Indira
-
నేనేంటో చూపిస్తా.. నటిని బెదిరించిన సల్మాన్ ఖాన్!
తనపై చేయి చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని సల్మాన్ ఓ నటిని బెదిరించాడట.. దమ్ముంటే కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగానీ అంటూ రెచ్చగొట్టాడట! ఈ ఆసక్తికర విషయం గురించి బాలీవుడ్ నటి ఇందిరా కృష్ట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సల్మాన్ బెదిరించాడుఆమె మాట్లాడుతూ.. తేరే నామ్ సినిమాలో నేను సల్మాన్ను కొట్టే సన్నివేశం ఒకటుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశానికి ముందు సల్మాన్ నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను చిన్నగా కొట్టినా సరే నేనేం చేస్తానో చూడు. ఎంత రచ్చ చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. నాకు చాలా భయమేసింది. ఆ సీన్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆందోళన చెందాను. చేతులు వణికాయి. ఇంతలో సల్మాన్ అదంతా ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చాను.ఆ ఫీలింగే రాదుఅతడితో కలిసి పని చేయడం నాకెంతో ఇష్టం. పెద్ద హీరోతో పని చేస్తున్న భావన రాదు. అంత కలివిడిగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. తేరే నామ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు సతీశ్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఇందిర.. లేడీ విలన్ నీరజ అక్క మమత పాత్రలో నటించింది.చదవండి: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్కు భారీ ఊరట! -
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్పూర్కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
‘ఖలిస్థానీ‘ వివాదాస్పద పోస్టర్లు: ఘాటుగా స్పందించిన కెనడా మంత్రి
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం కలకలకలం రేపింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. ‘వాంకూవర్లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు వేశారు. కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా.. ‘భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి, మరోమారు హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.ఇది కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంప్టన్లో జరిగిన బెదిరింపుల కొనసాగింపని, కెనడాలోని హిందువులను భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుతున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్ చర్య అని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూన్పై కెనడాలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. ఇటీవల వాంకోవర్లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించే పోస్టర్లు వెలిశాయని పబ్లిక్ సేఫ్టీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ అఫైర్స్ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాలో నేపియన్ ఎన్నికల జిల్లాకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Khalistan supporters in Vancouver with posters, of Hindu Indian prime minister Indira Gandhi body with bullet holes with her bodyguards turned assassins holding their guns, are again attempting to instil fear of violence in Hindu-Canadians. This is continuation of threats with a… pic.twitter.com/ia8WQL4VtH— Chandra Arya (@AryaCanada) June 8, 2024 -
హెన్రీ కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ దౌత్య నిపుణుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ విధానం రూపశిల్పిగా పేరుగాంచిన హెన్రీ కిసింజర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు వందేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంగో బాధపడుతున్న కిసింజర్ కనెక్టికట్లో తన నివాసంలో బుధవారం కన్నుమూశారని ఆయన కన్సల్టెంగ్ కంపెనీ ‘కిసింజర్ అసోసియేట్స్’ ప్రకటించింది. అమెరికా విదేశాంగ విధానం గురించి ఎక్కడ చర్చ జరిగినా కిసింజర్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. అంతలా ఆయన తనదైన ముద్ర వేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్న కిసింజర్ 21వ శతాబ్దంలోనూ ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేశారు. ఏకకాలంలో రెండు కీలక పదవులు కిసింజర్ 1923 మే 27న జర్మనీలోని బవేరియన్ సిటీలో జని్మంచారు. యూదు మతస్తుడైన కిసింజర్ 1938లో తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్లోని మన్హట్టన్లో స్థిరపడ్డారు. మాతృభాష జర్మన్. ఇంగ్లిష్ భాష అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నప్పటికీ చనిపోయేదాకా జర్మన్ యాస మాత్రం ఆయనను వదల్లేదు. న్యూయార్క్ సిటీలోని జార్జి వాషింగ్టన్ హైసూ్కల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత అమెరికా సైన్యంలో చేరారు. మాతృదేశం జర్మనీలో అమెరికా తరఫున పోరాడారు. నిఘా విభాగంలో పనిచేశారు. జర్మనీలో నాజీలను ఓడించేందుకు తన వంతు సేవలందించారు. ఆయనకు ‘బ్రాంజ్ స్టార్’ లభించింది. తర్వాత అమెరికాకు తిరిగివచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పరిజ్ఞానం పెంచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నేత, న్యూయార్క్ గవర్నర్ నెల్సన్ రాక్ఫెల్లర్కు సలహాలు ఇచ్చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రైమరీల్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు రిచర్డ్ నిక్సన్ విజయం సాధించారు. దాంతో కిసింజర్.. నిక్సన్ వర్గంలో చేరిపోయారు. నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కిసింజర్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 1973లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఏకకాలంలో రెండు కీలక పదవుల్లో కిసింజర్ చక్రం తిప్పారు. కిసింజర్ తర్వాత అమెరికాలో ఈ రెండు పదవులను ఒకేసారి ఎవరూ నిర్వర్తించలేదు. వాటర్గేట్ కుంభకోణంలో నిక్సన్ రాజీనామా చేయడంతో అధ్యక్షుడైన గెరాల్డ్ ఫోర్డ్ హయాంలోనూ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా సేవలందించారు. వియత్నాంలో అమెరికా యుద్ధానికి ముగింపు పలికేలా చొరవ తీసుకున్నందుకు 1973లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఘర్షణలను నివారించడంలో కీలక పాత్ర పోషించారు. అత్యంత శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు పొందారు. ఆయనకు మొదటి భార్య ద్వారా ఎలిజబెత్, డేవిడ్ జన్మించారు. భారత వ్యతిరేక వైఖరి విదేశాంగ మంత్రిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. కార్పొరేషన్లకు, రాజకీయనాయకులకు, ప్రపంచ స్థాయి నేతలకు సలహాలు ఇస్తుండేవారు. సభలు, సమావేశాల్లో పాల్గొనేవారు. ప్రపంచ పరిణామాలపై తనఅభిప్రాయాలు వెల్లడించేవారు. పలు చిన్న, దుర్బల దేశాలపై అమెరికా యుద్ధాలు, దాడుల వెనుక కిసింజర్ దుష్ట రాజనీతి ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనను యుద్ధ నేరగాడిగా పలు దేశాలు అభివర్ణించాయి. కిసింజర్ రెండు సార్లు చైనాలో పర్యటించారు. సోవియట్ రష్యాకు చెక్ పెట్టడానికి చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 1971లో భారత్–పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్కు అండగా నిలిచింది. దీని వెనుక కిసింజర్ ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో భారత్ను కిసింజర్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. తరచూ విమర్శలు చేస్తుండేవారు. భారత్ను తప్పుపట్టినందుకు ఆ తర్వాతి కాలంలో ఆయన తన సన్నిహితుల వద్ద పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
రేవంత్ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం
సాక్షి, జనగాం: కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్.. కడియంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జాఫర్గడ్లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కడియం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఓ గజదొంగ. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇందిరపై, రేవంత్రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. కానీ, నాపై ఒక్క కేసు కూడా లేదు అని కడియం అన్నారు. నియోజక వర్గంలోని మాదిగలపై నిజంగా ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ఇందిరకు సవాల్ విసిరారాయన. ఇందిర తన ఆస్తుల్ని రాసిచ్చిన మరు క్షణమే తాను తన ఆస్తుల్ని రాసి ఇచ్చేస్తానని కడియం తెలిపారు. 2018 ఎన్నికల్లో రాజయ్య చేతిలో ఇందిర చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గం పైన అవగాహన లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదు. ఆపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టులో ఆ కేసు నడుస్తోంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండని ఆమెకు.. ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారాయన. -
ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? గాంధీ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు?
అది 2018వ సంవత్సరం.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం ముగిసింది. కమల్ నాథ్ అధికారం చేజిక్కించుకున్నారు. 2018 డిసెంబర్లో రాష్ట్ర 31వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ల తర్వాత దక్కిన అధికారం కాంగ్రెస్ చేతిలో 15 నెలలు మాత్రమే ఉంది. మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకటిన్నర దశాబ్దం తర్వాత కాంగ్రెస్ను విజయపథంలో నడిపించిన కమల్నాథ్ను ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ‘మూడవ కుమారుడు’ అనేవారు. అంతటి ఘనత సాధించిన కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ఎన్నికల రంగంలోకి దిగనుంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కమల్ నాథ్ 1946 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించారు. పాఠశాల విద్య తరువాత కమల్ నాథ్ కోల్కతాకు వెళ్లి, అక్కడ సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశారు. 1973, జనవరి 27న అల్కా నాథ్ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నకుల్ నాథ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కమల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు. 1980లో తొలిసారి ఇక్కడ గెలిచారు. అప్పుడు అతని వయస్సు కేవలం 34 సంవత్సరాలు. 1997 ఉప ఎన్నికలను మినహాయిస్తే చింద్వారాలో విజయపథంలో దూసుకెళ్లిన నేత కమల్ నాథ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పర్యావరణం, జౌళి, వాణిజ్యం, రోడ్డు రవాణా, రహదారుల వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆయనకు లభించాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్తో అనుబంధం ఉన్న నేతగా కమల్నాథ్ పేరు తెచ్చుకున్నారు. పాఠశాల రోజుల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కమల్ నాథ్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్కు అండగా నిలిచిన కమల్నాథ్.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మారారు. ఎమర్జెన్సీ ముగిసినప్పుడు కాంగ్రెస్కు గడ్డుకాలం ఎదురైంది. అదే సమయంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీపై వయసు ప్రభావం పడింది. ఉమ్మడి ప్రతిపక్షం ముందు కాంగ్రెస్ బలహీనపడింది. అలాంటి సమయంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కమల్నాథ్ పార్టీకి అండగా నిలిచారు. దీనికి ప్రతిఫలంగా ఇందిరాగాంధీ ఆయనకు చింద్వారా లోక్సభ టిక్కెట్ ఇవ్వడంతో కమల్నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. కమల్నాథ్ పేరిట రూ.7.09 కోట్ల విలువైన చరాస్తులు, రూ.181 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కమల్నాథ్, ఆయన కుటుంబం పేరిట మొత్తం 23 కంపెనీలు, ట్రస్టులు రిజిస్టర్ అయ్యాయి. ఆయనకు చింద్వారా జిల్లాలో దాదాపు 63 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? తరువాత ఏం జరిగింది?
అది 1974వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీకి సమీపంలోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్లో ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. గుర్జర్ నేత రామచంద్ర వికల్కు ఓటు వేయాలని ఇందిర అభ్యర్థించాల్సివుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీతోపాటు పార్టీ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో గుర్జర్ నేత వికల్ రూపంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంది. ఆ సమయంలో రామచంద్ర వికల్ బాగ్పత్ ఎంపీగా ఉన్నారు. దాద్రీ ప్రాంతం.. తిరుగుబాటు రైతు నేత బీహారీ సింగ్కు బలమైన కంచుకోట. అతను ఈ ప్రాంత నివాసి. ఇందిరా గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచారు. అయినా వీటిని గుర్తించకుండా ఇందిర.. గుర్జర్ నేత వికల్ను రంగంలోకి దించారు. టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన బీహారీ సింగ్ తిరుగుబాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బీహారీ సింగ్కు ఎన్నికల చిహ్నంగా ‘సింహం’ గుర్తు కేటాయించారు. ఈ నేపధ్యంలో బీహారీ సింగ్.. తనకు టిక్కెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, అయితే వికల్కు అనుకూలంగా బహిరంగ సభ పెట్టవద్దని ఇందిరాగాంధీకి సందేశం పంపినా, ఆమె పట్టించుకోలేదు. బిహారీ సింగ్ బాగీ ఆ రోజు జరగాల్సిన ఇందిరాగాంధీ బహిరంగ సభను ఆపేందుకు ప్లాన్ వేశారు. ఆ సమయంలో దాద్రీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్లో ఓ సర్కస్ నడుస్తోంది. బిహారీ సింగ్ ఆ సర్కస్ నుండి 500 రూపాయలకు ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని బోనులో ఉంచారు. ఇందిరా గాంధీ సభ ప్రారంభం కాగానే బిహారీ సింగ్ సింహం ఉన్న బోనుతో సహా సమావేశానికి చేరుకుని, ఒక్కసారిగా బోను తెరిచారు. సింహం బయటకు రాగానే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. జనం చెల్లాచెదురయ్యారు. ఫలితంగా ఇందిర తన సభను 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది. బీహారీ సింగ్ బాగీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా ఓటమిపాలయ్యారు. బిహారీ సింగ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా సన్నిహితుడు. 1992లో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో బిహారీ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 2020 నవంబరు 29న బిహారీ సింగ్ బాగీ మరణించారు. త్వరలో బిహారీ సింగ్ విగ్రహాన్ని అతని స్వగ్రామమైన రుబ్బాస్లో ఆవిష్కరించనున్నారు. ఇది కూడా చదవండి: పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి..
దేశ రాజధాని ఢిల్లీ లేదా ఇటువంటి మెట్రో నగరాల్లో ఏదో విషయమై అప్పుడప్పుడు అల్లర్లు చోటుచేసుకుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య జిల్లా హింసాత్మకంగా మారింది. పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ఐదు అతిపెద్ద అల్లర్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. 1. సిక్కు అల్లర్లు(1984) దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఇవి చోటుచేసుకున్నాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది ఆమె అంగరక్షకులే. వారు సిక్కు మతానికి చెందినవారు. అందుకే ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని ప్రజలు సిక్కులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోతకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఐదు వేల మంది మరణించారని చెబుతుంటారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఇందిరా గాంధీ హత్యకు కారణం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అని చెబుతుంటారు. నాడు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె భారత సైన్యాన్ని ఆదేశించారు. ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. ఆలయంలోకి ప్రవేశించిన జర్నైల్ సింగ్, భింద్రన్వాలే అతని సహచరులు ఆలయం లోపల ఉన్న సైనికులపై దాడి చేశారు. దీంతో ఇందిర ప్రభుత్వం తుపాకులతో దాడి చేయాలని సైనికులను ఆదేశించింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్వాలే, అతని సహచరులు మరణించారు. 2. భాగల్పూర్ అల్లర్లు(1989) 1947లో చోటుచేసుకున్న భాగల్పూర్ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అల్లర్ల జాబితాలో ఉంటాయి. ఈ అల్లర్లు 1989 అక్టోబర్లో భాగల్పూర్లో జరిగాయి. హిందూ- ముస్లిం వర్గాల మధ్య ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 3. ముంబై అల్లర్లు (1992) ఈ అల్లర్లకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత. ఈ హింస డిసెంబర్ 1992లో ప్రారంభమై జనవరి 1993 వరకు కొనసాగింది. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 900 మంది చనిపోయారు. వీరిలో 575 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తుతెలియని వారు, మరో ఐదుగురు ఉన్నారు. సుధాకర్ నాయక్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యిందని నిరూపితమయ్యింది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవవలసి వచ్చింది. 4. గుజరాత్ అల్లర్లు(2002) గుజరాత్లోని గోద్రాలో జరిగిన అల్లర్లు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అల్లర్లు. గోద్రా ఘటన 2002లో జరిగింది. 27 ఫిబ్రవరి 2002న రైల్వే స్టేషన్లో ఒక గుంపు సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్కు నిప్పు పెట్టడంతో 59 మంది కరసేవకులు మరణించారు. ఫలితంగా గుజరాత్ అంతటా మతకల్లోలాలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారు. ఆ సమయంలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 5. ముజఫర్నగర్ (2013) ఈ అల్లర్లు ముజఫర్నగర్ జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగాయి. దీని కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఆగస్టు 27న కవాల్ గ్రామంలో జాట్ సామాజికవర్గ బాలికపై ముస్లిం యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు గురైన బాలిక బంధువు.. ఆ ముస్లిం యువకుడిని హత్య చేశాడు. తరువాత దీనికి ప్రతిగా పలువురు ముస్లింలు.. ఆ బాలిక సోదరులను హత్యచేశారు. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు?
ఆమధ్య రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. తాను పండిట్ నెహ్రూ పేరు చెప్పడాన్ని మర్చిపోతే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందన్నారు. కానీ నెహ్రూ ఇంటిపేరును కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉపయోగించరని ప్రశ్నించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, రాయ్ బరేలీ ఎంపీ అయిన తన ముత్తాత ఫిరోజ్ గాంధీ ఇంటి పేరును రాహుల్ గాంధీ తన ఇంటి పేరుగా పొందారు. ఫిరోజ్ గాంధీ 1960లో తన 48 ఏళ్ల వయసులో మరణించారు. ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘంఢీ. ఆయన 1912,సెప్టెంబర్ 12న బొంబాయిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు రతిమాయి, జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ. వీరు పార్సీ మతానికి చెందివారు. జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ మెరైన్ ఇంజనీర్. తండ్రి మరణించినప్పుడు ఫిరోజ్ గాంధీ చాలా చిన్నవాడు. యువ ఫిరోజ్ నాటి రోజుల్లో లేడీ డఫెరిన్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్న తన అత్త షిరిన్ దగ్గర ఉండేందుకు అలహాబాద్ చేరుకున్నారు. ఫిరోజ్ అలహాబాద్లోని ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఫిరోజ్ గాంధీ జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం. రెండవది నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడటం. ఫిరోజ్ గాంధీ ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ ఆ కళాశాల వెలుపల జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఒకరోజు ఆమె అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఫిరోజ్ ఆమెకు సాయం అందించారు. ఆ రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులకు ‘ఆనంద్ భవన్’ కేంద్రంగా ఉండేది. అక్కడి నుంచే ఫిరోజ్ స్వాతంత్ర్య ఉద్యమ భాగస్వామ్యం కొనసాగింది. అదే సమయంలో ఫిరోజ్ తన ఇంటిపేరులో ‘ఘంఢీ’ని ‘గాంధీ’గా మార్చుకున్నారు. మహాత్మా గాంధీపై గల గౌరవంతోనే ఫిరోజ్ తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీతో పరిచయం ఏర్పరుచుకున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. ఫిరోజ్ ఆమె కంటే 5 ఏళ్లు పెద్ద. కాగా కమలా నెహ్రూ.. ఇందిర, ఫిరోజ్ల వివాహాన్ని వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా చాలా తక్కువగా ఉన్నదని అన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ సాగరిక ఘోష్ తన పుస్తకం ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’లో.. టీబీ కారణంగా కమలా నెహ్రూ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఫిరోజ్ ఆమెను చికిత్స కోసం జర్మనీ తీసుకువెళ్లారని రాశారు. ఇది కూడా చదవండి: లండన్లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి? -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్లో, మూడవ భాగాన్ని సూరత్లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు?
ఆమధ్య ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో మన దేశానికి దక్షిణాన ఉన్న కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. భారత్- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం గత కొన్నేళ్లుగా భారతదేశంలో చర్చనీయాంశంగా ఉంది. ఈ ద్వీపం గురించి ప్రధాని మాట్లాడుతూ 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవును శ్రీలంకకు కానుకగా ఇచ్చారని, అయితే ఈ ద్వీపం భారత్లో భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామేశ్వరంనకు 12 మైళ్ల దూరంలో.. కచ్చతీవు ద్వీపం భారతదేశంలోని రామేశ్వరం- శ్రీలంక ప్రధాన భూభాగం మధ్య పాక్ జలసంధిలో ఉన్న జనావాసాలు లేని ఒక ద్వీపం. ఇక్కడ చుక్క నీరు కూడా దొరకదు. ఈ ద్వీపం బంగాళాఖాతం- అరేబియా సముద్రాలను కలుపుతుంది. కచ్చతీవు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం నుండి 12 మైళ్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాలోని నెందురికి 10.5 మైళ్ల దూరంలో ఉంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం 300 మీటర్ల వెడల్పు కలిగివుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం ఈ ద్వీపంలో మత్స్యకారుల ఆరాధనా స్థలం సెయింట్ ఆంథోనీ చర్చి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ చర్చిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలలో భారత్, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు పాల్గొంటారు. ఇక్కడి పగడపు దిబ్బల కారణంగా భారీ ఓడలు ఈ ప్రాంతంలో ప్రయాణించలేవు. 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఈ ద్వీపం ఏర్పడిందని చెబుతారు. ఈ ద్వీపానికి సంబంధించి భారత్, శ్రీలంకల మధ్య ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత్, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు ఈ ద్వీపంలో చేపలు పట్టేవారు. ఈ ద్వీపం రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేది. తరువాత భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగినప్పుడు ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోకి చేరింది. 1974-76లో ఇరు దేశాల మధ్య ఒప్పందం 1921లో ఈ ద్వీపానికి సంబంధించి శ్రీలంక, భారత్ల మధ్య ఒప్పందం జరిగినా ఫలితం లేకపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ దీవి గుర్తింపు విషయంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1970వ దశకంలో, భారతదేశం- శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దు నిర్ధారణపై చర్చలు ప్రారంభమైనప్పుడు, 1974-76లో ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా, శ్రీమావో బండారునాయకే శ్రీలంక అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు చెందుతుంది. నాటి ఒప్పందం ప్రకారం భారతీయ మత్స్యకారులు వీసా లేకుండా ఈ ద్వీపంలో విశ్రాంతి తీసుకోవడానికి, వలలు ఆరబెట్టడానికి, సెయింట్ ఆంథోనీ పండుగను జరుపుకోవడానికి అనుమతి ఉంది. అయితే 2010లో ఎల్టీటీఈ తిరుగుబాటు ముగిసిన తరువాత శ్రీలంక మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపలు పట్టడం ప్రారంభించారు. అయితే శ్రీలంక నేవీ ఈ ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల రాకను నిలిపివేసింది. దీనిపై వివాదాలు తలెత్తేవి. సుప్రీం కోర్టుకు చేరిన వివాదం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై చాలాకాలంగా వ్యతిరేకత ఉంది. 1991లో తమిళనాడు శాసనసభలో ద్వీపాన్ని తిరిగి భారతదేశంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. 2008లో అప్పటి జయలలిత ప్రభుత్వం ఈ విషయమై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఇంకా పరిశీలనలో ఉంది. తమిళనాడు డిఎంకె, ఐడిఎంకె పార్టీలు ఈ అంశాన్ని తరచుగా లేవనెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ కూడా లోక్సభలో కచ్చతీవును అంశాన్ని ప్రస్తావించారు. ఈ ద్వీపానికి సంబంధించి ఇందిరా గాంధీ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తే, శ్రీలంక భారత్ను అంతర్జాతీయ కోర్టుకు లాగుతుందనే వాదన వినిస్తున్నది. కచ్చతీవు విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్! -
ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ!
