sanjay kumar
-
తగ్గిన బంగారం అక్రమ రవాణా
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాకు దిగుమతి సుంకం తగ్గింపు కొంత చెక్ పెట్టింది. గతేడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించడం గమనార్హం. అనంతరం అక్రమ రవాణా (స్మగ్లింగ్/దొంగ రవాణా) గణనీయంగా తగ్గినట్టు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 847 కిలోల బంగారాన్ని (రూ.544 కోట్లు) డీఆర్ఐ అధికారులు జప్తు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులు, సరిహద్దులు, దేశంలోకి వచ్చే కార్గోల వద్ద అధికారుల నిఘా పెరిగినట్టు సంజయ్ కుమార్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు సరిహద్దుల ద్వారా వస్తు అక్రమ రవాణా జరుగుతుండడం తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ అధికారులు ఈశాన్య సరిహద్దుల వద్ద 1,319 కిలోల బంగారం అక్రమ రవాణాన్ని అడ్డుకుని, ఆ మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద ఎక్కువ మొత్తం పట్టుబడింది. కస్టమ్స్ విభాగం సహా సీబీఐసీ కలసి గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జప్తు చేసిన బంగారం 4,870 కిలోలుగా ఉంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ బంగారం ఆభరణ వర్తకుల (జ్యుయలర్లు) ఆదాయం 22–25 శాతం పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేయడం గమనార్హం. -
సంజయ్ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్సీ మీటింగ్లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్రెడ్డి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు.‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా. మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అరెస్టు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్రెడ్డిని కరీంనగర్ వన్టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్రెడ్డిని పోలీసులు కరీంనగర్కు తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, సంజయ్కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్రెడ్డి సంజయ్కుమార్పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్కుమార్ కౌశిక్రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం -
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్రెడ్డి నెట్టేశాడు. కౌశిక్రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్ను కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
BRS ఎమ్మెల్యే కౌశిక్డ్డిపై స్పీకర్కు జగిత్యాల MLA సంజయ్ ఫిర్యాదు
-
కౌశిక్రెడ్డిVsసంజయ్కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై గెలవాలన్నారు. -
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్ను కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
వెన్నుపోటు పొడిచింది
న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో సంజయ్ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.పాలకవర్గం మొదలు పార్లమెంట్దాకా‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.దౌత్య రక్షణ పీకేస్తామన్నారుతనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్ అఫైర్స్ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్కు నేను, డెప్యూటీ హైకమిషనర్ వెళ్లాం. ‘నిజ్జర్ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు. -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్పోర్ట్లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
జగిత్యాల కాంగ్రెస్లో కొత్త చర్చ.. జీవన్రెడ్డి ఫొటో ఎక్కడ?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఫ్లెక్సీల వార్ ఇంకా కొనసాగుతోంది.తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలు లేకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. కావాలనే జీవన్ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక.. మొన్న కూడా జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో, రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతోంది. ఈనేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్లో అంతర్గత పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
జగిత్యాల ప్రగతికే కాంగ్రెస్లో చేరా
జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతి అని, జగిత్యాల ప్రాంతాభివృద్ధికి ఆయనతో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్లో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంతో రాజకీయాలు చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలను ఖండించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. -
నాడు మీరు పార్టీలో చేర్చుకోలేదా?.. కేటీఆర్కు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అలాగే, తనపై విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటరిచ్చారు. అలాగే, జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ చేరినట్టు వెల్లడించారు.కాగా, సంజయ్ కుమార్ మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్గా కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువులతో కట్టించాను. నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. కేటీఆర్ మాటలు నన్ను బాధించాయి. విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో వేరే పార్టీలో గెలిచినవారిని మీరెలా(బీఆర్ఎస్) చేర్చుకోన్నారో ముందు సమాధానం చెప్పాలి. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం. నేను ఒక డాక్టర్ను చాలా కుటుంబాలను పోషించేంత ఆర్థికంగా ఉన్నవాడిని. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్లో చేరాను. మా కుటుంబం అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించాను. రైతుల కోసం రుణమాఫీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణాలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్స్ కట్టించాం. దీనికి సంబంధించిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. సంజయ్ కుమార్ ఇటీవలే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బీ-ఫామ్తో ఎన్నికల్లో గెలిచిన సంజయ్.. పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సంజయ్పై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్ఎస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. -
గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే.. ఎమ్మెల్యే సంజయ్కు కేటీఆర్ చురకలు
సాక్షి, జగిత్యాల: గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను ఉద్ధేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తుందని తెలిపారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరని అన్నారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనని తెలిపారు.కార్యకర్తలు ఎమ్మెల్యేను తయారు చేశారు కానీ.. ఎమ్మెల్యే, కార్యకర్తలను తయారు చేయలేదని తెలిపారు. వేల మంది కష్టపడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇప్పుడు దొంగల్లో కలిశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చిందన్నారు.‘అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం..వియ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు. ఎమ్మెల్యే సంజయ్కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీనే. దేశంలో ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెసే. దేశంలో ఎన్నో ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే తనకు తానే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు.2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయాడు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో రాజ్యాంగబద్ధంగా విలీనం అయ్యారు. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో విలీనం అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది చేరారు. రాజ్యాంగబద్దంగా మూడింట రెండొంతుల మంది చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదు అని కేటీఆర్ వివరించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్నీ రాళ్లతో కొట్టిచంపాలి. మీ చెమట, మీ రక్తం ధారపోసి గెలిపించాక పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్లతో కొట్టిచంపమని రేవంత్ రెడ్డే చెప్పాడు. మరి ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..? ఎవర్నీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
పోచారం, సంజయ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
ఇంకా అలక వీడని జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్బాబు మంగళవారం హైదరాబాద్లోని జీవన్రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబులు బేగంపేటలోని జీవన్రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్రెడ్డి భట్టి, శ్రీధర్బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
చాలా మనస్తాపానికి గురయ్యాను
-
కాంగ్రెస్ లో కలకలం
-
సంజయ్ చేరిక.. జీవన్ కినుక
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం రాత్రి అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలు బయటికి రావడంతో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్లు నచ్చజెప్పినా ఆయన దిగిరాలేదు. చివరికు మంత్రి శ్రీధర్బాబు చొరవ తీసుకుని చర్చలు జరిపినా జీవన్రెడ్డి శాంతించినట్టుగా కన్పించలేదు. ఏ వ్యక్తిపైనైతే పోరాడానో ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందంటూ సమస్య పరిష్కారం కాలేదనే సంకేతాలు ఇచ్చారు. నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. ఉదయాన్నే జగిత్యాలలోని తన నివాసానికి చేరుకున్న అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ తన సన్నిహితుల వద్ద జీవన్రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్లుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో జీవన్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామా వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కానీ జీవన్రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీకి అండగా నిలిచిన పెద్దమనిషి: శ్రీధర్బాబు తర్వాత మంత్రి శ్రీధర్బాబు రంగంలోకి దిగారు. జరిగిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ అన్నివిధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అండగా నిలిచిన పెద్దమనిషి జీవన్రెడ్డి అని కొనియాడారు. ఆయన మనస్తాపం చెందిన విషయం తెలుసుకుని తామంతా వచ్చి పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలని కోరామని తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, మనోవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన జీవన్రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సంజయ్ను ఏకపక్షంగా చేర్చుకోవడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ బలోపేతానికి పనిచేశారని, సంఖ్యాబలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తనతో చర్చించడానికి మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర నేతలు వచ్చారని అన్నారు. మూడు విడతలు తలపడిన జీవన్రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
జీవన్ రెడ్డి అవుట్!.. సంజయ్ ఇన్..!?
-
కాంగ్రెస్లో ఆసక్తికర రాజకీయం.. జీవన్రెడ్డి వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టేనా?
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్లో భిన్న నెలకొంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన అని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదుపోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..@jeevanreddyMLC @PocharamBRS @PocharamBRS @PocharamBhasker @BRSparty @INCTelangana @KTRBRS pic.twitter.com/w7wYzgz0gz— Sai (@Vardhavelly) June 23, 2024 అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన మరో ఎమ్మెల్యే
రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి ఆదివారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోగల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండురోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్కుమార్ 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2018లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అదే జీవన్రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్రెడ్డిపైనే మరోసారి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్.. ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కొంత దూరందూరంగా ఉంటున్నారు. మరోవైపు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కనీసం సమావేశం కాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తర్జనభర్జనలో ఉన్న ఆయన కాంగ్రెస్లో చేరారు. అయితే సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు పార్టీలో సీనియర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్రెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లాలో రాజకీయం మలుపుతిరిగే అవకాశముంది. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
వివాదాస్పదమైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీరు
-
క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్పై వేటు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటన వల్ల ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ తన పట్టు నిరూపించుకున్నాడు. బరిలో లేకపోయినా పట్టు నిరూపించుకున్న బ్రిజ్ భూషణ్ నేరుగా బరిలో నిలకపోయినా... 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే, డబ్ల్యూఎఫ్ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి చెప్పగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన మరోవైపు.. సాక్షికి మద్దతుగా బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. తాజాగా క్రీడా శాఖ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్లోని గోండాలో గల నందినగర్లో జరుగుతాయని ప్రకటించాడు. అయితే, ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖా నిర్ణయం తీసుకుంది. అందుకే వేటు ‘‘డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని క్లాజ్ 3(e) ప్రకారం.. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్స్ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. మీటింగ్కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇందుకు కనీసం 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి. అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి’’ . అయితే, ఈ నిబంధనలను సంజయ్ సింగ్ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్తోనే! -
నిబంధనల ప్రకారమే గేమింగ్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేíÙంచిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించేలా సవరించిన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన చట్ట సవరణలను పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది. అప్పటి నుంచి డ్రీమ్11 వంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, డెల్టా కార్ప్ వంటి కేసినో ఆపరేటర్లకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగర్వాల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 16,800 కోట్ల మేర పన్నులు కట్టాల్సి ఉందంటూ డెల్టా కార్ప్కు గత వారం నోటీసులు జారీ అయ్యాయి. రూ. 21,000 కోట్లు రాబట్టుకునేందుకు ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు గతేడాది షోకాజ్ నోటీసులు వచ్చాయి. వీటిని కర్ణాటక హైకోర్టు కొట్టేయగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 10న దీనిపై తదుపరి విచారణ జరగనుంది. -
ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంటు డైరెక్టర్గా సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారం ముగిసింది. ఆయన స్థానంలో రాహుల్ నవీన్ను ఇంఛార్జి డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1993 ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన రాహుల్ నవీన్ ఈడీకి రెగ్యులర్ డైరెక్టర్ నియమితులయ్యే దాకా పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. రాహుల్ నవీన్ ప్రస్తుతం ఈడీలోనే స్పెషల్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. సంజయ్కుమార్ మిశ్రాకు గతంలో రెండు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం ఏడాది చొప్పున పొడగింపు ఇవ్వగా సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. మరోసారి పొడగింపు కుదరదని తేల్చిచెబుతూ సెప్టెంబరు 15 దాకా గడువుచ్చింది. అది పూర్తి కావడంతో శుక్రవారం రాహుల్ నవీన్ను ఇంఛార్జిగా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు వెలువరించింది. -
జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా..
BRS పార్టీ నుండి 2014లో మాకునూరి సంజయ్ కుమార్ ఓటమి అనంతరం, 2019లో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి కులాలు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావితం పార్టీల పరిస్థితి: బి.ఆర్.ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రెబల్స్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఐదుగురు ఆశిస్తున్నారు. ఆశావహులు బీఆర్ఎస్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తాటిపర్తి జీవనరెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్సీ ) ఆశావహులు తాటిపర్తి విజయలక్ష్మి తాటిపర్తి రాము బీజేపీ: బోగ శ్రావణి (రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు) శైలేందర్ రెడ్డి మధుసూదన్ తిరుపతి రెడ్డి BRS అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్లస్లు: జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణా. సీఎం రిలీఫ్ పండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు అందించడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కెటిఆర్ వద్ద మంచి పేరు ఉండటం. మైనస్లు: బీర్పూర్ మండలంలో రోళ్లవాగు నిర్మాణం పూర్తి అయిన ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. కులవసంఘ భవనాలు నిర్మాణం జరిగినా.. దళిత బంధుకు అందించడం పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గంపై చిన్న చుపు చూడడం మండల, గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్లను అర్హులకు అందిచక పోవటం. -
అనిత X సంజయ్
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో తరచూ వార్తల్లోకెక్కిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయగా, వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ తన వీర విధేయుడు సంజయ్ కుమార్ సింగ్ను బరిలో దించాడు. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధ్యక్ష పోటీ ఇప్పుడు మాజీ రెజ్లర్ అనిత, బ్రిజ్భూషణ్ నమ్మిన బంటు సంజయ్ల మధ్యే నెలకొంది. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనితకు రెజ్లర్ల మద్దతు ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 12న ఓటింగ్, అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. -
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్లైన్స్ పుణె ఫ్లైట్లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్లైన్స్ పైలట్. సంజయ్ కుమార్ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
జగిత్యాల నియోజకవర్గంని పరిపాలించే వారెవరు?
జగిత్యాల నియోజకవర్గం జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాదించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. టిఆర్ఎస్ తరపున పోటీచేసిన డాక్టర్ ఎమ్.సంజయ్ కుమార్ భారీగా 61125 ఓట్ల ఆదిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్ కుమార్ కు 104247 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి. సంజయ్ కుమార్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత.1978 వరకు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ అదికంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందినా, ఆ తర్వాత అంటే నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈసారే వెలమ నేత గెలిచారు.2014లో కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత జీవన్ రెడ్డి కావడం విశేషం. ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ది సంజయ్ కుమార్ పై 7828 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. 2018లో మాత్రం జీవన్ రెడ్డి ఓడిపోవల్సి వచ్చింది. జీవన్ రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జగిత్యాలలో టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన తెలుగుదేశం ఎన్నికల ప్రచార కమిటీ అద్యక్షుడు ఎల్.రమణ 22385 ఓట్లతో ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018లో పోటీచేయలేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఏడుసార్లు రెడ్లు ఏడుసార్లు వెలమ, మూడుసార్లు బిసి వర్గం నేతలు, ద్విసభ్య నియోజకవర్గం గా ఉన్నప్పుడు ఒక ఎస్.సి నేత గెలుపొందారు. జీవన్రెడ్డి 1983లో టిడిపి పక్షాన తొలిసారి గెలుపొంది ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో స్థానం పొందారు. ఆ తరువాత ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. అనంతరం కాంగ్రెస్ ఐలో చేరి 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 1994లో ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్.రమణ, 1996లో కరీంనగర్ లోక్సభ స్థానానికి ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్రెడ్డి విజయం సాధించారు. 1999,2004,2014లలో కూడా నెగ్గారు. వై.ఎస్. క్యాబినెట్లో రహదారులు, భవనాల శాఖమంత్రిగా ఉన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో కేసిఆర్ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు. జగిత్యాలకు రెండు ఉప ఎన్నికలతో సహా 17సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి 10సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి ఎస్.టి.ఎఫ్. ఒకసారి గెలుపొందాయి. 1967లో కానుగంటి లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు గెలిచారు. 1952లో ఇక్కడ గెలిచిన బుట్టి రాజాం 57లో సుల్తానాబాద్లో, 62లో పెద్దపల్లిలో, 67లోను స్తులాపూర్లో మొత్తం నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో ఇక్కడ గెలుపొందిన వి.జగపతిరావు, 1989లో కరీంనగర్లో ఇండిపెండెంటుగా నెగ్గారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి నిర్వహించినవారిలో జీవన్రెడ్డితోపాటు, రాజేశంగౌడ్, ఎల్.రమణ కూడా ఉన్నారు. రాజేశంగౌడ్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేస్తే, రమణ 1995లో చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసారు. జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఈడీ డైరెక్టర్ను కొనసాగిస్తాం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకూ పెంచేందుకు అనుమతి కోరుతూ కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 63 ఏళ్ల మిశ్రా పదవీకాలాన్ని పదేపదే పెంచడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టడం తెలిసిందే. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమీక్షకు సంజయ్ కుమార్ గైర్హాజరైతే భారత ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అందువల్ల తమ పిటిషన్పై జూలై 28లోగా విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
జగిత్యాల సీఎం కప్ పోటీల్లో దొంగల హల్చల్..
జగిత్యాల: సీఎం కప్ లైటింగ్ నిర్వహణ చూస్తున్న సతీష్ అనే వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కొట్టేసిన దొంగలు.. మంత్రి కొప్పుల, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు హాజరైన కార్యక్రమంలో లక్ష రూపాయలు అపహరణకు గురి కావడంతో కలకలం.. పోలీస్ సెక్యూరిటీ కళ్ళు కప్పి ఉడాయించిన దొంగ.. మైక్ లో అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు. -
అప్పుడప్పుడు అలా జరుగుతుంది.. ఎమ్మెల్యే సంజయ్కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని, డాక్టర్లే కాకుండా సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ కు కంటి వైద్యంలో మంచి పేరుంది. డాక్టర్లు, చికిత్స గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఒకటి రెండు సంఘటనల వల్ల ప్రభుత్వాసుపత్రుల పట్ల అభిప్రాయాన్ని చెడుగా మార్చుకోవద్దని కోరారు. "మహిళ కడుపులో గుడ్డ ఉంచి కుట్లు వేశారన్నది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. కానీ ఇపుడు పేపర్లలో వస్తోందన్నారు. కింది స్థాయిలో ఒకరు చేసిన పొరపాటుకు మొత్తం వ్యవస్థను నిందించవద్దు. డాక్టర్లు, నర్సుల సమిష్ఠి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో రండి, మాతా శిశు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన గత వారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపింది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల DMHOకు ఫిర్యాదు చేశారు. చదవండి: నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
చైర్మన్ శ్రావణిని అవమానించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణిని రాజకీయంగా వేధించి, అవమానపరిచిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఒక మహిళ మీడియా సమక్షంలో తనను వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం బాధాకరమని, మహిళా చైర్మన్ను రాజకీయంగా అణచివేయడమంటే మొత్తం బీసీ సమాజాన్ని అణచివేయడమే అవుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీ మహిళలు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల హైదరాబాద్లోని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా స్థానిక ఎమ్మెల్యే సుభాష్రెడ్డి వేధింపులు తాళలేకి కన్నీరు పెట్టుకుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు బీసీలను కించపర్చడం కొత్తేం కాదన్నారు. గతంలో బీసీ లేదు గోసిలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారని, రిజర్వేషన్లు ఎత్తేయాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారని జాజుల తెలిపారు. మరో వైపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తే దేనికీ పనికిరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభలో మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. ఇలాంటి వాటిపై సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని, బీసీలకు క్షమాపణ చెప్పాలని జాజుల డిమాండ్ చేశారు. -
శ్రావణి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్.. ఏమన్నారంటే?
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్పర్సన్కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు. -
వైరల్ వీడియో: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!
-
Viral Video: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!
ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. చిన్నారి పాపలను అదృష్ట దేవతలుగా భావిస్తుంటారు. అంతేకాదు ఆడపిల్లలను అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకుంటారు. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అయిన ఓ వీడియో ఇలాంటి భావనను మన కళ్ల ముందుకు తెచ్చింది. జార్ఖండ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశారు. ‘భావోద్వేగ క్షణం. తల్లిదండ్రులు తమ కుమార్తెకు వీడ్కోలు చెబుతూ ఆమె పాదముద్రలను ఇంట్లో భద్రపరుస్తార’ని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఇంతకీ వీడియోలో ఏముంది? ఓ యువతిని కుర్చీలో కూర్చోపెట్టి తల్లిదండ్రులు ఆమె పాదాల చెంత కూర్చుంటారు. ఆమె పాదాలను పళ్లెంలో ఉంచి ముందుగా తండ్రి నీళ్లతో కడుగుతాడు. తర్వాత పాలతో పాదాలను కడుగుతాడు. పాదాలను కలిగిన పాలను తండ్రితో పాటు యువతి తల్లి కూడా తాగుతారు. తర్వాత యువతి పాదాలను ఎరుపు రంగు నీళ్లలో ఉంచి తెల్లటి వస్త్రంపై ఆమె పాదముద్రలు పడేలా చేస్తారు. అయితే ఈ వీడియోలోని వారు ఎక్కడ వారనే వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు ఈ వీడియో ఎప్పటిదనే విషయం కూడా తెలియదు. కానీ ఆ తల్లిదండ్రులు చేసిన పని మాత్రం ఎంతో మందిని కదిలించింది. మిశ్రమ స్పందన రెండు నిమిషాల 15 సెకన్ల ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేయగానే లక్షకు పైగా వ్యూస్తో వైరల్గా మారింది. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘హార్ట్ టచింగ్’ అంటూ చాలా మంది మెచ్చుకున్నారు. ‘భారతీయ సంస్కృతిలోని గొప్పదనానికి మచ్చుతునక’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘ఇంకా ఏ యుగంలో ఉన్నారు సార్ అని మరొకరు అంటే.. ‘ఇదంతా బాగానే ఉంది కానీ ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వండి’ అని ఇంకొరు వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆడపిల్లను అపురూపంగా చూసుకోవాలన్న సందేశాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. (క్లిక్: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి) -
యూపీలో బీజేపీ భారీ విజయం: తాజా ఎగ్జిట్పోల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు కొత్త పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. పంజాబ్, ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని.. గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey UP AC 70 Locations 280 Sample size nearly 7000 (exact number awaited as some data yet to be added) Vote Share Estimate BJP+ 43% SP+ 35% BSP 15% Cong 3% Oth 4% Big win for BJP Margin of error 3%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరప్రదేశ్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 43 శాతం ఓట్లను కైవసం చేసుకుంటాయని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ 35 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్పీ 15 శాతం, కాంగ్రెస్ 3 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సంపాదిస్తారని తెలిపింది. తాము అంచనా వేసిన దానికి 3 శాతం అటుఇటుగా ఫలితాలు రావొచ్చని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey findings PUNJAB No of AC 45 Locations 180 all sampled randomly, Sample size 4668, voters sampled randomly from voters list Vote share Estimate AAP 40% Cong 26% SAD+20% BJP+ 7% Oth 7% Big victory for AAP Margin of error 4%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి 29 శాతం, శిరోమణి అకాలీదళ్కు 20 శాతం, బీజేపీ, ఇతరులకు 7 శాతం చొప్పున ఓట్లు వస్తాయని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ అంచనా కట్టింది. తుది ఫలితాలు, ఎగ్జిట్పోల్కు మధ్య 4 శాతం వ్యత్యాసం ఉండొచ్చని తెలిపింది. (క్లిక్: ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్ పోల్స్) Finding from Lokniti-CSDS Post Poll survey UTTARAKHAND No of AC 26 Locations 104, Sample size 2738, All sampled randomly Estimated Vote Share BJP 43% Cong 38% AAP 3% BSP 4% Oth 12% Should give a comfortable majority to BJP Margin of error 3%.@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం దక్కనుందని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్లో తేలిందని రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది గురువారం(మార్చి 10న) తేలనుంది. (క్లిక్: వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం) Lokniti-CSDS Post Poll survey GOA AC 20 location 80 sample size 2066 sampled from voters list Vote share estimate BJP 32% Cong 29% AITC+ 14% AAP 7% RG 8% Oth 10% Hung Assembly possible Margin of error 6% due to smaller sample & multi corner contest@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 -
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఆ ఒక్కసారికి పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది. -
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యే
జగిత్యాల: కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రెండో దశలో ప్రజాప్రతినిధులు కూడా టీకాలు వేసుకోనున్నారు. అయితే సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు అత్యంత జాగ్రత్తతో టీకా వేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచించారు. మొదట కోవిడ్ వారియర్స్ ఉన్న వారికి టీకా వేసిన అనంతరం ప్రాధాన్య క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. వైద్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో కరోనా రోగులకు చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 5 వేల ప్రైవేటు దవాఖానల్లో టీకా పంపిణీ మొదలైంది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ వేసుకోనున్నారు. రెండో దశలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా టీకా తీసుకోనున్నారు. -
ఏడు పాత్రల మథనం
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష¯Œ ్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ‘నీ పేరు పిలవడం... నీ పేరు పలకడం..’ గీతాన్ని దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీతం అందించారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగలూరి. ఈ చిత్రానికి కెమెరా: సంతోష శానమోని, సహదర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
హోంక్వారంటైన్లోకి ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్లోకి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. అలాగే కరోనా బారిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. (చదవండి : ఎమ్మెల్యేకు కరోనా, నిన్ననే కవితకు విషెస్) I wish for your speedy and healthy recovery Anna. As I recently came in contact with you, I’ll be quarantining myself for next 5 days as a precautionary measure. I humbly request @trspartyonline cadre to avoid visiting my office for next few days. https://t.co/7Meoco2UCZ — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2020 -
ఎమ్మెల్యేకు కరోనా, నిన్ననే కవితకు విషెస్
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా బారినపడ్డారు. అసెంబ్లీలో కరోనా పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యేకు మంగళవారం పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ పలువురిని కలిసినట్టుగా తెలిసింది. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను ఆయన సోమవారం కలిసి అభినందించారు. కొద్ది రోజుల కిందట ఆయన కరోనా రోగులకు సేవలందించారు. ఎమ్మెల్యే సంజయ్ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు ఆకాక్షించారు. ఇక ఇటీవల కరోనా బారినపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కోరుకంటి చందర్ బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల సంతోష్ గుప్త, కేపీ వివేకానంద్, మంత్రి హరీష్రావు, హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు కోలుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో సత్తా చాటిన టీఆర్ఎస్ ) -
మానవ సంబంధాల నేపథ్యంలో...
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా, అక్షత సోనావని హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష¯Œ ్స నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అనిల్ పంగులూరి మాట్లాడుతూ– ‘‘దర్శకుడు క్రిష్ విడుదల చేసిన మా సినిమా టీజర్కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే లక్ష మంది టీజర్ని వీక్షించారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా: సంతోష శానమోని, సహ–దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
ఏడు పాత్రల అనుబంధం
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా టీజర్ను దర్శకుడు క్రిష్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగులూరి. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
కరోనా రోగికి అత్యవసర చికిత్స
సాక్షి, జగిత్యాల: ప్రమాదవశాత్తు గాయపడి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న కరోనా బా ధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ చొరవ తీసుకొని వైద్యం అందించారు. జ గిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని అంతర్గాం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు ఇటీవల ఇంట్లో జారిపడ్డాడు. తల కు బలమైన గాయంతోపాటు కుడికాలు విరిగిం ది. కన్నుకు కూడా తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కరీంనగర్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన క్రమంలో అతను కరోనా బారిన పడ్డాడు. కరోనా పాజిటివ్గా తేలడంతో అక్కడి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ తీవ్రమైన నొప్పితో నరకయాతన అనుభవిస్తున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ వెంటనే స్పందించారు. నేత్రవైద్యుడు అయిన ఎమ్మెల్యే సంజయ్తోపాటు ఆర్ధోపెడిక్ వైద్యుడు నవీన్, వైద్యసిబ్బంది పీపీఈ సూట్లు ధరించి కరోనా బాధితుడికి ఆదివారం చికిత్స అందించారు. ఇది తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్యే సంజయ్ను ట్విట్టర్లో అభినందించారు. -
ఖైదీ నంబర్ 4414
గొర్రెకుంటలో తొమ్మిది మంది హత్యకు గురైనసంఘటనకు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు పేర్కొన్నారు. ఒక్కడే ఇంత మందిని హత్యచేసి ఉండడని, ఇతరుల సహకారం తీసుకుని ఉంటాడని, ఘటనపై మరింత సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఎంజీఎం : తొమ్మిది మందిని ఒక్కడే పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు పేర్కొన్న వివరణపై పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గొర్రెకుంటలో హత్యకు గురైన వారి మృత దేహాలు ఎంజీఎం మార్చురీలో ఉండగా.. తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు మొదట మట్టెవాడ పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిషా సోదరుడు ఫిరోజ్ షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్కుమార్ యాదవ్ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నాడని, ఇంత మందిని ఒక్కడే ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ ఘటనలో సంజయ్కుమార్కు మరికొంత మంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఆయన మరింత సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.(వరంగల్ జైలుకు సంజయ్ ) మృతదేహాల అప్పగింత గొర్రెకుంటలో హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్ద వారి బంధుమిత్రుల మధ్య నిర్వహించారు. ఉదయం పశ్చిమ బెంగాల్ నుంచి మృతుడి బంధువులు వరంగల్కు చేరుకోవడంతో ఎండీ మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలం, కుమారులు ఎండీ షాబాద్ ఆలం, కూతురు బుస్రా ఖాతూ, మనవడు బబ్లూ మృతదేహాలను గీసుగొండ ఇన్చార్జి తహసీల్దార్ సుహాసిని, రాయపర్తి తహసిల్దార్ సత్యనారాయణ, గీసుగొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అర్బన్ పంచనామా అనంతరం అప్పగించారు. పోతనరోడ్డులోని ఖబరస్థాన్లో అంత్యక్రియలను పూర్తి చేశారు.(పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?) ఆందోళన అనంతరం షకీల్ మృతదేహం అప్పగింత.. మక్సూద్ కుటుంబ సభ్యులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో షకీల్ భార్య తాహేరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్కు ఇద్దరు భార్యలు ఉన్నారని, ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయమై అధికారులు ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో షకీల్ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూర్తయిందని షకీల్ సోదరుడు సజ్జర్తో వివరణ తీసుకున్న అనంతరం రెండవ భార్య తాహెర బేగంకు మృతదేహాన్ని అప్పగించారు. ఈమృతదేహానికి సైతం ముస్లిం మత పెద్దలు స్థానిక కార్పొరేటర్ రిజ్వానా షమీమ్ మసూద్, కల్పలత సూపర్బజార్ వైస్చైర్మన్ ఎం.డీ.షఫీ సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.(మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం) నిందితుడికి 14 రోజుల రిమాండ్ వరంగల్ లీగల్ : తొమ్మిది మందికి మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో వేసి హత్య చేసి నిందితుడు బీహార్కు చెందిన సంజయ్కుమార్యాదవ్ను గీసుకొండ పోలీసులు మంగళవారం మూడవ ముస్సిఫ్ కోర్టు ఇన్చార్జి జడ్జి కుమారస్వామి ఎదుట హాజరుపర్చారు. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జి జూన్ 8న తిరిగి హాజరుపర్చాలని ఆదేశించారు. నిందితుడిపై హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించడం, విషప్రయోగం ద్వారా కిడ్నాప్ చేయడం, చనిపోయిన వ్యక్తులకు చెందిన వస్తువులను దురుద్దేశ్యంతో స్వాధీనం చేసుకోవడం, దొంగతనం చేసి హత్య నేరానికి పాల్పడిన అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 302, 210 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై సెక్షన్లు.. ఐపీసీ సెక్షన్ 449 : హత్య చేయాలని ఉద్ధేశంతో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం ♦ ఈ నేరం రుజువైతే నిందితుడికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా సెక్షన్ 328 : నేరానికి పాల్పడాలనే ఉద్ధేశంతో విషప్రయోగం చేయడం 10 సంవత్సరాల కారాగార శిక్ష మరియు జరిమానా సెక్షన్ 364 : హత్య చేయడానికి మృతుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి కిడ్నాప్ చేయడం యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా సెక్షన్ 380 : దొంగతనం చేయడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా సెక్షన్ 404 : చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను తెలిసి తీసుకోవడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష సెక్షన్ 302 : హత్యా నేరం ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా సెక్షన్ 210 : బాకీ లేని అప్పు లేదా ఉన్నదానికంటే ఎక్కువ బాకీ డబ్బుల కోసం దురుద్ధేశంగా ఆర్డర్ తీసుకోవడం ,రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా శిక్ష + జరిమానా ఖైదీ నంబర్ 4414 : హై సెక్యూరిటీ బ్యారక్కు నిందితుడు వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట వద్ద బావిలోని తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరి హత్య కేసులోని నిందితుడైన సంజయ్కుమార్యాదవ్ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించగా హైసెక్యూరిటీ బ్యారక్లో ఉంచారు. అంతకు ముందు అతడికి ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రిమాండ్ ఖైదీ సంజయ్కుమార్కు 4414 నంబర్ కేటాయించినట్లు జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. మార్చురీలోనే మరో రెండు మృతదేహాలు.. తొమ్మిది మందిలో బీహార్కు చెందిన ఇద్దరి మృతదేహాలు ఎంజీఎం ఫ్రీజర్లలోనే ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు వరంగల్కు వస్తున్నారని, ఇక్కడకి చేరుకున్నాక అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
భావోద్వేగాల క్షీరసాగరమథనం
‘ఝలక్, గ్రీన్ సిగ్నల్, ప్రేమికుడు, సోడా గోలిసోడా’ చిత్రాల ఫేమ్ మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అక్షిత సొనవనే హీరోయిన్గా, ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడుగా నటించారు. హీరో సందీప్ కిషన్ ఇటీవల టైటిల్ని విడుదల చేయగా, తాజాగా హీరో అడివి శేష్ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసే చిత్రమిది. మంచి సినిమా చూశామనే సంతృప్తిని ప్రేక్షకులకు మిగిల్చేలా ఉంటుందనే నమ్మకం మాకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసడ, కెమెరా: సంతోష్ షనమోని, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
తప్పులు అంగీకరించిన టీఆర్ఎస్ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులను పార్లమెంటులో ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వొద్దంటూ లోక్సభ స్పీకర్ను కలసి విజ్ఞప్తి చేయడం ద్వారా టీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను అంగీకరించినట్లైందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మొండివైఖరి వల్ల 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహారశైలిని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. -
రెండవ రోజు హైకోర్టు న్యాయవాదుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. బదిలీలకు నిరసనగా బుధవారం తెలంగాణ హెకోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. శనివారం వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను బహిష్కరించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. జస్టీస్ సంజయ్ కుమార్ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ జస్టీస్ సంజయ్ కుమార్ను పంజాబ్, హర్యానా కోర్ట్కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. -
బదిలీ సిఫారసుపై న్యాయవాదుల భగ్గు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ సంజయ్కుమార్ బదిలీ సిఫా రసు నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళవారం అత్యవసరంగా ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశానికి భారీస్థాయిలో న్యాయవాదులు పాల్గొన్నారు. కొలీజియం నిర్ణయానికి నిరసనగా మంగళవారం నుంచి శనివారం (3 నుంచి 7) వరకు కోర్టు విధులను బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. 4 నుంచి 7వ రకు విధులను బహిష్కరించాలని కింది కోర్టు ల న్యాయవాద సంఘాలను సైతం హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. ఇటు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా జస్టిస్ సంజయ్కుమార్కు అండగా నిలవాలని నిర్ణ యించింది. సుప్రీంకోర్టులో పిల్కు తీర్మానం.. సీనియర్ న్యాయవాదుల నేతృత్వంలోని సంఘం కార్యవర్గం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియంలోని ఇతర న్యాయమూర్తులను కలవాలని కూడా తీర్మానించారు. ఇటు రాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకాలు, ప్రధాన న్యాయమూర్తిగా పదో న్నతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చే విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలన్నింటినీ భర్తీ చేసే వరకు ఏ హైకోర్టు నుంచి కూడా న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. బదిలీ అన్యాయం: టి.సూర్యకరణ్రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ‘నెంబర్ టు స్థానంలోని న్యాయమూర్తిని అదే స్థానంలో మరో హైకోర్టుకు బదిలీ చేస్తే ఎవరికీ అభ్యంతరముండదు. 12వ స్థానంలో ఉండే లా బదిలీ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏఆరోపణలు లేని జస్టిస్ సంజయ్కుమార్ను ఇలా బదిలీ చేయడం సరికాదు. 3 రాష్ట్రాల సీజేలు జస్టిస్ సంజయ్కుమార్ కంటే జూనియర్లు. జస్టిస్ సంజయ్కుమార్కు సీజేగా పదో న్నతి ఇవ్వకపోవడం అన్యాయమైతే ఇప్పు డు జూనియర్గా బదిలీ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే..’ -
‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్ చేయలేను’
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్న మున్నా భాయ్-3 షూటింగ్ వాయిదా పడబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ చిత్ర దర్శకుడు రాజ్కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడిందని, తనకు క్లీన్చీట్ వచ్చాకే షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో ‘బాబా’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా తన భార్య మాన్యతా దత్తో కలిసి వచ్చిన సంజూ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నా భాయ్-3 సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చేస్తున్నానని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సినిమా ఎప్పుడు మొదలుకానుందని దర్శకుడు రాజు కుమార్ హిరానీని అడగాలని, అతను మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలడన్నాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ...‘ఇప్పుడు నేను చెట్ల వెంట తిరుగుతూ డాన్స్ చేస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేయలేను. అయితే హాలీవుడ్ నటులు మెల్ గిబ్సన్, డెంజెల్ వాషింగ్టన్ లాగా గొప్ప పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశాడు. 1981 లో వచ్చిన రాకీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి సంజూ భాయ్... త్వరలో రణ్బీర్ కపూర్తో "షంషేరా" అలాగే అర్జున్ కపూర్తో "పానిపట్" సినిమాలలో కనిపించనున్నాడు. -
కవిత కోసం నా పదవి త్యాగం చేస్తా: సంజయ్
జగిత్యాల: జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఆ స్థానంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను గెలిపించుకుంటామన్నారు. జగిత్యాలలో బుధవారం జరిగిన కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. కవిత హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తారా? అని పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. కవిత హుజూర్నగర్ నుంచి పోటీ చేయబోరని స్పష్టం చేశారు. -
టెన్త్ ఫెయిలైనా... డాక్టర్నయ్యా!: ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఆయనో ప్రముఖ వైద్యుడు. కంటి డాక్టర్గా మారుమూల గ్రామాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించారు. వైద్య శిబిరంలో మందులు ఇచ్చి పంపించడమే గాక.. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన సేవా గుణం ఆయనది. 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. వెనుదిరిగి చూడలేదు. వైద్యుడిగా సేవలు అందిస్తూనే... ప్రజల్లో గుర్తింపు పొందారు. 6వేల ఓట్లతో ఓడిపోయిన చోటే 60వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనే జగిత్యాల ఎమ్మెల్యే ముకునూరు సంజయ్కుమార్. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహం, తాత చొక్కారావు ఆదర్శాలు తనను రాజకీయంగా నిలబెట్టాయని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇది. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం అంటే ఇష్టం జగిత్యాల మండలం అంతర్గాం సొంతూరు. నాన్న హన్మంతరావు, అమ్మ వత్సల. నాన్న వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. కుటుంబంలోని ఇతరులు రాజకీయంగా ఉన్నతస్థాయిలో ఉన్నా, నాన్న మాత్రం వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. 90 ఎకరాల భూమిని కౌలుకు ఇవ్వకుండా సాగు చేసేవారు. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. చిన్నప్పుడు, డాక్టర్ వృత్తిలోకి రాకముందు నాన్నకు వ్యవసాయంలో సాయపడేవాడిని. పట్టుబట్టి చదివా! నాకు చదువు అంటే ఇష్టమే. అయినా 1977లో పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. అప్పట్లో 10వ తరగతి పాస్ పర్సంటేజీ 10 శాతం ఉండేది. అయినప్పటికీ పట్టుబట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయి, ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయ్యా. ఇంటర్మీడియట్లో 80 శాతం మార్కులతో పాస్ అయ్యా. ఇంటర్ పూర్తి కాగానే మా నాన్న హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీలో చేర్చారు. 1980–81లో ఏడాది మాత్రమే డిగ్రీ చేశా. అప్పుడే విజయవాడలో ప్రైవేటు రంగంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల వచ్చింది. నాకున్న మార్కులతో నేరుగా ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాను. నాకు లా చేయాలని ఉన్నా, మా నాన్న కోరిక మేరకే ఎంబీబీఎస్ చదివి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పేరున్న నేత్ర వైద్య నిపుణుడిగా కొనసాగాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవి ఫెయిలైన విద్యార్థుల మానసిక స్థితిని చూస్తే బాధేస్తుంది. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అది గెలుపునకు మరో మెట్టుగా మార్చుకోవాలి. టెన్త్లో ఫెయిల్ అయినా బాధ పడలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఓడిపోయినా నేను బాధ పడలేదు. రెండోసారి విజయం సాధించానుగా. ఎదుగుదలలో సహధర్మచారిణి రాధిక 1989లో వివాహం జరిగింది. బంధువుల అమ్మాయి అయిన రాధికను పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా ఆవిడ రాధిక సైతం రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. రాధిక తండ్రి కమలాకర్రావు బోయినిపల్లి సర్పంచ్గా సేవలు అందించారు. రాధిక అమ్మ వాళ్ల నాన్న దివంగత మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్ధండుడు. అయినా రాధిక నా భార్యగా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. గృహిణిగా సేవలందించింది. నా వృత్తి విజయంలో, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఆమె ప్రధానం. సేవ చేసేందుకే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. నాకు చిన్నప్పటి నుంచే సామాజిక సేవలో పాల్గొనడం ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన. డాక్టర్గా ఉంటూనే ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం, గ్రామాల్లో వైద్య సేవలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడిని. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించాను. వేలాది మెడికల్ క్యాంపులు పెట్టడమే కాక, 10వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగాను. ఎమ్మెల్యేగా పూర్తి సమయం ప్రజాసేవకే నాకు ఒక్కతే కూతురు హార్తిక, అల్లుడు రాజీవ్. హైదరాబాద్లో బిజినెస్ చేస్తుంటారు. నేను, నా భార్య ఇక్కడ ఉంటాం. వాళ్లు తరచూ వస్తూ వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో నాకే సమయం కేటాయించారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా జీవితంలో మమేకం కావలసిందే. గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలు, ప్రజల బాధలను తెలుసుకుంటున్నా. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నా. జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మా కుటుంబానిది రాజకీయ నేపథ్యమే మా సొంత చిన్నాన్న శ్రీరంగారావు కరీంనగర్ ఎంపీగా సేవలందించారు. నా భార్య తాత చొక్కారావు రాజకీయ దిగ్గజం. కరీంనగర్ చరిత్రలో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి వంటి నేతనే ఓడించిన రాజకీయ దిగ్గజం ఆయన. నా జీన్స్లోనే రాజకీయ నేపథ్యం ఉంది. అదే నా రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణమై ఉంటుంది. గతంలో టికెట్ ఆఫర్ వచ్చినా... పోటీ చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, ప్రజారాజ్యం తరఫున జగిత్యాల నుం చి పోటీచేసే అవకాశం వచ్చింది. ప్రత్యేక కారణమేమీ లేకపోయినా... ఎందుకో పోటీ చేయలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీ కవిత సహకారంతో టీఆర్ఎస్లో చేరాను. తొలిసారి 2014లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. రెండోసారి మొన్నటి ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులు, కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ఏకంగా 60వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. డాక్టర్గా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో సంతృప్తి పొందుతున్నా! డాక్టర్గా ఉన్నప్పుడు వైద్య పరంగా ప్రజలకు సేవ చేసేవాడిని. ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసేవాడిని. ఎందరికో కంటి వెలుగునయ్యా. కానీ పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికీ సంతృప్తిగా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు? జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి చెరువులో నీరు నింపే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నీరందేలా చూ స్తున్నాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందింది. పట్టణ ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉం ది. ముఖ్యంగా యావర్రోడ్డును వెడల్పు చేసేలా చర్యలు తీసుకుంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి నన్ను అత్యధిక మెజారిటితో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. -
