Mahakumbh Mela 2025 పవిత్ర స్నానం గురించి బాధపడకండి..ఇలా చేస్తే పుణ్యఫలం! | Mahakumbh Mela 2025 special article on Holy Dip check details | Sakshi

త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం గురించి బాధపడకండి..ఇలా చేస్తే పుణ్యఫలం!

Jan 27 2025 5:32 PM | Updated on Jan 27 2025 7:10 PM

Mahakumbh Mela 2025 special article on Holy Dip  check details

నీలోనే దివ్యత్రివేణి 

ఆత్మ బోధనం 

మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సమారంభం. ఎందరో సాధువులు, బాబాలు, అవధూతలు, సిద్ధులు, యోగులు, వైష్ణవులు, శాక్తులు, ఇలా హైందవ ధర్మంలో ఉన్న అనేక ఆచారాలకు సంబంధించిన ఎందరో మహిమాన్వితులు మహాకుంభ మేళాకు తరలి వెళతారు. ప్రపంచ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు ఆ దివ్య మహోత్సవ సందర్శనార్థం ప్రయాగ చేరుకుంటారు. నదులకు సహజ సిద్ధంగా దివ్యశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే ఎన్నో దివ్య క్షేత్రాలు, ధామాలు పుణ్యనదుల పరీవాహక  ప్రాంతాల్లో కొలువుదీరి ఉంటాయి. ఈ సంవత్సరం మహా కుంభమేళ ప్రయాగలో జరుగుతుంది. 

భూమాతను ఆసురీ శక్తుల ప్రభావం నుండి కాపాడేందుకు, దివ్యశక్తిని పెంచేందుకు ఎందరో యోగులు, సిద్ధులు, గురువులు ప్రత్యక్ష, పరోక్ష రూ΄ాలతో కృషి చేస్తుంటారు. మహా కుంభమేళా సమయంలో ఎందరో సాధువులు, మహా యోగులు నదీ గర్భంలోకి తమ త΄ోశక్తులను కూడా ప్రవహింపచేసి, అక్కడికి వచ్చిన అనేక మంది భక్తులను అనుగ్రహిస్తారు. నదిలోని దివ్య శక్తి, విశ్వంలో గ్రహాల అమరిక వల్ల ఉత్పన్నమయ్యే విశ్వశక్తి, మహాయోగుల తపోశక్తి వెరసి, దివ్య ప్రకంపనలు భూ గ్రహమంతా విస్తరిస్తాయి. అక్కడికి చేరుకున్న వ్యక్తులకే కాకుండా, ఈ దివ్య ప్రకంపనలు సామూహిక చైతన్యానికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. 

యోగవిద్యలో చెప్పిన ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు, ప్రయాగరాజ్‌ లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతీ నదుల కలయికకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. త్రివేణి సంగమం వద్ద మూడు పుణ్యనదులు కలిసి ఒక పవిత్ర తీర్థంగా మారినట్లే, మానవుడిలో ఇడా, పింగళ సుషుమ్న నాడులు భృకుటీ మధ్య భాగంలో సంగమిస్తాయి. అందుకే బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని జ్ఞాన త్రివేణిగా అభివర్ణిస్తారు. ఈ మూడు నాడులు ఏకీకృతం అయినప్పుడు చైతన్య జాగృతి కలుగుతుంది. అందుకే భకుటీ మధ్యంలో గంధం, కుంకుమ, పసుపు లేదా భస్మాన్ని బొట్టుగా ధరిస్తారు. భ్రూ మధ్యంలో మూడు నాడుల కలయిక అన్నది యోగంలో చెప్పే అమృతత్వ స్థితిని ప్రదానం చేసేందుకు మార్గం అవుతుంది. 

ఈ సంవత్సరం సంక్రాంతి నుండి శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు సాగే ఈపవిత్ర సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటుగా మనసును క్లేశ రహితంగా మార్చుకోవడం వల్ల దివ్య శక్తిని ఎక్కడ ఉన్నా పొందవచ్చు. త్రివేణి సంగమ స్థలికి చేరుకోలేని వారు, ఇంటి వద్దే 45 రోజుల పాటు ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా అమృతతత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. 
– మాతా ఆనందమయి,ఆధ్యాత్మిక గురువు 
చదవండి: రూ. కోటి జాబ్‌ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement