర్చేందుకు నిర్ణయించుకుంది. అందుకోసం ఇంగ్లిష్పాలెంలోని తన ఆడ పడుచు కరీమున్నీసా, ఆమె భర్త షంషుద్దీన్ల ద్వారా చిలకలపూడికి చెందిన నూకల రామ్కుమార్ అనే వడ్డీ వ్యాపారి వద్ద 2015లో నూటికి రూ.10 వడ్డీ చొప్పున రూ.95,000 ను అప్పుగా తీసుకుంది. మహిళకు రామ్కుమార్ వేధింపులు.. వడ్డీ వ్యాపారి నూకల రామ్కుమార్ వద్ద అప్పు తీసుకున్న తాహెరున్నీసా 2015 నవంబరు నుంచి దాదాపు 30 నెలల పాటు ప్రతి నెలా రూ.9,500 చొప్పున వడ్డీ కట్టుకుంటూ వచ్చింది. అయితే రెండు మూడు నెలలుగా వడ్డీ కట్టటం భారం కావటంతో తాహెరున్నీసా ప్రతి నెలా గడువు ప్రకారం వడ్డీ చెల్లించటం లేదు, దీంతో తాహెరున్నీసాను రామ్కుమార్ వేధింపులకు గురి చేయటం మొదలుపెట్టాడు. వడ్డీ కట్టటం కష్టమైతే తన కోర్కె తీర్చాలంటూ వేధించటం ప్రారంభించాడు. అలా కాని పక్షంలో వ్యభిచారం చేసైనా తన అప్పు తీర్చాలంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం రామ్కుమార్ భార్య మరో యువకుడు కలిసి తాహెరున్నీసాను బెదిరించటంతో పాటు రామ్కుమార్తో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడించారు. రక్షణ కల్పించకుంటే ఆత్మహత్యే శరణ్యం.. రామ్కుమార్ వేధింపులతో హడలెత్తిపోయిన తాహెరున్నీసా బుధవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పోలీసు కార్యాలయానికి వెళ్ళింది. ఎస్పీ అందుబాటులో లేకపోవటంతో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణను కలిసి తన ఆవేదనను వెల్లిబుచ్చుకుంది. అతని వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. రక్షణ కల్పించని పక్షంలో తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమైంది. అలాగే తన బంధువుల వేధింపుల నుంచి తప్పించాలంటూ కోరింది. దీంతో ఏఎస్పీ బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. -
కథ అల్లి.. ప్రియుడితో వెళ్లి..!
విజయవాడ ,నూజివీడు : ట్రిపుల్ ఐటీకి వచ్చేందుకు బయలుదేరి నూజివీడు వరకు వచ్చి, కట్టుకథ అల్లి ఆ తర్వాత ప్రియుడితో కలిసి చెన్నై వరకు ఓ విద్యార్థిని వెళ్లిన ఘటన ట్రిపుల్ ఐటీలో సంచలనం కలిగించింది. తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (17) జూలై 29న ఇంటి నుంచి సోదరుడితో కలిసి నూజివీడుకు సాయంత్రం 4 గంటలకు వచ్చింది. నూజివీడు బస్టాండులో దిగాక సోదరుడిని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆ తర్వాత నాన్స్టాప్ బస్సులో విజయవాడకు చేరుకుని రైల్వే స్టేషన్కు వెళ్లింది. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి చెన్నై వరకు వెళ్లి అక్కడ రైల్వే పోలీసులకు చిక్కింది. దీంతో తమ బాబాయి ఇక్కడ ఉన్నాడంటూ చెప్పడంతో ఆయనకు అప్పగించారు. అయితే ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే తాను ఆటోలో ఎక్కానని, పక్కన కూర్చున్న వ్యక్తి ఏదో గుచ్చినట్లుగా ఉందని, అనంతరం ఏం జరిగిందో తెలియదని, తెలివి వచ్చేసరికి చూస్తే చెన్నై స్టేషన్లో ఉన్నానంటూ నమ్మశక్యం కాని కథను వినిపిస్తోంది. సోదరుడు నూజివీడు బస్టాండు వరకు రాగా, అక్కడి నుంచి ఎందుకు వెనక్కు వెళ్లిపొమ్మందో అడిగితే సమాధానం లేదు. నూజివీడు నుంచి చెన్నై వరకు బాలిక నిద్రమత్తులోనే ఉంటే రైల్వే స్టేషన్లోకి ఆగంతకులు ఎలా తీసుకెళ్లారు.. నిజంగా ఎవరైనా మత్తు ఇచ్చినా నూజివీడు చుట్టుపక్కల అన్ని తోటలు, అటవీ ప్రాంతం కాబట్టి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారే గాని చెన్నై వరకు ఎందుకు తీసుకెళ్తారనే విషయం అంతుబట్టడం లేదు. అక్కడ వరకు వెళ్తే తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, వారు ఏమయ్యారు అనేది ప్రశ్నార్ధకం. బస్టాండు వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే కట్టు కథ అవునా, కాదా అనే విషయం వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు బాలికను కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి రమ్మని మంగళవారం పంపించి వేసినట్లు సమాచారం. -
కాటేస్తున్న ‘కాల్’నాగులు
అధికార పార్టీ అండ చూసుకుని ఉయ్యూరులో ‘కాల్’ నాగులు రెచ్చిపోతున్నారు.. అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ప్రజల రక్తం పీలుస్తున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వికృత ఉదంతాలకు ప్రధాన కేంద్రంగా నిలిచిన పెనమలూరు నియోజకవర్గంలోనే మళ్లీ ఈ దందా ఊపందుకుంటోంది. అప్పట్లో ఈ వ్యవహారంలో ఈప్రాంత ప్రజాప్రతినిధి పేరు బాహాటంగా వినిపించడంతో సైలెంట్ అయిన ఆయన ఇప్పుడు అనుచరులతో దందాలు నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి... కృష్ణా, ఉయ్యూరు: ఉయ్యూరులో కాల్ నాగులు కాటేస్తున్నాయి. అధికార పార్టీ ముసుగులో దందా సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్లు.. తనఖాలు.. సేల్ డీడ్లు.. పెట్టుకుని వడ్డీలు కట్టలేక, తనువ చాలించేందుకు సిద్ధపడుతున్నా కనికరం లేకుండా తమ వద్ద ఉన్న ఆధార పత్రాలతో ఆస్తులను దిగమింగుతున్నారు. విజయవాడలో కాల్మనీ కలకలం కనుమరుగవ్వక ముందే ఉయ్యూరులో కాల్మనీ బాధలతో టెలీఫోన్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి రాంబాబు కుమార్తె ప్రశాంతి చెప్పిన పేర్లు, పోలీసులకు రాసిచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకప్పటి అనుచరుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏఎంసీ మాజీచైర్మన్ వల్లభనేని నాని ముఖ్య అనుచరుడు ఏఎంసీ వైస్చైర్మన్గా ఉన్న జరగోతు నాగరాజుతో పాటు కొందరి టీడీపీ నేతల పేర్లు ఉండటంతో కాల్ మనీలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల బండారం మరోసారి బట్టబయలైంది. టీడీపీ నేతల దందాపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది. నూటికి రూ.20 వడ్డీ.. ఉయ్యూరు పట్టణం కేంద్రంగా వడ్డీ వ్యాపారం జోరుగా జరుగుతుంది. నూటికి ఏకంగా రూ.10ల నుంచి రూ.20ల వరకు నూటికి వడ్డీలు వసూలు చేస్తూ పేదలు, వ్యాపారులు, ఉద్యోగుల సొమ్ము కొల్లగొట్టేస్తున్నారు. దాదాపు 50 మందికిపైగా వడ్డీ వ్యాపారులు పట్టణంలో వ్యాపారం సాగిస్తూ కోట్లు గఢించారు. వీరిలో 20 మంది నలుగురు ముగ్గురు కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి కాల్మనీకి డబ్బులిచ్చి సెక్యూరిటీ కింద ఆస్తుల్ని సేల్ డీడ్ చేయించుకుంటున్న భయానక పరిస్థితి. వడ్డీకి తీసుకున్న ఏ వ్యక్తి అయినా సరే జీవితాంతం వడ్డీ తీర్చడంతోనే సరిపోతుంది. ఎన్నేళ్లు చూసినా అసలు అలాగే మిగిలిపోతుంది. కొంతమంది అధికార పార్టీలో ముఖ్యనేతలకు వడ్డీ వ్యాపారులు నజరానాలు ముట్టచెబుతూ తమ అక్రమ సామ్రాజ్యానికి అడ్డంలేకుండా దారులు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈకాల్ నాగుల వెనుక టీడీపీలోని ఒకరిద్దరు ముఖ్యనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసులకు కూడా నెలవారీ మామూళ్లు ముట్టచెబుతూ ప్రసన్నం చేసుకుంటుండబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరకలు అంటకుండా..! కాల్మనీ వ్యవహారం వేడెక్కడంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్లు తీవ్రంగా స్పందించారు. పోలీస్ అధికారులకు ఫోన్చేసి ఎవరు కాల్మనీ దందాకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆదేశించారు. కాగా, కాల్మనీ మరకలు తమకు అంటకుండా ఉండేందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారే తప్ప, చిత్తశుద్ధి లేదని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
డ్రాలో కారు వచ్చిందని బురిడీ
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ) : ఆన్లైన్ లక్కీ డ్రాలో కారు వచ్చిందంటూ ఓ మహిళ నుంచి పలు దఫాలుగా రూ. 4.49 లక్షలు బ్యాంక్లలో జమ చేయించుకున్న ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలికి రెండు నెలలుగా కారు ఇవ్వకుండా ఇంకా డబ్బులు చెల్లించాలని నిందితులు నిత్యం ఫోన్లు చేసి మాట్లాడుతుండటంతో ఎట్టకేలకు విషయం పోలీసులకు చేరింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలనీలోని బ్లాక్ నెం 272 టీఎఫ్–1లో సత్యవరపు విజయ, మల్లేశ్వరరావు దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ కుమారుడు వినోద్కుమార్ కు మే 15న ఆన్లైన్లో కారు వచ్చిందంటూ ఫోన్ రావడంతో ఆ కుటుంబానికి అనందానికి అవధులు లేకుండా పోయ్యాయి. కారు రోడ్డు టాక్స్ మీరే చెల్లించాలని చెప్పడంతో తొలుత రూ.12,800 చెల్లించారు. కారు పంపకుండా క్యాష్ ప్రైజ్గా కూడా తీసుకోవచ్చునని నమ్మించారు. దీంతో వారు మరో మారు ఫోన్ చేసి టాక్స్ మొత్తం మీరే చెల్లించాలని చెప్పగా రూ.25,600 ఆన్లైన్ అకౌంట్లో చెల్లించారు. అదే నెల మరోసారి ఫోన్ చేయడంతో రూ. 51,200 చెల్లించారు. మీ ప్రైజ్ మనీ రెట్టింపు బ్యాంక్లో డబ్బులు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్న వారికి మరోసారి సదరు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మీకు కంపెనీ ఇచ్చే ప్రైజ్మనీ రెట్టింపు అయిందని, ఒకటి రెండు రోజులలో మీ అకౌంట్లో నగదు వేస్తామని చెప్పి మరి కొన్ని వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత జూన్ 1న రూ. 1,13,600, 6న మరో రూ. 40 వేలు, 25న మరో రూ. 1.09,600 చెల్లించారు. ఇక అంతటితో ఆగకుండా గత నెల 27న రూ. 20 వేలు, ఈ నెల 23న మరో రూ. 50 వేలు వేశారు. ఈ నెల 23వ తేదీ ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు రాఘవేంద్రగా చెప్పి మరో రూ. 26,100 చెల్లిస్తే డబ్బులు గంటలో మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు వేయకపోవడంతో ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 4.49 లక్షల నగదును పలు బ్యాంకుల్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతిరావు పేర్కొన్నారు. -
మా ఆటకు రండి
‘‘ఫలానా తోటలో ఆదివారం పేకాట శిబిరం నిర్వహిస్తున్నాం’’ మా ఆటకు రండి.. పందేలు కట్టండి.. నోట్ల కట్టలతో వెళ్లండి’’ అంటూ వినూత్నంగా పందెంరాయుళ్లకు నిర్వాహకుల నుంచి సందేశాలు వస్తున్నాయి. ఫోన్లలోనే ఆహ్వానాలు అందుతున్నాయి. ఇంకేముంది ఇదే మంచి తరుణమంటూ పేకాటప్రియులు నాలుగుముక్కలాటకు జై కొడుతూ శిబిరాల వైపు పరుగు తీస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముకాస్తా పేకాటలో పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పేకాటలకు అడ్డాగా మారింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాయ్ రాజా కాయ్ అంటూ పేకాటరాయుళ్ల పందెం కూతలు వినబడుతున్నాయి. రెండు నెలలుగా పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని మారుమూల ప్రదేశాల్లో శిబిరాలు జోరుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఎక్కడో ఒకచోట జరిగే జూద శిబిరాలు గ్రామ గ్రామాన పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. శిబిరాల జోరు బందరు మండలంలో పేకాట శిబిరాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అదృష్టాన్ని పరీక్షిం చుకునేందుకు అమాయకులు (పేకాటరాయుళ్లు) శిబిరాల వైపు పరుగులు పెడుతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ లక్షల్లో పందాలు కడుతున్నారు. ఆట ముగిసేసరికి సొమ్మంతా నిర్వాహకుల జేబుల్లో పోసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. మండలంలో 34 పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా గ్రామాల్లో పేకాటరాయుళ్ల పందెం కూతలతో మారుమోగుతున్నాయి. పెట్టుబడి లేకుండా లాభాలు పేకాటలో ఆటగాళ్లు బికారులు అవుతుండగా నిర్వాహకులకు కనకవర్షం కురుస్తోంది. పేకాట నిర్వాహకులుæ పెట్టుబడి లేకుండానే లక్షలు పోగేసుకుంటున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో మచిలీపట్నానికి చెందిన అనేకమంది శిబిరాలు నిర్వహిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఈజీ మనీకి అలవాటుపడిన నిర్వాహకులు పేకాటరాయుళ్ల ఫోన్ నంబర్లు తీసుకొని ‘మా ఆటకు రండీ అంటే మా ఆటకు రండీ’ అంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. రోజుకు రెండు ఆటలు పెడుతూ అమాయకుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాలే అడ్డాగా... బందరు మండలంలోని మంగినపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, కోన తదితర గ్రామాల్లో కోతముక్క ఆట విచ్చలవిడిగా సాగుతుంది. పట్టణంలోని బైపాస్రోడ్డులో పేకాట జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. మంగినపూడిలో గ్రామానికి చెందిన వ్యక్తి ప్రతి ఆదివారం ఆట పెడుతూ పేకాటరాయుళ్ల సొమ్ములు దిగమింగుతుండగా, మేకవానిపాలెంకు చెందిన మరో వ్యక్తి ఇటీవల వరకు శిబిరాలు నిర్వహించి రూరల్ పోలీసుల హెచ్చరికలతో స్వస్తి పలికాడు. కరగ్రహారానికి చెందిన ఇంకో వ్యక్తి కొన్ని రోజులుగా ఆట మొదలుపెట్టి ఆటగాళ్లను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రసాదంలా మింగేస్తున్నాడు మచిలీపట్నం బైపాస్రోడ్డుకు చెందిన ఒక వ్యక్తి బైపాస్రోడు, సుల్తానగరం, గూడూరు, ఘంటసాల, కూచిపూడి తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహించి పెట్టి లక్షలకు లక్షలు వెనకేశాడనే ప్రచారం సాగుతుంది. అక్రమ సంపాదనతో పలు గ్రామాల్లో లక్షలు ఖరీదు చేసే భూములు కొనుగోలు కూడా చేసినట్లు పేకాట రాయుళ్లే చెప్పుకుంటున్నారు. శిబిరాలు మారుస్తూ పేదల సొమ్మును ప్రసాదంలా మింగేస్తున్న నిర్వాహకుడిపై సంబంధిత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజాంపేటకు చెందిన మరో వ్యక్తి రెండు పూటలా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలి సింది. ఇక్కడి ఆటకు వెళ్ళిన వారంతా జేబులకు చిల్లులు పెట్టుకుని రావడమే తప్ప జేబులు నింపుకునే ప్రసక్తే లేదన్న వాదన వినబడుతుంది. చల్లపల్లికి చెందిన మరో వ్యక్తి చల్లపల్లి, ఘంటసాల, కూచిపూడి. మొవ్వ, కోసూరు, పద్దారాయుడుతోట, బందరు ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లను పిలిపించి కోన గ్రామ పరిసరాలు జూదాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. నిర్వాహకుల ఆదాయం రోజుకు రూ. 10,000ల నుంచి రూ. 20.000లపైబడి ఉంటుందంటే ఏమేరకు శిబిరాలు నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. నిద్రపోతున్న నిఘా బందరు మండలంతో పాటు పట్టణ నడిబొడ్డున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నా సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. పేకాటలతో వందలాది కుటుంబాలు వీధినపడుతున్నా జిల్లా యం త్రాంగం స్పందించకపోవడంతో నిఘా నిద్రపోతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కొంత మంది నిర్వాహకులు పోలీసులతో బేరం కుదుర్చుకున్నామంటూ పేకాటరాయుళ్ళను శిబిరాలకు పిలిపించుకోవడం పోలీసుల పనితీరుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రౌడీషీట్లు తెరుస్తాం పేకాటలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులపై పూర్తి నిఘా పెట్టాం. గతంలో ఆటలు పెట్టిన వారిని ఇప్పటికే బైండోవర్లు చేశాం. అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తాం. ప్రజల శిబిరాల సమాచారాన్ని నేరుగా నా దృష్టికి తీసుకురండి. సంబందించి సమాచారం ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. సమాచారం అందిన మరుక్షణం దాడులు చేయిస్తాం. శిబిరాలు నిర్వహించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదు. ఇతర సబ్–డివిజన్లో ఆటలు పెట్టే వారి వివరాలను అక్కడి డీఎస్పీలకు తెలియజేస్తాం.మహబూబ్బాషా, బందరు డీఎస్పీ -
అదృశ్యమయ్యాడు! శవమై తేలాడు..
యనమలకుదురు (పెనమలూరు) : యనమలకుదురులో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరిలో ఒకరు కేఈబీ కాల్వలో శవమై దొరకగా, బాలిక ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో కేసు మిస్టరీగా మారింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.యనమలకుదురు డొంక రోడ్డులో నేలటూరి దుర్గ ఓ అపార్టుమెంట్లో పని చేస్తుంది. భర్త నారాయణరావుకు ఆమె దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే దుర్గ (35) కొద్దికాలంగా తాపీ పని చేసే మచ్చా దుర్గాప్రసాద్ (25) తో కలిసి ఉంటోంది. కాగా దుర్గ కుమార్తెలు విజయవాడ మొగల్రాజపురంలో చదువుతున్నారు. ఈ నెల 27వ తేదీన దుర్గ పెద్ద కుమార్తె అనూష (15) ను స్కూల్ నుంచి తీసుకు వస్తానని దుర్గాప్రసాద్ బైక్పై వెళ్లాడు. అయితే ఇద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. యనమలకుదురు చిన్న వంతెన వద్ద దుర్గాప్రసాద్ బైక్, సెల్ ఫోన్ దొరికాయి. దీంతో దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం దుర్గాప్రసాద్, అనూష మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేఈబీ కెనాల్లో దుర్గాప్రసాద్ శవం.. కాగా, చోడవరం గ్రామం వద్ద కేఈబీ కెనాల్లో శవం ఉందని గ్రామస్తులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వచ్చి కాల్వ నుంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి దుర్గాప్రసాద్గా గుర్తించారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన దుర్గాప్రసాద్ కాల్వలో శవమై దొరకటంతో గ్రామంలో కలకలం రేగింది. అయితే అతనితో ఇంటికి రావాల్సిన అనూష ఆచూకీ మాత్రం తెలియలేదు. అసలు ఇద్దరూ ఎందుకు అదృశ్యమయ్యారు.. దుర్గాప్రసాద్ కాల్వలో దూకి ఎందుకు చనిపోయాడు.. అనూష ఎక్కడ ఉంది.. అసలు బతికే ఉందా.. లేదా అన్న విషయాలు స్పష్టం కాకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. పోలీసులు కేఈబీ కెనాల్లో ఇంకా గాలిస్తున్నారు. -
రామవరప్పాడులో భారీ చోరీ
రామవరప్పాడు (గన్నవరం) : ఎప్పుడూ రద్దీగా ఉండే రామవరప్పాడు పాత పోస్టాఫీసు రోడ్డులో గురువారం తెల్లవారుఝామున భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 10 కాసుల బంగారం, అర కేజీ వెండి, రూ.1.80 లక్షల నగదు మొత్తం సుమారు రూ.7 లక్షల ఆస్తి చోరీ జరిగింది. వివరాలాలా ఉన్నాయి. పాత పోస్టాఫీసు రోడ్డులోని ఓ భవనంలో పంచకర్ల మధుకిరణ్, శారదా భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మనోజ్, మానస సంతానం. మనోజ్ పంజాబ్లోని జీఎన్ఏ యూనివర్శిటిలో బీటెక్ చేరాల్సి ఉండగా, మానస 10వ తరగతి చదువుతోంది. వీరికి పక్కనున్న మరో గదిలో మధుకిరణ్ తల్లిదండ్రులు సాంబశివరావు, వరలక్ష్మి›ఉంటున్నారు. మధుకిరణ్ ఆటోనగర్లో సిటీ కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం ఉక్కబోతగా ఉందని ఏసీ ఉన్న గదిలో నలుగురు కలిసి నిద్రకు ఉపక్రమించారు. తెల్ల వారుఝామున సుమారు 2 గంటల సమయంలో ఆగంతకుడు వీరు నివసిస్తున్న భవనంలోకి చేరుకున్నాడు. తలుపులన్నీ వేసి ఉండటంతో వంట గదిలోని కిటికి గ్రిల్ను రాడ్డు సహాయంతో తొలగించి రంధ్రం గుండా లోపలికి ప్రవేశించాడు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టి పక్కనున్న గదిలోకి వెళ్లాడు. హ్యాంగర్కు తగిలించిన తాళంతో బీరువా లాక్ తీసి అందులోని నల్లపూసల గొలుసు, నాను తాడు, గాజులు, చెవి దుద్దులు, చైన్ (మొత్తం 10 కాసులు), సిటీ కేబుల్ కలెక్షన్ డబ్బు, మనోజ్ కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు కలిపి బీరువాలో ఉంచిన రూ.1.80 లక్షల నగదు, దేవుడి గదిలోని వెండి సామాన్లు అపహరించాడు. మనోజ్ కళాశాల బ్యాగ్లోని పుస్తకాలను తీసేసి అపహరించిన సొత్తును అందులో వేసుకుని ఉడాయించాడు. మానస నిత్యం ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చదువుకుంటుంది. రోజూ మాదిరిగానే మేల్కొన్న మానస తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో తండ్రి మధుకిరణ్ను లేపింది. మరో మార్గం నుంచి బయటకు వచ్చి తలుపు గడియ తీశాడు. పక్కనున్న గది తీసి ఉండటం, బీరువాలోని సామాన్లు చిందరవందరగా పడి ఉండటం చూసి దొంగతనం జరిగిందని గుర్తించి పటమట పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్.. సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ సభ్యులు రంగంలోకి దిగారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఇంట్లో కలియతిరిగి ప్రసాదంపాడు వైపు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చాయి. షార్ట్తో వచ్చి ఫ్యాంట్ షర్ట్తో వెళ్లి... సమీపంలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో రికార్డైన సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. షార్ట్, బనీన్తో ఓ ఆగంతకుడు ప్రసాదంపాడు వైపు నుంచి వచ్చి మధుకిరణ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫుటేజ్లో గుర్తించారు. సుమారు గంట తర్వాత అదే వ్యక్తి వైట్ షర్ట్, నల్ల ప్యాంట్తో వెనుక బ్యాగ్ తగిలించుకుని ముఖానికి మాస్క్ ధరించి బయటకు వచ్చి తాపీగా రామవరప్పాడు రింగ్ వైపు వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన మనోజ్ ఆగంతకుడు వేసుకున్న డ్రెస్, బ్యాగ్ తనవేనని గుర్తించాడు. పక్కా ప్లాన్తోనే.. చోరీ తీరును పరిశీలిస్తే పక్కా ప్లాన్తోనే జరిగిందని అనుమానిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి లోపలి వీధిలోకి వచ్చిన దుండగుడు ప్రారంభంలో ఉన్న నివాసాల్లోకి వెళ్లకుండా సరాసరి మధుకిరణ్ ఇంట్లోకి ప్రవేశించాడు. కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్న కిరణ్ ఇంట్లో కలెక్షన్ డబ్బు ఉంటుందని గ్రహించే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెక్కీ నిర్వహించి ఇంట్లో విలువైన వస్తువులు, బీరువా తాళాలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకునే ఈ పనికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. సుమారు 20 రోజుల క్రితం మధుకిరణ్ ఇంట్లోని తలుపు మరమ్మతుల నిమిత్తం ఇద్దరు వచ్చారని, ఒకవేళ ఇది వారి పని అయ్యి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కిటికి గ్రిల్ తొలగించిన ప్రదేశంలో నేలపై తుప్పు పట్టిన మేకులు కూడా చల్లారని బాధితులు తెలిపారు.