సమస్యల రాయికల్
ఎన్నో ఆశలతో మున్సిపాల్టీగా మారిన రాయికల్ పట్టణంలో సమస్యలు వేధిస్తున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత మంజూరైన నిధులతో ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయికల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.ఎన్నికల వేళ నాయకులు ఇచ్చిన హామీలు నేరవేర్చే దిశగా నిధులు మంజూరు చేస్తే పట్టణం అభివృద్ధి లో దూసుకుపోతుంది.ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు స్పందించి అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సాక్షి, రాయికల్: ప్రస్తుతం పట్టణంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. శివారు కాలనీలు చెత్తమయం... వెలగని వీధిదీపాలు... కాలనీల్లో మురుగుకాలువల అసంపూర్తి ఇది రాయికల్ పట్టణం తీరు. ఏళ్లు గడిచినా సమస్యల పరిస్కారానికి నోచుకోవడం లేదు.పట్టణంలో 16 వేల జనాభా ఉండగా సుమారు 10,914 మంది ఓటర్లు ఉన్నారు. 18 వార్డులున్నాయి. రాయికల్ పురపాలిక సంఘానికి రూ.25 కోట్లు మంజూరు కాగా పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. రాయికల్ పట్టణంలో ఏటా జనాభా పెరుగుతుండగా పట్టణ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. శివారు కాలనీలో మురుగు కాలువలు లేక రహదారిపై మురికినీరు పారడంతో పాటు వీధిదీపాలు లేక కాలనీల్లో తాగునీటి ఎద్దడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవీ సమస్యలు.. • గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహించడానికి రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీస్టేడియం ఏర్పాటుకు రూ.2.10 కోట్లు మం జూరు చేయగా కొంత మేరకు పనులు చేసి నిలిపివేశారు. మినీస్టేడియం పనులు పూర్తి చేయాల్సి ఉంది. • రాయికల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి రాయికల్తో పాటు మూడు మండలాలకు సేవలు అందించాల్సి ఉంది. రాయికల్ పట్టణంలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం వాహనం, సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. • పట్టణంలో ప్రయాణ ప్రాంగణంలో వసతులు లేకపోవడంతో ప్రయాణికులు రహదారిపై నిరీక్షించాల్సి వస్తోంది. రాయికల్ పట్టణంలో పాతబస్టాండ్లో ప్రయాణ ప్రాంగణం పునర్నిర్మించాలి. • పట్టణంలో స్వయం సహాయక బృందాల సమావేశం కోసం నిర్మించిన స్వశక్తి సంఘ భవనం పూర్తి చేయాల్సి ఉంది. • రాయికల్ మండల కేంద్రంలో అద్దె ఇరుకు గదుల్లో అవస్థల మధ్య ఉన్న గ్రంథాలయం సొంత భవనం నిర్మించాలి. • పట్టణంలో పెద్ద చెరువును మినీట్యాంక్బండ్గా అభివృద్ధి చేయాలి. • రాయికల్ పట్టణ పురపాలిక భవనాన్ని నూతనంగా నిర్మించాల్సి ఉంది. • పట్టణంలోని వైకుంఠ దామంలో పనులు పూర్తి చేసి పట్టణ వాసులకు సరిపడా వసతులు కల్పించాల్సి ఉంది. • పట్టణంలోని హనుమాన్వాడ దేవాలయంతో పాటు మార్కెట్యార్డుకు మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది. • ప్రతి శనివారం నిర్వహించే వారసంతలో రహదారిపై ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించాలి. • పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలి. • మిషన్ భగీరథ పనులతో గుంతలు ఏర్పడి పట్టణ వాసులకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని రహదారులను మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. • పట్టణంలో పలు వీధుల్లో విద్యుత్ తీగలు ఇతర తీగలు వేలాడుతుండటంతో ప్రమాదకరంగా మారింది. సరిచేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు వేయాల్సి ఉంది. సమస్యలు పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.ముఖ్యంగా రాయికల్ ఎన్నో ఎళ్లు ఉన్న పాత బస్టాండ్ లో ప్రయాణికుల కోసం షెడ్డు నిర్మాణం, మాదిగకుంట వినియోగంలోకి తీసుకవచ్చి సంక్షేమ వసతిగృహాలు, లైబ్రరీ వట్టి భవనాలు నిర్మించాలి – శ్రీనివాస్, రాయికల్ పట్టణాభివృద్ధి్ద కోసం నిధులు మంజూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లడంతో పట్టణాభివృద్ధి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేశారు.త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రానున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ది చేస్తా. – సంజయ్కుమార్, ఎమ్మెల్యే -
జగిత్యాల: ద్విముఖ పోరు
సాక్షి,జగిత్యాల(కరీంనగర్) : జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట. 1952లో ఏర్పడిన నియోజకర్గ పరిధిలో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాలు ఉన్నాయి. 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 4సార్లు విజయం సాధించాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ 12 సీట్లు గెలుచుకుంటే.. జగిత్యాలను మాత్రం జీవన్రెడ్డి కైవసం చేసుకున్నారు. అయితే ఈ సారి ఎలాగైన జగిత్యాల కోటపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ జోరుగాప్రచారం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ముందుకు సాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ముదుగంటి రవీందర్రెడ్డి ప్రచారంలో మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. ⇔యావర్రోడ్డు పూర్తికావాలి. ⇔పాతబస్టాండ్ను విస్తరించాలి. ⇔మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి. ⇔ఆయకట్టు కాలువల మరమ్మతులు చేపట్టాలి. ⇔నూతన ఫిల్టర్బెల్డ్ను లింగంపేట చెరువుకు కాకుండా నూతన చెరువుకు కలపాలి. ⇔జగిత్యాల పట్టణంలో రూ.5కోట్లతో నిర్మించిన టౌన్వాల్ 25ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దానిని ఉపయోగంలోకి తేవాలి. ⇔రాయికల్ మున్సిపాలిటీ అయిన్పటికీ... బస్టాండ్ ఏర్పాటు చేయాలి. ⇔రాయికల్లోని మాదికకుంట స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. ⇔పాత సారంగాపూర్ మండలంలో మిషన్భగీరథ అస్తవ్యస్తంగా ఉంది. ⇔మండలంలోని రోల్లవాగు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదు. ⇔సాంగాపూర్, బీర్పూర్ మండలాల కు కలిపి డిగ్రీకళాశాల ఏర్పాటు చేయాలని అక్కడి విద్యార్థులు కోరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్.. జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జీవన్రెడ్డి న్యాయవాదిగా జగిత్యాలలో స్థిరపడ్డారు. మొట్టమొదటిసారిగా మల్యాల సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్లో చేరి అప్పటి నుండి చేతిగుర్తు తరుఫునపోటీ చేసి ఇప్పటి వరకు 6సార్లు గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంజయ్కుమార్ (టీఆర్ఎస్) టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ది జగిత్యాల మండలం అంతర్గాం. వృత్తిరీత్యా కంటి వైద్య నిపుణులుగా జగిత్యాలలో స్థిరపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున టికెట్ దక్కింది. అప్పుడు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. మళ్లీ టీఆర్ఎస్ ఆయనకే టికెట్ కట్టబెట్టింది. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే సంజయ్కుమార్ను ఎలాగైనా గెలిపించి రికార్డు సృష్టించాలని ఎంపీ కవిత పట్టుపట్టారు. ఆయన తరఫున ముందుండి ప్రచారం చేస్తున్నారు. ఊరూరా తిరిగి, సంజయ్కుమార్ను గెలిపించి, జగిత్యాల కోటలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నారు. ముదుగంటి రవీందర్రెడ్డి (బీజేపీ) మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన ముదుగంటి రవీందర్రెడ్డి మొదటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 24 ఏళ్లుగా పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీచేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం అవకాశం రావడంతో రవీందర్రెడ్డి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన బీఈ ఇంజినీరింగ్ చేసినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. జగిత్యాల నియోజకవర్గం వార్తల కోసం... -
జగిత్యాల: బరిలో విద్యావంతులు
సాక్షి, జగిత్యాల : జిల్లాలో అసెంబ్లీ పోరు రసదాయకంగా మారింది. ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్ర వృత్తిలో ఉన్న డాక్టర్లు... రాజ్యంగ హక్కులను కాపాడేలా పేద, ధనిక తారతమ్యలకు తావు లేకుండా అన్నివర్గాలకు న్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతున్న న్యాయవాదులు.. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజినీర్లు.. ఉన్నత విద్యావంతులు చట్ట సభల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఒకప్పుడు రాజకీయాలను మురికికూపంలా భావించే విద్యావంతులు ఇప్పుడు అందులో ప్రవేశించి స్వచ్ఛమైన పాలన అందించేందుకు నడుం బిగించారు. జనం నాడి పట్టుకుని... రాజకీయాల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నుంచి ఈ సారి ఉన్నత విద్యావంతులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ వృత్తితోపాటు సమాజ సేవ చేయాలని కొందరు... తమకున్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని కొందరు ఎన్నికల వైపు మెుగ్గు చూపుతున్నారు. రాజకీయ అండదండలతో ప్రధాన పార్టీల టిక్కెట్లు సాధించుకుని బరిలో దిగారు. వృత్తుల్లో ఏర్పడ్డ పరిచయాలు, ఇంతకాలం తమ సేవలకు లభించిన గుర్తింపు తమకు కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు. అందుకు ప్రధాన పార్టీల నుంచి రేసులో ఉన్నవారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గం నుండే ఆరుగురు విద్యావంతులు బరిలో ఉన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన డాక్టర్ సంజయ్కుమార్ ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి గెలుపొందినా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే సంజయ్కుమార్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో పార్టీనే నమ్ముకుని పని చేసిన ఆయనకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ టిక్కెట్ కేటాయించారు. దీంతో సంజయ్కుమార్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెట్పల్లికి చెందిన డాక్టర్ జేఎన్.వెంకట్ ఏడాది క్రితం వరకు వైద్య సేవలందించారు. ప్రస్తుతం కోరుట్ల స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మొదట్నుంచే కాంగ్రెస్లో కొనసాగిన వెంకట్ 2009లో పీఆర్పీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో తన భార్య సునీతను పీఆర్పీ నుంచి కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపారు. అయితే ఆమె ఓడిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరిన వెంకట్ రెండు నెలల క్రితం వరకు పార్టీలోపీసీసీ కార్యదర్శిగా పని చేశారు. తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన సిరికొండ రవిశంకర్ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగిత్యాలకు మెడికల్ కాలేజీ సాధన.. నియోజకవర్గంలో నెలకొన్న అపరిష్కృత సమస్యల సాధనే ప్రధాన ఎజెండాగా చేసుకున్న రవిశంకర్ ఏడాది క్రితమే తన ఆస్పత్రిని సైతం మూసేసి జనం మద్యలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గమంతా పాదయాత్ర చేపట్టారు. అన్నివర్గాలను కలుస్తూ తనను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా డాక్టర్ సత్యనారాయణమూర్తి బరిలో ఉన్నారు. ఆయన జగిత్యాల స్ధానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇది రెండోసారి. 2014లోనూ అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పట్టణంలో ఆయనకు మంచి వైద్యుడిగా పేరుంది. జగిత్యాల నియోజకవర్గం నుండి మహాకూటమీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్రెడ్డి న్యాయవాది. ఇప్పటికీ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు జననేతగా పేరుంది. ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా మళ్లీ బరిలో ఉన్నారు. ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య న్యాయవాది. ఆయనా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే 2014లో కమలం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన 13,267 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. -
ఈసారి జగిత్యాల మాదే..!
2014 ఎన్నికల్లో నేను ఓడి కాంగ్రెస్ నాయకులు జీవన్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా.. మా అధినేత కేసీఆర్ జగిత్యాలను ఏనాడూ చిన్నచూపు చూడలేదు. నాలుగేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,250 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇక్కడి ప్రజలకు అందించారు. జిల్లా ఏర్పాటు.. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. రాయికల్ మున్సిపాలిటీ దాని అభివృద్ధికి రూ. 25 కోట్ల మంజూరు దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తా. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్రోడ్డు, పాత బస్టాండు విస్తరణ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు టీఆర్ఎస్తోనే సాధ్యం..’ అంటున్నారు జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్. ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి.. ప్రచార తీరు.. హామీలు.. గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, జగిత్యాల: 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనతో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఆ రెండు పార్టీల పుణ్యమా అని 1956లో ఏర్పాటైన జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్రోడ్డు విస్తరణ అంశాన్నీ ఆయా పార్టీలు పట్టించుకోలేదు. 58 ఏళ్లలో ఆయా పార్టీల పనితీరు.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పనితీరు ప్రజల ముందుంది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అద్భుత పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారంచుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ టీఆర్ఎస్ నెరవేర్చింది. డాక్టర్గా ప్రజల్లో నాకు మంచి ఆదరణ, గౌరవం ఉంది. ఇవే నా గెలుపునకు సహకరిస్తాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి జగిత్యాలపై గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఓడినా ప్రజల మధ్యే.. వృత్తిరీత్యా నేను కంటి వైద్యనిపుణుడిని. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు 50వేల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేశా. 2014 సాధారణ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే నేను టీఆర్ఎస్లో చేరిన. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ తరఫున జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయా. రాష్ట్రంలో మాత్రం మా పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఓడినా నిరుత్సాహపడలే. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్యలోనే ఉంటున్న. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసిన. పార్టీ అధిష్టానం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న. నిజామాబాద్ ఎంపీ కవిత, పార్టీ క్యాడర్ అందించిన సహాయసాకారాలు నాకు వరంలా కలిసొచ్చాయి. 2014కు ముందు జగిత్యాలలో అసలు టీఆర్ఎస్ కార్యాలయమే లేదు. నేను మోతెలో విశాలమైన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. దాని కేంద్రంగా ప్రజలకు సేవలందించా. ఆరు నెలల క్రితమే ఆస్పత్రిని మరో వైద్యుడికి అప్పగించి పూర్తిగా ప్రజల మధ్యే ఉంటున్న. రూ. 1250 కోట్లతో అభివృద్ధి.. నేను ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏనాడూ చిన్నచూపు చూపలేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు దీటుగా జగిత్యాలలో అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేసింది. రాయికల్ మండలం బోర్నపల్లిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్లు విడుదల చేయగా.. పనులు ముగింపు దశలో ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. కొత్తగా రాయికల్ మున్సిపల్ ఏర్పాటుతో పాటు రూ.25 కోట్లు, నియోజకవర్గంలో 26వేల మంది బీడీ కార్మికులకు జీవనభృతి, 58వేల మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ, ఆరోగ్య శ్రీ పథకం కింద 9వేల మందికి కార్పొరేట్ వైద్యం, వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల, 2800 మందికి కల్యాణలక్ష్మీ.. 750 మందికి షాదీముబారక్ చెక్కులు, 3,500 మందికి కేసీఆర్ కిట్ల పంపిణీ, చెరువుల పునరుద్ధరణ మొత్తంమీద నియోజకవర్గానికి నాలుగేళ్ల కాలంలో రూ.1250 కోట్లు మంజూరు చేయించిన. 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ఇవి నా గెలుపునకు సహకరిస్తున్నాయనే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులూ కేసీఆర్పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్దే. ఉపాధ్యాయుల సీపీఎస్ సమస్య పరిష్కారం కేంద్ర ఆధీనంలోనిది. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు రెండు నెలల క్రితమే మా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. 2014 ఎన్నికల ఫలితాల ప్రకటన మరుసటి రోజే నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజల మధ్య ఉంటున్న నేను.. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన. ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తాన్నీ రెండు సార్లు చుట్టి వచ్చిన. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ కవిత పర్యటనలతో నియోజకవర్గంలో మరింత ఊపు వచ్చింది. పార్టీ క్యాడర్, నాయకులందరూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. ఫలితంగా ప్రచారానికి నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామనీ తీర్మానాలు, వాగ్దానాలు చేస్తున్నారు. అది ప్రతిపక్షాల కుట్ర నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. చిరువ్యాపారులను ఇబ్బంది పెడతానని ప్రతిపక్షాలు నన్ను బద్నాం చేసే కుట్ర పన్నుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ను విస్తరిస్తానని మాత్రమే నేను చెబుతున్న. ఏ ఒక్క చిరువ్యాపారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్న. అదో మాయకూటమి అభివృద్ధి నినాదం కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో 58 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కూటమిగా ఏర్పడ్డాయి. మహాకూటమి పేరుతో ప్రజలను మాయచేసేందుకే వీరందరూ ఒక్కటయ్యారు. ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించని ఆ రెండు పార్టీలను ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. జగిత్యాలలో కాదు అసలు రాష్ట్రంలోనూ మహాకూటమి ప్రభావం లేదు. జనాల్లో చర్చ లేదు. రాష్ట్రంలో మాదిరిగానే జగిత్యాలలోనూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గం వార్తల కోసం -
ఎయిర్ ఏసియా ఇండియా సీఓఓగా ఇండిగో మాజీ
సాక్షి, ముంబై : ఎయిర్ ఏసియా ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. ఇండిగో మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ కుమార్ను తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించింది. డిసెంబర్ 3 నుంచి సంజయ్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారని ఎయిర్ ఏసియా ఒక ప్రకటనలో తెలిపింది. తమ టీంలో సంజయ్కుమార్ చేరడం చాలా సంతోషంగా ఉందంటూ ఎయిర్ ఏసియా ఇండియా ఛైర్మన్ రామదొరై ఆయనకు స్వాగతం పలికారు. సంస్థ వృద్ధి పుంజుకుంటున్న, అంతర్జాతీయ కార్యకలాపాలకు విస్తరించాలన్న ఉద్దేశ్యంలో సమయంలో ఆయన తమతో జత కలిసారని తన ప్రకటనలో పేర్కొన్నారు. టాటా సన్స్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్కు 1.5శాతం, రామదొరైకి 0.5శాతం వాటాతో జాయింట్ వెంచర్గా ఏర్పడిన విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా ఇండియా. సెప్టెంబర్ నాటికి దేశీయంగా 4.4 శాతం మార్కెట్ వాటా ఉన్న ఎయిర్ ఏసియా ఆర్థిక అక్రమ ఆరోపణలు, చట్టవిరుద్ధ లాబీయింగ్ ఆరోపణలపై సీబీఐ కేసులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానయాన సేవలకు సంబంధించిన లైసెన్సులు పొందేందుకు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. కాగా ఇండిగోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసిన సంజయ్ కుమార్కు వైమానిక పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. -
ఉద్యోగులకు అన్యాయం చేసిన కేసీఆర్
కరీంనగర్సిటీ: సకల జనుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాలకు క్షేత్రస్థాయిలో నేతృత్వం వహించిన ఉద్యోగులపై కేసీఆర్ కక్షసాధింపు చర్యలతో తీవ్ర అన్యాయం చేశాడని బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని 21, 25వ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం హౌసింగ్బోర్డు కాలనీ, మధుర నగర్, గాయత్రి నగర్, మేదరివాడ, శషామహల్ ప్రాంతంలో సాగింది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఎన్నో ఆశలతో నూతన ఆవిర్భావ రాష్ట్రంలో తమకు తమ కుటుంబాలకు వ్యక్తిగత, సామాజిక భద్రతతోపాటు సరైన రీతిలో గౌరవ అభిమానాలు లభిస్తాయనుకున్న ఉద్యోగులకు అవమానకరమైన మనోవేదనను కేసీఆర్ మిగిల్చాడని విమర్శించారు. నూతన రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు, మండలాల విభజనతో ఉద్యోగులపై మానసిక భౌతిక ఒత్తిడి తీవ్రమైందన్నారు. బదిలీల క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. బీజేపీ నాయకులు తోట సాగర్, కోడూరి అనిల్, కటుకం రమేశ్, గడ్డం మహేశ్వర్రెడ్డి, కొట్టె రవి, ఇస్కమల్ల సంజీవ్, దర్శనాల క్రిష్ణ, పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి, చిట్టిమల్ల సంతోష్, రచ్చ సాయికిరణ్,తోట సతీష్లతో పాటు బీజేపీ ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు బేతి మహేందర్రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ప్రవీణ్రావు ,బండ రమణారెడ్డి, నాంపెల్లి శ్రీనివాస్, ఉప్పరపెల్లి శ్రీనివాస్, సర్దార్ సంజీత్సింగ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను గౌరవించేది బీజేపీయే... కరీంనగర్రూరల్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానించిన ఢిల్లీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ నేడు ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్తో చేతులు కలపడం ఎన్టీఆర్ అభిమానులను మోసం చేయడమేనని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో సోమవారం ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం, పాదయాత్ర నిర్వహించారు. మహాకూటమి ఆవిర్భావంలో సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిన విషయం ప్రజలు గమనించి ఎన్టీఆర్ ఆశయాలను గౌరవించే బీజేపీకి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు బీజేపీకి ఓట్లువేసి గెలుపించాలని కోరారు. నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, దాసరి రమణారెడ్డి, కూకట్ల రమేశ్, కోత్తూరి సంపత్, బలుసులఅనిల్, హరిక్రిష్ణ, వెంకటేష్, శ్రీనివాస్, ప్రశాంత్, ప్రవీణ్, రాజేష్, బాలి సత్యం, రమేశ్, వంశీ, సదానందం, తిరుపతి, దేవేందర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
ఈ లుక్కుకే బుక్కయ్యాడు
బిహార్ బీజేపీ లీడర్ సంజయ్ కుమార్ మహతో ఫోన్ని ఎవరో కొట్టేశారు. అది ఖరీదైన ఫోన్. అంతకన్నా వాల్యూ అయిన డేటా అందులో ఉంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ దొంగమొహం వాడెవడో కనిపెట్టే బాధ్యతను పోలీస్ డిపార్ట్మెంట్ మధుబాల దేవి అనే పోలీస్ ఆఫీసర్ మీద పెట్టింది. కాల్ డేటా రికార్డ్స్ని ట్రేస్ చేసి.. ఆ ఫో ఎవరి దగ్గర ఉందో కనిపెట్టింది మధుబాల. మరి వాడి దగ్గర్నుండి ఫోన్ రాబట్టడం ఎలా? మెసేజ్లు పంపడం మొదలుపెట్టింది. ముందు ‘హాయ్’ అంది. తర్వాత ‘ఐ లైక్ యూ’ అంది. ఆ తర్వాత ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పింది. అతడు పడిపోయాడు. ‘ఐ టూ..’ అన్నాడు. ‘నిన్నొకసారి చూడాలని ఉంది’ అని కూడా అన్నాడు. మధుబాల ఫొటో పంపింది. ఆ వ్యక్తి మళ్లీ పడిపోయాడు. ‘మొత్తం బిహార్లోనే లేదు ఇంత అందగత్తె’ అనుకున్నాడు. ‘మనం వెంటనే మీట్ అవుదాం’ అన్నాడు. మధుబాల ‘ఎస్’ చెప్పింది. ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మంది. దొంగోడు వచ్చాడు. పోలీస్ ఆఫీసరమ్మా వెళ్లింది. అయితే.. బుర్ఖా వేసుకుని వెళ్లింది! అతడు ఆమెకు దగ్గరవుతుండగా, అతడికి ఎవరో నలుగురు దగ్గరయ్యారు. ఆ నలుగురూ పోలీసులు! వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. అతడి చేతిలోని ఫోన్ని లాక్కున్నారు. ‘ఈ ఫోన్ ఎవరిది?’ అని అడిగారు. ‘కొన్నాను’ అన్నాడు అతడు. ‘ఎక్కడ కొన్నావ్?’ అని అడిగారు. ‘ఎవరో అమ్ముతుంటే కొన్నాను’ అన్నాడు. పోలీసులకు అర్థమైంది. దొంగ దగ్గర ఇంకో దొంగ కొన్నాడని! (దొంగ సొమ్ము కొన్నవాళ్లు దొంగలే కదా). దొంగకు కూడా అర్థమైంది... ముగుసులో ఉన్నది తన లవర్ కాదు, పోలీస్ ఆఫీసర్ అని. పోయిన ఫోన్ దొరికినందుకు బీజేపీ లీడర్ హ్యాపీ. ఒక పెద్ద టాస్క్ని పూర్తి చేసినందుకు పోలీస్ ఆఫీసర్ హ్యాపీ. వాళ్లిద్దరికన్నా ఎక్కువ హ్యాపీ.. బిహార్ పోలీస్ డిపార్ట్మెంట్! ఫోన్ కోసం వేటాడితే అనుకోకుండా ఒక గ్యాంగ్స్టర్ వాళ్లకు పట్టుబడ్డాడు. అవును. ఇప్పటివరకు మనం దొంగ.. దొంగ.. అనుకున్న ఆ దొంగోడు.. మహమ్మద్ హస్నైన్ అనే నటోరియస్ గ్యాంగ్స్టర్! మధుబాల ప్లాన్కి అది ప్రతిఫలం. మామూలు దొంగను పట్టబోతే ఏకంగా గ్యాంగ్స్టరే వలలో పడ్డాడు. ఇదంతా సరే.. పైన నయరతార ఫొటో ఏమిటి? తన ఫొటో అంటూ గ్యాంగ్స్టర్కి మధుబాల పంపిన ఫొటో.. నయనతారదే! -
వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం
అందరికీ వాహనం అవసరమే. కాకపోతే మనుషుల్ని బట్టి వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. పెద్ద కుటుంబమైతే విశాలమైన పెద్ద కారు కావాల్సి రావొచ్చు. అదే చిన్న కుటుంబం, సింగిల్గా ఉన్న ప్రొఫెషనల్స్ లాంటి వారికయితే ఇటు పార్కింగ్కు అటు మెయింటెనెన్స్కు సులువుగా ఉండే చిన్న కారు బెటరని అనిపించొచ్చు. ఇక గృహిణులైతే.. చిన్నా, చిత్రకా పనులు చుట్టబెట్టేందుకు తేలికపాటి స్కూటర్లాంటి దాన్ని ఇష్టపడొచ్చు. ఇలా ఒకరికి అనువైన వాహనం మరొకరికి అనువైనది కాకపోవచ్చు. అలాగే, వాహన బీమా కూడా!!. అల్లాటప్పాగా ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా... వాహనం, దాని వాడకాన్ని బట్టి సరైన పాలసీ, తగిన యాడ్-ఆన్లు తీసుకుంటేనే బీమా ప్రయోజనాలు పూర్తిగా పొందవచ్చు. అందుకే వివిధ సందర్భాల్లో ఉపయోగపడే యాడ్-ఆన్ల గురించి తెలుసుకోవాలి. బంపర్ టు బంపర్ డ్రైవింగ్.. ప్రస్తుతం చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దాదాపు ఒకదానికి మరొకటి తాకేంత దగ్గరగా బంపర్ టు బంపర్ డ్రైవింగ్ పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు కారు ఫైబర్ , మెటల్ వగైరా పార్టులు ఇట్టే దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, దెబ్బతిన్న ఫైబర్, ప్లాస్టిక్, మెటల్ వంటి భాగాల రిపేర్లకు అయ్యే ఖర్చులో వాహనం తరుగుదలను బట్టి దాదాపు 50 శాతం దాకా మాత్రమే సాధారణ పాలసీల్లో పరిహారం దక్కవచ్చు. ఇలాంటప్పుడు డిప్రిసియేషన్ కవరేజీ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. రీప్లేస్ చేసిన భాగాల విలువలో డిడక్ట్ చేసిన తరుగుదల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు రెండు పర్యాయాలు అవకాశం లభిస్తుంది. దీనితో ప్లాస్టిక్, ఫైబర్ పార్టులకు మరింత సమగ్ర కవరేజీ ఉన్నట్లవుతుంది. కన్జూమబుల్ కవరేజి.. మీరు పూర్తి బీమా క్లెయిమ్ కోరుకునే వారయితే దీన్ని తీసుకోవచ్చు. వాహనంలో నట్లు, బోల్టులు, బ్రేక్ ఫ్లూయిడ్స్ మొదలైన వాటిని కన్జూమబుల్స్ భాగాలుగా వ్యవహరిస్తారు. చాలా మటుకు పాలసీల్లో ఇలాంటి వాటికి కవరేజీ ఉండదు. కాబట్టి ఇలాంటి కన్జూమబుల్ భాగాలకు కూడా బీమా రక్షణ ఉండేలా యాడ్-ఆన్ కవర్ తీసుకోవచ్చు. తాళం చెవులు పోతే.. మతిమరుపు వల్ల కావొచ్చు మరొకటి కావొచ్చు తరచూ తాళాలు పోగొట్టుకోవడం సమస్యయితే ఇందుకోసం కూడా ప్రత్యేకంగా కార్ కీ రీప్లేస్మెంట్ కవరేజీ లభిస్తుంది. కారు తాళం చెవి పోతే డూప్లికేట్ కీ తయారీకి, ఒకవేళ తాళం కూడా పాడైతే దాన్ని కూడా మార్చేందుకు అయ్యే ఖర్చును దీని కింద పొందవచ్చు. ఈ యాడ్-ఆన్ తీసుకుంటే రూ. 50,000 దాకా కవరేజీ ఉంటుంది. పాలసీ వ్యవధిలో ఒకో దఫాకి గరిష్టంగా రూ. 25,000 దాకా క్లెయిమ్కు అవకాశముంటుంది. భారీ వర్షాలు, వరదల నుంచి వాహనానికి రక్షణ.. చిన్నదైనా, పెద్దదైనా వర్షమొస్తే చాలు రోడ్లూ, ఇళ్లూ జలమయమైపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనాల్లోకి నీళ్లు వెళ్లిపోయి అవి కదలకుండా మొరాయిస్తుంటాయి. పోనీ అని నిండా నీళ్ల నుంచి దాన్ని బైటికి లాగేందుకు స్టార్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంజిన్ దెబ్బతింటే బీమా కంపెనీలు దాన్ని స్వయంకృతం కిందే పరిగణిస్తాయి. దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వవు. పోనీ సొంత డబ్బు పెట్టుకుని ఇంజిన్ను రిపేరు చేసుకోవాలనుకుంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కేందుకు హైడ్రోస్టాటిక్ లాక్ యాడ్ ఆన్ కవరేజీ ఉపయోగపడుతుంది. నీరు చొరబడటం వల్ల ఇంజిన్ భాగాలు పాడైతే వాటిని రిపేర్ చేసేందుకు లేదా రీప్లేస్ చేసేందుకు అయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ మీరు నివసించే ప్రాంతంలో వర్షమొస్తే మునిగిపోయే పరిస్థితులుంటే ఇలాంటి యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్కు రక్షణ .. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారై ఉండి ఇన్సూరెన్స్ను ఇప్పటిదాకా క్లెయిమ్ చేయని పక్షంలో మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) భారీగానే లభించవచ్చు. అయితే, మీ టీనేజీ పిల్లలో లేదా సమీప బంధువులో మీ కారును తీసుకెళ్లి ఏ డ్యామేజీనో చేసి తీసుకొస్తే బీమా పరిహారం తీసుకోవాల్సి రావొచ్చు. ఫలితంగా ఎన్సీబీ ప్రయోజనాలను నష్టపోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భం ఎదురు కాకుండా ఎన్సీబీ ప్రొటెక్టర్ కవర్ తీసుకుంటే పాలసీ వ్యవధిలో రెండు పర్యాయాల దాకా నో క్లెయిమ్ బోనస్ పర్సంటేజీకి రక్షణ ఉంటుంది. దాదాపు 25 శాతం పైగా ఎన్సీబీ జమయిన వాహనదారులకు ఈ కవరేజీ ఉపయోగ కరంగా ఉంటుంది. ప్రయాణించే వారికి అదనపు భద్రత వాహనంలో ప్రయాణించే వారి వ్యక్తిగత భద్రతకు కూడా మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవరేజీలు ఉన్నాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్: వాహనంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదవశాత్తు పాక్షికంగా లేదా పూర్తిగా వికలాంగులైనా లేదా ప్రమాదంలో మరణించినా .. ఈ కవరేజీతో గరిష్టంగా ఒక్కొక్కరికి రూ. 2 లక్షల దాకా పరిహారం లభిస్తుంది. హాస్పిటల్ క్యాష్: ఈ యాడ్-ఆన్ ఉంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షంలో రోజుకు రూ. 1,000 దాకా గరిష్టంగా 30 రోజుల వరకు నగదు పరిహారం లభిస్తుంది. అంబులెన్స్ చార్జెస్ కవర్: వాహనంలో ప్రయాణిస్తుండగా గానీ ఎక్కుతుండగా లేదా దిగుతుండగా గానీ ప్రమాదవశాత్తు పాలసీదారుకు తీవ్రగాయాలైతే ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్కయ్యే ఖర్చులు ఈ యాడ్ ఉంటే పొందవచ్చు. ఇలా..వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలసీలను, యాడ్ ఆన్ కవరేజీలు తీసుకుంటే నిశ్చింతగా.. దూసుకుపోవచ్చు. -
భిక్షమెయ్యలేదని... గొంతు కోసేశారు..
న్యూఢిల్లీ: అతి చిన్న వయసులోనే పిల్లల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలోని గోవింద్పురి ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కలకలం రేపింది. అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఒక పూల వ్యాపారిని బీర్సీసాతో గొంతు కోసి హత్యచేశారు భిక్షాటన చేసుకునే బతికే ఇద్దరు బాలురు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఒక దేవాలయం దగ్గర పూలవ్యాపారం చేసుకుంటాడు సంజయ కుమార్. పక్కనే మరో షాపులో మద్యం సేవిస్తుండగా 9, 10 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలు భిక్షమడిగారు. దీనికి సంజయ్ నిరాకరించడంతో చంపేస్తామని బెదిరించారు. దీంతో కోపోద్రిక్తుడైన సంజయ్ ఒక బాలుడ్ని చెంపపై కొట్టాడు. అంతే పిల్లలిద్దరూ గొడవకు దిగి రెచ్చిపోయారు. ఒకడు బీరు సీసాతో నెత్తిమీద బలంమీద కొట్టాడు. మరొకడు కిందపడిపోయిన సంజయ్పైకి ఎక్కి కుర్చుని మరీ పగిలిన బీరు సీసాతో గొంతు కోసేశాడు. దీంతో బాధితుడు తీవ్రం రక్తం స్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిల్లల్ని తోసి పారిపోవడానికి సంజయ్ ప్రయత్నించాడనీ, కానీ సగంవరకు గొంతు తెగిపోయి తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ తప్పి పడిపోయాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తాము ఆసుపత్రి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా సంజయ్ నిరాకరించాడని పక్క షాపు యజమాని రోహ్తస్ కుమార్ తెలిపారు. పోలీసులు వచ్చి తరలించేలోపే మరణించాడన్నారు. కాగా రిక్షా కార్మికుల పిల్లలలైన నిందితులిద్దరూ సంవత్సరం క్రితం ఇంట్లోంచి పారిపోయి వచ్చి, కల్కాజీ గుడి దగ్గర బిక్షాటన చేస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించామని చెప్పారు. -
‘బ్యాక్లాగ్స్’ సమస్యను పరిష్కరించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో 12, అంత కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని (బ్యాక్ లాగ్స్) విద్యార్థులను తదుపరి సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి విశ్వవిద్యాలయం అధికారులు నిరాకరిస్తున్న నేపథ్యంలో... ఈ సమస్యకు ఓ పరిష్కారం చూడాలని ఉస్మానియా వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణీయమైన నిర్ణయాన్ని తీసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్కు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. 12 అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని తమను తదుపరి సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు గతనెలలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.వాదనలు విన్న హైకోర్టు సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. -
మహిళల పట్ల ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు
వెల్దుర్తి, న్యూస్లైన్ : చెరువులో చేపలు పట్టే విషయంలో ఓ వర్గం మహిళలపై స్థానిక ఎస్ఐ అశోక్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గురువారం మండల పరిధిలోని ఎలుకపల్లికి చెందిన ముది రాజ్ కులస్తులు స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భం గా ఎస్ఐ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే ఈ విషయం లో విచారణ చేయిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కాన్చెరువు (చేపల కోసం) హక్కులపై ఎలుకపల్లికి చెందిన ముదిరాజు లు, వెల్దుర్తికి చెందిన గంగపుత్రుల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. అయితే వారం రోజుల క్రితం చెరువులో చేపల వేట కొనసాగిస్తున్నారని గంగపుత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదిరాజ్లను ఎస్ఐ స్టేషన్కు తీసుకువచ్చారు. బుధవారం స్థానిక ఎస్ఐ పో లీసుల ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య చెరువులో ఉన్న చేపలను గంగపుత్రులు వేటాడారు. అయితే మిగిలిన ముదిరాజ్ లు, మహిళలు దీనిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఇందుకు ఆగ్రహించిన ఎస్ఐ సదరు కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశా రు. అనంతరం ముదిరాజ్ కులస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంత రం సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని వెనుతిరిగారు. గురువారం ముదిరాజ్లను రిమాండ్కు తరలిస్తుండగా సదరు కులస్తులతో పాటు వెల్దుర్తి సర్పంచ్ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు తోట నరసింహులు, ఉపసర్పంచ్ వెంకటేష్లు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ మో హన్రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండతో నిరుపేదలైన ముదిరాజులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహా నికి గురైన ఎస్ఐ సర్పంచ్ని తీవ్రంగా దూర్భాషలాడారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చి వె ల్దుర్తి పట్టణాన్ని బంద్ చేయించి బ స్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎస్ఐ దిష్టిబొమ్మతో అంబేద్కర్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్విహ ంచి అక్కడ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అయితే విష యం తెలుసుకున్న తూప్రాన్ సీఐ సం జయ్కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఎస్ఐ మహిళలపై అనుచిత వాఖ్యలు చేశారని, బాంబులు వేసి ఇళ్లను ధ్వం సం చేస్తానని హెచ్చరించారని ఆరోపిం చారు. మంత్రి సునీతారెడ్డికి బంధువునంటూ అమాయక ప్రజలను వేధిస్తున్నాడని, తక్షణమే ఎస్ఐపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎస్ఐపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళన కారులు శాంతించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి తహశీల్దార్కు మెమోరాండం సమర్పించారు. హక్కులు ముదిరాజులకే : సర్పంచ్ పంచాయతీ పరిధిలో 20 చెరువులు, కుంటలు ఉండగా పంచాయతీ అభివృ ద్ధి కోసం వేలం పాటలు చేశామని సర్పంచ్ మోహన్రెడ్డి తెలిపారు. 18 చెరువు, కుంటలకు గంగపుత్రులకు కే టాయించి.. కాన్ చెరువు ముదిరాజుల కు, నర్సిన్ చెరువు ఎస్సీలకు కేటాయించామన్నారు. ఎస్ఐ అతిగా ప్రవర్తిస్తూ పోలీసు బలగాలతో కాన్చెరువులో అక్రమంగా గంగపుత్రులచే దగ్గరుండి చేపలు పట్టించడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి రిమాండ్కు తరలించారని ఆరోపించారు. తండ్రి రిమాండ్తో సొమ్మసిల్లిన కుమార్తె చేపల వేటకు వెళ్లిన ముదిరాజలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే గుడ్డివాడైన కానికే అంజయ్యను రిమాండ్కు తరలించడంతో ఆయన కుమార్తె మంజుల సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను తోటి మహిళలు ఆస్పత్రికి తరలించారు. డీపీఓ ఆదేశాల మేరకే బందోబస్తు ఇచ్చాం కాన్చెరువు హక్కులు గంగపుత్రులకే ఉంటాయని డీపీఓ ఆదేశాల మేరకే గంగపుత్రులు కాన్చెరువులో చేపలు పట్టడానికి బందోబస్తు ఇచ్చామని తూప్రాన్ సీఐ సంజయ్కుమార్, స్థానిక ఎస్ఐ అశోక్రెడ్డిలు తెలిపారు. కాన్చెరువుపై గంగపుత్రులకు పూర్తి హక్కు ఉంటుందని సర్పంచ్కు డీపీఓ నోటీసులు కూడా పంపారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7న కాన్చెరువులో ముదిరాజులు చేపల వేట సాగిస్తున్నారని గంగపుత్రులు తమకు ఫిర్యాదు చేయగా అక్రమంగా చేపలు పడుతున్న ముదిరాజులైన మల్లయ్య, అంజయ్య, స్వామి, భాగయ్య, పోచయ్య, అంజయ్య, మైసయ్య, యాదగిరి, కిష్టయ్యలపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.