కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్లో సోమవారం పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ పట్టణానికి చెందిన మందపల్లి శ్రీదేవి వైఎస్సార్ ఫ్లై ఓవర్ విస్తరణలో భాగంగా తమ స్థలాలు పోయాయని భావించిన ప్రభుత్వం పక్కనే ఉన్న శ్మశాన భూమి, మరుగుదొడ్డిని పట్టాలుగా ఇచ్చిందని, ఆ భూమి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా స్థలంపై ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని, ఇప్పుడు పోలీసులతో వచ్చి ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. తమ కుటుంబాన్ని కాపాడాలని, లేదంటే కుటుంబం మొత్తం చనిపోయే పరిస్థితి ఉందని ఓ వినతి పత్రంలో పేర్కొన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమటూ ఆమె పురుగుల మందు తాగారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment