
ఇండిగో ఎయిర్లైన్స్ పుణె ఫ్లైట్లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్లైన్స్ పైలట్.
సంజయ్ కుమార్ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.