Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్‌ | Shakshi Excellence Awards 2025 | Sakshi
Sakshi News home page

Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్‌

Published Sun, Mar 9 2025 4:54 AM | Last Updated on Sun, Mar 9 2025 4:03 PM

Shakshi Excellence Awards 2025

సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్‌ ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్‌ ఇచ్చి గౌరవిస్తోంది. 

ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్‌.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.

సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.
– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్‌

సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్‌ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్‌ చేసి పెద్ద నోట్స్‌ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.
– శాంతా సిన్హా, జ్యూరీ చైర్‌పర్సన్‌



మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు.  వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్  ఫార్మింగ్‌  అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


మావురం మల్లికార్జున్‌ రెడ్డి, సేంద్రియ వ్యవసాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్  ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్‌ హాస్పిటల్‌ స్థాయి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు.  ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్‌ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్‌ హెల్త్‌ కేర్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణ

చెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్‌. ఫార్మసీలో పీహెచ్‌డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్‌ స్టోర్‌ప్రారంభించిన సుహాస్‌ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించారు. ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్‌ బి షెట్టిని ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – స్మాల్‌ అండ్‌ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


సుహాస్‌ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యం

వీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్‌ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో  ఇప్పటివరకు 14,996  మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్‌ ప్రోగ్రామ్‌ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


కె. అనురాధ, విద్యారంగం

మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు.  వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్  ఫార్మింగ్‌  అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


మావురం మల్లికార్జున్‌ రెడ్డి, సేంద్రియ వ్యవసాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్‌ హాస్పిటల్‌ స్థాయి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు.  ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్‌ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్‌ హెల్త్‌ కేర్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణ

చెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్‌. ఫార్మసీలో పీహెచ్‌డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్‌ స్టోర్‌ప్రారంభించిన సుహాస్‌ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించారు. ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్‌ బి షెట్టిని ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – స్మాల్‌ అండ్‌ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


సుహాస్‌ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యం

చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్‌ పుష్కలంగా ఉన్న అర్జున్‌ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్‌ గుజరాత్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌ షిప్‌లో అండర్‌ 13 విభాగంలో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్‌ యూత్‌ చాంపియన్‌ షిప్‌లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.  అర్జున్ ను  ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–స్పోర్ట్స్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


అర్జున్‌ ఎరిగైసి, క్రీడలు

అడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన.  ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్మెంట్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


దుశర్ల సత్యనారాయణ, పర్యావరణం

భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్‌లో కొత్త  తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్‌ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సీరిస్‌’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్‌ మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైన త్రిష  బీసీసీఐ  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్‌ రౌండర్‌గా  పేరు తెచ్చుకున్న ఈ లెగ్‌ స్పిన్నర్‌ ఐసీసీ అండర్‌–19 మహిళల టి 20 వరల్డ్‌ కప్‌–2025లో  సెంచరీ చేసి రికార్డులు బ్రేక్‌ చేసింది.  గొంగడి త్రిషను ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌– స్పోర్ట్స్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి.


త్రిష, క్రీడలు

ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్‌ మొదలు పెట్టి  గ్రూప్‌–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఎడ్యుకేషన్  అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


మద్దెబోయిన మానస, విద్యారంగం

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్‌ రమేశ్‌ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్‌ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్‌ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి.  దీప్తి జీవాంజిని స్పోర్ట్స్‌ కేటగిరిలో ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


జీవాంజి దీప్తి, క్రీడలు

పెద్ది శంకర్‌ గౌడ్‌ ‘రెడీ టు సర్వ్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్‌ హోమ్‌ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్‌ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి  వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా  ఇస్తున్నారు. పెద్ది శంకర్‌ గౌడ్‌ను ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సోషల్‌ సర్వీస్‌’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


పెద్ది శంకర్, సామాజిక సేవ

మద్దినేని ఉమామహేష్‌.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్‌. స్వస్థలం  విజయవాడ.  బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్‌ సాధించాడు.  2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్‌ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్‌ మెన్స్ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్‌ కేటగిరిలో యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి.

మద్దినేని ఉమా మహేష్, క్రీడలు

ఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్‌ కుమార్‌ చందన, నాగభరత్‌ కలిసి 2018లో స్కైరూట్‌ ఏరోస్పేస్‌నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్‌ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్‌–సిరీస్‌ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్‌. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్‌ స్టార్టప్‌  అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.

పవన్‌ చందన, నాగ భరత్, స్టార్టప్‌

తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం  సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు.  పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.

అనితప్రొద్దుటూరి, సామాజిక సేవ

చంద్రకాంత్‌ సాగర్‌ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్‌ నుంచే 2019లో ప్రణవ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో  పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్‌ మాస్కులు,  పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్‌ 25 లక్షలు.  చంద్రకాంత్‌ సాగర్‌ని ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ కేటగిరీ’లో స్పెషల్‌ జ్యూరీ రికగ్నేషన్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.


చంద్రకాంత్‌ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యం

డొక్కరి రాజేశ్‌ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్‌ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్‌ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు.  2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు.  వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్‌ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్‌.


డొక్కరి రాజేష్‌ తల్లిదండ్రులు, అమర సైనికుడు


→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి
 

∙‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయ

డొక్కరి రాజేష్‌ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ...

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement