కరాటే పోటీల్లో విద్యార్థులకు పతకాల వెల్లువ
అమలాపురం రూరల్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో అమలాపురం మండలం కామనగరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్నారు. కాకినాడ ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన సెకండ్ ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్షిప్లో విద్యార్థులు ప్రఽథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సుమారు 650 మంది విద్యార్థులు పోటీలకు హాజరు కాగా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి 54 మంది పాల్గొన్నట్టు కోచ్ పడాల అంజి తెలిపారు. సత్తా చాటిన స్కూల్ విద్యార్థులు 24 బంగారు పతకాలు, 30 వెండి పతకాలను సాధించి, ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment