కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య A wife assassinated her husband | Sakshi
Sakshi News home page

కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య

Published Fri, Jun 28 2024 4:29 AM | Last Updated on Fri, Jun 28 2024 4:29 AM

A wife assassinated her husband

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన తల్లీకూతురు

సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలంలో ఘటన  

సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. 

మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.

ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement