IndiGo Airlines
-
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్లైన్స్ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్బాస్ విన్నర్గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్మనీ ఎంతో తెలుసా..? -
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
ఇండిగో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల పాట్లు!
IndiGo Outage: ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి తలెత్తిన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు, గ్రౌండ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.చెక్-ఇన్లు నెమ్మదిగా సాగడంతో ప్రయాణికులు చాలా సేపు వేచిఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల భారీ క్యూలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణాలు కిక్కిరిశాయి. దీంతో కొన్ని చోట్ల సిబ్బంది బోర్డింగ్ పాసులను చేత్తో రాసిస్తున్నారు. ఇండిగో సిస్టమ్లో తలెత్తిన లోపం కారణంగా టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ కొందరు ప్రయాణికులు వాపోయారు. తమకు ఎదురైన ఇబ్బందులను బాధిత ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తాయి.అంతరాయంపై ఇండిగో స్పందించింది. కొనసాగుతున్న సిస్టమ్ అంతరాయం కారణంగా ప్రభావితమైన కస్టమర్లకు సాధ్యమైనంత మెరుగైన సహాయం, మద్దతును అందించడానికి తమ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ‘ఎక్స్’లో వివరించింది. #6ETravelAdvisory : We want to assure you that our dedicated airport teams are working relentlessly to provide the best possible assistance and support to customers affected by the ongoing system outage. (1/2)— IndiGo (@IndiGo6E) October 5, 2024 -
నేటి నుంచి ముంబై–విజయవాడకు ఇండిగో సర్వీస్
గన్నవరం: వాణిజ్య రాజధాని ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమాన సంస్థ శుక్రవారం నుంచి నూతన సర్వీస్ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూరప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ముంబై–విజయవాడ మధ్య ఎయిరిండియా సర్వీస్ నడుస్తుండగా, ఇప్పుడు ఇండిగో రాకతో మరో సర్వీస్ అందుబాటులోకొచ్చినట్లయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 14 నుంచి న్యూఢిల్లీ–విజయవాడ సర్వీస్సెప్టెంబర్ 14వ తేదీ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి విజయవాడకు విమాన సర్వీస్లు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్బస్ ఎ320 విమానం రోజూ ఉదయం 8.10 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి 10.40కి విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11.10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఎయిరిండియా రెండు విమాన సర్వీస్లను నడుపుతోంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండిగో సంస్థ ఢిల్లీ–విజయవాడ మధ్య సర్వీస్ నడిపేందుకు ముందుకొచ్చినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. -
ఇండిగో, ముంబై ఎయిర్పోర్ట్లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్పోర్ట్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్పోర్ట్పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
15 నిమిషాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య!
కర్ణాటక: అందమైన బీచ్లు, దేవస్థానాలతో ప్రశాంతంగా ఉండే ఉడుపి నగరంలో ఘోరం చోటుచేసుకుంది, ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి, ఇంటి యజమాని నూర్ మహమ్మద్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య హసీనా (45), కూతుళ్లు అఫ్నాన్ (23), ఆజ్నాన్ (21), కొడుకు అసీమ్ (14) ఉడుపిలో తృప్తినగరలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కొడుకు అసాద్ బెంగళూరులో ఇండిగో ఎయిర్లైన్స్లో, అలాగే అఫ్నాన్ బెంగళూరులో ఎయిర్హోస్టెస్గా ఉద్యోగం చేస్తున్నారు. పండుగ సెలవులు రావడంతో అఫ్నాన్ రెండు రోజుల కిందట ఉడుపిలోని ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం 8:20 గంటల సమయంలో 45 ఏళ్ల మధ్యవయస్కుడు మూతికి మాస్క్ ధరించి సంతెకట్టెకు వచ్చాడు, అక్కడి నుంచి ఆటో ఎక్కి తనను తృప్తినగరకు తీసుకెళ్లాలని ఆటోడ్రైవర్ శ్యామ్కు సూచించాడు. ఆ మేరకు అతన్ని తృప్తినగరలో దించాడు. హత్యకు గురైన తల్లి హసీనా, ఆమె పిల్లలు (ఫైల్) నలుగురిని వెంటాడి పొడిచి దుండగుడు వెంట తెచ్చుకున్న చాకుతో ఇంటిలోకి చొరబడి మారణహోమం సృష్టించాడు. ఎక్కడ ఉన్నవారిని అక్కడే పొడిచి, గొంతుకోసి హతమార్చాడు. వంట గది, బెడ్రూం, బాతురూం, హాల్లో ఒక్కొక్కరి శవాలు ఉండడమే దీనికి నిదర్శనం. హసీనా అత్తను వెంటాడగా ఆమె భయంతో బాతురూంలోకి వెళ్లి లాక్ చేసుకోవడంతో బతికి పోయింది. అసీమ్ సైకిల్ తొక్కుతూ ఇంటిలోకి వచ్చి దుండగున్ని చూసి కేకలు వేశాడు. దుండగుడు బాలున్ని హాల్లో పొడిచి చంపి పరారయ్యాడు. 15 నిమిషాల్లో దారుణం కాగా హంతకుడు 15 నిముషాలలో పని ముగించుకొని మళ్లీ ఎవరో బైకులో వెళ్తుంటే సంతెకట్టకు డ్రాప్ తీసుకున్నాడు. సంతెకట్ట నుంచి ఎక్కడకు వెళ్లాడో జాడ లేదు. ఈ హత్యోదంతం క్షణాల్లోనే ఉడుపి అంతటా పాకిపోయింది. వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి జాగిలాలు, వేలిముద్రల నిపుణులు ఆధారాల కోసం గాలించారు. బెంగళూరు యాసలో మాట్లాడాడు ► ఐదు పోలీసు బృందాలు మంగళూరు, శివమొగ్గ, కారవారకు వెళ్లాయి, రెండు బృందాలు ఉడుపిలో గాలిస్తున్నాయి. ► 45 ఏళ్ల వయసున్న హంతకుని సీసీ కెమెరా ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. నిందితుడు బెంగళూరు యాసలో కన్నడ మాట్లాడినట్లు ఆటో డ్రైవర్ శ్యామ్ చెప్పాడు. ► ఎయిర్ హోస్టెస్గా పని చేస్తున్న యువతిపై ద్వేషంతోనే హత్యాకాండకు పాల్పడి ఉండొచ్చని, లేదా పెద్ద కొడుకు పాత్ర ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ► పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. ► దుబైలో ఉన్న మొహమ్మద్, బెంగళూరులో పెద్దకొడుకు అసాద్ చేరుకోగా సోమవారం సాయంత్రం కోడిబెంగ్రె జామియా మసీదులో అంత్యక్రియలను జరిపారు. -
కొచ్చి–బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన కొచ్చి–బెంగళూరు విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్తో అధికారులు హైరానా పడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 2.24 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. 6ఈ6482 విమానం మొత్తం 139 మంది ప్రయాణికులతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే, ఆ విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అధికారులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో, అధికారులు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. వారికి చెందిన లగేజీని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువేదీ లేదని ధ్రువీకరించుకున్నారు. అనంతరం 2.24 గంటల సమయంలో ఆ విమానం తిరిగి బెంగళూరుకు టేకాఫ్ అయ్యింది. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్లైన్స్ పుణె ఫ్లైట్లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్లైన్స్ పైలట్. సంజయ్ కుమార్ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
ఆకాశంలో పుట్టినరోజు వేడుకలు.. చిన్నారికి ఇండిగో ఎయిర్లైన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్..
పుట్టినరోజును ఎవరైన చాలా స్పెషల్గా జరుపుకోవాలనుకుంటారు. అందుకు ముందే కొత్తగా ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ మొదటి బర్త్డే అంటే ఇక ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇవేం లేకుండానే ఓ చిన్నారి తన బర్త్డేని చాలా స్పెషల్గా జరుపుకుంది. ఎందుకంటే చిన్నారి పుట్టినరోజుని ఏకంగా ఇండిగో విమాన సంస్థే జరిపింది. బ్యూలా లాల్ అనే చిన్నారికి ఇండిగో విమాన సంస్థ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయేలా అరుదైన జ్ఞాపకాన్ని అందించింది. చిన్నారి మొదటి పుట్టిన రోజునే విమానంలో ప్రయాణిస్తుందని తెలుసుకుని ఎయిర్లైన్స్ సిబ్బంది ముందస్తుగా బర్త్డే ప్లాన్ చేశారు. కరాచీ విమానాశ్రయానికి చిన్నారి రాగానే ఎయిర్లైన్స్ కెప్టెన్ మైక్ అందుకుని ఈ విషయాన్ని మైకులో అందరికీ ప్రకటించారు. చిన్నారితో కేక్ కట్ చేయించారు. విమాన ప్రయాణీకులందరూ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఈ వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చాలా మంచి అవకాశం అని స్పందించారు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. లాంగ్ లైఫ్, హ్యాప్పీగా ఉండాలని చిన్నారి సోషల్ మీడియా వేదికగా దీవించారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్హోస్టస్తో అసభ్యకరంగా..
పట్నా: భారతీయ విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరువకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరు విమానంలో పట్నాకు వస్తున్నట్లు ఇండిగో సంస్థ ఫిర్యాదుచేయంతో పట్నాలో దిగగానే పట్నా ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ అధికారులు అరెస్ట్చేశారు. ప్రస్తుతం బిహార్లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్యసేవనం రాష్ట్రపరిధిలో నేరం. మద్యం తాగి బిహార్లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విమానంలో వీరు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇండియన్ ఎయిర్లైన్స్పై డీజీసీఏ సీరియస్ న్యూఢిల్లీ: పారిస్–న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ ఆరున జరిగిన రెండు ఘటనలను అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలను లెక్కచేయకుండా బాత్రూమ్లో ధూమపానం చేస్తున్న వ్యక్తిపై, తోటి ప్రయాణికురాలి సీటు, దుప్పటిపై మూత్రవిసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడిపై అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని డీజీసీఏ సూచించింది. ‘ ఏదైనా విమానంలో అనుకోని ఘటన జరిగితే ల్యాండింగ్ జరిగిన 12 గంటల్లోపు మాకు నివేదించాలి. కానీ డిసెంబర్ ఆరున ఘటన జరిగితే జనవరి ఆరున మేం అడిగేదాకా ఆనాటి ఘటనపై సంస్థ ఎలాంటి రిపోర్ట్చేయలేదు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల విషయంలో మీ వైఖరి నిబంధనలకు అనుగుణంగా లేదు. రెండు వారాల్లోపు నివేదించండి. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీజీసీఏ పేర్కొంది. -
IndiGo Special offer: రూ.2వేలకే విమాన టికెట్!!
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఏ ఆఫర్లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్ఎస్బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. -
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నటుడు దగ్గుబాటి రానా ఆగ్రహం
-
ప్రాంతీయ భాషల వారిని నియమించండి
సాక్షి, హైదరాబాద్: దేశీయ విమాన సర్వీసుల నిర్వహణలో ఇండిగో విమానంలో ప్రాంతీయ భాషలైనా తెలుగు, తమిళ, కన్నడ వచ్చిన ఎయిర్హోస్టెస్లను నియమించుకోవాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత విమాన సంస్థకు ట్విట్టర్ ద్వారా సూచించారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో వస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉన్న సీట్లో కూర్చున్నారు. ఆ సీట్లలో కూర్చున్న వారికి ప్రత్యేకంగా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ సమయంలో సంబంధిత ప్రయాణికురాలికి ఎయిర్హోస్టెస్ సూచించిన అంశాలు ఇంగ్లిష్లో ఉండటంతో సీటు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై దేవాస్మిత చక్రవర్తి అనే ప్రయాణికురాలు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో తెలుగు భాష వచ్చిన ఎయిర్హోస్టెస్ నియమించేలా చూడాలని, దీనివల్ల భద్రతా సంబంధిత సూచనలు తేలికగా తెలుగు మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుందని, ఇంగ్లిష్, హిందీ మాత్రమే వచ్చిన వారినే నియమించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయనిఆ ట్వీట్లో తెలిపింది. ఈ ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్ స్థానిక భాషల్లోనూ సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక భాషలు వచ్చిన సిబ్బందిని నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
తోటివారే! తక్కువ చేయకండి!
మనం పెట్టుకున్న నిబంధనలకైనా మానవీయ కోణం తప్పనిసరి. వినియోగదారులను దేవుళ్ళుగా భావించాల్సిన సేవల రంగం సహా అనేక చోట్ల అది మరీ ముఖ్యం. తద్విరుద్ధంగా రాంచీ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది ఒక దివ్యాంగ టీనేజ్ కుర్రాడి విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు నివ్వెరపరిచింది. ‘తోటి ప్రయాణికుల భద్రతకు భంగకరం’ అనే సాకుతో, హైదరాబాద్కు రావాల్సిన ఆ వీల్ఛెయిర్ కుర్రాడినీ, అతని తల్లి తండ్రులనూ విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది చూపిన అమానుషత్వం తీవ్ర విమర్శల పాలైంది. మన దేశంలో దివ్యాంగుల పట్ల సరైన రీతిలో సున్నితంగా స్పందిస్తున్నామా? వారినీ సమాజంలో ఓ భాగంగా కలుపుకొని పోతున్నామా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తోటి ప్రయాణికులు సైతం అభ్యర్థిస్తున్నప్పటికీ, అవసరమైతే తామున్నామని ప్రయాణికుల్లోని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ ప్రైవేట్ విమానయాన సిబ్బంది పెడచెవినపెట్టడం పరాకాష్ఠ. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయిన ఆ సంఘటనపై చివరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించి చర్యలకు ఆదేశించాల్సి వచ్చింది. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) సమగ్ర విచారణకు దిగింది. సదరు ప్రైవేట్ విమాన సంస్థ అధిపతులు ‘ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమది మంచి నిర్ణయమే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, క్షమాపణ చెప్పారు. ఆ దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ వీల్ఛైర్ ఇస్తామన్నారు. కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారీ మీడియాలో వివాదం రేగడం, పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టడం మామూలైంది. మానవీయత పరిమళించాల్సిన ఆధునిక సమాజంలో ఇవాళ్టికీ ఇలాంటి దుర్విచక్షణ కొనసాగడం విచారకరం. నిజానికి, దివ్యాంగుల పట్ల డీజీసీఏ నియమావళి కూడా ఇక్ష్వాకుల కాలం నాటిది. మారిన కాలంతో పాటు కొత్తగా వచ్చిన సమస్యలు, సవాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సి ఉంది. ప్రవర్తన అదుపులో లేని ప్రయాణికుల గురించి నివేదించమనీ, ప్రమాదకరమైన అలాంటి వ్యక్తులను విమానంలోకి ఎక్కనివ్వవద్దనీ నియమావళిలో ఉండవచ్చు గాక. దాన్ని అడ్డం పెట్టుకొని, అభం శుభం తెలియని దివ్యాంగుడి ప్రయాణం నిరాకరించడం మానవత్వం అనిపించుకోదు. గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశీయ, విదేశీ విమానాశ్రయాలు, అలాగే ప్రైవేట్ విమానయాన సంస్థలు బాగా పెరిగాయి. ఫలితంగా, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానయానం పలువురికి అనువుగా మారింది. అందుబాటులోకి వచ్చింది. అలాగే, ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగుల విభాగంలోని ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. కానీ, వారు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తగిన వసతులు కల్పించడం, సేవలు అందించడం కరవైంది. విమానయాన టికెట్లు బుక్ చేసుకుంటున్న ప్పుడు దివ్యాంగులకు లభించే సేవలపై స్పష్టత పూజ్యం. విమానాశ్రయాల్లో, చెక్–ఇన్ సందర్భాల్లో, బోర్డింగ్ నియమాల్లో, విమానాల్లో ఆతిథ్యంలో వారి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు వసతులూ అంతంత మాత్రం. రైళ్ళలోనూ, ప్రభుత్వ రవాణా సదుపాయాల్లోనూ ఇదే పరిస్థితి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారిలో 20 శాతం మంది కదలడంలో, ప్రయాణంలో సమస్యలున్నవారే. ప్రయాణ సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాలను వారికి కూడా సౌకర్యంగా ఉండేలా మార్చాలని 2015లోనే ప్రభుత్వం ‘యాక్సెసిబుల్ ఇండియా’ పేరిట కార్యక్రమం చేపట్టింది. కానీ, ఆ లక్ష్యాలను ఇప్పటికీ అందుకోలేదన్నది చేదు నిజం. పౌర భవనాలన్నిటినీ దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని 2017లోనే సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇవాళ్టికీ అది అమలైంది చాలా కొద్దిగానే! అందుకే, మన తోటివారైన దివ్యాంగుల పట్ల కనీసపు అక్కర, వారి సమస్యలను అర్థం చేసుకొనే సహృదయం పని ప్రదేశాల్లో, ప్రయాణ వసతుల్లో లోపిస్తోందనడానికి తాజా ఇండిగో ఘటన ఓ మచ్చుతునక మాత్రమే. విమానాల్లోనే కాదు... రైళ్ళు, బస్సులు, వినోదశాలలు, చివరకు విద్యాల యాలు, కార్యాలయాల్లో కూడా వారి శారీరక, మానసిక ప్రత్యేకతల రీత్యా ఏర్పాట్లు చేయడం కీలకం కాదా? ఆ మాత్రం చేయడం కనీస మానవ ధర్మం, వ్యవస్థపై ఉన్న బాధ్యత కావా? ఆ మధ్య సినీ నటి – దివ్యాంగ నర్తకి సుధా చంద్రన్ కృత్రిమ పాదం పట్ల విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నుంచి అవమానం ఎదురైంది. నెల రోజుల క్రితమే రెండు బ్యాటరీలతో నడిచేదే తప్ప నాలుగు బ్యాటరీలతో నడిచే వీల్ఛైర్ను అనుమతించబోమంటూ ఓ దివ్యాంగ ప్రొఫెసర్ను ఎయిర్పోర్ట్లో నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. అయితే, ప్రభుత్వ విధానాలు, ఆదేశాలతో పాటు సామాజిక ఆలోచనలో మార్పు మరీ కీలకం. బౌద్ధిక, గ్రహణ సామర్థ్యాల విషయంలో కొందరిలో ఉండే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, సంస్థలు సహానుభూతితో వ్యవహరించే సంస్కారం కావాలి. దివ్యాంగులూ మన లాంటి మనుషులే నన్న భావంతో, మానవీయంగా వ్యవహరించేలా చైతన్యం తేవాలి. అన్నిటికన్నా ముందుగా... ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మనమే! విమానాల్లో పక్షులు, జంతువులకు కూడా తగిన చోటిచ్చే మనం, మన వ్యవస్థ మన సోదర దివ్యాంగుల్ని లోకువగా చూడడమేంటి? -
ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022 ఏం జరిగింది? హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇండిగో ఏమంటోంది? రాంచి ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది. చదవండి👉🏻 రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ -
కడప నుంచి ఇండిగో విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఆ సంస్థ ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పదం రద్దుచేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది. -
కస్టమర్ కోరిన చోటుకే లగేజీ డెలివరీ...!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. డోర్ టు డోర్ బ్యాగేజ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్పోర్ట్ పేరుతో ఈ సేవలను కార్టర్పోర్టర్ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్లో ఇండిగో అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరుకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఒకవైపుకు చార్జీ రూ.630తో మొదలు. కస్టమర్కు చెందిన లగేజీని పూర్తిగా ట్రాక్ చేస్తారు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు బుక్ చేయాల్సి ఉంటుంది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన కార్టర్పోర్టర్ ఆన్ డిమాండ్ బ్యాగేజ్ డెలివరీ సేవలను విస్తారా, ఎయిర్ ఏషియాకు సైతం అందిస్తోంది. చదవండి: కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు -
మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!
ముంబై : తమ సొంత ఊరికి వెళ్లేందుకు మేకలు అమ్ముకున్న వలస కార్మికునితోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ఉచితంగా సొంతింటికి చేర్చేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ అంగీకరించింది. వివరాలు.. లాక్డౌన్ కారణంగా అనేక మంది వలస జీవులు వేరే రాష్ట్రాలలో ఇరుక్కుపోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం దేశీయ విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో చిక్కుకున్న కొంతమంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్కు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) అయితే వీరికి మార్చి నెల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో విమాన టికెట్ల కోసం నానా తంటాలు పడి రూ.30,600లు సేకరించారు. వీరిలో ఒకరికి డబ్బులు కుదరకపోవడంతో తాను పెంచుకుంటున్న మూడు మేకలను అమ్ముకుని విమానం టికెట్టు కొనుగోలు చేశాడు. కాగా కొన్ని కారణాల వల్ల ఆ విమానం రద్దు అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 28 వరకు విమానయాన సేవలపై ఆంక్షలు విధించడంతో ఈ విమానాన్ని రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ పోస్టులో తెలిపారు. తాజాగా మేకలు అమ్ముకున్న వ్యక్తిని పశ్చిమ బెంగాల్ పంపించేందుకు ఇండిగో అంగీకరించింది. కోల్కతాకు తిరిగి ప్రయాణించలేని ముగ్గురు ప్రయాణీకులకు తాము వసతి కల్పించామని ఇండిగో ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జూన్ 1నుంచి వలస కార్మికుల కోసం టికెట్ల బుకింగ్ తెరిచినట్లు ఇండిగో తెలిపింది. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో) -
ఇంజిన్లో లోపం.. వెనక్కి మళ్లిన విమానం
ముంబై: ముంబై–హైదరాబాద్ విమానం ఇంజిన్లో లోపం రావడంతో తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. ముంబై విమానాశ్రయం నుంచి గురువారం వేకువజామున ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానం ప్రయాణీకులతో హైదరాబాద్కు బయలుదేరింది. కొద్దిసేపటికే ఒక ఇంజిన్ పనిచేయని విషయం పైలెట్ గమనించి, అప్రమత్తమయ్యాడు. అధికారుల ఆదేశాల మేరకు తిరిగి విమానాన్ని అదే విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపా రు. వారిని వేరే విమానాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు వెల్లడించారు. -
180 మంది ప్రయాణీకులతో సేఫ్ ల్యాండింగ్..
కోల్కతా : 180 మంది ప్రయాణీకులతో సిలిగురి నుంచి కోల్కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యలతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిలిగురిలోని బదోగ్రా ఎయిర్పోర్ట్కు తిరిగి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుదిరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిర్బస్ ఏ 320 నియోలో తరచూ ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సమస్యతో ఇదే ఇంజన్ను వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం పరిపాటిగా మారింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి తన ఎయిర్బస్ ఏ 320 నియో విమానాల ఇంజన్లను సవరించాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఇండిగోను ఆదేశించింది. -
ఇండిగో విమాన సేవల్లో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : తమ నెట్వర్క్లో సిస్టమ్స్ డౌన్ కావడంతో విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఇండిగో ఎయిర్లైన్స్ పేర్కొంది. పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలతో తమ ఆపరేషన్స్లో ఆలస్యం జరగవచ్చని త్వరలోనే సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ప్రయాణీకులకు తలెత్తిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నారు. ప్రయాణీకులు సంస్థ సోషల్ మీడియా వేదికలపై తమ కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చని పేర్కొంది. ముంబైలో ఇప్పటికి తొమ్మిది విమానాల ఆపరేషన్స్లో జాప్యం నెలకొందని తెలిపింది. ఈ రోజంతా సర్వర్ డౌన్ కారణంగా మరింత జాప్యం చోటుచేసుకోవచ్చని ప్రయాణీకులు గమనించాలని కోరింది. -
ఎయిర్హోస్టెస్ చెవి కట్ చేశాడు..
సాక్షి, బెంగళూరు: ప్రేమకు నిరాకరించిందని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న పగతో ఓ రౌడీషీటర్, ఎయిర్హోస్టెస్పై దాడి చేసి చెవిని కత్తిరించిన ఘటన ఐటీ సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కొడిగెహళ్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా రౌడీషీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు జాలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అజయ్ అలియాస్ జాకీ. ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేసే ఓ ఎయిర్హోస్టెస్ బాధితురాలు. మే 12 తేదీన హెబ్బాల వద్ద క్యాబ్లో ఈ దురాగతానికి uమొదటిపేజీ తరువాయి పాల్పడ్డాడు. ప్రేమించాలని వేధింపులు ఎయిర్హొస్టెస్ను ఫిబ్రవరి నుంచి ప్రేమించాలని రౌడీషీటర్ అజయ్ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో తెలిపింది. కుటుంబసభ్యులు రౌడీషీటర్ అజయ్ను హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన జాకీ ఎయిర్హొస్టెస్ ఇంటిముందు వీరంగం సృష్టించాడు. వారి కారు అద్దాలు, బైక్ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో రౌడీషీటర్ అజయ్పై జాలహళ్లి పోలీస్స్టేషన్లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జాకీని పిలిచి హెచ్చరించారు. అప్పటి నుంచి ఎయిర్హోస్టెస్పై మరింత కసి పెంచుకున్నాడు. కారులో చొరబడి దాడి ఈ నెల 12 తేదీన ఎయిర్హోస్టెస్ కెంపేగౌడ విమానాశ్రయానికి క్యాబ్లో వెళుతుండగా, తెలుసుకున్న డీషీటర్ జాకీ హెబ్బాల వద్ద కారును అటకాయించాడు. డ్రైవరును బెదిరించి కారులో ఎక్కి కారును పోనివ్వాలని హెచ్చరించాడు, డ్రైవర్ నిరాకరించడంతో చాకుతో భుజంపై పొడిచాడు. తరువాత తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఎయిర్హోస్టెస్ను జాకీ బెదిరించగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన దుండగుడు ఆమె చెవిని చాకుతో కత్తిరించి ఉడాయించాడు. దాడిలో గాయపడిన బాధితురాలు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పై కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. -
విమానంలో దుశ్చర్య : ప్రయాణికుడి అరెస్ట్
ముంబై : విమాన టాయ్లెట్లో పొగతాగిన ప్రయాణికుడిని అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈనెల 25న అహ్మదాబాద్ నుంచి గోవాకు ఇండిగో విమానంలో వెళుతున్న ప్రయాణికుడు విమానంలోని టాయ్లెట్లో సిగరెట్ తాగుతూ సిబ్బందికి పట్టుబట్టారు. నిబంధనలను ఉల్లంఘించి విమానంలో పొగతాగుతున్న ప్రయాణికుడిపై కెప్టెన్కు సిబ్బంది ఫిర్యాదు చేశారు. చట్టప్రకారం విమానంలో సిగరెట్ తాగడం నేరం కావడంతో విమానం గోవాలో ల్యాండవగానే స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రయాణికుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గత వారం విమానంలో సిగరెట్ తాగేందుకు అనుమతించాలని కోరుతూ ఓ ప్రయాణికుడి వాగ్వాదానికి దిగడంతో విస్తారా ఎయిర్లైన్స్ విమానం గమ్యస్ధానం చేరేందుకు మూడు గంటలు జాప్యమైంది. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో ప్రయాణికుల ఆందోళన
-
వెబ్ చెకిన్ ఛార్జీలపై సమీక్ష
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు సంబంధించి వెబ్ చెకిన్ విధానంలో ఏ సీటు ఎంపిక చేసుకున్నా చార్జీలు వర్తిస్తాయంటూ ఇండిగో ఎయిర్లైన్స్ చేసిన ప్రకటన వివాదం రేపడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ (ఎంవోసీఏ) రంగంలోకి దిగింది. ఇలాంటి విధానాలు ప్రస్తుత నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అన్న అంశాన్ని సమీక్షించనున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. కొన్ని ఎయిర్లైన్స్ ప్రస్తుతం అన్ని సీట్లకు వెబ్ చెకిన్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ చార్జీలు అన్బండిల్డ్ ధర విధానం పరిధిలోకి లోబడే ఉన్నాయా లేదా అన్నది సమీక్షించనున్నామని వివరించింది. అన్బండిల్డ్ ధర విధానం కింద.. సీట్ల కేటాయింపు సహా వివిధ సర్వీసులకు ఎయిర్లైన్స్ వేర్వేరుగా చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వివాదమిదీ.. విమాన ప్రయాణానికి సంబంధించి ఆన్లైన్లోనే సీటును ఎంపిక చేసుకుని, ప్రయాణ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడాన్ని వెబ్ చెకిన్గా వ్యవహరిస్తారు. సాధారణంగా సీటు ఎంపిక ప్రాధాన్యతలను బట్టి ఎయిర్లైన్స్ నిర్దిష్ట చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ సీట్లలో కొన్ని ఉచితంగా కూడా ఉంటాయి. అయితే, ఇండిగో ఆదివారం నాడు ఇకపై అన్ని సీట్లకు చార్జీలు వర్తింపచేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొనడం దుమారం రేపింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సోమవారం ఇండిగో మరో ప్రకటన విడుదల చేసింది. తమ విధానాల్లో మార్పులేమీ చేయలేదని, వెబ్ చెకిన్కి చార్జీలేమీ విధించబోవడం లేదని పేర్కొంది. ముందస్తుగా సీట్లను ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని వివరించింది. మార్కెట్ డిమాండ్, ప్రయాణికుల అభీష్టాన్ని బట్టి చార్జీలు ఉంటాయని ఇండిగో తెలిపింది. ప్రిఫర్డ్ సీటింగ్ చార్జీ అత్యంత తక్కువగా రూ. 100 నుంచి ఉంటుందని పేర్కొంది. ఇవి కాకుండా ఎప్పట్లాగే కొన్ని ఉచిత సీట్లు కూడా ఉంటాయని, సీటింగ్ పట్టింపు లేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చని లేదా ఎయిర్పోర్ట్లోనైనా ఉచితంగా చెకిన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. మరోవైపు ఇదే అంశంపై ట్విటర్లో ప్రయాణికుల ప్రశ్నలకు స్పందిస్తూ.. వెబ్ చెకిన్ల ద్వారా సీట్లను ముందస్తుగా కేటాయించేందుకు చార్జీలు వర్తిస్తాయంటూ స్పైస్జెట్ వెల్లడించింది. -
కుటుంబాన్ని వదిలివెళ్లింది : ఇండిగోకు ఫైన్
న్యూఢిల్లీ : నిర్దేశించిన సమయం కల్లా ప్రయాణికులందర్ని ఎక్కించుకుని టేకాఫ్ అవుతుంటాయి విమానాలు. ఎవరైనా రాకపోతే, ఒకటికి రెండు సార్లు అనౌన్స్మెంట్స్ కూడా చేస్తారు విమాన సిబ్బంది. ప్రయాణికులు కూడా ఎక్కడ విమానం మిస్ అవుతామేమో అని అర్థగంట ముందే బోర్డింగ్ పాస్ తీసుకుని వేచి చూస్తూ ఉంటారు. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి సమాచారం లేకుండానే కోల్కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ టేకాఫ్ అయి వెళ్లిపోయింది. ఎయిర్పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు. కానీ చివరికి ఆ విమానం వెళ్లిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులు. దీంతో చెప్పాపెట్టకుండా.. విమానం టేకాఫ్ అవడంపై ఇండిగో ఎయిర్లైన్స్పై అపెక్స్ కన్జ్యూమర్ కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్ల్ను ఆశ్రయించారు. ఇండిగో ఎయిర్లైన్స్ చేసిన ఈ తప్పిదానికి, కన్జ్యూమర్ కమిషన్ బెంచ్ రూ.61వేల పరిహారం విధించింది. ఇండిగో ఎయిర్లైన్ వేసిన రివ్యూ పిటిషన్ను సైతం కొట్టివేసింది. బెంచ్లో అధ్యక్షుడు జస్టిస్ ఆర్కే అగర్వాల్, సభ్యులు ఎం శిరీష ఉన్నారు. ప్రయాణికులను కాంటాక్ట్ చేయడంలో ఎయిర్లైన్ విఫలమైందని బెంచ్ పేర్కొంది. ‘మొబైల్ నెంబర్ ద్వారా ప్రయాణికులను ఇండిగో కాంటాక్ట్ చేయొచ్చు. విమాన టిక్కెట్ బుకింగ్ సమయంలోనే మొబైల్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి. విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికులు మొబైల్ నెంబర్ ఇచ్చారు కూడా. కానీ ఎందుకు వారికి కాల్ చేయలేదు’ అని బెంచ్ ప్రశ్నించింది. ఇండిగో ఎయిర్లైన్స్ చేసిన తప్పిదానికి, తొలుత రూ.41వేల జరిమానా వేసింది. ఆ అనంతరం రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో మరో రూ.20వేలను అదనంగా ఫైన్గా విధిస్తున్నట్టు కన్జ్యూమర్ కమిషన్ వెల్లడించింది. -
ఇండిగో చార్జీలు ప్రియం..
న్యూఢిల్లీ: విమాన ఇంధన ధరలు పెరుగుదలతో టికెట్ల రేట్లకూ రెక్కలొస్తున్నాయి. అన్నింటికన్నా ముం దుగా.. ఇండిగో ఎయిర్లైన్స్ ఇందుకు తెరతీసింది. దేశీ రూట్లలో టికెట్లపై రూ.400 దాకా ఇంధన సర్చార్జీ విధించాలని నిర్ణయించింది. 1,000 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై రూ.200, అంతకు మించిన దూరాలపై రూ.400 సర్చార్జీ ఉంటుందని ఇండిగో తెలిపింది. మే 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది. అటు ఇంధన (ఏటీఎఫ్) రేటు పెరగడానికి ఇటు రూపాయి విలువ క్షీణించడం కూడా తోడవడంతో ఎయిర్లైన్స్పై అదనపు భారం పడుతోందని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. -
ఇండిగోకు బెదిరింపు కాల్: షాకింగ్ ట్విస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల బాంబు ఉందంటూ ఎయిర్లైన్స్ను హడలెత్తించిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పనితీరు బాగా లేదని సీనియర్ ఉద్యోగులు వార్నింగ్ ఇవ్వడంతో ఎయిర్లైన్స్కు కాల్ చేసి బుద్ధి చెప్పాలనుకున్నాడట. ఈ విషయాలను నిందితుడే స్వయంగా వెల్లడించాడు.ఆ వివరాలిలా.. పుణేకు చెందిన కార్తీక్ మాధవ్ భట్(23) హాస్పిటాలిటీలో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఇండిగో ఎయిర్లైన్స్లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరాడు. అయితే వర్క్ బాగా చేయడం లేదని, చాలా మెరుగు పడాలని సీనియర్లు కార్తీక్కు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్కు బుద్ధిచెప్పాలని భావించినట్లు నిందితుడు తెలిపాడు. మే 2న ముంబైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేసి కలకలం రేపాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికుల లగేజీతో పాటు ఎయిర్లైన్స్ మొత్తం తనిఖీలు చేసి ఫేక్ కాల్ అని తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కార్తీక్ను తాజాగా అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తన పనితీరు బాగున్నా సీనియర్ ఉద్యోగులు వంకలు పెట్టారన్న కారణంగా.. ఇండిగో ఎయిర్లైన్స్కు ఫోన్చేసి బాంబు అని బెదిరించినట్లు నిందితుడు అంగీకరించాడు. -
నేటి నుండి వైజాగ్కు ఇండిగో కొత్త సర్వీస్
విమానాశ్రయం(గన్నవరం): ఇండిగో ఎయిర్లైన్స్ విజయవాడ ఎయిర్పోర్టు కేంద్రంగా మంగళవారం నుంచి విశాఖపట్నానికి నూతన విమాన సర్వీసును ప్రారంభించనుంది. 74 సీటింగ్ సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం ప్రతిరోజు ఉదయం 10.10కి ఇక్కడి నుంచి బయలుదేరి 11.25కి వైజాగ్కు చేరుకుంటుంది. తిరిగి వైజాగ్ నుంచి 11.55కు బయలుదేరి మధ్యాహ్నం 13.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి రోజుకు 14 సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈనెల 9నుంచి బెంగళూరు, చెన్నైకి మూడవ డైరెక్ట్ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. కొత్త సర్వీస్లతో విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో రాకపోకలు సాగిస్తున్న సర్వీసుల సంఖ్య 20కు చేరనుంది. -
బ్యాటరీ ‘విప్పి’ చూడ బంగారముండు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేసే ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఎల్ఈడీ లైట్ బ్యాటరీల లోపలి భాగంలో బంగారం ప్లేట్లను అమర్చి, స్కానింగ్కు సైతం చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఈ పంథాలో ఎనిమిది పసిడి రేకుల్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి రూ.14 లక్షల విలువైన 445 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. దుబాయ్కు చెందిన ఓ ముఠా బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు తాజాగా ఎంచుకున్న మార్గమే ఎల్ఈడీ బ్యాటరీ. బంగారాన్ని స్మగ్లర్లు మందమైన రేకులుగా మార్చారు. దీన్ని రీ–చార్జబుల్ లాంతర్ లైట్ లోపల ఉండే బ్యాటరీల్లో అమర్చారు. ఆ లైట్ను స్కానింగ్ చేసినా పసిడి ఆచూకీ దొరక్కుండా బంగారు రేకుల చుట్టూ నల్లరంగు పొడి ఏర్పాటు చేశారు. ఈ లైట్ను గురువారం దుబాయ్ విమానాశ్రయానికి తీసుకువచ్చిన స్మగ్లర్లు హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి అప్పగించారు. అతడికి ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్ను తీసుకుని హైదరాబాద్ వెళ్లాలని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని పంపారు. దీనికి ప్రతిఫలంగా కొంత మొత్తం చెల్లించారు. బండారం బయటపడిందిలా: ఇండిగో ఎయిర్లైన్స్లో వచ్చిన ఈ క్యారియర్ గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అనుమానాస్పదంగా ఉన్న అతన్ని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్లో ఉన్న ఎల్ఈడీ లైట్ను పరిశీలించగా.. బ్యాటరీల తీరులో మార్పులు కనిపించాయి. వాటిని పగులగొట్టి చూడగా.. లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు బయటపడ్డాయి. క్యారియర్ను విచారించగా తనకు దాన్ని ఇచ్చిన వారితో పాటు తీసుకునే వారి వివరాలు సైతం తెలియవన్నాడు. అయితే దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉంటుందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. -
విజయవాడ నుంచి ఇండిగో సర్వీసులు
సాక్షి, అమరావతి: విజయవాడ నుంచి మూడు నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటిం చింది. మార్చి 2 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్కుమార్ తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రతి రోజు 3 సర్వీసులు, బెంగళూరు, చెన్నైలకు ఒక్కో సర్వీసు చొప్పున మొత్తం రోజుకు 5 సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు రూ.1,246, చెన్నైకు రూ.1,179, బెంగళూరుకు రూ. 1,826 ధరల నుంచి టికెట్లు అందుబా టులో ఉంచినట్లు తెలిపారు. వచ్చే 2,3 నెలల్లో ముంబై, ఢిల్లీలకు నేరుగా సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. ఉడాన్ పథకం కింద తిరుపతి నుంచి కొల్హా పూర్, కేరళలోని కానూర్లకు త్వరలో సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. -
రాత్రి వేళ.. రయ్..
మధురపూడి (రాజానగరం): విమానయాన ప్రయాణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎయిర్నెట్ వర్క్ను విస్తరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం మధురపూడిలోని రాజమహేంద్రవరం వి మానాశ్రయంలో ఇండిగో విమానయానసంస్థ çసర్వీసులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇండిగో సంస్థ దేశీ విమానయాన రంగంలో స్థానాన్ని బలపరచుకుందన్నారు. మంగళవారం ఇండిగో రాజమహేంద్రవరం–చెన్నై ద్వారా ఏటీఆర్ ఆపరేషన్స్ను ప్రారంభించారు. మొత్తం నాలుగు సర్వీసులు ఉదయం నుంచి రాత్రివరకు నడుస్తాయన్నారు. ఉదయం 8.20 గంటలకు మొదటిసర్వీసు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో సర్వీసు, మధ్యాహ్నం 2.35 గంటలకు మూడో సర్వీసు ఉంటాయన్నారు. నైట్ ల్యాండింగ్స్ మొదలు ఇండిగో విమాన సర్వీసులతో నైట్ ల్యాండింగ్స్ ప్రారంభమవుతాయని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎమ్.రాజ్కిషోర్ అన్నారు. రాత్రి 8.40గంటలకు చివరి సర్వీసు చేరుతుంది. దీంతో రాత్రి సర్వీసుల నిర్వహణకు ఎయిర్పోర్టును అభివృద్ధి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇండిగోసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ ఎం.సంజీవ్ రామదాస్ జెండా ఊపి విమాన సర్వీసులను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరంఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎమ్మెల్యేలు ఆకుల రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చైర్మన్ పంతం రజనీశేష సాయి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం సబ్ కలె క్టర్ సాయికాంత్ వర్మ, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు టెర్మినల్ భవనంలో జ్యోతి ప్రజ్వలన, కేక్కటింగ్ జరిగింది. రాజమహేంద్రవరాన్ని కేంద్రం అంగీకరించాలి రాజమహేంద్రవరంగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణ చేసింది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా కేంద్రం అంగీకరించలేదని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహాన్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘‘కేంద్రం అంగీకారం అవసరం. దానికోసం ప్రయత్నిస్తాను. రైల్వేజోన్ సాధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే మా ప్రతిపాదనలు తీసుకోవాలి. కాని కేంద్రం (పార్లమెంటరీకమిటీ) ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు. -
గన్నవరం నుంచి ఇండిగో సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం): ఇండిగో విమానయాన సంస్థ ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు సర్వీసులు నడపనుంది. ఈ మేరకు ప్రయాణ షెడ్యూ ల్ను విడుదల చేయడంతో పాటు టిక్కెట్ బుకింగ్ కూడా ప్రారంభించింది. ఇండిగో నూతనంగా కొను గోలు చేసిన 74 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఏటీఆర్ 72–600 విమానాలను నడపనుంది. గన్నవరం నుంచి సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ గత ఏడాది కాలంగా సన్నాహాలు చేస్తోంది. ఎట్టకేలకు మార్చి 2 నుంచి సర్వీసులను నడపనున్నట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. సర్వీసులు ప్రారంభం సందర్భంగా టికెట్ ప్రారంభ ధరలను చెన్నైకు రూ.999, హైదరాబాద్కు రూ.1,099, బెంగళూరుకు రూ.1,599గా ప్రకటించింది. సర్వీసుల వివరాలు హైదరాబాద్ నుంచి ఉదయం 7.35, మధ్యాహ్నం 13.50, రాత్రి 20.10 గంటలకు విమానాలు గన్నవరానికి చేరుకుంటాయి. తిరిగి గన్నవరం నుంచి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 18.45, రాత్రి 21.35కు హైదరాబాద్ బయలుదేరుతాయి. గన్నవరం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 9.35కు బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి 10.15కు బయలుదేరి 11.50 గంటలకు గన్నవరానికి విమానం చేరుకుం టుంది. గన్నవరం నుంచి మధ్యాహ్నం 15.15కు బయలుదేరి 16.35కు చెన్నైకు చేరుకుంటుంది. తిరిగి చెన్నై నుంచి 16.55కు బయలుదేరి 18.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. -
పీవీ ఎక్స్ప్రెస్ హైవే పై ప్రమాదం
రంగారెడ్డి : రాజేంద్ర నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని 245వ నెంబర్ పిల్లర్ వద్ద పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పైన ప్రమాదం జరిగింది. జ్యోతి నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన వంశీ అనే ఉద్యోగికి గాయాలు అయ్యాయి. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని బయటికి తీశారు. అనంతరం ఆ మార్గంలో ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
పీవీ సింధుకి వేధింపులు
-
పీవీ సింధుకి వేధింపులు
ముంబై : బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో ఎయిర్లైన్ సిబ్బంది ఒకరు ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పీవీ సింధునే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ట్వీట్లు వైరల్ అయ్యాయి. ''చెప్పడానికి చాలా బాధకరంగా ఉంది. శనివారం(నవంబర్ 4న) హైదరాబాద్ నుంచి ముంబైకి 6ఈ 608 విమానంలో బయలుదేరడానికి వెళ్లిన నాకు, గ్రౌండ్ స్టాఫ్ అజితేష్ నుంచి చాలా చేదు అనుభవం ఎదురైంది'' అని సింధు పేర్కొన్నారు. '' అజితేష్ చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ఎయిర్హోస్టస్ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించింది. అయినప్పటికీ ఆమెతో కూడా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. దాన్ని చూసి నేను చాలా షాక్ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్లైన్స్ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి'' అని మరో ట్వీట్ చేశారు. విమాన ప్రయాణాల్లో దేశీయ క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్లు చేదు అనుభవాలను చవిచూశారు. Sorry to say ..i had a very bad experience😤when i was flying by 6E 608 flight to bombay on 4th nov the ground staff by name Mr ajeetesh(1/3) — Pvsindhu (@Pvsindhu1) November 4, 2017 -
పార్టీలో విషాదం.. ఎయిర్ హోస్టెస్ మృతి
కోల్కతా: పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ ఎయిర్ హోస్టెస్ శవంగా మారడం స్థానికంగా కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కోల్కతా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. షిల్లాంగ్కు చెందిన క్లారా ఖాంగ్సిట్ (22) ఇండిగో ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొందరు మిత్రులతో కలిసి ఓ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు మంగళవారం రాత్రి హాజరైంది. స్నేహితులతో కలిసి క్లారా హుషారుగా పార్టీ చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు కిటికీ నుంచి కింద పడిపోయి క్లారా మృతిచెందింది. బుధవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అపార్ట్మెంట్లో ఉన్న క్లారా ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసులు విచారించారు. ఎయిర్లైన్స్ అధికారులను సంప్రదించగా.. పోలీసుల విచారణలో నిజాలు వెల్లడవుతాయన్నారు. అయితే క్లారా ఆత్మహత్య చేసుకుందా.. లేక పార్టీ తర్వాత గొడవ జరిగి ఎవరైనా ఆమెను హత్య చేశారా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. -
జేసీ దివాకర్ రెడ్డికి ఊరట...
హైదరాబాద్: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట లభించింది. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు ఆయనపై విధించిన నిషేధాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ బుధవారం ఎత్తివేసింది. కాగా గత నెల విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్ పాస్ను నిరాకరించిన ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్తో పాటు ఎయిర్ ఇండియా ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు ఆయన ప్రయాణంపై నిషేధం విధించాయి. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా విమానయాన సంస్థలను ఆదేశించాలని కోరారు. అయితే నిషేధంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీకి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. జేసీపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఇండిగో, గో ఎయిర్, ఎయిర్ ఏసియా, స్పైస్ జెట్, టర్బో మెగా ఎయిర్ వేస్ తదితర విమాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పౌర విమానాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లకు కూడా నోటీసులు ఇచ్చింది. -
మీ బస్సులో అనుమతిస్తారా?
జేసీ పిటిషన్పై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా విమానయాన సంస్థలను ఆదేశించాలని కోరుతూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. నిషేధంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించింది. జేసీపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఇండిగో, గో ఎయిర్, ఎయిర్ ఏసియా, స్పైస్ జెట్, టర్బో మెగా ఎయిర్ వేస్ తదితర విమాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పౌర విమానాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లకు కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, పిటిషనర్ తరుఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘పిటిషనర్ బస్సు ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని తమ బస్సులోకి అనుమతినివ్వరు కదా. మరి విమానయాన సంస్థలు కూడా నిబంధనలనే పాటించాలి కదా. పాటించకపోతే ప్రయాణికుల భద్రత, రక్షణ ఎలా సాధ్యమవుతాయి?’అని వ్యాఖ్యానించారు. -
రాత్రికి రాత్రే విదేశాలకు ఎంపీ జేసీ!
న్యూఢిల్లీ: విశాఖ ఎయిర్పోర్టులో వీరంగం చేసి వివాదంలో చిక్కుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రాత్రికి రాత్రే విదేశాలకు వెళ్లిపోయారు. గురువారం విశాఖ ఎయిర్పోర్టులో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు బోర్డింగ్ పాస్ మేషీన్లను ధ్వసం చేసిన జేసీపై తీవ్ర విమర్శలు వెల్లుతున్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం రంగంలోకి ఆయనను బుజ్జగించి క్షమాపణ చెప్పించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. క్షమాపణ చెబుతారా అని విలేకరులు హైదరాబాద్లో శుక్రవారం ప్రశ్నించగా.. చెప్పడానికి ఏమీ లేదని, తానేమీ మాట్లాడనంటూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లొస్తే వివాదం సద్దుమణుగుతుందని భావించిన ఆయన కుటుంబంతో సహా యూరప్ వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 9:50 గంటలకు ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ వెళ్లిన జేసీ, అక్కడి నుంచి మరో విమానంలో ఫ్రాన్స్ చేరుకున్నారు. దాదాపు వారం రోజులు కుటుంబంతో అక్కడే గడుపుతారని తెలుస్తోంది. తాజా వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కుటుంబంతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లిపోయారని దేశీయ విమానయాన సంస్థలతో పాటు పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, గోఎయిర్, ఎయిర్ఆసియా ఇండియా సంస్థలు జేసీని తమ విమానాలు ఎక్కనివ్వబోమని స్పష్టం చేశాయి.టీడీపీ ఎంపీ జేసీ విదేశీ పర్యటనపై ఆయన సన్నిహితులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ఆయన ఇప్పుడు యూరప్ వెళ్లలేదని, కొన్ని రోజుల ముందుగానే ఫ్రాన్స్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించి ఆయనపై చర్యలు తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీ జేసీ విషయంలో ముట్టిముట్టనట్లుగా ఉంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అన్ని వివరాలు బయటపెడతాయని, బోర్డింగ్ పాస్ ఇచ్చే సమయానికి జేసీ ఎయిర్పోర్టుకు రాలేదని గుర్తించామని చెప్పారు. కానీ అంతకుముందు విజయనగరంలో ఈ కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జేసీ విషయాన్ని అధికారులే చూసుకుంటారని, ఆయన విషయంలో తనకేం సంబంధం లేదని చెప్పడం గమనార్హం. -
మా విమానాలూ ఎక్కనివ్వం
- జేసీపై మరిన్ని విమానసంస్థల నిషేధం - సీసీటీవీ ఫుటేజీల్లో అంతా స్పష్టం: మంత్రి అశోక్ న్యూఢిల్లీ/విజయవాడ/విజయనగరం గంటస్తంభం: విశాఖ ఎయిర్పోర్టులో జులుం ప్రదర్శించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై దాదాపు అన్ని దేశీయ విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. ఆలస్యంగా వచ్చిన తనను బోర్డింగ్కు అనుమతించలేదని ఇండిగో సంస్థ సిబ్బందిపై ఎంపీ జేసీ వీరంగం వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ జేసీపై నిషేధం విధించగా.. శుక్రవారం విస్తారా, గోఎయిర్, ఎయిర్ఆసియా ఇండియా సంస్థలు జేసీని తమ విమానాలు ఎక్కనివ్వబోమని చెప్పాయి. కాగా, ప్రస్తుత ఘటనపై క్షమాపణలు చెబుతారా అని విలేకరులు జేసీని హైదరాబాద్లో ప్రశ్నించగా.. తానేమీ మాట్లాడనని, చెప్పడానికి ఏమీ లేదని వెళ్లిపోయారు. సీసీ కెమెరాలు చెబుతాయి.. జేసీ ఉదంతంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీలు అన్ని వివరాలను బయటపెడతాయని చెప్పారు. ఎంపీ అయినా, సాధారణ పౌరుడికైనా, చివరకు తనకైనా భద్రత నిబంధనలు ఒక్కేనన్నారు. 45 నిమిషాల ముందే కౌంటర్లు మూసివేయాలనే నిబంధన ఉందని, ఆ సమయంలో జేసీ అక్కడకు చేరుకోలేదనే విషయం సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు విజయనగరంలో మంత్రి అశోక్ మాట్లాడుతూ.. జేసీ విషయంలో తనకేం సంబంధం ఉండదని, అధికారులే అంతా చూసుకుంటారన్నారు. -
జేసీ ప్రవర్తనపై స్పందించిన అశోక్ గజపతిరాజు
న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. తాను గంట ముందే వచ్చినా....ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని జేసీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. అలాంటిది ఏం జరిగినా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివుంటుందని అది పరిశీలించిన తర్వాతే ఎవరిది తప్పో తేలిపోతుందన్నారు. తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదని అశోక్ గజపతి రాజు అన్నారు. కాగా ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీఐపీ లాంజ్లో ఉన్న అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని జేసీ చెప్పగా, ఆయన విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్పాస్ ఇప్పించారు. అయితే ఆలస్యంగా వచ్చిన ఇతర ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు ఇవ్వవపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రంగంలోకి టీడీపీ అధిష్టానం.. జేసీతో మంతనాలు
విశాఖపట్నం: జాతీయ స్థాయిలో టీడీపీ పరువు పోయేలా వ్యవహరించిన ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదంపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ వివాదం వేడి తాకింది. గూండాలాగా వ్యవహరించిన ఓ ఎంపీ విషయంలో చంద్రబాబు ఇలాంటి వైఖరేనే అనుసరించేది.. అండదండలు అందించేది అని ఆగ్రహం పెల్లుబుకుతుండటంతో నష్టనివారణ చర్యలకు పార్టీ దిగింది. ఇప్పటికే జేసీతో మరో ఎంపీ సీఎం రమేశ్ మంతనాలు జరుపుతున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందికి క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేసును మరోదారిలో నీరుగార్చేందుకు టీడీపీ యత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా జేసీపై ఫిర్యాదు కూడా చేయలేదు. సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారు. దీంతో జేసీని రక్షించేందుకు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన జేసీ దాడి విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అనుసరిస్తున్నారు. దీంతో సొంతపార్టీ ఎంపీకి ఒక న్యాయం, ఇతర ఎంపీలకు మరో న్యాయమా అంటూ తీవ్ర విమర్శలు ఆయనపై వస్తున్నాయి. -
'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. జేసీ దివాకర్రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం నిజంగా సిగ్గుచేటన్నారు. సెక్యూరిటీ నియమాలను జేసీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎంపీలు తమ హద్దుల్లో ఉంటూ హుందాగా ప్రవర్తించాలని మాజీ డీజీసీఏ హితవు పలికారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించించిన వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్జెట్, గో ఎయిర్, జెట్ఎయిర్వేస్లు కూడా జేసీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇండిగో విమానంలో బెంగళూరుకు వెళ్లేందుకు గురువారం ఉదయం దివాకర్రెడ్డి 7.30 గంటలకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్లోకిð వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55 గంటలకు బయలుదేరనుంది. అయితే బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కౌంటర్లో సిబ్బందిని అడగగా.. విమానం బయలుదేరే సమయానికి 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు జారీ చేశామని, ఆ సమయం దాటిన తర్వాత వచ్చిన వారికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. తనకే రూల్స్ చెబుతారా అంటూ కౌంటర్లోకి చొరబడి ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేయడంతో పాటు బోర్డింగ్ పాస్లు జారీచేసే మెషీన్ను టీడీపీ ఎంపీ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వీఐపీ లాంజ్లో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని చెప్పారు. కేంద్ర మంత్రి విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్పాస్ ఇప్పించగా, ఇతర ప్రయాణికులకు అలాగే బోర్డింగ్ పాస్లు ఇవ్వవ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ఎంపీ గైక్వాడ్ విషయంలో వ్యవహరించినట్లుగానే జేసీపైనా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
గన్నవరం నుంచి ‘ఇండిగో’!
విమానాశ్రయం(గన్నవరం): కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, ట్రూజెట్ విమాన సంస్థలు ఇక్కడ్నుంచి సర్వీసులు నడుపుతుండగా..తాజాగా ఇండిగో విమానయాన సంస్థ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్పోర్టు అధికారులతో చర్చించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇండిగో ప్రతినిధుల బృందం గన్నవరానికి రానుంది. -
జాబ్స్ అంటూ లక్షలు దోచేస్తారు.. జాగ్రత్త!
హైదరాబాద్: ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కన్సల్టెన్సీ ఏర్పాటుచేసి ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశచూపి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయాలు గుంజుతున్న ఢిల్లీ ముఠా బాగోతం హైదరాబాద్కు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సైబర్ విభాగం ఏసీపీ ఎస్.జయరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ కౌరవ్, అర్జున్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిగా చెలామణి అవుతూ అవుతూ జాబ్స్ వెబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డాటా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన శ్రవణ్ కుమార్రెడ్డికి ఫోన్ చేసి 'యాస్ గ్రూప్ కన్సల్టెన్సీ' నుంచి కాల్ చేస్తామని చెప్పి అతడికి మెయిల్ చేశారు. నెంబర్ తీసుకున్న ముఠా శ్రవణ్కు ఫోన్ చేసి మొదట సెక్యూరిటీ కింద రూ.12,150 కట్టాలని చెబితే పే చేశాడు. ఆ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ హెచ్ఆర్ అంటూ చెప్పి డిమాండ్ చేయగా మరో రెండు దఫాలుగా మొత్తం రూ. 1.84 లక్షలు వారు చెప్పిన అకౌంట్లో జమచేశాడు. జాబ్ గురించి ఫోన్ చేస్తే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఈ జనవరి 3న జీడిమెట్ల సూరారం కాలనీకి చెందిన శ్రవణ్ ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపి ఫేక్ కన్సల్టెన్సీ అని తేల్చేశారు. మరో నలుగురి సాయంతో రాహుల్, అర్జున్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కుకట్పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి ఈ కేసు విచారణ చేస్తున్నారని, జాబ్స్ అనగానే డబ్బులు చెల్లించి మోసపోవద్దని ఓ ప్రకటనలో సైబర్ క్రైమ్ విభాగం సూచించింది. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. 2015 డిసెంబర్ పోల్చుకుంటే 2016 డిసెంబర్లో 24% పెరిగినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2015 డిసెంబర్లో 77.09 లక్షల మంది విమాన సేవల్ని వినియోగించుకోగా..ఈ సంఖ్య 2016 డిసెంబర్లో 95.52 లక్షలకు చేరినట్లు వివరించింది. గత పూర్తి ఏడాదిలో సుమారుగా పది కోట్ల మంది ప్రయాణించగా.. 2015లో ఈ సంఖ్య 8.2 కోట్లుగా ఉంది. 11 దేశీయ విమానయాన సంస్థల్లో ఇండిగో ఎయిర్లైన్స్ డిసెంబర్లో 38.48 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి టాప్లో నిలిచింది. -
విమానంలో దుస్తులు విప్పేసి.. గొడవ
భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు నీచంగా ప్రవర్తించాడు. ప్రయాణంలో ఉండగా.. బాత్రూంలోకి వెళ్లి అక్కడ దుస్తులు మొత్తం విప్పేసి నానా హంగామా సృష్టించాడు. తొలుత విమానం ఎక్కి సీటులో కూర్చోగానే తనకు సీటుబెల్టు కట్టుకోవడం ఎలాగో తెలియదని చెప్పాడు. దాంతో విమాన సిబ్బంది ఆ విషయంలో అతడికి సాయం చేశారు. తర్వాత అతడు బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న కాల్ బెల్ కొట్టి, సాయం కావాలని సిబ్బందిని పిలిచాడు. వెంటనే సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా.. అతడు దుస్తులన్నీ విప్పేసి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు. దాంతో లోపలకు వెళ్లేందుకు నిరాకరించిన మహిళా సిబ్బంది.. అతడిని కాస్త గౌరవప్రదంగా ప్రవర్తించాలని చెప్పారు. తర్వాత ఎలాగోలా బయటకు వచ్చిన ప్రయాణికుడు.. ఆ తర్వాత కూడా తన దుష్ప్రవర్తన మానుకోలేదు. ప్రయాణికులంతా విమానం నుంచి దిగేటప్పుడు మహిళా సిబ్బందిపై అతడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో విమాన కెప్టెన్కు సిబ్బంది ఈ విషయం వెల్లడించగా, కెప్టెన్ వెంటనే ఢిల్లీలోని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సదరు ప్రయాణికుడు కిందకు దిగగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఢిల్లీలోని ఒక పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ప్రయాణికుల సంతృప్తి తమ ప్రధాన లక్ష్యమని.. అయితే ఎవరైనా ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం ితర ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా తాము స్పందించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా అనుచితంగా ప్రవర్తించేవాళ్లను నియంత్రించడానికి కొన్ని విమానయాన సంస్థలు ప్లాస్టిక్ బేడీలు కూడా విమానాల్లో ఉంచుకుంటున్నాయి. విమాన భద్రతకు ముప్పు వాటిల్లే సందర్భంలో తాము ఏమాత్రం ఊరుకునేది లేదని విమానయాన సంస్థలన్నీ ఇప్పటికే స్పష్టం చేశాయి. అలాంటివారిని పోలీసులకు అప్పగిస్తామని తెలిపాయి. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు ఎయిర్పోర్టు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. -
ఇండిగో బంపర్ ఆఫర్: ఉచిత విమాన ప్రయాణం
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన చరిత్రలో చెప్పుగోదగిన బంపర్ ఆఫర్ ఇది. మిమ్మల్ని ఉచితంగా విమానంలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలకు తీసుకెళతారు. అక్కడ ఫుడ్డు, బెడ్డూ అన్నీ వాళ్లవే. మనం చెయ్యాల్సిందల్లా విహారాన్ని ఆస్వాదించి, ఆ అనుభవాలను పంచుకోవటమే! వారూవీరనే తేడాలేకుండా ఎవరైనాసరే ఈ ప్రయాణానికి అర్హులే. రిజిస్ట్రేషన్లకు చివరి తేది 2016, అక్టోబర్ 5. వివరాల్లోకి వెళితే.. చౌక విమానయాన సంస్థగా ప్రారంభమై, అనతికాలంలోనే సేవలను విస్తరించి ప్రయాణికుల మన్ననలు పొందిన ఇండిగో ఎయిర్ లైన్స్.. ఈ ఏడాది పదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ తన ప్రయాణికులకు భారీ ఆఫర్ ను ప్రకటించింది. 'ది 6ఈ ఎక్స్ ప్లోరర్' పేరుతో ఎంపిక చేసిన ప్రయాణికులకు ఇండిగో విమానాల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తున్నారు. దేశంలోని 4 లేదా 5 ప్రఖ్యాత టూరిస్టు ప్రదేశాలకు తీసుకెళ్లడమే కాక, భోజనం, వసతి సౌకర్యాలు కూడా సంస్థే చూసుకుంటుంది. టూర్ లో మన అనుభవాలు, చూసిన ప్రదేశాల గురించి మనం రాసే వ్యాసాన్నిఇండిగో వెబ్ సైట్ లో ప్రచురిస్తారుకూడా! ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి. ఆన్ లైన్ లో తమ పేరును రిజిస్టర్ చేసుకున్నవారికి చిన్నపాటి ఇంటర్వ్యూ నిర్వహించి, తుది జాబితా తయారుచేస్తామని ఇండిగో చైర్మన్ ఆదిద్య ఘోష్ తెలిపారు. ఎంపికైన వారిని డిసెంబర్ 31లోగా టూర్లకు తీసుకెళతామన్నారు. ఆగస్టు ప్రారంభం నాటికి ఇండిగో ఎయిర్ లైన్స్ 13.4 కోట్ల మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చిందని, సంస్థలో మొత్తం 14 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఇండిగో 10వ వార్షికోత్సవం సందర్భంగా అందిస్తోన్న బంపర్ ఆఫర్ ను మీరూ అందుకోవాలంటే https://www.goindigo.in/6e-explorer కి లాగిన్ అవ్వండి. నియమనిబంధనలు చదివిన పిదప అదృష్టాన్ని పరీక్షించుకోండి! -
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం
శంషాబాద్: ఇండిగో ఎయిర్లైన్స్లో బోర్డింగ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా ప్రయాణించే అవకాశం లేకుండా పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే ఎయిర్లైన్స్ విమానాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్ధరాత్రి, శుక్రవారం ఉదయం కూడా బోర్డింగ్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకున్న సంఘటనలు జరిగాయి. గురువారం రాత్రి 10.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వయా బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన 6 ఈ 511 విమానంలో బోర్డింగ్ పూర్తి చేసుకున్న 25 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉన్నా వారు ఎక్కకుండానే విమానం సమయానికి టేకాఫ్ తీసుకుంది. దీంతో ప్రయాణికులు రాత్రి ఒంటిగంట వరకు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాచారు. తాము సమయానికి బోర్డింగ్ పూర్తి చేసుకున్నా విమానంలోకి ఎక్కకుండా గేట్ మూసివేశారని ఆరోపించారు. ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్కు బయలుదేరిన విమానంలో కూడా సుమారు 20 మంది ప్రయాణికులు బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గత ఏప్రిల్లో శబరిమలై వెళ్లే పలువురు ప్రయాణికులు కూడా సుమారు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. -
తీరు మారని ‘ఇండిగో’
బోర్డింగ్ ప్రయాణికులను అనుమతించని వైనం శంషాబాద్: ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవహార శైలితో శంషాబాద్ విమానాశ్రయం నుంచి శబరిమలై వెళ్లడానికి బయలుదేరిన 13 మంది ప్రయాణికులు ఆదివారం ఇబ్బందులు పడ్డారు. బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా వారిని విమానంలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు ది గారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన 6ఈ(413) ఇండిగో ఎయిర్లైన్స్ ఆదివా రం ఉదయం 7.12కి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. ఉదయం 6.30కి బోర్డింగ్ను పూర్తి చేసుకున్న 13మంది ప్రయాణికులు విమానంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది నిరాకరించారు. అప్పటికే డోర్ వేసినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆలస్యంగా బోర్డింగ్ ప్రక్రి య పూర్తి చేసుకోవడంతో అనుమతించలేదని ఎయిర్లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులను ప్రత్యామ్నాయంగా వేరే విమానాల్లో పంపినట్లు సమాచారం. ఈ నెల 14న కూడా ఇండిగో విమాన సిబ్బం ది తీరుతో కొచ్చిన్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇలానే ఇబ్బందికి గురయ్యారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : తమను ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోయిందంటూ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.... హైదరాబాద్ నుంచి కొచ్చికి ఇండిగో విమాన సర్వీసులో వెళ్లేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అప్పటికి కొన్ని నిమిషాల ముందే విమానం వెళ్లిపోయిందని సదరు ప్రయాణికులకు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో అధికారులపై ప్రయాణీకులు మండిపడ్డారు. ముందుగా టిక్కెటు కొనుగోలు చేసిన విమానం ఎందుకు వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రయాణీకులు ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎయిర్పోర్టు పోలీసులు రంగంలోకి దిగి... ప్రయాణికులకు శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎయిర్ ‘బస్సు’లో గొడవ
♦ ఎయిర్లైన్స్ సిబ్బందికి ప్రయాణికులకు వాగ్వాదం ♦ ప్రయాణికులను వదిలేసి రాయ్పూర్ వెళ్లిన ఇండిగో విమానం ♦ పోలీసుల రంగ ప్రవేశంతో ఇరుపక్షాల మధ్య సయోధ్య ♦ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రయాణికులను పంపిన ఎయిర్లైన్స్ సంస్థ శంషాబాద్: అది ఎయిర్ బస్సు.. కానీ అందులో గొడవ చోటు చేసుకోవడంతో ప్రయాణికులను వదిలేసి ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది.. పరిస్థితి పోలీసుల దాకా వెళ్లడంతో ఎట్టకేలకు సయోధ్య కుదిర్చారు. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని ఓ పెళ్లి విందులో పాల్గొనడానికి ఛత్తీస్గఢ్కు చెందిన 70 మందితో కూడిన బంధువుల బృందం రెండురోజుల క్రితం నగరానికి వచ్చింది. శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాయ్పూర్ వెళ్లడానికి వీరు ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన 466వ నంబర్ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అందరూ బంధువులే కావడంతో విమానంలో తమకు తోచిన విధంగా సీట్లలో కూర్చున్నారు. కానీ, టికెట్ బుకింగ్ ఆధారంగానే సీట్లలో కూర్చోవాలని ఎయిర్లైన్స్ సిబ్బంది వారికి సూచిం చారు. అందుకా బృందం అంగీకరించలేదు. ఈ విషయమై పెళ్లి బృందానికి, ఎయిర్లైన్స్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో రాత్రి 9 గంటలకు ప్రయాణికులను అక్కడే దించేసి విమానం టేకాఫ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో పెళ్లి బృందం ఎయిర్లైన్స్ సిబ్బందితో గొడవకు దిగి.. అర్ధరాత్రి వరకు విమానాశ్రయంలో ఆందోళన చేపట్టింది. చివరకు ఆర్జీఐఏ పోలీసులు వచ్చి ప్రయాణికులకు, ఎయిర్ లైన్స్ సిబ్బందికి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో పెళ్లి బృందాన్ని శంషాబాద్లోని ఓ హోటల్లో బస చేయించారు. ఇండిగో ఎయిర్లైన్స్ శనివారం ఉదయం కొందరు ప్రయాణికులను, సాయంత్రం మరికొందరిని రాయ్పూర్కు వేర్వేరు విమానాల్లో పంపారు. -
విమానంలో మహిళపై లైంగిక వేధింపులు!
కోల్కతా: ఓ మహిళను సహ ప్రయాణికుడు లైంగికంగా వేధించిన ఘటన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. కోల్కతా- న్యూఢిల్లీ విమానంలో సహ ప్రయాణికుడు తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి.. కేసు నమోదు చేశారు. 50 ఏళ్ల నిందితుడు సంజయ్ కనద్, బాధితురాలు ఇద్దరూ ఢిల్లీ వాసులే. వారు సోమవారం ఉదయం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి వచ్చి.. ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో కూచున్నారు. ఇద్దరు సీటు బెల్టులు పెట్టుకున్న అనంతరం మహిళ కేకలు వేసింది. తన పక్కన కూర్చున్న సంజయ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో ఇద్దరిని విమానాశ్రయంలోనే దింపేసి షెడ్యూల్ ప్రకారం విమానం వెళ్లిపోయింది. అనంతరం బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్ సిబ్బంది.. సంజయ్ కనద్ను అరెస్టు చేశారు. -
త్వరలో అరబిందో క్విప్ ఇష్యూ!
రూ. 2,000 కోట్ల నిధుల సమీకరణ యోచన రూ. 900 కోట్లతో కొత్త యూనిట్ల ఏర్పాటు రెండేళ్లలో రూ. 20,000 కోట్ల ఆదాయ లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో త్వరలోనే క్విప్ ఇష్యూకి రావాలని అరబిందో ఫార్మా యోచిస్తున్నట్లు సమాచారం. ఇండిగో ఎయిర్లైన్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతం కావడంతో మార్కెట్ నుంచి నిధులు సమీకరించడానికి ఇదే సరైన తరుణమని కంపెనీ భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలోనే రావాలని ఆశించినా మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) విధానంలో సుమారు రూ. 2,000 కోట్ల నిధులను సమీకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నిధుల సేకరణ గురించి నవంబర్ 6న జరిగే బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అరబిందో ఫార్మా మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. లక్ష్యం మూడు బిలియన్ డాలర్ల క్లబ్ వచ్చే రెండేళ్లలో మూడు బిలియన్ డాలర్ల క్లబ్లో (సుమారు రూ. 20,000 కోట్ల ఆదాయం) చేరాలని అరబిందో ఫార్మా లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.12,120 కోట్లుగా ఉంటే 2017-18 నాటికి రూ.20,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా భారీ విస్తరణ ప్రణాళికలను కూడా కంపెనీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ఒక్క ఏడాదిలోనే తెలుగు రాష్ట్రాల్లో యూనిట్ల విస్తరణ కోసం రూ.900 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించింది. రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టిన తెలంగాణలోని మెదక్ జిల్లా యూనిట్ విస్తరణకు ఇప్పటికే అన్ని అనుమతులూ వచ్చాయి. ఈ విస్తరణ పూర్తయితే ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 96 టన్నుల నుంచి 421 టన్నులకు పెరుగుతుంది. వీటితోపాటు జడ్చర్లలో పెన్సిలిన్ యూనిట్, విశాఖపట్నం నాయుడిపేటలో ఫినిష్డ్ డోసేజ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. క్విప్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను ఈ విస్తరణ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ ఏడాది రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధపడింది. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్పై తుది నిర్ణయం తీసుకోనుంది. తొలి త్రైమాసికంలో 50 శాతం మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో రూ.2,220 కోట్ల ఆదాయంపై రూ. 406 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ద్వితీయ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడంతో కంపెనీ లాభాలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయికి సమీపంలో రూ. 841 వద్ద కదులుతోంది. -
చంద్రబాబుతో ఇండిగో ఎయిర్లైన్స్ ఛైర్మన్ భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇండిగో ఎయిర్లైన్స్ ఛైర్మన్ రాహుల్ భాటియా గురువారం భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఇండిగో సర్వీసుల పెంపుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా దేశ ఏవియేషన్ రంగంలో ఏకైక లాభదాయక సంస్థగా ఉన్న ఇండిగో విశాఖను తన హబ్ గా చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. విమానాల్లో ఇంథనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) పై వ్యాట్ ను చంద్రబాబు ఒక శాతానికి తగ్గించటంతో ఇండిగో విశాఖపట్నం వైపు కన్నేసింది. దీని వల్ల కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇదే కారణంతో కంపెనీ విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ కేంద్రాలకు సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. -
ఢిల్లీ-వైజాగ్ మధ్య ఇండిగో నాన్స్టాప్ సర్వీస్
న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థ దేశీయ నెట్వర్క్లో 10 కొత్త డైలీ నాన్-స్టాప్ విమాన సర్వీసులను నేటి నుంచి అందించనున్నది. హైదరాబాద్, వైజాగ్, గోవా, ఢిల్లీ, బెంగళూరులకు నాన్స్టాప్ సర్వీసులు ఉంటాయని ఇండిగో తెలిపింది. నేటి(శుక్రవారం) నుంచి ఢిల్లీ-వైజాగ్ నాన్స్టాప్ విమాన సర్వీస్ను తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని పేర్కొంది. అలాగే హైదరాబాద్-వైజాగ్ల మధ్య మూడవ డైలీ నాన్స్టాప్ విమాన సర్వీసును, ముంబై-హైదరాబాద్ల మధ్య 6వ నాన్స్టాప్ విమాన సర్వీసులను అందిస్తున్నామని తెలిపింది. అలాగే ఈనెల 26 నుంచి ఢిల్లీ-గోవా నాలుగవ డైలీ నాన్స్టాప్ విమాన సర్వీస్ను, ఢిల్లీ-బెంగళూరు 9వ డైలీ నాన్స్టాప్ విమాన సర్వీస్ను ప్రారంభిస్తామని పేర్కొంది. ఢిల్లీ-విశాఖ డైలీ నాన్-స్టాప్ సర్వీస్ను తొలిసారిగా ప్రారంభిస్తున్నామని, ప్రయాణికులు అదే రోజు ఆంధ్రప్రదేశ్కు రిటర్న్ జర్నీ చేయవచ్చని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై పన్నులు తగ్గించిందని, ఫలితంగా తక్కువ చార్జీలు ఆఫర్ చేసే అవకాశాలున్నాయని, కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఇండిగో పేర్కొంది. -
విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు
ముంబై: విస్తరణ ప్రణాళికలో భాగంగా మరిన్ని నగరాలను కలుపుతూ ఆదివారం నుంచి 6 కొత్త విమాన సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. విశాఖ, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్, రాంచీ, కోల్కతాల నుంచి కొత్త సర్వీసులు నిర్వహిస్తామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు - భువనేశ్వర్, విశాఖ విమాన సేవలు ఆదివారం నుంచి, మిగిలి నవి ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 36 నగరాల మధ్య 485 సర్వీసులు నిర్వహిస్తుండడంతో ఈ రం గంలో మరింత బలపడతామని తెలిపింది.