ప్రతీయేటా జూలై 15న స్వాతంత్ర్యసమరయోధుడు, రాజనీతిజ్ఞుడు కుమారస్వామి కామరాజ్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి. కామరాజ్ రాజకీయ చతురతకు పేరుగాంచారు. జవహల్లాల్ నెహ్రూ మరణాంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షునిగా కామరాజ్ పార్టీకి సారధ్యం వహించారు. కామరాజ్ తనకు ప్రధానమంత్రికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నా ఆ అవకాశాన్ని లాల్బహదూర్శాస్త్రి, ఇందిరాగాంధీలకు కల్పించడంలో ప్రధాన భూమిక వహించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి నాటి రోజుల్లో ఒక నేతగా, ముఖ్యమంత్రిగా కామరాజ్ మద్రాస్(ప్రస్తుతం తమిళనాడు)లో విశేష రీతిలో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఆయన భారీగా పెట్టుబడులు కేటాయించారు. కామరాజ్ పరిపాలనా కాలంలో మద్రాస్ భారతదేశంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రంగా పేరొందింది. ఇందుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందించిన భారీ సాయం దోహదపడింది. 1976లో కామరాజ్ భారత అత్యున్న పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నారు. కామరాజ్ జన్మదినాన తమిళనాడులోని అన్ని స్కూళ్లలో ‘ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డే’ని నిర్వహిస్తుంటారు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే.. కామరాజ్ నాడార్ (వెనుకబడిన కులం) కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య కూడా పూర్తి కాకుండానే తన 11 సంవత్సరాల వయస్సులో మదురై సమీపంలోని తన మామ కిరాణా దుకాణంలో పని చేశారు. ఈ సమయంలోనే అతనిలో రాజకీయాలపై, స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి ఏర్పడింది. కామరాజ్ను నాటి జలియన్వాలాబాగ్ ఊచకోత అమితంగా కలచివేసింది. కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్గా చేరిన కామరాజ్ 1940లో పార్టీ మద్రాసురాష్ట్ర విభాగానికి అధిపతిగా ఎదిగారు. అతను 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ కామరాజ్ను మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలోనే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుంది. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. ఆరు వేల పాఠశాలలను తిరిగి తెరిపించి.. 1952లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది సి రాజగోపాలాచారి ఎంపికయ్యారు. అయితే 1954లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో రాజగోపాలాచారికి విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో అనుభవం ఉన్న నాయకుడి స్థానంలో యువ నాయకుడిని (కామరాజ్) నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఆ పదవిని అధిష్టించిన కామరాజ్ తొలుత 1953లో రాజాజీ ప్రవేశపెట్టిన కుల ఆధారిత సవరించిన ప్రాథమిక విద్య పథకాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి తెరిపించారు. తన పదవీకాలంలో 12,000 పాఠశాలలను నిర్మించారు. 11వ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు. పార్టీకి కలసివచ్చిన కామరాజ్ ప్రణాళిక 1963లో నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతున్న దశలో కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ‘నెహ్రూ తర్వాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలోనూ మెదిలింది. అప్పుడే పార్టీని పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు కామరాజ్ ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వంలో ఉన్న నేతలు సంస్థాగత పనులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. 1963 ఆగస్టు 10న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానంలో కామరాజ్ ప్రణాళిక ఆమోదం పొందింది. శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ 1964 మే 27న నెహ్రూ మరణించారు. నెహ్రూ లాంటి వారు మరొకరు లభ్యం కారని భావించిన కామరాజ్ వివాద రహిత నేత లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టడంలో కీలకపాత్ర వహించారు. అనంతరం కామరాజ్ పార్టీని సమాఖ్య నాయకత్వ వ్యవస్థ వైపు నడిపించడానికి ప్రయత్నించారు. 1966లో శాస్త్రి కన్నుమూశారు. అనంతరం గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ, శాస్త్రిలను కోల్పోయిన క్లిష్ట సమయాలను కాంగ్రెస్ అధిగమించేందుకు కామరాజ్ విశేష కృషి చేశారు. అనంతరం శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నుకోవడంలో కామరాజ్ కీలక పాత్ర పోషించారు. 1966 జనవరి 24న ఇందిర ప్రధాని పదవిని అలంకరించారు. 72 ఏళ్ల వయసులో కన్నుమూత ఇందిరాగాంధీ పదవిలో ఉన్న సమయంలో ఆమె మద్దతుదారులకు, మరికొందరు పార్టీ నేతలకు మధ్య విబేధాలు పొడచూపాయి. ఇది చివరకు 1969లో పార్టీ చీలికకు దారితీసింది. పార్టీపై కామరాజు ప్రభావం తగ్గిపోయింది. 1967 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడించింది. కామరాజ్ ఓటమి పాలయ్యారు. 1971లో ఇందిరను ఓడించాలని భావించిన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇందిరా కాంగ్రెస్ (రిక్విజిషన్) కాంగ్రెస్ (ఓ)ని ఘోరంగా ఓడించింది. కామరాజ్ 1975లో తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్లతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్లో సన్బాత్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు. ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
తల్లి బర్త్డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్
సూపర్స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేశ్ తల్లికి బర్త్డే విషెస్ తెలియజేశారు. కుటుంబసభ్యుల మధ్య ఆమె పుట్టినరోజును జరుపుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ భార్యకు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ ఈ వేడకల్లో సూపర్ స్టార్ కృష్ణ, నమ్రత, సితార, గౌతమ్, ప్రియదర్శిని, మంజులా, గల్లా జయదేవ్ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో మిగతా కుటుంబసభ్యులు పాల్గొనగా మహేశ్ బాబు మాత్రం మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతోనే మహేశ్ రాలేకపోయారని తెలుస్తుంది. చదవండి: సర్కారు వారి పాట: ఫైనల్ షూటింగ్ -
ప్రేమ్ ఇల్లమ్.. వీల్చెయిర్తోనే నడిపిస్తోంది
వైకల్యంతో వీల్ చెయిర్కు పరిమితమైన ఇందిర ను చైల్డ్కేర్ హోమ్లో చేర్చారు తల్లిదండ్రులు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇందిరను కలిసేవారు. ఇందిరకేమో వాళ్లను పదేపదే చూడాలనిపించేది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షం గా అనుభవించిన ఇందిర తనలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ‘ప్రేమ్ ఇల్లమ్’ పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ.. 30 మంది పిల్లలను అమ్మలా ఆదరిస్తున్నారు. ఇందిరకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చి తొంభైశాతం వైకల్యానికి గురైంది. నడవడానికి రెండు కాళ్లు సహకరించనప్పటికీ ‘ఏదోఒకరోజు నేను నడవగలుగుతాను’ అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నైలోని ఓ షెల్టర్ హోంలో ఇందిరను చేర్చారు. హోమ్లో ఉన్న పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడితే ఇందిర మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది. అన్నయ్య ప్రోత్సాహంతో.. షెల్టర్ హోమ్లో సైకాలజిస్టుగా పనిచేస్తోన్న అన్నయ్య సెల్విన్ ఇందిర ఆసక్తిని గమనించి తల్లిదండ్రులతో మాట్లాడి ఇందిర డైలీ స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. ఇందిర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనని తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ, అన్న అండతో‡ధైర్యం గా ముందుకు సాగింది. కానీ చాలా స్కూళ్లు ఇందిర వైకల్యాన్ని సాకుగా చూపించి అడ్మిషన్ ఇవ్వడానికి వెనకాడాయి. ఎట్టకేలకు ఒక స్కూలు ఇందిరకు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన ఇందిర అనేక భయాలు, ఆత్మనూన్యతకు లోనైనప్పటికీ అంకిత భావంతో ఎంతో కష్టపడి చదివి ఎస్ఎస్ఎల్సీ మంచి మార్కులతో పాసైంది. అలాగే డిగ్రీ, ఎంసీఏ కూడా పూర్తి చేసింది. ప్రేమ్ ఇల్లమ్.. ఇందిర లాంటి వాళ్లను మరింత మందిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సెల్విన్ 1999లో ‘ప్రేమ్ ఇల్లమ్’ను స్థాపించి వైకల్యం గలిగిన పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇందిర ఎంసీఏ అయ్యాక ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రేమ్ ఇల్లమ్లో చేరి సేవ చేయాలని నిర్ణయించుకుంది. 2017 నుంచి ప్రేమ్ ఇల్లమ్ సంస్థకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ ఇల్లమ్లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఐదుగురు స్కూలుకెళ్తుండగా మిగతా వారంతా హోమ్లోనే ఉంటున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఇందిర స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఈడీ చేసి వారికి పాఠాలు చెబుతోంది. అంతేగాక 2019 నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ, ఆ పంటలతోనే షెల్టర్ హోమ్ పిల్లలకు భోజనం పెడుతుండడం విశేషం. కరోనా కష్టకాలంలో గ్రామంలోని పాజిటివ్ పేషంట్లకు భోజనాన్ని పంపిణీ చేసింది. ‘‘నా చిన్నప్పటినుంచి పన్నెండేళ్ల వరకు షెల్టర్ హోంలో గడిపాను. దీంతో బయట సమాజంలో ఎలా ఉంటుందో తెలిసేది కాదు. శారీరక, మానసిక వైకల్యం లేని పిల్లల్ని ఎప్పుడూ కలవలేదు. ఎనిమిదో తరగతిలో చేరి కొత్తకొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడం, తోటి విద్యార్థులతో కలవడం కష్టంగా ఉండేది. రోజూ స్కూలు అవగానే అన్నయ్య దగ్గర బాధపడేదాన్ని. ‘‘నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను నువ్వు గట్టిగా నమ్ము’’ అని వెన్ను తట్టి చెప్పేవారు. అ ప్రోత్సాహంతోనే ఎంసీఏ వరకు చదివాను. నాకు ఒకరు ఏవిధంగా చెయ్యందించారో అలానే నేను నాలాంటి వాళ్లకు సాయం చేయాలని ప్రేమ్ ఇల్లమ్లో పని చేస్తున్నాను. మేము సేంద్రియ పద్ధతిలో ఒక్కో పంటకు 25 బస్తాల ధాన్యాన్ని పండిస్తాము. అవి హోమ్లో ఉన్న పిల్లలకు సరిపోతాయి. కూరగాయలు, పండ్ల చెట్లు కూడా పెంచి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం’’ అని ఇందిర చెప్పింది. పట్టుదలకు వైకల్యం అడ్డురాదని, ఎంతటి పనినైనా సాధించవచ్చని ఇందిర ‘ప్రేమ్ ఇల్లమ్’ నిరూపిస్తుంది. -
కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా హృదయేశ్ ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఏప్రిల్లో కోవిడ్ బారిన పడిన ఆమె కోలుకున్నారు. తర్వాత ఆమె గుండెకు శస్త్రచికిత్స కూడా జరిగింది. శనివారం రాష్ట్ర పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె.. ఉత్తరాఖండ్ సదన్లో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు సుమిత్ హృదయేశ్ తెలిపారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ స్థానం నుంచి ఎన్నికైన ఇందిర, రాష్ట్ర కాంగ్రెస్ అంత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ఆమె రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 2012-2017 సంవత్సరాల్లో పనిచేశారు. ఇందిర మృతిపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. -
జూడాల సమస్యలను పరిష్కరించాలి: ఇందిరాశోభన్
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లను తెలంగాణ సర్కార్ విస్మరించడం సరికాదని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జూడాలకు 10 శాతం ఇంటెన్సివ్ ఇస్తానన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందన్నారు. వేతనాల పెంపుపై గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కరోనా బారిన పడ్డ జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పేషంట్లకు చికిత్స చేస్తున్న వారి ఆరోగ్యానికే భద్రత లేకుండా ఎలా అని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసుపై ఆరా తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ రోజే వాళ్లని పిలిచి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జూడాలను చర్చలకు ఆహ్వానించి.. సమ్మెను విరమింపజేయాలన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పంతాలకు పోకుండా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. చదవండి: ‘కేసీఆర్.. మీది గుండెనా.. బండనా..?: వైఎస్ షర్మిల సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్బాబు తల్లి ఇందిరా దేవి గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తల్లితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఏప్రిల్ 20. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అమ్మ పుట్టినరోజు. హ్యపీ బర్త్డే అమ్మ’’ అంటూ తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాగా ఇందిర.. నటుడు కృష్ణ మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. (సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి) April 20!! A very special day of the most special person in my life... Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020 కాగా మహేష్ సోదరి మంజులా కూడా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తన వ్యక్తిత్వంలాగే అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. మా ప్రతి రోజును గొప్పగా తీర్చిదిద్దుతుంది. తన మంచితనం, అప్యాయత, ప్రేమ మా హృదయాలను తాకుతుంది. మా కుటుంబానికిక వెన్నుముక తను. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాం’ అంటూ మంజులా ట్వీట్ చేశారు. The charmer that she is,she always wears a smile as beautiful as her personality.💛 She brightens up our day,has always touched our hearts with kindness,goodness,https://t.co/en89wteV3w the woman of the family,she truly is the backbone of it all,we love you.Happy Birthday Amma♥️ pic.twitter.com/nlvBN69p6S — Manjula Ghattamaneni (@ManjulaOfficial) April 20, 2020 కాగా మహేష్ తల్లి ఇందిర బయట కనిపించడం చాలా అరుదు. ఇందిర కృష్ణకు మేన మరదలు. 1961లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు. అయితే కొంత కాలానికి కృష్ణ.. విజయ నిర్మలను వివాహం చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిరాను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. (యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక ) ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్తోనే.. జక్కన్న క్లారిటీ -
దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. ఇందిరా అలాంటి సలహా ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు. ఇలాంటి వాళ్ల వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాను నిర్భయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అయితే ఉరిశిక్షకు కూడా తాను పూర్తి వ్యతిరేకమని ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు.. రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి కూడా నలుగురు దోషులను క్షమించాలని ట్విటర్ వేదికగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన నిర్భయ తల్లి... ‘నాకు ఇలాంటి సలహా ఇవ్వడానికి అసలు ఇందిరా జైసింగ్ ఎవరు? దోషులను ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటోంది. నిజానికి ఇందిరా లాంటి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదు. అసలు ఆమె ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆమెను చాలాసార్లు నేరుగా కలిశాను. కానీ ఎప్పుడూ కూడా నా క్షేమ సమాచారాల గురించి ఆమె అడగలేదు. కానీ ఈరోజు దోషుల తరఫున మాట్లాడుతోంది. ఆమె లాంటి వాళ్లు రేపిస్టులకు మద్దతు పలుకుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా? చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని Asha Devi on senior lawyer Indira Jaising's statement 'follow Sonia Gandhi's example and forgive convicts': Who is Indira Jaising to give me such a suggestion?Whole country wants the convicts to be executed. Just because of people like her, justice is not done with rape victims. pic.twitter.com/k3DfgRQio3 — ANI (@ANI) January 18, 2020 -
జీవన శైలి వల్ల కూడా సంతాన లేమి
భారతదేశంలో సంతానం లేని వారి శాతం వేగంగా పెరుగుతోంది. జీవన శైలిలో వచ్చిన మార్పులతో పాటు అనేక కారణాలతో దేశంలో సుమారు 15 శాతం దంపతులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారిలో ఒక శాతం మంది మాత్రమే ఐ.వి.ఎఫ్., ఇతర అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ‘‘సంతానలేమి సమస్య ఎక్కువైందని, ఇందుకు పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ భారతదేశం వంటి విస్తారమైన దేశంలో కేవలం ఒక శాతం దంపతులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉండడం విచారకరం’’ అని ఇందిరా ఐ.వి.ఎఫ్. గ్రూప్ చైర్మన్ డా. అజయ్ ముర్దియా అంటున్నారు. ఇందిరా ఐవీఎఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్లలో నూతనంగా రెండు ఆస్పత్రులను ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలు లేని దంపతులకోసం సెప్టెంబర్ 10 వరకు ఉచిత అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
ఇందిరా.. గో బ్యాక్..
సాక్షి, లింగాలఘణపురం: గో బ్యాక్.. గో బ్యాక్.. ఇందిరా గో బ్యాక్ అంటూ స్టేషన్ఘన్పూర్ మహాకూటమి అభ్యర్థి సింగపురం ఇందిరను కుందారంలో యువకులు అడ్డుకున్నారు. జనగామ జిల్లా ఉద్యమంలో కనిపించని ఇందిరా నేడు జఫర్గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలుతానంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం పట్ల మండలంలోని కుందారం గ్రామంలో ఆదివారం రాత్రి ఆమెకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా రోడ్షో ఆదివా రం మండలంలోని నెల్లుట్ల నుంచి ప్రారంభించారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుందారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్న సమయంలో స్థానిక యువకులు కొంతమంది ఇందిరా గో బ్యాక్ అంటూ నినదిం చారు. జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమాల ఫలితంగా జరిగిందని, అలాంటి జిల్లా ఉనికి కోల్పో యే విధంగా జఫర్గడ్ మండలాన్ని అధికారంలోనికి వస్తే వరంగల్లో కలుపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావంటూ ప్రశ్నించారు. దీంతో స్థానిక యువకులకు, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది. జై జనగామ..జైజై జనగామ అంటూ పెద్ద ఎత్తున యువకులు నినదించారు. -
బాబొచ్చాడు.. బార్లొచ్చాయి...
బొబ్బిలి: బాబు వస్తే జాబొస్తుందని నమ్మించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు వి.ఇందిర విమర్శించారు. సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం అమ్మకాలకు లక్ష్యాలు విధించి మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఆదాయ వనరుగా పరిగణిస్తుందని, మీరయినా దృష్టి సారించి నియంత్రించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు లేఖలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 20వేల లేఖలు రాయగా అందులో బొబ్బిలి ప్రాంతం నుంచే పదివేల లేఖలుండటం విశేషమని చెప్పారు. మద్యం కారణంగా మహిళలపై హింస, అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మద్యానికి బానిసలై ఇంటిని పట్టించుకోకపోవడంతో మహిళలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. యువత మద్యానికి బానిసవడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ అమ్ముతున్నారో చూపించాలని ప్రశ్నిస్తున్నారని, అసలు ఎక్కడ అమ్మడం లేదో వారే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ఆమె వెంట కె.పుణ్యవతి, సీహెచ్ రమణమ్మ, పి.సత్తెమ్మ, ఎస్.రాముడమ్మ తదితరులు ఉన్నారు. -
ఇందిరకే అత్యంత ప్రజాదరణ
శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య భారతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీయేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. తిరుగులేని నిర్ణాయాత్మక నేతగా పేరు సంపాదించుకున్న ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వానికి సందేశాన్నిచ్చారు. సంస్థాగత విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇందిర శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘ఇండియాస్ ఇందిర – ఎ సెంటెన్నియల్ ట్రిబ్యూట్’ పుస్తకాన్ని ప్రణబ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో రెండోసారి కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత నెలకొన్న దుర్భర పరిస్థితుల్లోనూ ఇందిర కేవలం రెండునెలల్లోనే ఎన్నికలు ఎదుర్కొని కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చారన్నారు. ఇందుకు ఆమె వేగంగా, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమే కారణమన్నారు. ‘20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకుల్లో ఆమె ఒకరు. ఆమె మరణించి ఇన్నేళ్లయినా నేటికీ ప్రజాస్వామిక భారతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఆమెనే’ అని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఉప రాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొన్నారు. -
చిరస్మరణీయురాలు ఇందిరా గాంధీ
– కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. శనివారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని డీసీసీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుత.. ఇందిరా గాంధీ ప్రధామంత్రిగా పనిచేసిన సమయంలో బంగ్లా విముక్తికోసం పాకిస్తాన్పై యుద్ధం చేసి విజయం సాధించరన్నారు. పేదల కోసం బ్యాంకుల జాతీయికరణ, గరిబీ హఠవో, హరిత విప్లవాలను ప్రోత్సహించారన్నారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం వెనుక ఉన్న బండారాన్ని త్వరలో బయట పెడతామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ నాయకులంతా బైక్లపై ర్యాలీగా వచ్చి రాజ్విహార్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్కు వెళ్లారు. ఉల్లిరైతును ఆదుకోవడంలో విఫలం ఉల్లిరైతును ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లిని రోడ్లపైనే పడేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, శాసనమండలిలో విపక్షనేత రామచంద్రయ్య, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, పనబాక లక్ష్మీ, కిల్లి కృపారాణి, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. అతిథి గృహం నిర్వాహకులపై కోట్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం నిర్వాహకులపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రెస్మీట్ నిర్వహణ కోసం మీటింగ్ హాల్ను ఇవ్వకపోడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు.అతిథి గృహం ఏమైనా కలెక్టర్/జేసీ సొంత ఆస్తినా అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు అయి ఉండి తెలుగుదేశం ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
థ్రిల్లర్ సినిమాగా ఇందిరాగాంధీ ప్రసంగం..
న్యూఢిల్లీః అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగం.. సినిమాగా రూపొందుతోంది. 40 ఏళ్ళ క్రితం 1975 జూన్ 25న భారత్ లో ఎమర్జెన్సీని విధించి... ఆరోజు రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఆమె ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం ప్రముఖ బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'సన్ పఛత్తర్' గా విడుదల కాబోతోంది. ఎమర్జెన్సీ పై నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగం ఓ కథా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షయ్' ఫేమ్ సందీప్ మాధవన్ భయంకరమైన (పానిక్) సౌండ్ ట్రాక్ ను అందించారు. ఆల్ ఇండియా రేడియోలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగంపై రూపొందుతున్న ఈ కథా చిత్రానికి సంబంధించిన అన్ని ఆడియో హక్కులను ఆల్ ఇండియా రేడియోనుంచి, వీడియో హక్కులను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాత కబీర్ లోవీ ఓ ప్రకటనలో తెలిపారు. 'సన్ పఛత్తర్' సినిమాలో స్టార్ నటుడు కె కె మెనన్, ప్రవేశ్ రాణా, కీర్తి కుల్హారీలు నటిస్తుండగా, 'తమాన్ ఛే' ఫేమ్ నవనీత్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇందిర (28) శుక్రవారం బలవన్మరణం చెందింది. నిజామాబాద్ రూరల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ఆమెకు ఆరు నెలల క్రితం వివాహమైంది. భర్తతో తలెత్తుతున్న మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల కిందట విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని చనిపోయింది. మనోవేదనతోనే ఇందిర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
గాంధీ, నెహ్రూ, ఇందిర గ్రేట్..!
సదస్సులో ఆఫ్రికా నేతల ప్రశంసలు న్యూఢిల్లీ: ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో పలువురు ఆఫ్రికా అగ్ర దేశాల అధినేతలు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. భారత్- ఆఫ్రికాల మధ్య సత్సంబంధాలకు ఆ ముగ్గురు నేతలు చేసిన కృషిని, ఆఫ్రికా, ఇండియాల మధ్య చరిత్రాత్మక సంబంధాలను తమ ప్రసంగాల్లో వారు గుర్తు చేశారు. ‘దాదాపు శతాబ్ద కాలంగా ఆఫ్రికా, భారత్లను ఐక్యంగా ఉంచుతున్న బంధాలను, ఆ విషయంలో ఇద్దరు దార్శనిక ప్రధానులైన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చూపిన చొరవను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పేర్కొన్నారు. 1955లో జరిగిన ప్రఖ్యాత బాండుంగ్ సదస్సులో, అనంతరం అలీనోద్యమంలో నెహ్రూ పోషించిన పాత్రను జుమా గొప్పగా ప్రశంసించారు. ఆఫ్రికా - ఇండియా డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏర్పాటులో, ఆఫ్రికా దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో ఇందిరాగాంధీ అందించిన సహకారం మరవలేనిదన్నారు. అహింసా విధానంలో వలసపాలనకు అంతం పలికే ఉద్యమానికి గాంధీ, నెహ్రూలు నేతృత్వం వహించారని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ను గొప్ప పార్టీగా ముగాబే అభివర్ణించారు. ఆఫ్రికాలో వలస పాలనకు వ్యతిరేకంగా నెహ్రూ, తన తాత కలిసి పనిచేశారని మొరాకో రాజు మొహమ్మద్6 గుర్తు చేశారు. -
‘సుప్రీం’కు తల్లీకూతుళ్ల వివాదం
- హైకోర్టు తీర్పు నిలుపుదలకు నిరాకరణ - ‘బీఈ’ వివాద పరిష్కార బాధ్యతలు పెద్ద మనుషులకు - ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ (బీఈ) యాజమాన్యపు హక్కు విషయంలో తల్లీ, కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. కంపెనీ డెరైక్టర్లుగా ముగ్గురు కుమార్తెల నియామకం చెల్లదని, 81 శాతం వాటాల బదలాయింపు నిబంధనలకు అనుగుణంగా లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న ఈ వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మేలని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్లకు అప్పగించింది. వీరు ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్తర్వుల ప్రతి అందుకున్న నాటి నుంచి ఆరు వారాల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ నాగప్పలతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. బీఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్రాజు దాట్ల ఇటీవల మరణించడంతో, ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇది హైకోర్టుకు చేరడంతో, సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. డెరైక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమల నియామకం, 81 శాతం వాటాల బదలాయింపు చెల్లదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మహిమ, పూర్ణిమలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను గత వారం జస్టిస్ గోపాలగౌడ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కపిల్సిబాల్, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం, తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వివాద పరిష్కార బాధ్యతలను మధ్యవర్తులకు అప్పగించింది. -
తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది
81 శాతం వాటాల బదిలీ చెల్లదు బయోలాజికల్- ఈ కంపెనీ కుటుంబ వివాదంపై హైకోర్టు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న బయోలాజికల్- ఈ (బీఈ) మార్గదర్శకుడి మరణంతో న్యాయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తల్లీకూతుళ్లు హద్దులు గీసుకుని చేస్తున్న ఈ యుద్ధంలో సెంటిమెంట్ కొట్టుకుపోయింది. వారసులెవరనే విషయంపై కోర్టులో తల్లీ, కూతుళ్లు తమంతట తాముగా దోషులుగా నిలబడి, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ బయోలాజికల్- ఈ (బీఈ) కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చిం ది. కంపెనీ డెరెక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమ చట్టబద్ధంగా నియమితులు కాలేదని తేల్చి చెప్పింది. బీఈ చైర్మన్, ఎండీ విజయకుమార్ దాట్ల పేరుతో ఉన్న 81 శాతం వాటాల బదిలీ చెల్లదని ప్రకటించింది. కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి రేణుక దాట్ల, కుమార్తెలు పూర్ణిమ, ఇందిరా, మహిమ.. వివాదాలను పక్కనపెట్టాలని ఆదేశించింది. మూడో వ్యక్తికి జోక్యం చేసుకునే అవకాశమిస్తే, కంపెనీ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిం చింది. తాత్కాలిక బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లుగా రేణుక, ఆమె ముగ్గురు కుమార్తెలను నియమించిన కోర్టు, వీరిలో రేణుక ఈడీగా, మిగిలినవారు డెరైక్టర్లుగా ఉంటారని తెలిపింది. వారసులెవరనే విషయంపై సివిల్ కోర్టులో ఉన్న వివాదం తేలేంత వరకు ఆయనకున్న 81శాతం వాటాలను బోర్డు ఎవరికీ బదలాయించరాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... బీఈ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా ఉన్న డాక్టర్ దాట్ల విజయకుమార్రాజు ఇటీవల మరణించారు. ఆయన మృతితో ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇదే సమయంలో ముగ్గురు కుమార్తెలు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. విజయకుమార్ రాజు పేరు మీద ఉన్న 81 శాతం వాటాను ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరున బదలాయించుకున్నారు. వీటన్నింటిపై విజయకుమార్రాజు సతీమణి రేణుక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, ఇటీవల తీర్పు వెలువరిస్తూ, కంపెనీ ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తూ తల్లీ, కూతుళ్లకే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేణుక మేనేజింగ్ డెరైక్టర్గా, ఏకాభిప్రాయంతో ఈ బోర్డు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బోర్డు డెరైక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, కంపెనీ లా బోర్డును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని తెలిపారు. కంపెనీ లా బోర్డులో ఉన్న పిటిషన్పై నిర్ణయం వెలువడేంత వరకు ఈ తాత్కాలిక బోర్డు కొనసాగుతుందని, సివిల్ కోర్టులో వివాదం తేలేంత వరకు తమ వద్ద ఉన్న పిటిషన్ను కంపెనీ లా బోర్డు అలానే పెండింగ్లో ఉంచాలని ఆదేశించారు. -
ఫొటోల నిషేధంతో ప్రకటనల జోరు తగ్గేనా?
అవలోకనం అమెరికాను యుక్త వయసులో తొలిసారిగా దర్శించినప్పుడు అక్కడి రాజకీయ ప్రకటనల్లో, నేతల ఫొటోలకంటే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉండటం గమనించాను. అత్యంత విద్యావంత సమాజానికి, అత్యంత అవిద్యావంత సమాజానికి మధ్య అంతరం ఇదే కాబోలు. అయితే విగ్రహాలను ఆరాధించే మనలాంటి సమాజాలకు విషయం కంటే నేతల దర్శనమే ముఖ్యం కావచ్చునేమో.. దేశ రాజకీయ పార్టీలన్నీ ద్వేషించే తరహా తీర్పును భారత సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే ప్రకటించింది. నేనయితే వ్యక్తిగతంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించను కానీ, దాన్ని రాజ్యాంగపరమైన అనౌచి త్యానికి సంబంధించిన విషయమని కానీ లేదా ఈ అంశం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినంత ప్రాధాన్యమైనదని కానీ నేను భావించటం లేదు. కాని ఈ తీర్పు ఇప్పుడు మన మధ్య ఉనికిలో ఉంది. ప్రభుత్వం నగదు చెల్లింపు చేసి ప్రచురించే ఏ ప్రకటనలో అయినా సరే ముగ్గురు వ్యక్తుల ఫొటోలను మాత్రమే ప్రచురించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా ఆదేశించింది. ఇవి సర్వసాధారణంగా డైరె క్టరేట్ ఆఫ్ ఆడియో-విజువల్ పబ్లిసిటీ -డీఏవీపీ- విడుదల చేసే ప్రకటనలు. భారతీయ ప్రింట్ పత్రికలన్నిటికీ డీఏవీపీ అనే సంక్షిప్త పదానికి అర్థం సుపరిచితమే. ఈ ప్రకటనలను సబ్సిడీ ధరలతో విడు దల చేస్తుంటారు. అయితే వీటి పరిమాణం దృష్ట్యా అన్ని వార్తాపత్రి కలు, టీవీ స్టేషన్లు ఈ తరహా ప్రకటనల కోసం తీవ్రంగా ప్రయత్ని స్తుంటాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రకటనలు తారస్థాయికి చేరుకుంటాయి కానీ సంవత్సరం పొడవునా కూడా వీటిని విడుదల చేస్తుంటారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వార్షికోత్సవాలు వంటివి కూడా ఈ ప్రకటనల కింద విడుదల చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తాము సాధించిన విజయాల గురించి చెప్పుకోవడానికి ఈ ప్రకటనలు ఏకైక అతి పెద్ద మార్గంగా ఉంటు న్నాయి. సాధారణంగా ఈ ప్రకటనల్లో ఫొటోలే సింహభాగాన్ని ఆక్రమిస్తుం టాయి. ఈ ఫొటోలను ప్రకటన పైభాగంలో లేదా ప్రకటన స్థలంలో అత్యంత ప్రధానమైన చోట ప్రచురిస్తుంటారు. ఈ ఫొటోలు ఒక అధిక్రమాన్ని అనుసరిస్తుం టాయి. అతి శక్తిమంతులైన నేతలు ఈ ప్రకటనల్లో ప్రధాన స్థానాన్ని పొందుతుం టారు. ఇతరుల కంటే పెద్ద పరిమాణంలో వీరి ఫొటోలు ఆయా ప్రకటనల్లో దర్శనమిస్తాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ప్రధానమంత్రితో పాటు ఆ ప్రకటనను విడుదల చేసిన శాఖకు చెందిన కేబినెట్ మంత్రి ఫొటోలకు ప్రాధా న్యత లభిస్తుంది. సహాయ మంత్రులు, ఇతరుల ఫొటోలు చిన్న పరిమాణంలో ప్రకటన దిగువ భాగంలో ప్రచురితమవుతుంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనల్లో ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లభిస్తుంది. ప్రకటనలోని విషయానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందు కంటే ఇక్కడ ఫొటోకు ఉన్న ప్రాధాన్యత విషయానికి ఉండదు. (డీఏవీపీ వారి ప్రకటనలు నాణ్యమైన డిజైనర్లను ఆకర్షించవు అనేది వాస్తవమే అనుకోండి). స్థానిక స్థాయిలో చూస్తే ఇది కచ్చితమైన రాజకీయ ప్రకటన కాబట్టే నేనిలా చెబుతున్నాను. భారత్కు ఇరుగుపొరుగున ఉన్నవారిని చూస్తే, అక్కడి బిల్బోర్డులన్నీ పూర్తిగా ఫొటోలతో నిండిపోవడాన్ని మనం చూడవచ్చు. వీటిలో టెక్స్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ బిల్ బోర్డులను రాజకీయ పార్టీ నెలకొల్పినట్లయితే, వాటి పైభాగాన ఆ పార్టీ అగ్రనేత కనిపిస్తుంటాడు, అతడి లేదా ఆమె మద్దతు దారుల ముఖాలు కింది వరుసలో ఉంటాయి. ఒకవేళ ఈ బిల్బోర్డులు అధీకృతం కానట్లయితే అవి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను అభినందిస్తూ కనబడే ఒక స్థానిక నేత భారీ సైజు ఫొటోను కలిగి ఉంటాయి. అంటే పై స్థాయినేతలతో ఆ నేతకు ఉండే సాన్నిహిత్యానికి ఇది ప్రతీక అన్నమాట. నేను యుక్తవయసులో మొదటిసారిగా అమెరికాకు వెళ్లినప్పుడు, యార్డ్ సైన్లు అని అక్కడి వారు పిలుచుకునే స్థానిక రాజకీయ ప్రకటనలను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అవి కేవలం టెక్ట్స్తో మాత్రమే ఉండేవి (సెనేట్కి ప్రాక్స్మిర్ లేదా సెనేట్కి కాస్టెన్.. ఇలా వ్యక్తుల పేర్లు మాత్రమే వాటిలో ఉండేవి). వాటిలో ఫొటోలు ఉండేవి కావు. వాటి అవసరం లేదనిపిం చేలా అవి కనబడేవి. అత్యంత విద్యావంత సమాజానికి, అత్యంత అవిద్యావంత సమాజానికి మధ్య ఆంతరం ఇదే కావచ్చు మరి. దీన్ని మరింత లోతుగా అంచనా వేస్తే, విగ్రహాలను పూజించేటటువంటి ప్రజ లకు వ్యక్తులు లేదా నేతల దర్శనం అత్యంత ప్రధానం కావచ్చు. మళ్లీ మనం సుప్రీం కోర్టు తీర్పు వద్దకు వస్తే, ఇకనుంచి భారత్లో విడుదలయ్యే వేలాది ప్రకటనలలో ఇకపై కేవలం ముగ్గురి ఫొటోలు మాత్రమే మనం చూస్తాం. వారు భారత రాష్ట్రపతి, ప్రధానితోపాటు.. న్యాయవ్యవస్థ పబ్లిసిటీ సామగ్రిని పెద్దగా జారీ చేయదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటో కూడా ఈ ప్రకటనల్లో కనిపించవచ్చు. చమత్కారమేమిటంటే, తమ ఫొటోలను ప్రకటనల్లో ఉపయోగిం చడం సబబేనా అనే విషయాన్ని ఈ ముగ్గురు వ్యక్తులు తమకుతాముగా నిర్ణయించుకోవచ్చునని కోర్టు పేర్కొంది. దీన్ని చమత్కారమని ఎందు కన్నానంటే, మన ప్రధాని తన ఫొటోలు ప్రచురితం కావడాన్ని ఇష్టపడ తారు కాబట్టి, ఇకపై ఆయన ఫొటోలను ఎక్కువగా ఉపయోగించినట్ల యితే వెంటనే అది రాజకీయ దాడిని ఆకర్షించవచ్చు కూడా. మరి, కోర్టు ఇతరుల ఫొటోలను ఎందుకు నిషేధించినట్లు? నాకు ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే యాడ్లతో కోర్టులకు సమస్య లేదు (డూప్లికేట్ ప్రకటనలు కానట్లయితే, ఉదాహరణకు అనేక విభాగాలు ఒకే విషయంపై ప్రకటనలను జారీ చేస్తుంటాయి. కాబట్టి నా అభిప్రాయంలో అలాం టివి కళాత్మకంగా కానీ నైతికపరంగా గానీ అభ్యంతరకరంగా కనిపించవచ్చు. బహుశా న్యాయస్థానం భారతీయుల విస్తృత మానసికతత్వాన్ని అర్థం చేసుకుని ఇలా ఆలోచించి ఉండవచ్చేమో. ఫొటోలను నిషేధిస్తే యాడ్లు కుదిం పునకు గురై ప్రభుత్వ ధనం కాస్త ఆదా అవుతుందని కోర్టు భావించి ఉండవచ్చు. కారణమేదైనా కావచ్చు.. కానీ రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వీకరించవు. తమకు అందుబాటులో ఉన్న ఏకైక అతి ముఖ్యమైన సందేశ సాధనాలను తొలగి స్తున్న విషయానికి సంబంధించి మన నేతలు ఐక్యంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మన నేతలు అత్యంత సూక్ష్మబుద్ధి కలవారు. మనలో చాలామంది కంటే వీరు తమపై తాము చక్కటి అవగాహన కలిగిన వారు కాబట్టి ఈ అవ రోధాన్ని ఎలా అడ్డుకోవాలనే విషయంపై వీరంతా కలసి పనిచేయవచ్చు కూడా. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)· ఆకార్ పటేల్ -
అక్కే దిక్కు
తండ్రికి వ్యవసాయ పనులలో సహాయం చేద్దామని వెళ్లిన ఆ యువకుడికి విద్యుదాఘాతం శాపంగా మారింది. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు కాళ్లు చచ్చు బడిపోయి మంచాన పడటంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. జీవచ్ఛవంలా బతుకుతున్న కొడుకు దీన స్థితిని చూస్తూ తట్టుకోలేక తల్లిదండ్రులు కాలం చేసారు. దాంతో అక్కే అతడికి దిక్కయింది. ఎవరి జీవితాన్ని వారు చూసుకునే ఈ రోజుల్లో ఆ యువకుడి అక్క పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని తమ్ముడి సేవకే అంకితం చేసింది. తమ ఇద్దరి పొట్ట పోషించుకోవడం కోసం, తమ్ముడి వైద్య ఖర్చుల కోసం ఆమె బీడీ కార్మికురాలిగా, వ్యవసాయ కూలీగా మారింది. తమ్ముడికి అన్నీ తానే అయి, అతడి మల మూత్రాదులనూ శుభ్రం చేస్తూ జీవితం సాగిస్తోంది. ఈ కుటుంబం దీనస్థితిని చూసి అయ్యో పాపం అనని వారులేరు. అలాగని ఆర్థికంగా చేయూతనిచ్చినవారూ లేరు. దీంతో తమకు ఆదుకోవాలంటూ, కనిపించిన ప్రతి ఒక్కరినీ ఈ అక్కా, తమ్ముళ్లు వేడుకుంటున్నారు. ఆపన్న హస్తం కోసం క్షణమొక యుగంలా వేచి చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామం. ఓ పెంకుటిల్లు తలుపు తట్టగానే ఓ మహిళ దీనంగా వచ్చి తలుపు తెరిచింది లోపల మంచం మీద జీవచ్ఛవంలా పడి ఉన్నాడు ఓ యువకుడు. అతని పేరు బొబ్బిలి రమేష్. వ యస్సు 36. 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు తను కూడా అందరిలాగే జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడు. తల్లిదండ్రుల పేదరికానికి తను పరిష్కారం కావాలనుకున్నాడు. అయితే ఇంటర్ ఫెయిలవడం అతని జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఓ రోజు వ్యవసాయ పనులలో సహాయం చేద్దామని పొలానికి వెళ్లాడు. అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చూడడానికి స్తంభం ఎక్కాడు. కరెంట్ లేదనుకొని తీగలను సరిచేయబోయాడు. అంతే! విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలయ్యాయి. నడుము నుంచి కింది వరకు శరీరం చచ్చుబడిపోయింది. ఒక్కగానొక్క కొడుకును బతికించుకోవడానికి తల్లిదండ్రులు పడరాని పాట్లు పడ్డారు. హైదరాబాద్ సహా పొరుగు రాష్ట్రాల పెద్ద ఆస్పత్రులకూ తిరిగారు. ఖర్చుల కోసం ఉన్న నాలుగెక రాల పొలాన్ని అమ్ముకున్నారు. అయిన వాళ్ల దగ్గర అప్పులు చేశారు. తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో సాయం చేసేవారే కరువయ్యారు. ఈ దిగులుతోనే 2000 సంవత్సరంలో తండ్రి బాలయ్య చనిపోగా, తల్లి సాయమ్మ 2013లో మరణించింది. దీంతో రమేష్ బాధ్యత అక్క ఇందిరపై పడింది. తమ్మునిపై ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టింది. తాను పెళ్లి చేసుకుంటే, తన తమ్ముడు ఎక్కడ అనాథ అవుతాడేమోనని పెళ్లి ఆలోచనే మానేసింది. అమ్మ, నాన్న అన్నీ... అక్కే 18 ఏళ్లుగా రమేశ్ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఇందిర అతడికి తల్లీ, తండ్రీ, అక్కా తానే అయి సేవలు చేస్తోంది. తాను కష్టపడి పని చేయాల్సిన వయసులో అక్క కూలి పని చేసి తనను బతికించుకోవడానికి పడుతున్న తపనను చూసి రమేష్ కుమిలి పోతున్నాడు. 40 ఏళ్లు దాటినా తన కోసం అక్క పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకుందంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. రమేష్కు ప్రమాదం జరిగినప్పుడు ఊరు ఊరంతా సానుభూతి చూపించింది. ‘సాయం చేస్తాం’ అంటూ నేతలెందరో అభయమిచ్చారు. వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. అప్పటి ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ పోషణకు బ్యాంకు రుణం, ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడిచిపోయాయి. రమేష్ మరింత అనారోగ్యానికి గురవుతున్నా ఏ సాయమూ అందలేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది తమ్ముడిని వదిలి వెళ్లిపోతే ఎక్కడ అనాథ అవుతాడోనన్న భయంతో వాడితోనే ఉండిపోయాను. పూట గడవడం కష్టంగా మారింది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. కాళ్లు చచ్చు బడిపోయివాడు.. పేదరికం కారణంగా నేనూ ఏమీ చేయలేకపోతున్నాం. - రమేష్ అక్క ఇందిర సాయం చేయాలనుకుంటే బొబ్బిలి రమేష్ ఫోన్ నంబర్లు 9490242011 ; 9948084048 -
నలబైఏళ్లకు న్యాయం
సాక్షి, ముంబై : ఓ వీర పత్నికి 40 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. 1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో బాబాజీ జాదవ్ వీరమరణం పొందారు. ఆయన భార్య ఇందిరా జాదవ్ ప్రభుత్వం తరఫున లభించాల్సిన స్థలం కోసం అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు కోర్టు మంగళవారం ఇందిరాకు న్యాయం చేసింది. అంతేకాకుండా జాప్యం జరగడానికి గల ప్రధాన కారకుడైన అప్పటి ప్రభుత్వ అధికారి నుంచి రూ.75 వేలు జరిమానా వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆమె వయసు 74 ఏళ్లు ఉండగా అనారోగ్యంతో ప్రస్తుతం పుణేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.... 1965లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో దేశ రక్షణ కోసం పోరాడుతూ జాదవ్ వీరమరణం పొందాడు. అప్పటి ప్రధాని లాల్ బహాదూర్ శాస్త్రి ఆయన భార్య ఇందిరాకు పది ఎకరాల పంట భూమి ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. కానీ పది ఎకరాల పంట భూమితో పాటు ఇల్లు కట్టుకునేందుకు రత్నగిరిలో ఐదు గుంటలు స్థలం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ స్థలాన్ని ఆమెకు అందజేయాలని 1967 నుంచి మిలిటరీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం 1994లో ఆమెకు ఖేడ్లో ఓ స్థలాన్ని చూపించిం ది.ఆ స్థలం నిర్మాణుష్య ప్రాంతంలో ఉండడం వల్ల దాన్ని స్వీకరించేందుకు ఆమె నిరాకరించింది. ఆ తరవాత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడమే మానేసింది. బాధితురాలు లాయర్లు అవినాశ్ గోఖలే, మయూరేష్ మోద్గీల ద్వారా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తుల బెంచి పలుమార్లు విచారణ జరిపి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటి నుంచి ఇంటి స్థలం ధర ఎంత నిర్ణయించాలనే దానిపై ప్రభుత్వం తేల్చుకోలేకపోయింది. ఆమెకు ఉచితంగా స్థలం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. చివరకు కోర్టు ఉచితంగా అందజేయాలని తీర్పునిచ్చింది. ఇంటికోసం అందజేసే స్థలాన్ని 1998 మార్కెట్ రేటు ప్రకారం సగం ధరకే అందజేయాలని ఆదేశించింది. ఆ ప్రకారం స్థలం రేటు రూ.45 వేలు పలుకుతుంది. రూ.75 వేలు జరిమానా డబ్బులోంచి మొత్తాన్ని చెల్లించి మిగతా రూ.30 వేలు ఇందిరా జాదవ్ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని కోర్టు చెప్పింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని, వెంటనే న్యాయం చేయాలని న్యాయమూర్తులు అభయ్ ఓక్, ఎ.ఎస్.చందూర్కర్ ఆదేశించారు. -
పిల్లలు లేకపోతే నేను కూడా బావతోపాటు...
ఆ రోజు సందర్భం వేరు. దాదాపు ఐదేళ్ల క్రితం... 2009 ఫిబ్రవరి 12.... వాలెంటైన్స్ డేకి రెండురోజుల ముందు నేను... రియల్హీరో శ్రీహరి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు.. ఆయనతో పాటు ఆయన భార్య శాంతి కూడా... రియల్ స్టార్లా అనిపించారు! ఈ రోజు సందర్భం వేరు. శ్రీహరి లేరు. కానీ ఆయన భార్య రియల్ లైఫ్ హీరోలా వాస్తవ జీవితంతో పోరాడుతూ కనిపించారు! ఆ రోజు సరదాగా శ్రీహరి... ‘‘నన్ను ఒక్క పూట వదలవే, కోటి రూపాయలిస్తా’’ అన్నారు. ఈ రోజు శాంతి... కోట్లు ఖర్చుపెట్టయినా బతికించుకుంటానని కన్నీళ్లతో ఎంత వేడుకున్నా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు శ్రీహరి! ఆ రోజు శాంతి... ‘శ్రీహరిని విడిచి ఒక్కపూటైనా ఉండలేను’ అన్నారు. ఈరోజు దేవుడు శాంతిని ఒంటరిని చేసి... జ్ఞాపకాలను మాత్రమే తోడుగా మిగిల్చాడు. ఆ రోజు శాంతి... ‘‘నాకు కారే అక్కర్లేదు బావా... సైకిల్ మీద తీసుకెళ్లినా నీతోపాటు వచ్చేస్తా’’ అన్నారు. ఈ రోజు... శ్రీహరితో కలిసి నడిచే భాగ్యాన్ని కూడా కోల్పోయారు. ఆ రోజు శ్రీహరి... ‘‘పెళ్లి కాకముందు పదమూడేళ్లలో... రెండు మూడు జీవితాలు చూసింది శాంతి’’ అన్నారు. ఈ రోజు శాంతి... భర్త పోయాక ఇంకెన్ని జీవితాలను చూడాల్సి వస్తుందో అనిపించింది. ఆ రోజు శాంతి... ‘‘బావ లేకుండా బతకలేను’’ అన్నారు. ఈ రోజు... బావ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రాంతిలో బతుకుతున్నారు. ఎవరి జీవితంలోనైనా ఇంత వైరుధ్యం ఉంటుందా? శాంతి జీవితంలో ఉంది. చదవండి... ఈవారం ‘తారాంతరంగం’లో... - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్ ఇందిర: 9 అక్టోబర్... అసలు ఆరోజు ఏం జరిగింది? శాంతి: ప్రభుదేవా సినిమా షూటింగ్కోసమని ముంబై వెళ్లాం. ముందురోజు రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్లం కానీ, ఏదో సాంగ్ సీక్వెన్స్ ఉందని ప్రభుదేవా రిక్వెస్ట్ చేయడంతో ముంబైలోనే ఉండిపోయాం. బావకి ముందురోజు కాస్త జ్వరం ఉన్నా, ఆరోజు బాగానే ఉన్నాడు. రోజూ పాలు, బ్రెడ్ తీసుకునేవాడు, ఆరోజు టీ తెప్పించమని చెప్పి, బెడ్ మీదే కూర్చుని తాగాడు. తర్వాత కాళ్లు లాగుతున్నాయని, నాతో కాళ్లు నొక్కించుకుని కాసేపు పడుకున్నాడు. ఉదయం 8.30 టైంలో అనుకుంటా... తనకిష్టమైన ఉడిపి హోటల్ నుంచి ఇష్టంగా తినే ఊతప్పం తెప్పించాను. కానీ, ‘నాకు తినాలని లేదు, నువ్వు తినెయ్’ అన్నాడు. తను తినందే ఏరోజూ ముందు తినే అలవాటు లేని నేను, ముందురోజు తినకపోవడంతో ఆకలిగా ఉందని, తిందామని కూర్చున్నాను. ఇంతలో బావ మళ్లీ పిలిచి, ఛాతీలో మంటగా ఉందన్నాడు. హోటల్ వాళ్లనడిగి, వెంటనే డాక్టర్ని పిలిపించాను. ‘పల్స్ తక్కువగా ఉంది, హాస్పిటల్కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు డాక్టర్. ‘బట్టలు మార్చుకుని వెళ్దాం’ అనే లోపలే బావ గబగబా బయటికెళ్లిపోయాడు. నేను కిందికి వచ్చేలోపలే తనతోపాటు ఉన్న మనుషులను తీసుకుని హాస్పిటల్కు వెళ్లిపోయాడు. ‘ఏంటి బావా అలా వెళ్లిపోయావు?’ అని ఫోన్ చేసి అడగ్గానే ‘కంగారేం లేదు... పక్కనే ఉన్న హాస్పిటల్కు వెళ్లి ఇంజక్షన్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా’ అన్నాడు. కానీ నాకు కంగారు తగ్గక, ప్రతి 10 నిమిషాలకు కాల్ చేస్తూనే ఉన్నా. చివరికి బావ ‘నైట్ షూటింగ్... నిద్దర లేదు... లొల్లి చేయకుండా కాసేపు నన్ను రెస్ట్ తీసుకోనీవే’ అని విసుక్కుని ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తే తెలిసింది... బావని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని! అది తెలియగానే నా గుండె ఆగిపోయినట్టయింది! వెంటనే బండి పంపమని చెప్పి, 10.45 కల్లా హాస్పిటల్కు చేరుకున్నాను. ఎమర్జన్సీ వార్డ్... బావను చూడగానే ఏడవడం మొదలెట్టాను. ‘ఏమీ లేదు, పల్స్ తక్కువ ఉంది. గ్లూకోజ్తోపాటు ఏదో మందు ఎక్కిస్తానన్నారు. అది తీసుకోగానే వెళ్లిపోదాం... నాకేం కాదు, ఏడవకు’ అన్నాడు బావ. తర్వాత చీఫ్ డాక్టర్ వచ్చాడు. ‘మేజర్గా ఏమీ లేదు’ అంటూ ఏదో చెప్పి వెళ్లిపోయారు కానీ నాకు విషయం పెద్దగా అర్థం కాలేదు. సెలైన్ ఎక్కిస్తుండగా బావ, నేనూ ఎప్పటిలానే మాట్లాడుకున్నాం. అయితే ఉన్నట్టుండి బావ నాలుక మడత పడడం మొదలైంది. ‘ఏ మైంది బావా’ అంటుండగానే కళ్లు మూతలు పడడం మొదలైంది. డ్యూటీ డాక్టర్ని, నర్సుల్ని గట్టిగా పిలిచాను. వెంటనే ఏవో ఇంజక్షన్లు ఇస్తూ, కాసేపు నన్ను బయటికి పొమ్మన్నారు. నేనలా పోతుండగా బావ ‘వీళ్లిలా గుచ్చేస్తున్నారు... ఏం చేస్తున్నావ్... రావే’ అని గట్టిగా అరిచాడు. అయినా హాస్పిటల్ వాళ్లు నన్ను అక్కడ ఉండనీయకుండా బైటికి పంపించడంతో ఏమీ చేయలేక వెళ్లిపోయాను. బయటికొచ్చి ఫోన్లు చేయడం మొదలెట్టాను... ముందు హైదరాబాద్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ సంజీవ్కి, శ్రీనివాస్ అన్నకి (బావ వాళ్ల అన్న)! ఇద్దర్నీ వెంటనే ముంబై బయల్దేరి రమ్మని చెప్పి, మళ్లీ బావ దగ్గరికి వచ్చాను. (బోరున ఏడుస్తూ..) మా ఇద్దరి ప్రేమా మా ఇద్దరికే తెలుసు... మనిషి నిస్తేజంగా అలా పడుకుని ఉన్నాడనే కానీ, తన చూపు మాత్రం నావైపే! ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను... ఇంతలో బావ నోట్లోంచి ఉన్నట్టుండి రక్తం రావడం మొదలైంది. బావకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేని నేను, అంతలా రక్తం రావడంతో గట్టిగా అరవడం మొదలెట్టాను. వెంటనే నన్ను వార్డు నుంచి బయటికి పంపించబోయారు హాస్పిటల్ స్టాఫ్! ‘నాకు ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పండి’ అని అడగడంతో, ‘అది తర్వాత... మీరిక్కడుంటే ట్రీట్మెంట్ ఇవ్వలేం’ అంటూ నన్ను బయటికి పంపించేశారు. చేసేదేంలేక పిల్లలకు ఫోన్ చేసి, ‘అప్పకి బాలేదు. వెంటనే వచ్చేయండి’ అని చెప్పి మళ్లీ లోపలికి వచ్చేంతలో డాక్టర్ ‘హి ఈజ్ నో మోర్’ అని చెప్పారు! ‘ఇంతలో ఇంత ఘోరమా?’ అని ఒకవైపు... అస్సలు నమ్మకం కలగకపోవడం మరోవైపు! సాయంత్రం 7.30 టైంలో అనుకుంటా పిల్లలు వచ్చారు... 9.30 దాకా బావ చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నా. మర్నాడు పొద్దున బావని తీసుకుని హైదరాబాద్కి వచ్చాం. ఇందిర: గత సంవత్సరంగా ఆయన సన్నగా, బలహీనంగా కనిపించారు... అసలు ప్రాబ్లమేంటి? శాంతి: కొన్నాళ్ల క్రితం ఆయనకు షుగర్ వచ్చింది. దానికితోడు లివర్ ప్రాబ్లమ్ కూడా రావడంతో మనిషి సన్నబడిపోయాడు. అయితే వాటన్నిటినీ తక్కువ కాలంలోనే కంట్రోల్కి తెచ్చుకున్నాడు. సంవత్సరంగా అయితే తాగడం పూర్తిగా మానేశాడు. మనిషి సన్నబడ్డాడనే గానీ, హెల్త్ పర్ఫెక్ట్గా ఉండింది. చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇందిర: మీరు కూడా అంత ఆరోగ్యంగా కనిపించట్లేదు... చాలా సన్నబడిపోయారు! శాంతి: నిజమే... 18 కేజీలు తగ్గాను! ఏం చేయను? బావ లేకుండా... తిండి ఎక్కట్లేదు... మనుషుల్ని కలవాలనిపించట్లేదు... బయటికి పోవాలనిపించట్లేదు... ఏమీ చేయాలనిపించట్లేదు... ఏం చేయను? ఇందిర: ఇలాంటి పరిస్థితి ఆకస్మికంగా సంభవించినప్పుడు మనం నమ్మకపోవడం నుంచి అపనమ్మకంలో బతుకుతుంటాం... శాంతి: నాకైతే బావ చనిపోయినట్లేలేదు! షూటింగ్కి వెళ్లాడు... ఏడింటికల్లా తిరిగొస్తాడు, బావకోసం వంట చేయాలి... అనే ఆలోచనలతోనే బతుకుతున్నాను. మీకో విషయం తెలుసా.. పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా, రోజూ నేను బావకు ఇష్టమైన వంటలే చేస్తుంటా. మూడుపూటలా బావకి (ఫోటో దగ్గర) పెడుతుంటా! ఇందిర: ఒక మనిషి గొప్పతనం పోయిన తర్వాత కానీ తెలీదంటారు. మీ బావ గురించి మీకు తెలీదని కాదు... శాంతి: యస్... యస్... యస్... బావ పోయిన రోజు నేను చూసిన అభిమానం అంతా ఇంతా కాదు. అభిమానులు, నచ్చినవాళ్లు, బంధువులు, స్నేహితులు... ఒకరుకాదు ఆరోజు వచ్చింది! బావ నిజంగా చాలా అదృష్టవంతుడు! అయితే ఇంత మంచి వ్యక్తిని 47 ఏళ్లకే దేవుడలా తీసుకెళ్లిపోవడం చాలా అన్యాయం! ఇందిర: మీరు ఆరోజు అంత నిబ్బరంగా వుండడం చాలా ఆశ్చర్యపరిచింది... శాంతి: ఎందుకంటే... ఆరోజు నాకసలు బావ చనిపోయిన ఫీలింగే లేదు! బతికున్నారని, లేస్తారనే అనిపించింది! పొలంలో పాప పక్కన పెట్టినప్పుడు కూడా బావ లేచి వస్తాడని, మట్టి వేయొద్దని అన్నాను. (ఏడుస్తూ) ఇద్దరు పిల్లలు లేకపోతే ఆరోజు నేను కూడా బావతోపాటు లోపల పడిపోయేదాన్ని! వాళ్లిద్దరికోసమే... బతకడం! ఇందిర: ఆయన మరణం ఆకస్మికంగా జరిగింది... మీకేదైనా జరిగితే పిల్లల సంగతేంటని ఎప్పుడైనా ఆలోచించారా? శాంతి: బావకు ప్లానింగ్ చేసే టైం లేకపోయింది. పైగా తను చావు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు నా పరిస్థితి అలా కాదు... కచ్చితంగా ఆలోచిస్తున్నాను. వాళ్లు ఎదిగి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేదాకా జాగ్రత్తగా ఉంటా! వాళ్లకోసం ప్లానింగ్ చేయాల్సింది చాలా ఉందని తెలుసు. అందుకే ఇప్పటినుంచే మొదలెట్టాను. నాకేదైనా అయినా నా పిల్లల జీవితాలే కాదు, మనవలు, మనవరాళ్ల జీవితాలు కూడా సాఫీగా గడిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాను. ఇందిర: పిల్లలు ఉన్నట్టుండి మెచ్యూర్డ్గానో, బాధ్యతగానో అయినట్టు ఏమైనా అనిపించిందా? శాంతి: పెద్దోడు చాలా అండర్స్టాండింగ్! సందర్భాన్ని బట్టి... ఓదారుస్తాడు, నవ్విస్తాడు! చిన్నవాడికి ఇంకా అంత తెలీదు. కానీ వాడు కూడా ఇప్పుడిప్పుడు... తిన్నానా లేదా? నిద్రపోయానా లేదా? అని కనుక్కుంటుంటాడు. నేను తినకపోతే ఒక్కోసారి పిల్లలు కూడా తినరు. అలానే నిద్రపోతారు. అప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. అందుకే మర్నాడు వాళ్లకోసమైనా తింటుంటాను. నేను పైకి బెడ్రూంలోకి వెళ్లకపోతే, రాత్రి ఒంటిగంటైనా, రెండయినా వాళ్లు కూడా నాతోపాటే కూర్చుంటారు. అప్పుడప్పుడు బెడ్రూం తలుపు తీసి చూసి, నేను పడుకున్నాను అనుకున్నాక పడుకుంటారు. నేను ఎప్పుడూ ఏడుస్తుంటాననో ఏమో కానీ, నా ముందు ఒక్కసారి కూడా వాళ్లు కంట నీరు పెట్టలేదు. దే కేర్ ఫర్ మి సోమచ్! అయామ్ వెరీ లక్కీ దట్ వే! ఇందిర: ఇప్పుడు పరిస్థితి ఇంతకుముందులా కాదుకదా! జీవితానికి సంబంధించి ఏమైనా నేర్పిస్తున్నారా? శాంతి: యాజ్ సచ్... పిల్లలు చాలా మెచ్యూర్డ్ అండ్ స్మార్ట్! దే కెన్ లుక్ ఆప్టర్ దెమ్సెల్వ్స్ వెల్! దానికితోడు ఇప్పుడిప్పుడు నేను ఇంటి ఖర్చులన్నీ పెద్దోడి చేతుల మీదుగా చేయిస్తున్నాను... డబ్బు విలువ తెలియాలని! ఉల్లిపాయ రేట్ల నుంచీ బియ్యం రేట్ల దాకా అన్నీ చెప్తున్నాను. ఒకవైపు బాధ్యత నేర్పుతూనే, బావ లేని లోటు లేకుండా వాళ్లను ‘శ్రీహరి పిల్లలు’గానే పెంచుతున్నాను! వాళ్లకోసం ఎంతయినా కష్టపడతాను! ఇందిర: పిల్లలు ఏం కావాలని ఆయనకుండేది? శాంతి: ఇద్దరూ ఆయనలా ఇండస్ట్రీలోకి రావాలని! నాకు మాత్రం వాళ్లు చదువుకోవాలని! ఇక పిల్లల విషయానికి వస్తే... పెద్దవాడికి డెరైక్టర్ అవ్వాలని (ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు), చిన్నోడికి యాక్టర్ అవ్వాలని (చైల్డ్ యాక్టర్గా చేశాడు అవార్డు కూడా వచ్చింది)! బావ కలగన్నదీ, పిల్లలకు నచ్చింది నెరవేర్చడం నా బాధ్యత... అయితే, ఇద్దరు పిల్లలూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాకే! ఇందిర: అసలు ఆయనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండేవి? శాంతి: బావకు ఎప్పుడూ జనాలతో ఉండాలని, వాళ్లకు చేతనైనంత సాయం చేయాలని, అందుకోసం మినిస్టర్ అవ్వాలని కోరిక ఉండేది. 2009లో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా రెండు పడవల మీద కాళ్లు పెట్టొద్దని నేనే తనను వెనక్కి లాగా! ఫ్యామిలీ పరంగా చూస్తే పిల్లలు చిన్నవాళ్లు, నేనూ తనను చూడకుండా ఉండలేను... పైగా తన కెరీర్ కూడా అప్పుడు చాలా బాగుంది. ఇటు ఇండస్ట్రీపరంగా చూసినా, తను రాజకీయాల్లోకి వెళ్తే ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడతారని ససేమిరా అన్నాను. అందుకే తను 2014 కల్లా అన్ని కమిట్మెంట్లు పూర్తిచేసుకుని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానన్నాడు. కానీ, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది... బావకోసమైనా నేను రాజకీయాల్లోకి రావాలని, తను ప్రజలకు చేయాలనుకున్న మంచి నేను చేయాలని! ఇందిర: ఈ రెండున్నర నెలల్లో ... ‘అసలు మనుషులు ఇలా ఉంటారా?’ అని అనిపించిన సందర్భాలున్నాయా? శాంతి: నాకు ముందే తెలుసు... మనుషులు ‘ఇలానే’ ఉంటారని! నాకేదీ షాకింగ్ కాదు. ఎందుకంటే, జీవితంలో ఢక్కామొక్కిలు తిని వచ్చినదాన్ని! అప్ప (నాన్న ఆనందన్ - తమిళ్లో పెద్ద యాక్టర్) బతికి ఉండగానే అప్స్ అండ్ డౌన్స్ చూసినదాన్ని! ఇక నాన్న పోయాక చెప్పనక్కర్లేదు! ఒక్క జీవితంలో ఎన్నో జీవితాల్ని చూసినదాన్ని కాబట్టి ఈరోజు ఎలాగైనా బతకగలుగుతున్నాను. అయితే, మనుషులం కదా... చిన్న ఆశ ఉంటుంది. ఇన్నాళ్లు నన్ను అక్క, చెల్లి, అమ్మ, వదిన అని పిలిచినవాళ్లు, బావకు అతిదగ్గరగా ఉన్న కొందరు ఈరోజు అసలు కనిపించకపోవడంతో, ఆ ఆప్యాయతను మిస్సవుతున్నాను. అదొక్కటే కొంచెం బాధనిపిస్తుంది. ఎందుకంటే, నేనే కాదు... నా పిల్లలకు కూడా వాళ్లు చాలా క్లోజ్. అయినా మేం కోరుకునేదేంటని? కాస్తంత ఓదార్పు... మాటసాయం! అది కూడా వాళ్లకు అంత కష్టంగా ఉంటే మనమేం చేయగలం! ఇందిర: ఎందుకంటారు? శాంతి: (నిర్వేదంగా నవ్వుతూ) నా దగ్గర డబ్బు లేదు... నేనేమైనా అడుగుతాననుకుంటున్నారేమో! వాళ్లకు తెలీదు... నేను చచ్చేంతవరకు నా చేయి పైన ఉండాల్సిందే కాని, కింద ఉండదని! చిన్నప్పుడు అంత కష్టంలో ఉన్నప్పుడే ఒకరి దగ్గర చేయి చాచలేదు... ఇప్పుడు చేస్తానా! అవసరమైతే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వస్తా... సినిమాలు పొడ్యూస్ చేస్తా... సీరియల్స్ తీస్తా... ఏదైనా చేస్తాను, ఎంతైనా కష్టపడతాను కానీ, ఒకరి నుంచి ఆశించను! ఇందిర: రివర్స్లో... మీ దగ్గరికి డబ్బుకోసం (సాయం) వచ్చినవాళ్లు, డబ్బు ఇవ్వాలని (అప్పులు) వచ్చినవాళ్లు ఉన్నారా? శాంతి: ఉన్నారు. సాయంకోసం వచ్చిన ఎవ్వరినీ బావ కాదనేవాడు కాదు. నమ్ముతారో లేదో ‘మన దగ్గర 10 వేలే ఉన్నాయి బావా’ అన్న రోజున కూడా ‘ఇచ్చెయ్వే... వాళ్లేదో కష్టంలో ఉన్నారు’ అని ఇచ్చేసేవాడు. అటువంటి మనిషి బావ! తనలా నేనెప్పటికీ చేయలేను... అయితే ఇప్పటికీ కుదిరినంత చేస్తున్నాను. ఇక డబ్బులు ఇవ్వాలని వచ్చినవాళ్ల గురించి అంటారా... సరైన డాక్యుమెంట్లు, ప్రూఫ్లు చూపిస్తే తప్ప ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తున్నాను. లేకపోతే ప్రతివాళ్లూ మోసం చేస్తారు. ఇందిర: ఆయన ఉండగా ఇల్లంతా సందడిగా, హడావిడిగా ఉండేదేమో కదా? ఇప్పుడు..? మీ సంగతి? శాంతి: బావను తలుచుకుంటూ, గతాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటా. రోజుకో గంటసేపు మాత్రం బావ సమాధి దగ్గర కూర్చుని వస్తా. సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక, వాళ్లకి కావలసినవి చూసుకుని, ఓ గంటసేపు నిద్రపోతా... ఎందుకంటే, నాకు రాత్రిపూట నిద్రపట్టడం లేదు. బాగా దగ్గరివాళ్లను తప్ప ఎవ్వర్నీ పెద్దగా కలవాలని కూడా ఉండట్లేదు. ఓ వారం నుంచే కాస్తంత బయటికెళ్తున్నా. రికవర్ కావడానికి, దీన్నుంచి బైటికి రావడానికి ట్రై చేస్తున్నాను. ఇందిర: ‘మళ్లీ తెల్లారుతోందా?’ అని భయపడిన సందర్భాలున్నాయా? శాంతి: (నిర్లిప్తంగా) అసలు నిద్రపోతేగా! ఇందిర: బావ విషయంలో బాగా మిస్సయ్యే క్షణాలు..? శాంతి: భోజనం టైం! తను తిని లేచాక కబుర్లు చెబుతూ అదే ప్లేట్లో భోంచేయడం! అది అలవాటయ్యే ఇప్పుడు ఏమీ తినాలనిపించట్లేదు! ఇందిర: మీరు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు... ఆయన మిమ్మల్ని కనుపాపలా చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులంటారు? శాంతి: (నవ్వుతూ) నేను ఆయన్ని అనేదాన్ని... ఆయన నన్ను అనేవారు! అది పక్కనపెడితే ఇప్పుడూ, ఎప్పుడూ నేను ఒక్కటే అంటాను... అలాంటి భర్త దొరకడం నా అదృష్టమని! ఎందుకంటే - ఆయన ఒక ట్రెడిషనల్గా ఉండే చదువుకున్న అమ్మాయిని చేసుకోలేదు... ఒక ఆర్టిస్ట్ని, అందులోనూ గ్లామర్ ఆర్టిస్ట్గా ఉన్న నన్ను పెళ్లి చేసుకుని, ఇంతగా నెత్తినపెట్టుకుని చూసుకున్నాడు. అందుకే ఏ జన్మయినా నాకు ఆయనే భర్తగా కావాలనుకుంటున్నాను! ఇందిర: గతంలో డిసెంబర్ 31 అంటే ఎలా ఉండేది? ఈ సంవత్సరం..? శాంతి: ప్రతి ఏడాది డిసెంబర్ 31న ఇంట్లో విపరీతమైన సందడి! ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవారు. బయట ఈయన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే, నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడిపేదాన్ని! ఈ సంవత్సరం ముగ్గురం (నేను, పిల్లలు) బావ సమాధి దగ్గర గడుపుతాం! మొదట్లో బావ యాక్టింగ్ నాకు నచ్చేది కాదు మొదట్లో ఈయన యాక్టింగ్ నాకు అసలు నచ్చేది కాదు. ‘నీకసలు యాక్టింగ్ రాదు... ఎలా యాక్టర్వి అయ్యావు బావా’ అని ఎప్పుడూ ఏడిపించేదాన్ని! కాని ‘సాంబయ్య’, ‘అయోధ్య రాముడు’ చూశాక మాత్రం ‘చాలా బాగా యాక్ట్ చేశావు బావా’ అని మెచ్చుకున్నా! నా అభిప్రాయానికి చాలా విలువ ఇచ్చేవాడు బావ! ప్రివ్యూ అవగానే నా వంకే చూసేవాడు... ఏమంటానా అని! నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పేదాన్ని... తన యాక్టింగ్ గురించే కాదు, మొత్తం సినిమా గురించి! అందుకే మొదట్లో ప్రివ్యూకి తీసుకువెళ్ళేవాడు కాస్తా తరువాత తరువాత ఫస్ట్ కాపీకి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ‘ఇక్కడ ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి.... ఈ షాట్స్ మార్చాలి’ అని చెబితే మార్పించేవాడు. బావ ఎప్పుడూ అనేవాడు - ‘నీ నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయి... నువ్వు ఏమి చెబితే అదే జరుగుతుంది’ అని! నిజంగానే అన్నట్టే జరిగేది... సినిమా రిజల్ట్! ఆయన భార్యగా నేనెప్పుడూ ఆయన్ని హీరోగా చూడడానికే ఇష్టపడేదాన్ని. అందుకే క్యారెక్టర్ రోల్స్కి షిఫ్ట్ అవుతానన్నప్పుడు వద్దని గొడవ చేశాను. కానీ వాటిలో తన యాక్టింగ్ చూశాక మాత్రం గర్వంగా ఫీలయ్యాను... ముఖ్యంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, మగధీర...’లలో... హీరోలకు సమానంగా తననీ గుర్తుంచుకునేలా యాక్ట్ చేశాడు! బావ - నేను 1991... నా కెరియర్ పీక్లో ఉంది... ఎంతోమంది ‘ఐ లవ్ యూ’ చెప్పారు కానీ, ఈయన ఒక్కరే నన్ను ‘పెళ్లి చేసుకుంటాను’ అన్నారు. అది నచ్చే, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను. చెల్లెళ్లు, తమ్ముళ్ల పెళ్లిళ్లు అయితే కానీ పెళ్లి చేసుకోనని చెప్పినా, నాకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తానన్నాడు. 1993లోగా పెళ్లి చేసుకోకపోతే తనకు పెళ్లి యోగం లేదని ఎవరో జాతకం చెప్పడంతో, మా తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో బయటెవ్వరికీ చెప్పకుండా, అదే సంవత్సరం నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. నా తోబుట్టువులందరి పెళ్లిళ్లు అయిపోయాక 1996లో అందరి సమక్షంలో మళ్లీ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నా ఇంటి నుంచి నన్ను కట్టుబట్టలతో తీసుకెళ్లి, తనే అన్నీ (పెళ్లి నగలు, చీరలు, ఫ్లాట్, కారు..) సమకూర్చి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. నాకు కోరికలు చాలా తక్కువ. బావను ఎక్కువ ఏదీ అడిగేదాన్ని కాదు. కానీ నా నోటి నుంచి ‘బాగుంది’ అన్న పదం వచ్చినా సాయంత్రంకల్లా అది ఇంటికి రావలసిందే... కారైనా, నగైనా! అది కూడా సర్ప్రైజ్ చేస్తూ! ఇద్దరం చాలా పొసెసివ్! టీవీలో ఒక అమ్మాయి వైపు ఇంట్రస్ట్తో చూసినా నేను ఊరుకునేదాన్ని కాదు. ఎక్కడున్నా ప్రతి పది నిమిషాలకు కాల్ చేసేదాన్ని. బావ కూడా ఏం తక్కువ కాదు... తను లేకుండా నన్ను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు. బావకు ఎప్పుడైనా పిల్లలకన్నా నేనే ఎక్కువ. నేనెలా ఉన్నాను... తిన్నానా లేదా? అని ఎప్పుడూ కనుక్కుంటూనే ఉంటాడు... ఆఖరికి పోయే ముందు కూడా! హోటల్ నుంచి హాస్పిటల్కు వెళ్తూ రిసెప్షన్లో ఉన్న అబ్బాయితో ‘మేడమ్ గారు బ్రేక్ఫాస్ట్ చేయలేదు... తినమని చెప్పండి’ అని చెప్పి మరీ వెళ్లాడు! ఎప్పుడూ ‘నేనున్నాను... నీకేంటే?’ అనే బావ ఈరోజు నన్ను ఇలా వదిలేసి వెళ్లినందుకు చాలా కోపంగా ఉంది! -
నాయనమ్మ, నాన్నల్లాగే నన్నూ చంపేస్తారేమో: రాహుల్