రైలే కళ్యాణ వేదిక! | Couple Gets Married on Bengal-Jharkhand Train | Sakshi
Sakshi News home page

రైలే కళ్యాణ వేదిక!

Dec 3 2023 6:22 AM | Updated on Dec 3 2023 6:32 AM

Couple Gets Married on Bengal-Jharkhand Train - Sakshi

కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు...అంటారు. కళ్యాణ ఘడియ ముంచుకొచ్చింది...అనుకున్నారేమో ఒక ప్రేమ జంట బెంగాల్‌–జార్ఖండ్‌ మూవింగ్‌ ట్రైన్‌లోనే దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వధువు భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ ‘రైలు పెళ్లి’ వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌ అయింది.

బోగీలో ఉన్న ప్రయాణికులు ఈ పెళ్లి తంతు చూసి మొదట షాక్‌ తిన్నా ఆ తరువాత మాత్రం ఆశీర్వదించారు. ‘మల్టీ పర్సస్‌ ఇండియన్‌ రైల్వేస్‌’ ‘విమానంలో జరిగే పెళ్లి కంటే ఇది నయం. తక్కువ ఖర్చు కదా’... ఇలాంటి కామెంట్స్‌ నెటిజనుల నుంచి వచ్చాయి. ఇక మరో పెళ్లి విషయానికి వస్తే... దిల్లీకి చెందిన 27 సంవత్సరాల అవినాష్‌ కుమార్‌ డెంగ్యూ బారిన పడ్డాడు. బెడ్‌ మీద నుంచి లేవలేని పరిస్థితి. ఈలోపు పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో హాస్పిటల్‌లోనే వధువు మెడలో తాళి కట్టించి పెళ్లి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement