Sakshi Excellence Awards
-
సేవాభావాన్ని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సేవ చేస్తున్న వారిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్నో రంగాల్లో సేవ చేస్తున్నవారు నిజజీవితంలో తారసపడుతున్నప్పటికీ.. అందులో ఉత్తమమైన వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్న ‘సాక్షి’కృషి అద్భుతమని ప్రశంసించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తులకు ‘సాక్షి’మీడియా గ్రూప్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ.. వైఎస్ భారతిరెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడారు.ఈ కృషిని అభినందించాల్సిందే..సమాజంలో ఎలాంటి ఫలాలను ఆశించకుండా సేవచేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని.. ఆ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే, వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని దత్తాత్రేయ చెప్పారు. వారి జీవితం సమాజంలోని ఎంతోమందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఎక్సలెన్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ‘సాక్షి’మీడియా గ్రూప్ పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తోందని.. ఈ కృషిని అభినందించాల్సిందేనని చెప్పారు.‘‘ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ఆషామాషీ కాదు. సేవ చేసేవారిని గుర్తించడం, వారి సేవతో సమాజంలో వస్తున్న మార్పును విశ్లేషించడం ద్వారా విశిష్ట వ్యక్తులను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ సభ్యులకు అతిపెద్ద సవాలు..’’అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపిక చేసిన విధానం అద్భుతంగా ఉందని జ్యూరీ సభ్యులను అభినందించారు. పదేళ్ల అవార్డుల ప్రదానోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమలు, ఆరోగ్య పరిరక్షణ తదితర కేటగిరీలలో తొమ్మిది మందికి గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, ఇక్ఫాయ్ యూనివర్సిటీ డైరెక్టర్లు కె.ఎల్.నారాయణ, కె.ఎస్.వేణుగోపాల్రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పోతూరి, సాక్షి సీఈవో, డైరెక్టర్లు, ఎడిటర్ పాల్గొన్నారు. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ : మీ అభిమాన తారలకు ఓటేయండి
‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం’ అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరిస్తుంది సాక్షి మీడియా గ్రూప్. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల’ కోసం ఓటింగ్ని ఆహ్వానిస్తోంది. సినిమా రంగంలో వివిధ కేటగిరీలకు అవార్డులను అందించే అవకాశం మీకే ఇస్తుంది. మీ ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అండ్ బెస్ట్ మూవీస్ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మేమిచ్చిన కేటగిరీలలో ఉన్న ఆప్షన్స్ను పరిశీలించి మీకు నచ్చిన వారిని నామినేట్ చేయండి. మీరిచ్చే ఓటింగ్తో విజేతలను ప్రకటించి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ తో వారిని సత్కరించడమే కాకుండా విన్నర్స్ ఎంపికలో పాల్గొన్న వారిని లక్కీ డ్రా తీసి అతిరథ మహారథుల సమక్షంలో జరిగే ఎక్సలెన్స్ అవార్డ్ ఫంక్షన్లో మీరు పాల్గొనే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మీ అభిప్రాయాన్ని మా వాట్సాప్ నెంబర్ 8977738781 ద్వారా కూడా తెలియజేయొచ్చు.ఓటింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 Party 2
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 Party 1
-
'సాక్షి ఎక్సలెన్స్' అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
Sakshi Excellence Awards 2023 : కన్నులపండువగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు (ఫొటోలు)
-
ప్రతిభా పురస్కారాల సాక్షిగా..
'నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. పూట గడవని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... అలాగే పిన్న వయస్సులోనే ప్రతిభ చూపేవారు... తమ ప్రతిభను సమాజ హితం కోసం... దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు... ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు ఎందరో... ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... సత్కరించి గౌరవిస్తోంది. ఇందులో భాగంగా 9వ ఎడిషన్కు సంబంధించిన ‘సాక్షి’ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో నవంబర్ 16, గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు.' లాన్స్నాయక్ బొగ్గల సాయి తేజస్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) చిత్తూరుజిల్లాలోని ఎగువ రేగడ పల్లి గ్రామానికి చెందిన యువతేజం బొగ్గల సాయితేజ బాల్యం నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్లో ఆర్మీజవాన్ గా చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. స్వల్పకాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు సాయితేజ. అతని శక్తియుక్తులను గుర్తించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్... ఆయనను తన వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. అయితే... అనూహ్యంగా 2021 డిసెంబర్లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్తోపాటు సాయితేజ కూడా అమరుడయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సోదరుడు మహేష్ కూడా సైన్యంలో ఉన్నారు. విధి నిర్వహణలో అమరుడైన వీర జవాన్ లాన్ ్స నాయక్ సాయితేజకు సెల్యూట్ చేస్తూ సాక్షి ఎక్సలెన్ ్స – మరణానంతర పురస్కారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసింది సాక్షి మీడియా గ్రూప్. తల్లిదండ్రుల స్పందన: మా సాయితేజ చిన్నప్పటి నుంచే దేశం గురించి ఆలోచించేవాడు. దేశసేవ గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనే సొంతంగా వెళ్లి ఆర్మీలో సెలక్ట్ అయ్యాడు. అక్కడ దేశం కోసం అమరుడయ్యాడు. కొడుకు మీద మీద ప్రేమతో గుడికట్టి, మేమూ ఆ ప్రాంగణంలోనే ఉంటున్నాం. ఈ అవార్డు మాకు నిత్య స్మరణీయం. పంతంగి భార్గవి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (ఎడ్యుకేషన్) పంతంగి భార్గవి తండ్రి ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చదువుల తల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పట్టి చిక్కుప్రశ్నలు పరిష్కరించే మెళకువలను ఆకళింపు చేసుకుంది భార్గవి. కరోనా మహమ్మారి విరుచుకుపడినా మనోధైర్యం కోల్పోకుండా ఆన్ లైన్ క్లాసుల ద్వారా సాధన కొనసాగించింది. జేఈఈ అడ్వాన్ ్సడ్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించి బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్లో చేరింది... సాధన చేస్తే సాధ్యం కానిదేమీ లేదని నిరూపించిన భార్గవిని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎడ్యుకేషన్ అవార్డ్తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. భార్గవి సోదరి స్పందన: మా అమ్మానాన్న మమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను బీటెక్ చేసి టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్నాను. తమ్ముడు చదువుకుంటున్నాడు. చెల్లికి ఇంత గొప్ప పురస్కారం లభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. పార్టిసిపేటరి రూరల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ (ప్రొ. ఎస్వీ రెడ్డి, ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోంది పార్టిసిపేటరి రూర ల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయం, పర్యావరణం, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధిక దిగుబడులు సాధించేలా రైతులకు మెళకువలు నేర్పిం చి, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తోంది. ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు పది వేల నుంచి 25 వేల వరకు అధికంగా ఆదాయం చేకూరుతోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఈ సొసైటీ ని ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: సరిగ్గా చేసుకుంటే వ్యవసాయం లాభదాయకమే. ఖర్చులు తగ్గించుకోవాలి, కొత్త వంగడాలతో శ్రద్ధగా సేద్యం చేయాలి. రైతులకు నేను చెప్పే మాట ఒక్కటే... ‘రసాయన ఎరువులకు బదులు గ్రీన్ లేబుల్ ఉన్న పెస్టిసైడ్స్ని వాడాలి’. తెలుగు నేలకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇచ్చిన ఈ అవార్డు అమ్మ ప్రశంసలా ఉంది. కేడర్ల రంగయ్యఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కొమురంభీం జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేడర్ల రంగయ్య తాను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటూ... తన ఇద్దరు పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య కృషిఫలితంగా విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280 కి పెరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు జిల్లాస్థాయిలో టాపర్స్గా నిలిచారు. సామాజిక రుగ్మతలైన బాల్యవివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. బెల్ట్షాపులు తొలగింపు కోసం నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడింది. మద్యపానంపై స్వచ్ఛంద నిషేధం అమలవుతోంది. విద్యార్థుల భవితకు పాటుపడుతున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎక్సలెన్్స ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: పిల్లలను చైతన్యవంతం చేయడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చన్నది నా ఆలోచన. నాకు భార్య çసహకారం ఉంది. సాక్షి పురస్కారం నా బాధ్యతను పెంచింది. మరింత ఉత్సాహంగా పని చేసి లక్ష్యాన్ని సాధిస్తా. సునీల్ యల్లాప్రగడ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) కాంపోజిట్ మెటీరియల్స్తో సరికొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. రైల్వేస్, ఆటోమోటివ్, విండ్, మెరైన్, డిఫెన్ ్స తదితర సంస్థలకు అవసరమైన డిజైన్, టూలింగ్, కాంపోజిట్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తోంది. ట్రియోవిజన్ ఉత్పత్తులు కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. రసాయనాలు, మంటల నుంచి రక్షణ కల్పిస్తాయి. తుప్పుపట్టవు. దేశీయంగానే కాకుండా గ్రీస్, యుఏఈ, నైజీరియా తదితర దేశాలకూ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ట్రియోవిజన్ . కాంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ దేశవిదేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సునీల్ యల్లాప్రగడను సాక్షి స్మాల్ / మీడియం స్కేల్ – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: మేం తయారుచేస్తున్న ఉత్పత్తులను స్వదేశంలోనే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మా కృషిని గుర్తించి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సాక్షి మీడియా సంస్థ సత్కరించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. కొమెర అంకారావు (జాజి) ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఇండివిడ్యువల్) పల్నాడు ప్రాంతానికి చెందిన కొమెర అంకారావుకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రోజూ అడవికి వెళ్లి విత్తనాలు చల్లడం... మొక్కలు నాటడం అలవాటు. అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేయడం, వేసవిలో మొక్కలకు నీళ్లుపోసి సంరక్షించడం, వారంలో నాలుగు రోజులు అడవుల్లోనే సంచరించడం, రెండురోజులు పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడం అభిరుచులు. తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పంట పండించి పక్షులకు ఆహారంగా వదిలేస్తారు. అంకారావు నిస్వార్థ సేవకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వన్యప్రేమికుడైన అంకారావు ఉరఫ్ జాజిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: ఈ పని చేస్తే అవార్డులు వస్తాయని కూడా తెలియదు. సుచిర్ ఇండియా నుంచి సంకల్పతార, దయానంద సరస్వతి సంస్థ నుంచి వృక్షమిత్ర, చెన్నై ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్æ పురస్కారాలందుకున్నాను. అవార్డులు వస్తాయని పనిచేయలేదు, అవార్డులు రాకపోయినా పని ఆపను. డాక్టర్ చినబాబు సుంకవల్లి (ఎక్సలెన్స్ ఇన్ హెల్త్కేర్) క్యాన్సర్ సోకి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నవారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు డాక్టర్ చినబాబు సుంకవల్లి. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ ముప్పు తప్పించవచ్చనే ఆలోచనతో 2013లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆర్థికస్తోమత లేని రోగులకు అవసరమైన వైద్యం అందించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. మురికివాడలు, పల్లెలు, పట్టణాలు, గిరిజన తండాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది ఈ ఫౌండేషన్. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు లక్షమందికి వైద్య పరీక్షలు చేశారు. క్యాన్సర్ రోగులకు తనవంతు సేవ చేస్తున్న సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లిని సాక్షి ఎక్సలెన్ ్స ఇన్ హెల్త్ కేర్ అవార్డ్తో పురస్కరించింది. పురస్కార గ్రహీత స్పందన: వైద్యరంగంలో చికిత్స మాత్రమే కాదు, అంతకుమించిన సేవలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ధైర్యం చెప్పి సాంత్వన కలిగించడం, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చైతన్యవంతం చేయడం వంటివి. మా సేవలను గుర్తించి సాక్షి ఇచ్చిన ఈ అవార్డు రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుంది. నెలకుర్తి సిక్కిరెడ్డి (యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్) తన ఆటతీరుతో జాతీయ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న నెలకుర్తి సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు. తల్లి గృహిణి. బాల్యం నుంచి క్రీడలపై కూతురికి ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు పేరెంట్స్. ఆమెకు బ్యాడ్మింటన్లో మెళకువలు నేర్పించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఆటలో కఠోరమైన శిక్షణ తీసుకున్న సిక్కిరెడ్డి స్వల్పకాలంలోనే ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. 2007లో కెరీర్లో తొలి అంతర్జాతీయ జూనియర్ ప్రపంచ కప్ పోటీలో పాల్గొంది. బ్యాడ్మింటన్ లో విశేష ప్రతిభ చూపిన సిక్కిరెడ్డిని కేంద్రప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. తనకిష్టమైన క్రీడల్లో సత్తా చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న సిక్కిరెడ్డిని సాక్షి ఎక్సలెన్ ్స యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను కెరీర్ మొదలు పెట్టిన తొలిరోజుల్లో ప్రారంభమైన సాక్షి, మొదటి నుంచి నాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రతి అవార్డూ దేనికదే ప్రత్యేకం. దేని గొప్పతనం దానిదే. సాక్షి పురస్కారం అర్జున అవార్డు మరోసారి అందుకున్నంత ఆనందాన్నిస్తోంది. జాస్పర్ పాల్ యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల జాస్పర్పాల్.... 2014లో ఒక ఘోర రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అది దేవుడు తనకు ఇచ్చిన పునర్జన్మగా భావించిన జాస్పర్ ఆ క్షణమే ఒక గట్టి సంకల్పం తీసుకున్నారు. నిలువ నీడ లేని వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 2017లో సెకండ్ ఛాన్ ్స ఫౌండేషన్ స్థాపించారు. పుట్పాత్లపై నిస్సహాయంగా పడి ఉన్న వృద్ధులను చేరదీసి.. జీవిత చరమాంకంలో వారికి ఊరట కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందికి ఆశ్రయం కల్పించారు. 300 మందిని తిరిగి వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. హైదరాబాద్లో జాస్పర్ నిర్వహిస్తున్న షెల్టర్హోమ్స్లో సుమారు 200 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు...ఫ్రీ హాస్పిటల్ ఫర్ ది హోమ్లెస్ పేరుతో నిలువ నీడలేని వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్న జాస్పర్ పాల్ని సాక్షి యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – సోషల్ సర్వీస్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: తొమ్మిదేళ్లుగా సామాజిక సేవలో ఉన్నాను. రకరకాల కారణాలతో వృద్ధులను వారి పిల్లలు వదిలేయడం గమనించాను. ఒంటరి వృద్ధులను చూసినప్పుడు బాధగా అనిపించేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలని ఓల్డేజీ హోమ్ ఏర్పాటు ద్వారా ఎందరో వృద్ధులను కాపాడగలిగాను. దీన్ని సాక్షి గుర్తించి అవార్డు ఇవ్వడం... పెద్దల ఆశీస్సులు లభించినంత ఆనందంగా ఉంది. డాక్టర్ పద్మావతి పొట్టబత్తిని ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ వైకల్యం ఆమె అభిరుచిని అడ్డుకోలేకపోయింది. సంకల్పం ఆమెకు కొత్తదారి చూపింది. ఆవిడే పద్మావతి పొట్టబత్తిని. పసితనంలో పోలియో బారినపడ్డా, చెక్కుచెదరని మనోబలంతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తనలోని కళాభిరుచికి రెక్కలు తొడిగి రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివ్యాంగుల కోసం ఒక సంస్థను ఏర్పాటుచేసి వారికి కంప్యూటర్స్, నృత్యం, సంగీతం, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్న పద్మావతిని పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించడంతోపాటు రాష్ట్రప్రభుత్వం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. కళలు, సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న పద్మావతిని ఎక్సలెన్ ్స ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: చిన్ననాటి నుంచి ఆర్టిస్టుగా ఉండటం వల్ల నాలాగా కళాకారులు అవ్వాలనుకునే దివ్యాంగులకు సాయం చేయాలనుకున్నాను. నేను ఎదుర్కొన్న సమస్యలు మిగతావారు ఫేస్ చేయకూడదని వారికి మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. నా కృషిని గుర్తించి, ఈ అవార్డును ఇవ్వడం ఆనందంగా ఉంది. డా. బి. పార్థసారథి రెడ్డి, ఛైర్మన్ (హెటిరో డ్రగ్స్) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ (సుధాకర్ రెడ్డి, హెటిరో గ్రూప్ డైరెక్టర్) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో ఫార్మాస్యూటికల్స్ తమ విభిన్నమైన ఉత్పత్తులతో పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ పరంగా దేశవిదేశాల్లో విశేషమైన గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫార్మా కంపెనీ హెచ్ఐవీ చికిత్సలో వినియోగించే డ్రగ్స్ను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్వైన్ ఫ్లూ, కోవిడ్ చికిత్సలో వినియోగించిన ఔషధాలను పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసి రికార్డు సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఔషధాల ఉత్పత్తికి అంకితమై, విశేష కృషి చేస్తున్న హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డా. బి.పార్థసారథి రెడ్డిని బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లార్జ్స్కేల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. స్పందన: (సుధాకర్ రెడ్డి, డైరెక్టర్, అవార్డు అందుకున్నారు) మా వంతు సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన ఔషధాల తయారీలో ముందుంటున్నాం. అదే నిబద్ధతతో ప్రయోగాలను కొనసాగిస్తూ మందులను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (కార్పొరేట్) (ఎమ్.వెంకట నారాయణ రెడ్డి, సీఈవో) వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, బయో ఇంధనం, సౌరశక్తి ఆధారిత పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహించడం నెక్ట్స్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను నియంత్రిస్తూ... క్లీన్ఎనర్జీతో ఈ సంస్థ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణాకోర్సుల నిర్వహణతోపాటు ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ అందిస్తోంది. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, సోలార్ ఆఫ్– గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ప్రకృతి వనరుల సద్వినియోగంతో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందిస్తున్న నెక్స్ట్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ప్రతినిధి ఎస్. వెంకట నారాయణరెడ్డిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ – కార్పొరేట్ అవార్డ్తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: సాక్షి సంస్థ మా సర్వీస్ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఊహించని సంతోషం. సేవ చేసే వారిని గుర్తించి గౌరవించడం పెద్ద బాధ్యత. సాక్షి అంత పెద్ద బాధ్యతను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయం. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ) (ఉదయ్ పిలాని, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్) పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్. హానికారకమైన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వాటిని రీ సైక్లింగ్ చేయడం అనే బృహత్కార్యాన్ని తన భుజాన వేసుకుంది ఈ క్లబ్. గత పదేళ్లుగా విశాఖలోని బీచ్, అపార్ట్మెంట్స్, మార్కెట్ ప్రాంతాల్లో ఇండియా యూత్ ఫర్ సొసైటీతో కలిసి జీవీఎం సహకారంతో ఒక ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ను నిర్వహిస్తోంది. వీరు నిర్వహిస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్షాప్స్ ఫలితంగా ప్రజల్లో ఆశాజనకమైన మార్పు అంకురిస్తోంది. పుడమితల్లిని కాపాడుకునేందుకు తోడ్పాటునందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ పిలానిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్సర్వేషన్ – ఎన్జీవో అవార్డ్తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: పర్యావరణంపై చూపే ప్రేమ ఈ రోజు ఇంతమంది ముందుకు తీసుకువచ్చింది. సాక్షి ఎక్సెలెన్స్ అవార్డు సత్కారం మా రోటరీ క్లబ్కు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ అవార్డు ఒక మైల్స్టోన్ లాంటిది. కృష్ణ కుమ్మరి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ ఇస్రోలో సైంటిస్ట్గా చేరి తన కల నెరవేర్చుకున్నాడు యువశాస్త్రవేత్త కృష్ణ కుమ్మరి. స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మద్దిలేటి. కూలిపనే వారి జీవనాధారం. ఒకవైపు పేదరికం...దానికితోడు చిన్నతనంలో సోకిన పోలియో. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన కృష్ణ... తిరుపతిలో డిప్లొమో, హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు. ఇక చాలు అనుకోలేదు... 2018లో ఇస్రోలో సైంటిస్ట్గా చేరారు. చంద్రయాన్ – 3 ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ విభాగంలో పనిచేసి ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి దోహదపడ్డాడు కృష్ణ. చంద్రయాన్ 3 ప్రయోగంతో దేశప్రతిష్టను ఇనుమడింపచేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన కృష్ణని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన నేను, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఇస్రో వరకు వెళ్లాను. కానీ, అవార్డులు నన్ను వరిస్తాయని ఊహించలేదు. ఇంత గొప్ప వేదికపైన సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వర్గీయ సి.ఆర్. రావు తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ పద్మ విభూషణ్ డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావ్... కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్కతాలో ఎం.ఎ. స్టాటిస్టిక్స్ చదివి... కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్లో డైరెక్టర్గానూ, అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్గానూ సేవలందించారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించి 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. అమెరికా అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్ ్స పురస్కారాన్ని అందుకున్నారు. భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్–2023 అవార్డును అందుకున్నారు సీఆర్ రావు. 102 ఏళ్ల వయసులో ఇటీవలే తుదిశ్వాస విడిచారు. గణాంక శాస్త్రంలో ఆయన అందించిన విశేషమైన సేవలను స్మరించుకుంటూ ఎక్సలెన్ ్స ఇన్ ఎన్ ఆర్ఐ అవార్డ్తో గౌరవించింది సాక్షి మీడియా గ్రూప్. డాక్టర్ సిఆర్ రావు మేనల్లుడు డాక్టర్ యు.యుగంధర్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ –ఏఐఎమ్ఎస్సిఎస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్) అవార్డును స్వీకరించారు. -
ఆనందం.. భావోద్వేగం ‘సాక్షి’గా...
ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డు ఎవరికైనా బోలెడంత ఆనందాన్నిస్తుంది. ఎక్సలెన్స్ని అభినందిస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్ పలువురు చిత్రరంగ ప్రతిభావంతులకు ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులు అందించినప్పుడు అవార్డు గ్రహీతల్లో ఆ ఆనందమే కనిపించింది. నవంబర్ 16న ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డుల వేడుక ఆనందం,భావోద్వేగాలతో సంబరంగా జరిగింది. ఆ వేడుక విశేషాలు ఈ విధంగా... కైకాల లక్ష్మీనారాయణ, శ్యామలా దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్, వాడ్రేవు పద్మావతీ దేవి, వై.ఎస్. భారతీ రెడ్డి, స్రవంతి, ఆదిశేషగిరి రావు ► మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎందుకంటే నా తొలి చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలై 55 ఏళ్లయిన సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నాను. కళలు, కళాకారుల పట్ల ‘సాక్షి’ ఎంతో ఔన్నత్యంతో వ్యవహరిస్తుందనడానికి ప్రతీక ఈ పురస్కారాలు. ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నందుకు నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో సంతోషపరిచింది. – ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి (జీవన సాఫల్య పురస్కారం) ► నా భర్త మహేశ్ (మోస్ట్ పాపులర్ యాక్టర్ – ‘సర్కారువారి పాట’) గారి తరఫున ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. భారతిగారికి, ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డు గ్రూప్కి, జ్యూరీ మెంబర్స్కి థ్యాంక్స్. ఈ గుర్తింపు, గౌరవం ఇచ్చిన మా ఫ్యాన్స్కి కృతజ్ఞతలు. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. – నమ్రతా శిరోద్కర్ ► ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డులవేడుకకు నేను హాజరు కావడం ఇదే తొలిసారి. నైన్త్ ఎడిషన్ రన్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు. భారతీ మేడమ్కి, ‘సాక్షి’కి ధన్యవాదాలు. ‘దిల్’ రాజు అన్నగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మోర్ స్పెషల్. – నిర్మాత అభిషేక్ అగర్వాల్ (క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ – ‘కార్తికేయ 2’) ► ఈ అవార్డు గురించి మాట్లాడే ముందు నేను ఓ ఎమోషనల్ ఘటన గురించి చెబుతాను. ‘బెంగాల్ టైగర్’ సినిమా చేసిన తర్వాత నా చేతిలో సినిమాలు లేనప్పుడు, నేను ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు తిరిగి నన్ను ప్రథమ దశకు చేర్చిన నా హీరో, రవితేజగారికి ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డుని నేను ఆయనకు అంకితం చేస్తున్నాను. ఏం చేయాలో తెలియని ఓ దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నప్పుడు, ఇక జీవనం కొనసాగించడం చాలా దుర్లభమేమో అనే స్థితిలో... నేను, నా ఫ్యామిలీ ఈ భూమి నుంచి, జనం నుంచి దూరం కావాలని.. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి బాధాకరమైన ఘటన అది. ఆ తర్వాతి రోజు రవితేజగారు ఫోన్ చేసి, ‘ఎక్కడ ఉన్నావ్’ అన్నారు. ‘ఇంట్లో ఉన్నాను సార్’ అన్నాను. ‘వెళ్లి సినిమా చెయ్’ అన్నారు. ఆ సినిమా పేరు ‘ధమాకా’. నేను, నా కుటుంబం ఈ రోజు సజీవంగా ఉన్నామంటే దానికి కారణం మాస్ మహారాజా రవితేజ సార్. ‘సాక్షి’ టీవీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో పాటలు రాశాను. జగన్మోహన్ రెడ్డిగారికి అంకితం చేశాను. అలా నన్ను ప్రోత్సహించినందుకు, జగన్ సార్కి, ‘సాక్షి’ మీడియాకి రుణపడి ఉన్నాను. – భీమ్స్ (పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ – ‘ధమాకా’) ► ‘‘నాకు వచ్చిన తొలి అవార్డు ఇది. ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. పాట తల్లి కొంగు పట్టుకుని వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాను. నన్ను ఆదరించిన సినీరంగం, అభిమానించిన ప్రేక్షకులు, నాకు అవకాశాలిచ్చిప్రోత్సహించిన దర్శక–నిర్మాతలు, హీరోలు.. సంగీత దర్శకులు... అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ‘డీజే టిల్లు’లో నాకు పాట రాసే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు రామ్ మిరియాల, దర్శకుడు విమల్ కృష్ణ, హీరో సిద్ధు, నిర్మాతలు చినబాబు, వంశీగార్లకు కృతజ్ఞతలు. మరిన్ని మంచి పాటలు రాస్తాను. – కాసర్ల శ్యామ్ (మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ – ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్) ► ఈ రోజు ఇంతమంది పెద్దల ముందు ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్గారంటే నాకు చాలా అభిమానం. అలాంటిది శ్యామలాదేవిగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మరింత సంతోషంగా ఉంది. ‘బింబిసార’లో ఈ పాట (నీతో ఉంటే చాలు... ) పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కీరవాణిగారికి థ్యాంక్స్. ‘సాక్షి’ అవార్డు నాకు చాలా స్ఫూర్తినిస్తుంది.. యాజమాన్యానికి ధన్యవాదాలు. – మోహనా భోగరాజు (మోస్ట్ పాపులర్ సింగర్) ► ఇది నా తొలి అవార్డు. నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని అవార్డులు గెలుచుకున్నా సరే.. ‘డీజే టిల్లు’, ఈ అవార్డు నాకు స్పెషల్. ఈ సినిమాను మేం కరోనా టైమ్లో చిత్రీకరించాం. చాలామంది వారి వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టారు. మానసికంగా కాస్త ఒత్తిడికి లోనైనా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్లు ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టకపోయినట్లయితే ఈ అవార్డుతో నేను ఇప్పుడు ఇక్కడ నిల్చునేవాణ్ణి కాను. వారందరికీ థ్యాంక్స్. ‘ఏంటి మీ అబ్బాయి పదేళ్లుగా ఖాళీగా ఉన్నాడా?’ అనే మా చుట్టుపక్కలవారి ప్రశ్నలను భరిస్తూ, నన్నుప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నేను ఈ కథను చెప్పినప్పుడు, ఈ కథను, నాలోని పిచ్చిని నమ్మి చాన్స్ ఇచ్చిన సిద్ధుకు, నిర్మాతలు చినబాబుగారు, వంశీ అన్న, ముఖ్యంగా త్రివిక్రమ్గారికి ధన్యవాదాలు. – విమల్కృష్ణ (డెబ్యుడెంట్ డైరెక్టర్ – ‘డిజే టిల్లు) ► ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ‘సాక్షి’ టీమ్కు ధన్యవాదాలు. నా కెరీర్లో తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ నాకు స్పెషల్ ఫిల్మ్. రాజు (‘దిల్’ రాజు)గారికి థ్యాంక్స్. నా తొలి సినిమాకు దర్శకుడు హర్ష కొనుగంటి, అనుపమా పరమేశ్వరన్ చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్న చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. – ఆశిష్ రెడ్డి (డెబ్యుడెంట్ లీడ్ యాక్టర్ – ‘రౌడీ బాయ్స్’) ► ‘‘మా టీమ్ అందరికీ ‘మేజర్’ ఎమోషనల్ మూవీ. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో, రిలీజ్ సమయంలో ఎలాంటి ఎమోషన్తో ఉన్నామో.. ఇప్పుడూ అదే ఎమోషన్తో ఉన్నాం. గ్రేట్ సోల్జర్కు మేం చేయగలిగిన ట్రిబ్యూట్గా ఈ సినిమా చేశాం. మహేశ్బాబుగారు, నమ్రత మేడమ్, శరత్, అనురాగ్, సోనీ పిక్చర్స్కు ధన్యవాదాలు. ముఖ్యంగా నా స్నేహితుడు హీరో అడివి శేష్కు. వీరందరూ ‘మేజర్’ సినిమాకు నన్ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు. – శశికిరణ్ తిక్క (క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ – ‘మేజర్’) ► కృష్ణగారు ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా చూసి, నన్ను ఇంటికి పిలిస్తే వెళ్లాను. ‘నీ సినిమా చూశానయ్యా.. బాగా చేశావ్. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావ్’ అన్నారు. ‘మీ అందం ముందు మాది ఎంత సార్.. మీరు సిమ్లా ఆపిల్లా ఉంటారు’ అని నేను అనగానే ఆయన మురిసిపోయారు. అలాంటి కృష్ణగారి తమ్ముడు ఆది శేషగిరిరావుగారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటానని అనుకోలేదు. భారతిగారికి, ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డ్స్కి థ్యాంక్స్. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు నా ఒక్కడిదే కాదు.. నా టీమ్ అందరిదీ. – అలీ (పాపులర్ ఓటీటీ ఫిల్మ్ – (‘అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి’) ► ‘‘ఇటీవలే ధనలక్ష్మీ (మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి) గారితో ఓ గంట మాట్లాడాను. ఏంటి శేష్.. నెలకు ఒకసారే మాట్లాడుతున్నావ్.. రెండు నెలలకు ఒకసారే కలుస్తున్నావ్ అన్నారు. బెంగళూరుకు ఏదో ఒక బహుమతితో వస్తానమ్మా అన్నాను. ఈ ‘సాక్షి’ అవార్డు ఓ చక్కని బహుమతి. కొన్ని రోజుల్లో బెంగళూరు వెళ్తున్నాను. సందీప్ అమ్మగారికి ఈ అవార్డు ఇస్తాను. సందీప్ ఉన్నికృష్ణన్ చేసిన త్యాగానికి ఇదొక చిన్న అభినందనలాంటిది. ఆయన దేశం కోసం చేసిన సేవలకు, త్యాగంతో దేశాన్ని నిలబెట్టిన దానికి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో.. అలా నేను సందీప్గారికి అభిమానిని. ఆయన మంచి మానవతావాది. నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్యూ సార్.. జై హింద్. ‘మేజర్’కి నాకు అవకాశం కల్పించిన మహేశ్ సార్, నమ్రత మేడమ్లకు, ‘మేజర్’ను ్రపారంభించిన నిర్మాత అనురాగ్కు, ఈ జర్నీని నిజం చేసిన దర్శకుడు శశికి థ్యాంక్స్. – అడివి శేష్ (జ్యూరీ స్పెషల్ అవార్డు – ‘మేజర్’) ► నన్ను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ‘సాక్షి’ టీమ్కు ధన్యవాదాలు. విజేతలకు శుభాకాంక్షలు. రెండేళ్లుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. క్యాన్సర్తో పోరాడాను. ఇప్పుడు నార్మల్గా ఉంది. ఈ వేదిక పై ఉండటం సంతోషంగా ఉంది. త్వరలోనే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను. కెమెరాపై నాకున్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇటీవలే నేను ‘యామిని క్యాన్సర్ ఫౌండేషన్’ను ఆరంభించాను. మహిళల ఆరోగ్యం, జెనెటిక్ కాన్సర్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం. – నటి హంసానందిని ► అవార్డ్స్ ఫంక్షన్స్లో గ్రహీతలు అవార్డులు తీసుకున్నప్పుడు ఎమోషనల్ స్పీచ్లు ఇస్తే.. దీనికి ఎందుకు ఇంత చేస్తున్నారు? అనుకునేదాన్ని. అలా అనుకున్నందుకు ఇప్పుడు గిల్ట్గా ఫీలవుతున్నాను. ఇప్పుడు ఇలా ఓ వేదికపై అవార్డు తీసుకుంటుంటే.. అవార్డులు ఎంత ప్రత్యేకమో తెలుస్తోంది. ఈ అవార్డుతో ‘మసూద’ సినిమాను నాకు మరింత స్పెషల్గా చేసిన ‘సాక్షి’కి, భారతి మేడమ్కి ధన్యవాదాలు. ‘గంగోత్రి’ సినిమా (చైల్డ్ ఆర్టిస్ట్) విడుదలై 20 ఏళ్లయింది. ఇప్పుడు బెస్ట్ డెబ్యుడెంట్ లీడ్ యాక్ట్రస్ అవార్డు తీసుకున్నాను. మా దర్శకుడు సాయికిరణ్, తిరువీర్, నిర్మాత రాహుల్గార్లు.. ఇలా టీమ్ అందరికీ «థ్యాంక్స్. ‘మసూద’కు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మాకుప్రోత్సాహాన్నిచ్చింది. – కావ్యా కల్యాణ్రామ్ గడచిన ఏడాది నుంచి ఈ ఏడాది వరకూ తెలుగు సినిమా రంగం ఎందరో ప్రముఖులను కోల్పోయింది. కళాతపస్వి కె. విశ్వనాథ్, ప్రజానటి జమున, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ, సీనియర్ నటులు శరత్బాబు, చంద్రమోహన్, చలపతిరావు, ఎం. బాలయ్య, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న, నటుడు–నిర్మాత రమేశ్బాబు, ప్రముఖ దర్శకుడు వి. సాగర్, రచయిత కందికొండ... ఇలా ఎందరో. వీరి మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించి, నివాళులు అర్పించింది ‘సాక్షి’. దివంగత ప్రముఖుల్లోని కొందరి కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. ఈ ప్రత్యేక నివాళి కార్యక్రమంలో పాల్గొన్న వారి స్పందన... ► ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన రోజు. ‘సాక్షి’ సంస్థకి, భారతిగారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాన్నగారితో పాటు ఇక్కడ వీడియోల్లో చాలా మంది పెద్దవాళ్లను చూపించారు. వారిని లేట్ (చనిపోయిన) అనలేం. వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. మీరు ఇచ్చిన ఈ గౌరవం,ప్రోత్సాహం, ప్రేమ, అభిమానానికి మా కుటుంబంలోని అందరం మళ్లీ మళ్లీ ‘సాక్షి’కి, భారతి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. – కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్ ► ఈ అవార్డు కృష్ణగారిది. ‘సాక్షి’ యాజమాన్యానికి, ముఖ్యంగా భారతిగారికి, వారి టీమ్కి కృతజ్ఞతలు, అభినందనలు. ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డుల్లో ప్రతి ఏడాది ఒక విశిష్టత కనిపిస్తుంటుంది. కేవలం సినిమా వాళ్లకే కాకుండా ఎన్నో రంగాల వారికి అవార్డులు ఇవ్వడం సంతోషం. నేను ఎన్నో అవార్డు వేడుకలు చూశాను కానీ, తొలి నుంచి ‘సాక్షి’లో వైవిధ్యం ఉంటుంది.. ఇందుకు హృదయపూర్వకంగా వారికి అభినందనలు. – సూపర్స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత జి. ఆదిశేషగిరి రావు ► ఈ రోజు ‘సాక్షి’, భారతి గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక నా మనసుకు బాగా దగ్గరైంది. ఈ ఏడాది సినీ రంగానికి చాలా పెద్ద నష్టం జరిగింది. అమ్మ కూడా ఈ ఏడాది దూరం అయిపోయారు. ‘నా కళ్ల ముందే ఇంతమంది వెళ్లిపోతున్నారు.. నా టైమ్ ఎప్పుడొస్తుందో’ అంటుండేవారు అమ్మ. అంతేకాదు.. అమ్మ మరో మాట కూడా అనేవారు. ‘ఒక ఆర్టిస్ట్కి మరణం ఎప్పుడూ ఉండదు.. తరతరాలుగా వాళ్లని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు’ అని. ‘సాక్షి’ అవార్డు అనేది ఆమెకు నిజమైన నివాళి. థ్యాంక్యూ టు సాక్షి. – ప్రజానటి జమున కుమార్తె స్రవంతి ► ఐదేళ్లు వెనక్కి వెళితే.. కృష్ణంరాజుగారు, నేను ఇదే వేదికని అలంకరించాం. ఆయనకి భారతిగారు ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు ఇచ్చారు. అలాగే కృష్ణంరాజుగారి చేతుల మీదుగా రామ్చరణ్కి, మరికొందరికి అవార్డులు ఇప్పించారు భారతిగారు. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేం. ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నటీనటులకు మరణం లేదు.. ఎందుకంటే ఎంతోమంది అభిమానులను, వారసులను, కుటుంబ సభ్యులను సంపాదించుకున్నారు. వీళ్లందరిలోనూ వాళ్లు ఉంటారు. కృష్ణంరాజు, కృష్ణ, వైఎస్ రాజశేఖర రెడ్డిగార్లు... వీళ్లందరికీ మరణం లేదు. అన్ని రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని సత్కరించడం భారతిగారి గొప్పతనం.. సంస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి.. కృష్ణంరాజుగార్ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. కృష్ణంరాజుగారి ఆశయాలు ఎన్నో ఉన్నాయి.. ఆయన వారసుడిగా వాటన్నింటినీ ముందుకు తీసుకెళతాడు మా ప్రభాస్. అలాగే కృష్ణగారి అబ్బాయి మహేశ్ బాబు కూడా ఎంతో మంది చిన్నారుల వైద్యానికి సాయం చేస్తున్నారు. ఇలా వాళ్ల వారసులు మనలోనే ఉన్నారు కాబట్టి వారికి మరణం లేదు. ‘ఒక పత్రికను నడపడం అంటే మామూలు విషయం కాదు.. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటిది భారతిగారు చాలా సింపుల్గా ఉంటూ ఆ సంస్థని ఎంతో ముందుకు తీసుకెళ్లారు.. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి’ అంటుండేవారు కృష్ణంరాజుగారు. ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారతిగారిని కోరుతున్నాను. – రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ► అందరికీ నమస్కారం. నాన్నగారికి ఈ అవార్డు ఇచ్చినందుకు భారతిగారికి, ‘సాక్షి’కి అభినందనలు తెలుపుకుంటున్నాను. – కైకాల సత్యనారాయణ తనయుడు కైకాల లక్ష్మీనారాయణ ► అందర్నీప్రోత్సహిస్తూ ఎన్నో ఏళ్లుగా అవార్డులు ఇస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి, ముఖ్యంగా భారతిగారికి ధన్యవాదాలు. కళాకారులైనా, సంఘ సేవకులైనా.. అవార్డులనేవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందాన్ని ప్రతి ఏడాది అందరికీ పంచుతున్న ‘సాక్షి’కి అభినందనలు. – దర్శకుడు వీవీ వినాయక్ ► విభిన్న రంగాలవారిని ఎంపిక చేసి, అవార్డులు ఇచ్చి,ప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతిగారికి థ్యాంక్స్. ‘కశ్మీరీ ఫైల్స్’తో ఇండియా మొత్తం హల్చల్ చేసిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ మా కంటే ఎంతో ముందున్నాడు. గ్రేట్ ఫిల్మ్ ‘మేజర్’. ఇండియా మొత్తం ‘మేజర్’ సినిమాను అప్రిషియేట్ చేశారు. వీరితో పాటు ఇంకా అవార్డు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. – నిర్మాత ‘దిల్’ రాజు ► సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు. – నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) -
Sakshi Excellence Awards: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం. అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతి భావంతులను గుర్తించి 'సాక్షి'ఎ క్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. 'సాక్షి' వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన 'జ్యూరీ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా 'సాక్షి' ఎక్స లెన్స్ అవార్డుల కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2022కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 15, 2023 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించ అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సం స్థల తరపున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి జ్యూరీ ప్రత్యేక ప్రశంస' కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించ డం, సేవలను కొనియాడటం, సాధనను అభి. సందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని 'సాక్షి' అభిలషిస్తోంది. 'సాక్షి' చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్సైట్కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23256134 నంబర్పై గాని మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com (చదవండి : సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం) కేటగిరీలు ఇలా: ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఫార్మింగ్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– NGO యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– ఎడ్యుకేషన్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– సోషల్ సర్వీస్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – NGO -
‘సాక్షి’మీడియా గ్రూప్కు ధన్యవాదాలు: కే. విశ్వనాథ్
అగ్ర దర్శకుడు, కళా తపస్వీ కే. విశ్వనాథ్ (92) ఇక లేరనే విషయం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన విశ్వానాథ్.. ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతం చేసుకున్నారు. 2015లో ఆయనకు ‘సాక్షి’ మీడియా సంస్థ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినే ‘సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డును ప్రధానం చేసింది. (చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు) సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేసింది. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దర్శకుడు శేఖర్ కమ్ముల కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరో వైష్ణవ్ తేజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరోయిన్ కృతి శెట్టి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరోయిన్ రష్మిక మందన కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
దర్శకుడు సుకుమార్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం
నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. తిండిలేని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... పిన్న వయస్సులోనే ప్రతిభ చూపే వారు కొందరైతే... తమ ప్రతిభ ను సమాజ హితం కోసం, దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు ఇంకొందరు. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు మరికొందరు! ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... గౌరవించి సత్కరిస్తోంది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి సాక్షి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో అక్టోబర్ 21, శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు. మరుప్రోలు జస్వంత్ రెడ్డి : (తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి శ్రీనివాసులురెడ్డి) – స్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) బాపట్లలోని దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ 18 ఏళ్ల వయసులోనే మద్రాస్ రెజిమెంట్లో శిక్షణ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జమ్ముకాశ్మీర్కు వెళ్లాడు. 2021 జులై 8న జమ్మూకాశ్మీర్లోని సుందర్ బని సెక్టార్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టులతో తలపడ్డ జశ్వంత్, ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచాడు. అమ్మా! కంగారు వద్దు... అవే చివరి మాటలు!! మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసినా ‘అమ్మా! నేను బాగున్నాను. మీరు జాగ్రత్త’ అని చెప్పేవాడు. గతేడాది సరిహద్దులో ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో... జూలై 6న ఫోన్ చేసినప్పుడు కూడా ‘ఇక్కడ (జమ్ము) బాగుంది. నా నుంచి ఫోన్ లేకపోయినా మీరేం కంగారు పడకండి. మీరు జాగ్రత్త’ అన్నాడు. అవే చివరి మాటలు. ఎనిమిదవ తేదీ ప్రాణాలు వదిలాడు. డాక్టర్ డి. పరినాయుడు : జట్టు సంస్థ – ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది జట్టు సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు పదివేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడంతోపాటు స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు నాచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ. సేద్యానికి సేవ చేశాను: పదహారేళ్లుగా వ్యవసాయ పద్ధతుల్లో ఆచరణీయమైన ప్రయోగాలు చేశాను. అవార్డులు అందుకున్నాను. నాచురల్ ఫార్మింగ్కి ప్రచారం బాగానే ఉంది. కానీ రైతులు రావాల్సినంత స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇలాంటి గుర్తింపులు, అవార్డులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. సహదేవయ్య–విక్టోరియా : ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ – నవజీవన్ సంస్థ, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం 1996లో ఏర్పడిన ఈ సంస్థ అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తోంది. సాధికారత, స్వయంసమృద్ధి, సహజ వనరుల సంరక్షణ, సమాన అవకాశాలు, రక్షిత మంచినీరు, బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది. ప్రచారం లేకుండా పని చేశాం: ప్రచారం చేసుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి మా సేవలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదం చేస్తాయి. బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి: ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బొల్లంపల్లి ఇంద్రసేన్రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్షాప్లు నిర్వహించారు. యునైటెడ్ నేష¯Œ ్స ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీ¯Œ రెవల్యూష¯Œ నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం. అనిల్ చలమలశెట్టి, భార్య స్వాతి : గ్రీన్ కో గ్రూప్ – ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్రీన్కోగ్రూప్. ఈ కంపెనీ అధినేతలు అనిల్ చలమలశెట్టి, ఆయన భార్య స్వాతి. 2030 నాటికి ఒక గిగా వాట్ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, 2040 నాటికి పర్యావరణ సమతుల్యతను నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఈ సంస్థ కర్నూలులో 15 వేల కోట్ల వ్యయంతో 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ని ఉత్పత్తి చేయడం వీరి ప్రాజెక్టు ప్రత్యేకత. పర్యావరణం కోసం పనిచేస్తాం: ఈ పురస్కారం మా టీమ్లో అందరికీ కలిపి సంయుక్తంగా ఇచ్చిన గౌరవం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కార్య క్రమాలను ఇంకా ఇంకా కొనసాగిస్తాం. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలోని జనగామ గ్రామం. తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి. భవన నిర్మాణ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సుభాష్రెడ్డి ఆరు కోట్ల రూపాయలతో బీబీపేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారు. సీతారాంపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాణ్యతకు నా పనే గీటురాయి: దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాటి నాయకులలా మనం జీవితాలను త్యాగాలు చేయలేకపోయినా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలనేది నా అభిమతం. రోడ్డు, స్కూలు బిల్డింగ్... ఏ పని చేసినా సరే... నాణ్యతకు నేనే గీటురాయి అన్నట్లుగా చేశాను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఈ సర్వీస్ని ఇలాగే కొనసాగిస్తాను. అక్షత్ సరాఫ్ : (రాధా టీఎమ్టీ) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ 1960లో శ్రీ రాధేశ్యామ్ జీ షరాఫ్ టి.ఎమ్.టి. సంస్థను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు రాధా టి.ఎమ్.టి. కంపెనీ డైరెక్టర్ అక్షత్ షరాఫ్.హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఈ సంస్థ శంకరంపేట్, చిన్న శంకరంపేట్ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొక్కలు నాటించడం, స్టీల్ ప్లాంట్లలో కాలుష్య నివారణకు కృషి చేస్తోంది. ఇదే బాధ్యతను కొనసాగిస్తాం: మా వంతు సామాజిక బాధ్యతగా విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్నాం. ఈ అవార్డు స్ఫూర్తితో... మా సేవలను నాణ్యత తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను. పి.జ్ఞానేశ్వర్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తాను పుట్టిపెరిగిన గ్రామంలో పచ్చదనం తగ్గిపోవడం, మంజీరా నదీతీరం కళ తప్పడం చూసి పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తున్నారు. పిల్లలను గ్రీన్ బ్రిగేడ్గా తయారుచేసి వారి చేత మొక్కలు నాటిస్తున్నారు. ఎర్త్ లీడర్లను తయారు చేస్తాను: మంజీర నది ఎండిపోయి నీరు లేక పక్షులు చనిపోయాయి. చెట్లు ఎండిపోయాయి. నా వంతుగా పరిరక్షణ బాధ్యత చేపట్టాలనుకుని, పర్యావరణవేత్తల సహకారంతో పనిచేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మంది ఎర్త్ లీడర్లను తయారు చేయాలనేది నా లక్ష్యం. నిఖత్ జరీన్ : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ బాక్సింగ్ రింగులో పవర్ ఫుల్ పంచ్లతో విజృంభిస్తూ ఒక్కో పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన నిఖత్ జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులో తండ్రి వద్ద బాక్సింగ్లో ఓనమాలు నేర్చుకున్న నిఖత్, ఇస్తాంబుల్లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణపతకాన్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. తల్లిగా గర్వపడుతున్నాను: మా అమ్మాయికి అవార్డు రావడం తల్లిగా నాకు ఎంత సంతోషంగా ఉంది. తను హైదరాబాద్లో లేదు. ఆమె తరఫున నేను అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) బ్యాడ్మింటన్లో అద్భుతాలు సృష్టిస్తు్తన్న ఈ అమలాపురం కుర్రాడు అంతర్జాతీయ పోటీల్లో రాకెట్లా దూసుకుపోతూ పతకాల పంట పండిస్తున్నాడు. చిరాగ్ శెట్టితో కలిసి భారత పురుషుల డబుల్స్ టీమ్లో సత్తా చాటుతున్నాడు. 2022లో జరిగిన థామస్ కప్లో స్వర్ణ పతకాన్ని, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకంతోపాటు ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యపతకాన్నీ గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు. సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథం, తల్లి రంగమణి సాక్షి ప్రోత్సాహాన్ని మరువలేం: మా అబ్బాయికి అర్జున అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడూ అంతే సంతోషిస్తున్నాను.. మా సాత్విక్ క్రీడాప్రస్థానంలో తొలి నుంచి సాక్షి పత్రిక అండగా వెన్నంటే ఉందని చెప్పాలి. మా బాబు ఫైల్ తిరగేస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. షేక్ సాదియా అల్మాస్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ పవర్ లిఫ్టింగ్లో సత్తా చాటుతోంది. పవర్ లిఫ్టింగ్లో నేషనల్ చాంపియన్ అయిన తండ్రిని చూసి ప్రేరణ పొందిన సాదియా పదవ తరగతి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఒక్కో పతకం గెలుచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. మన దేశంలో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మన నేల మీద నాకు వచ్చిన గుర్తింపు, అందుతున్న గౌరవం ఇది. ఎంతో మంది క్రీడాకారులున్నారు. అంతమంది నుంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.∙ డాక్టర్ రామారెడ్డి కర్రి : ఎక్సలెన్స్ ఇన్ హెల్త్కేర్ రాజమండ్రిలో మానస ఆస్పత్రిని స్థాపించి మానసిక వైద్యుడిగా దాదాపు 40 ఏళ్లుగా వైద్యం చేస్తూనే మరోవైపు పలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళాసంస్థల్లో వివిధ పదవులు నిర్వహించారు రామారెడ్డి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అవార్డులు శక్తినిస్తాయి: మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరైన అవగాహన లేని రోజుల్లో నా సర్వీస్ మొదలుపెట్టాను. నలభై రెండేళ్లలో దాదాపుగా ఒకటిన్నర లక్షల మంది తెలుగు వాళ్లకు స్వస్థత చేకూర్చగలిగాను. తెలుగు మీడియా సంస్థ నుంచి గుర్తింపు లభించడం సంతోషం. అవార్డులు మనసు మీద మనిషి మీద చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా బాగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి. సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లి: యంగ్ అచీవర్ ఆఫ్ ఇది ఇయర్ (ఎడ్యుకేషన్) తెనాలికి చెందిన ప్రియ మానస, రాజ్కుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్థ్ శ్రీవాత్సవ్, పసి వయసులోనే కంప్యూటర్స్లో ఆరితేరడంతో మాంటెగ్న్ కంపెనీ ఏడో తరగతిలోనే నెలకు 25 వేల జీతంతో ఐటీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్టుగా పార్ట్టైమ్ జాబ్ చేస్తూనే అమెరికన్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో భూకంపాల రాకను ముందుగానే పసిగట్టే ప్రాజెక్టులో సీనియర్ ప్రొఫెసర్లతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు. ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకుంటాం: డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఈ తరానికి చాలా అవసరం. మనం ఎంత నేర్చుకుంటామనేది... నేర్చుకోవడానికి మనం పెట్టిన శ్రద్ధాసక్తులను, ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఆసక్తి కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి : తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ఒకవైపు పేషంట్లకు చికిత్సలు, మరోవైపు పరిశోధనలతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణకు ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు ఎ.ఐ.జీలో అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇస్తున్నారు. వైద్యుల త్యాగాలకు అంకితం: ఈ గౌరవం నాకు మాత్రమే దక్కుతున్న గుర్తింపు కాదు. మా డాక్టర్లందరికీ అందిన పురస్కారం. కోవిడ్ సమయంలో లక్షలాది పేషెంట్లకు వైద్య సేవలందించడంలోనూ, వ్యాక్సిన్ తయారీకి సహకారంలోనూ డాక్టర్ల భాగస్వామ్యం మరువలేనిది. ఈ అవార్డు... కోవిడ్ విధుల్లో భాగంగా అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలిన డాక్టర్లకు, వారి త్యాగాలకు అంకితం. రవి పులి: తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్కి వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇండియాలోని వారికి సేవలందిస్తున్నారు. వీటి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా.. ఎంట్రప్రెన్యూర్గా మారడానికి గైడె¯Œ ్స, మెంటార్షిప్ ఇవ్వడంతోపాటు కావాల్సిన పెట్టుబడి అందేలా సహకరిస్తున్నారు. కరోనా కాలంలో రవి చేసిన సాయం ఎంతోమంది తెలుగు వారిని సొంతగూటికి చేర్చింది. అంత కష్టం వద్దు: పాతికేళ్ల కిందట నేను యూఎస్కి వెళ్లినప్పుడు వీసా వంటి ఇతర వివరాల కోసం గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేక చాలా కష్టపడ్డాను. అందుకే విదేశాలకు వచ్చే విద్యార్థులకు ఇరవై ఏళ్లుగా సలహాలిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నాను. దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. సాక్షికి కృతజ్ఞతలు. కారింగుల ప్రణయ్: యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) అదిలాబాద్ జిల్లాకు చెందిన కారింగుల ప్రణయ్ సామాజిక స్పృహ కలిగిన తనలాంటి యువకులతో కలిసి స్వాస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం.. వారి చదువులకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. మా గ్రామాలకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం: పోషకాహారలోపంతో బతుకీడ్చే ఆదివాసీ మహిళలు, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనిపించి స్వాస్ను స్థాపించాం. మొదలు పెట్టేనాటికి మా బృందంలో ఉన్నది పదిమందికి లోపే. ఇప్పుడు 700 మంది సేవలందిస్తున్నారు. ఇది మా అందరి సేవలకు అందిన పురస్కారం. సుంకరి చిన్నప్పల నాయుడు, సుజాత : బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) షీమాక్స్ ఎక్స్పర్ టెక్నోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎండీ సుంకరి చిన్నప్పల నాయుడు. పట్టణ యువతతో సమానంగా గ్రామీణ యువతకూ ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 300 మంది గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు. ఈ జ్ఞాపిక ఉత్తేజాన్నిస్తుంది: చిన్న చిన్న సంస్థలకు ఆదర్శంగా మమ్మల్ని చూపించాలనుకోవడమే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు నాలో ఉత్సాహాన్ని పెంచింది. భవిష్యత్తులో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనా సరే ఈ జ్ఞాపికను చూడగానే ఉత్తేజం వస్తుంది. కె. లీలా లక్షా్మరెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ గ్రీన్ రివల్యూషన్) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థ కె.లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన 2010లో ఏర్పాటైంది. నాటినుంచి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో కలిపి 12,485 గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. ఇప్పటివరకు 3,500 పాఠశాలలు, సుమారు 9 లక్షల మంది విద్యార్థులు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సేవకు పట్టం కడుతోంది: సమాజంలో సేవ చేసే వాళ్లను గుర్తించి, గౌరవించడం చాలా కష్టమైన విషయం. క్లిష్టమైనది కూడా. అలాంటిది ‘సేవకు పట్టం’ కట్టడాన్ని బాధ్యతగా తలకెత్తుకుంది. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా çకొనసాగిస్తున్న సాక్షికి అభినందనలు. చిన్నాలమ్మ: స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ఫార్మింగ్ కొండ మీదినుంచి పారుతున్న నీటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించిన 75 ఏళ్ల ఈ బామ్మ పేరు చిన్నాలమ్మ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిమిడిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాదాపు 500 కుటుంబాల కోసం తన పెన్షన్ డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువపెట్టి తెచ్చిన సొమ్ముకు గ్రామస్థుల భాగస్వామ్యంతో కాలువకు ఇరువైపులా కాంక్రీట్తో గట్లు నిర్మించుకునేలా చేసింది చిన్నాలమ్మ. ఈ చెక్డ్యామ్ వల్ల ఆ పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. నీటిని నిలుపుకున్నాం: ఊరందరికీ వ్యవసాయమే ఆధారం. పంట పండేనాటికి తుపానులొచ్చి వరదలో పంట కొట్టుకుపోతూ ఉంటే ఎన్నాళ్లని చూస్తూ ఉంటాం; నీళ్లు నిలుపుకునే వీల్లేకపోవడంతో పొలాలు బీడు పెట్టాల్సి వచ్చేది. దాంతో మా సొంత డబ్బుతో చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. మరో ఐదారు ఊళ్ల వాళ్ల పంటలూ నిలిచేటట్లు డ్యామ్లు కట్టాం. అందుకు గుర్తుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. కూరెళ్ళ విఠలాచార్య : జ్యూరీ ప్రత్యేక గుర్తింపు ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం. పుస్తకాలు కొనలేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఉద్యోగ విరమణ తరువాత 2014లో వెల్లంకి గ్రామంలో ప్రారంభించిన ఈ లైబ్రరీలో రెండు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య చేసిన కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఆశ్చర్యం కలిగించింది: నేను స్థాపించిన ఈ గ్రంథాలయానికి రీసెర్చ్ స్కాలర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వస్తుంటారు. ఎక్కడో మారుమూల పల్లెలో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో ఏమో గానీ ప్రధాని నా గురించి మాట్లాడటం, సాక్షి పత్రిక వాళ్లు అవార్డుతో సత్కరించడానికి ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎనభై ఐదేళ్ల వయసులో ఇంతకంటే పెద్ద సంతోషాలు ఇంకేం కావాలి? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డాక్టర్. నాగేశ్వర్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
లీలా లక్ష్మా రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
దర్శకుడు సుధీర్ వర్మ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పవర్ లిఫ్టింగ్ సదియా అల్మాస్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సాత్విక్ సాయిరాజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
తెలుగు ఎన్నారై రవి పులి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
SWAS NGO వ్యవస్థాపకుడు కరింగుల ప్రణయ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. పరి నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
గ్రీన్కో గ్రూప్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
నవజీవన్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సుంకరి చిన్నప్పల నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాక్టర్. కర్రి రామారెడ్డి కి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పాలడుగు జ్ఞానేశ్వర్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
" సాక్షి మీడియా గ్రూప్ ప్రస్థానం " AV వీడియో
-
మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నేషనల్ క్రష్... సోషల్ మీడియాలో వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజే వేరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా నటిగా గుర్తింపు దక్కించుకున్న భామ టాలీవుడ్ సినిమాలో తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పుష్ప చిత్రంలో ఆమె 'రారా సామి.. బంగారు సామి' అంటూ సాగే పాటతో యూత్ను ఊర్రూతలుగించింది. తాజాగా రష్మిక మరోసారి శ్రీవల్లి అవతారమెత్తింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్లో మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టింది. మరో నటి కృతి శెట్టితో కలిసి వేదికపై రారా సామి అంటూ పుష్ప సినిమాను గుర్తుకు తెచ్చింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టిన్గా ఉండే ఈ భామ ఇటీవలే మాల్దీవుల్లో వ్యాకేషన్కు వెళ్లి వచ్చింది. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఇన్స్టాగ్రామ్లో 34 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. ఆమె ఫోటోలు, రీల్స్ను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా తన అభిమానులతో టచ్లో ఉంటుంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప -2'లో నటిస్తోంది. ఆ తర్వాత దళపతి విజయ్తో 'వారిసు', సిద్ధార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను', రణ్బీర్ కపూర్తో 'యానిమల్' చిత్రాల్లో కూడా కనిపించనుంది. రష్మిక ఇటీవలే అమితాబ్ బచ్చన్ సరసన 'గుడ్బై'తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. Rashmika Mandanna and Krithi Shetty Dance For Saami Saami Song | Watch Sakshi Excellence Awards 2021 on 29 October 2022 at 5PM on Sakshi TV#SakshiExcellenceAwards2021 #SakshiAwards #RashmikaMandanna #KrithiShetty #SaamiSaamiSong #PushpaMovie #AlluArjun @alluarjun @iamRashmika pic.twitter.com/cRFIxXVS09 — Sakshi (@sakshinews) October 29, 2022 -
స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది
సాక్షి, హైదరాబాద్: విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ వీసీ ఎస్వీ కోటారెడ్డి పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్పర్సన్గా రెయిన్బో ఆస్పత్రి డైరెక్టర్ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కె అగర్వాల్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ సభ్యులుగా వ్యవహరించారు. -
సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ 2021 సినిమా విభాగం
-
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2021-సినిమా విభాగం.. నామినేషన్లు ఇలా!
ప్రతిభ, నైపుణ్యం, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీసి గౌరవించి సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. 2021 సంవత్సరానికి సంబంధించి సినిమా విభాగంలో వివిధ కేటగిరీలకు అవార్డులను మీరే ఎంచుకోండి. మీ ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అండ్ బెస్ట్ మూవీస్ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మేమిచ్చిన కేటగిరీలలో ఉన్న ఆప్షన్స్ను పరిశీలించి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసి వాట్సాప్ ద్వారా జవాబును పంపించండి. మీరిచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతలను ప్రకటించి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుతో సత్కరిస్తాం. ఉదా: మీ ఫేవరెట్ యాక్టర్ను సెలెక్ట్ చేసి.. Best Actor- హీరో పేరు టైప్ చేసి వాట్సాప్ చేయండి. మీ సమాధానాలు పంపాల్సిన మా వాట్సాప్ నెంబర్: 73311 55521 సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్-2021 (For films released in the year 2021) 1. MOST POPULAR ACTOR ⇒ అల్లు అర్జున్- పుష్ప ⇒ బాలకృష్ణ- అఖండ ⇒ రవితేజ- క్రాక్ ⇒ నాని- శ్యామ్ సింగరాయ్ 2. MOST POPULAR MOVIE ⇒ పుష్ప ⇒ అఖండ ⇒ జాతిరత్నాలు ⇒ శ్యామ్ సింగరాయ్ 3. MOST POPULAR DIRECTOR ⇒ సుకుమార్- పుష్ప ⇒ గోపీచంద్ మలినేని- క్రాక్ ⇒ బొమ్మరిల్లు భాస్కర్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ⇒ కె.వి. అనుదీప్- జాతిరత్నాలు 4. DEBUTANT LEAD ACTOR ⇒ వైష్ణవ్ తేజ్- ఉప్పెన ⇒ ప్రదీప్ మాచిరాజు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ⇒ తేజ సజ్జ- జాంబీ రెడ్డి 5. DEBUTANT LEAD ACTRESS ⇒ జాతిరత్నాలు- ఫరియా అబ్దుల్లా ⇒ పెళ్లిసందడి- శ్రీలీల ⇒ ఉప్పెన- కృతీశెట్టి ⇒ రొమాంటిక్- కేతిక శర్మ 6. DEBUTANT DIRECTOR ⇒ బుచ్చిబాబు సన- ఉప్పెన ⇒ విజయ్ కనకమేడల- నాంది ⇒ అశ్విన్ గంగరాజు- ఆకాశవాణి ⇒ సుజనా రావు- గమనం 7. CRITICALLY ACCLAIMED MOVIE ⇒ లవ్ స్టోరీ- శేఖర్ కమ్ముల ⇒ నాంది- విజయ్ కనకమేడల ⇒ రిపబ్లిక్- దేవ కట్టా 8. CRITICALLY ACCLAIMED DIRECTOR ⇒ శేఖర్ కమ్ముల- లవ్ స్టోరీ ⇒ రాహుల్ సాంకృత్యాయన్- శ్యామ్ సింగరాయ్ ⇒ క్రిష్- కొండ పొలం 9. MOST POPULAR MUSIC DIRECTOR ⇒ దేవిశ్రీ ప్రసాద్- (పుష్ప, ఉప్పెన) ⇒ తమన్- (అఖండ, క్రాక్, వకీల్ సాబ్) ⇒ రథన్- (జాతిరత్నాలు) ⇒ మిక్కీ జె. మేయర్- (శ్యామ్ సింగరాయ్) 10. MOST POPULAR ACTRESS ⇒ సాయి పల్లవి- లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ⇒ రష్మిక- పుష్ప ⇒ శ్రుతీ హాసన్- క్రాక్ ⇒ తమన్నా- సీటీమార్ 11. MOST POPULAR OTT FILM ⇒ సినిమా బండి ⇒ అద్భుతం ⇒ ఆకాశవాణి ⇒ నిన్నిలా నిన్నిలా 12. MOST POPULAR SINGER ( MALE ) ⇒ సిద్ శ్రీరామ్ (శ్రీవల్లి... - పుష్ప) (ఆనందం మదికే... - ఇష్క్) (లెహరాయి... - మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్) ⇒ జావేద్ అలీ (నీ కన్ను నీలి సముద్రం... ఉప్పెన) ⇒ రామ్ మిర్యాల (చిట్టీ... జాతిరత్నాలు) (పుట్టెనే ప్రేమ... గల్లీ రౌడీ) ⇒ శివం (దాక్కో దాక్కో మేక... పుష్ప...ది రైజ్) 13. MOST POPULAR SINGER ( FEMALE ) ⇒ మంగ్లీ (సారంగ దరియా... లవ్ స్టోరీ) (ఊరంతా... రంగ్ దే ) ⇒ ఇంద్రావతీ చౌహాన్ (ఊ అంటావా... పుష్ప... ది రైజ్) ⇒ మోహనా భోగరాజు (మగువా మగువా... వకీల్ సాబ్) (అమ్మ సాంగ్... అఖండ) (నీటి నీటి సుక్కా... టక్ జగదీశ్) ⇒ మౌనికా యాదవ్ (సామి సామి- పుష్ప... ది రైజ్) 14. MOST POPULAR LYRICIST ⇒ చంద్రబోస్ (పుష్ప... ది రైజ్ -సింగిల్ కార్డ్) (పెళ్లి సందడి -సింగిల్ కార్డ్) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా (నీలి నీలి ఆకాశం..) (ఈశ్వరా... ఉప్పెన) ⇒ సుద్దాల అశోక్ తేజ (సారంగ దరియా... లవ్ స్టోరీ) ⇒ రామజోగయ్య శాస్త్రి ( మగువా మగువా... వకీల్ సాబ్)- (చిట్టి... జాతిరత్నాలు) ⇒ శ్రీమణి (లెహరాయి... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్) ⇒ మిట్టపల్లి సురేందర్ (నీ చిత్రం చూసి... లవ్ స్టోరీ) ⇒ పెంచలదాస్ (భలేగుంది బాల... - శ్రీకారం) -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రోమో
-
‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు’లకు ఎంట్రీల ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం’ అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’ వెలికితీసి గౌరవిస్తోంది. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డుల’ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2021కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డులఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు జూలై 10, 2022 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. ‘సాక్షి’ చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్సైట్కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–23256134 నంబర్పై గానీ, మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com కేటగిరీలు ఇలా.. ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఫార్మింగ్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– ఎన్జీఓ యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– ఎడ్యుకేషన్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– సోషల్ సర్వీస్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఎన్జీఓ -
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
-
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
-
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
-
ఈ అవార్డు ఆయనకే అంకితం: స్వేరోస్
-
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి
-
Prof B Koteswara Rao Naik: ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా..
-
సాక్షి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది: సుబ్బు పరమేశ్వరన్
-
Mountaineer Amgoth Tukaram: మట్టిలో మాణిక్యాలకు వెలుగు ‘సాక్షి’
-
Sakshi Excellence Awards అవార్డు మరింత స్ఫూర్తినిస్తుంది: అరుణ్ డేనియల్ ఎలమటి
-
Sakshi Excellence Awards: మరింత మందికి సేవ చేసే అవకాశం
-
పేదరికాన్ని నిర్మూలించడంలో ‘నాంది ఫౌండేషన్’ సేవలు భేష్!
-
ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయి
-
జీవితంలో ఇదో గొప్ప గౌరవం
-
నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం
-
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి
విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. -
‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా డాక్టర్ చావా సత్యనారాయణ
వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. -
సాక్షి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది: సుబ్బు పరమేశ్వరన్
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ ’ అవార్డును లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ స్థాపకుడు సుబ్బు పరమేశ్వరన్ అందుకున్నారు. విద్యార్థి దశలోనే పిల్లలకి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అందించేందుకు నడుం బిగించింది లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో అనుసంధానమై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సామాజిక, మనోవైజ్ఞానిక బోధనల విధానాలపై ఉపాధ్యాయులకు కూడా ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. 2016లో హైదరాబాద్లో ఆవిర్భవించిన ఈ సంస్థ ఇప్పటి వరకు దేశంలోని 200 పాఠశాలలకు చెందిన 13 వందల మంది ఉపాధ్యాయులు, 42,500 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. అందరూ విస్మరించిన ఒక మౌలికమైన సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడం ద్వారా విద్యార్థుల బహువిధ నిపుణతల కోసం లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. గర్వించే క్షణం ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. సాక్షికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు, ప్రైవేటు లో బడ్జెట్ విద్యార్థుల కోసం చేస్తున్న కృషి మరింత మందికి చేరాలని కోరుకుంటున్నాం. -
‘సిరివెన్నెల’ బరువు మోయటం అంత సులువు కాదు: త్రివిక్రమ్
కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్బాబు, అల్లు అర్జున్తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్ బిగినింగ్ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్ రాసిన మారుతి సార్కి థ్యాంక్స్. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేశ్బాబులకు థ్యాంక్స్. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్ నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్. – రాశీ ఖన్నా, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే) ‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్ టీమ్కి కూడా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్కి చెందుతుంది. మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – గౌతమ్ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ (జెర్సీ) యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ. – మణిశర్మ (మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు). ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది. – త్రివిక్రమ్ ‘సిరివెన్నెల’గారి గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్ బుర్రా ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్కి థ్యాంక్స్. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్ ఆఫ్ రామ్...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). -
సేవకు వందనం: ‘యంగిస్తాన్ ఫౌండేషన్’కు సాక్షి పురస్కారం
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్–సోషల్ సర్వీస్’ అవార్డును యంగిస్తాన్ ఫౌండేషన్ స్థాపకుడు అరుణ్ డేనియల్ ఎలమటి అందుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో 2014లో హైదరాబాద్లో ‘యంగిస్తాన్ ఫౌండేషన్’ ను స్థాపించారు అరుణ్. కోవిడ్ వల్ల నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తిండి లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 20 లక్షల మందికి ఆహారం అందించింది ఈ సంస్థ. నల్లమల అటవీప్రాంతంలో అష్టకష్టాలు పడుతున్న గిరిజన కుటుంబాలకు నెలవారీ వంటసామాను సరఫరా చేశారు. మూగజీవాలకు కూడా ఆహారాన్ని అందించి వాటిపట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా మానసిక ఆరోగ్యం, గృహహింస, లింగవివక్ష, బ్రెస్ట్ క్యాన్సర్ తదితర విషయాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. సేవకు స్ఫూర్తి సేవా రంగంలో ముందుకు వెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాకు చాలా థ్యాంక్స్. ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కోవడానికి, మరింత మందికి సేవలు అందించడానికి ఈ పురస్కారం స్ఫూర్తిని ఇస్తుంది. – అరుణ్ డేనియల్ కుమార్, యంగిస్తాన్ -
ఈ అవార్డు ఆయనకే అంకితం: స్వేరోస్
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును తెలంగాణ స్వేరోస్ సంస్థ తరపున శాయన్న అందుకున్నారు. చదువు అంటే కేవలం పుస్తకాలను బట్టీ పట్టడం కాదు. నాలెడ్జ్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, మోరల్ సైన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ వంటి పాఠ్యేతర అంశాల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉండాలి. అందుకోసమే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఆ స్ఫూర్తితో 1984లో ‘స్వేరోస్’ పేరుతో విద్యార్థులే నిజామాబాద్ లో ఒక బృందంగా ఏర్పడి విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్, విలేజ్ లెర్నింగ్ సెంటర్స్, వొకేషనల్ ట్రయినింగ్ సెంటర్స్, స్వేరోస్ సర్కిల్ వంటి వాటి ఏర్పాటుతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది స్వేరోస్. ఆయనకే అంకితం పేదల బతుకుల బాగు కోసం కృషి చేస్తున్న మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి ఈ అవార్డును మాకు అందించారు. దీనికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థలో నన్ను భాగస్వామి చేసినందుకుగాను ఈ అవార్డును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గారికి అంకితం చేస్తున్నా. – శాయన్న,స్వేరోస్ ఇంటర్నేషనల్ -
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
సాక్షి మీడియా గ్రూప్ అందించిన ‘సాక్షి ఎక్స్లెన్స్’ పురస్కారాల్లో భాగంగా మోస్ట్ పాపులర్ డైరెక్టర్(ఎఫ్ 2) అవార్డును అనిల్ రావిపూడి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎఫ్ 2’ నా కెరీర్కు ఒక గేమ్ చేంజర్లా ఫీల్ అవుతాను. ఈ సినిమా నాకు సర్ప్రైజులు ఇస్తూనే ఉంది. ఇది కూడా (‘సాక్షి’ అవార్డు) ఓ సర్ప్రైజ్. ఈ ప్యాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలుపెట్టి, చక్కగా పని చేసుకుంటున్నాం. ఇలాంటి టైమ్లో ‘సాక్షి’ యాజమాన్యం అవార్డ్స్ ఇవ్వటం అనేది మా అందరికీ ఒక బూస్టింగ్లా అనిపించింది. నాకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో నాకు జంధ్యాలగారు, ఈవీవీగారంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్లో ఉన్నప్పుడే త్రివిక్రమ్గారి సినిమాలు చూసి, ఆయన రాసే స్టైల్, డైలాగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లం. మా జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ వాళ్లు తీసిన సినిమాలు మా మైండ్ మీద ఎంతో కొంత ప్రభావం చూపించే ఉంటాయి. ‘థ్యాంక్యూ సో మచ్ సార్.. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
Sakshi Excellence Awards: ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్’ అవార్డును నాంది ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ కె సతీష్ కుమార్ అందుకున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి నిస్వార్థంగా ఆవిర్భవించినదే.. ‘నాంది’ ఫౌండేషన్. ఎ.పి., తెలంగాణతో సహా దేశంలోని 17 రాష్ట్రాలలో ఇంతవరకు 70 లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ‘నాంది’ 1998లో హైదరాబాద్లో ఆవిర్భవించింది. పేదరికాన్ని నిర్మూలించే ఒక శక్తిగా అవతరించింది. ఆదివాసీ వ్యవసాయదారులకు చేయూతనిచ్చి, వారితో చేతులు కలిపి లక్ష మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు తెచ్చింది. ‘అరకు కాఫీ’తో దేశానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది. అల్పాదాయ కుటుంబాల్లోని 4 లక్షల మంది బాలికలకు విద్యను అందించింది. బాధ్యత పెంచింది సాక్షి మీడియా గ్రూప్కు, న్యాయ నిర్ణేతల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది. పాఠశాల విద్యార్ధుల కోసం మేం చేస్తున్న కృషి ఫలాలు మరింత మందికి అందాలని కోరుకుంటున్నాం. – కె. సతీష్ కుమార్, ఆరకు ఫైనాన్స్ మేనేజర్ -
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
Sakshi Excellence Awards: సాక్షి మీడియా ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్కు బెస్ట్ డెబ్యూ యాక్టర్, నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ ‘దొరసాని’ మూవీతోనే టాలీవుడ్కి పరిచయం కావడం విశేషం. అవార్డుల గురించి వారి మాటల్లోనే.. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్: ఆనంద్ దేవరకొండ ‘సాక్షి’ మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. ‘దొరసాని’ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఈ ప్యాండమిక్లో వచ్చిన సినిమాకి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రెండేళ్లలో నాది ఒక సినిమా థియేటర్లో (దొరసాని), ఇంకోటి (మిడిల్ క్లాస్ మెలోడీస్) ఓటీటీలో విడుదలయ్యాయి. ‘దొరసాని’ టీమ్ మధుర శ్రీధర్ సార్, సురేష్ బాబుగారు, కో స్టార్ శివాత్మిక అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు అవకాశం ఇచ్చినందకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టీమ్’ అన్నే రవి సార్, డైరెక్టర్ వినోద్, ఆనంద్ ప్రసాద్గారు, ఆదిత్యలకు స్పెషల్ థ్యాంక్స్. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ చేస్తున్నాను. మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది: శివాత్మిక నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన ‘సాక్షి’కి నా కృతజ్ఞతలు. ‘దొరసాని’ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మధుర శ్రీధర్ గారికి, ఎస్. రంగినేనిగారికి, సురేష్బాబుగారికి, కేవీఆర్ మహేందర్గారికి, ధీరజ్గారికి, నా కో యాక్టర్ ఆనంద్కి కూడా ధన్యవాదాలు. నా మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘అమ్మా నాన్నా.. అక్కా’ (జీవిత–రాజశేఖర్–శివాని) మీ దగ్గర్నుంచే యాక్టింగ్ నేర్చుకున్నాను. -
స్పర్శ్ హాస్పీస్కు సాక్షి అవార్డు.. ‘గొప్ప గుర్తింపు’
Sakshi Excellence Awards: సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ హెల్త్కేర్’ అవార్డును స్పర్శ్ హాస్పీస్ తరఫున సీఈఓ డా.రామ్ మోహన్రావు అందుకున్నారు. స్పర్శ్ హాస్పీస్ ‘ఎక్స్లెన్స్ ఇన్ హెల్త్కేర్’ మరణాన్ని ఎలాగూ తప్పించలేం కానీ మరణ యాతనను తగ్గించవచ్చనే ఆలోచనతో ‘రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 2011లో హైదరాబాద్లో ఏర్పాటైంది ‘స్పర్శ్ హాస్పీస్’ సంస్థ. అవసాన దశలో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని అందిస్తోంది. వివిధ కారణాల వలన ఈ సెంటర్కి రాలేని వారి కోసం స్పర్శ్ టీమ్ సభ్యులు వారి ఇళ్లకే వెళ్లి సపర్యలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 9 ఏళ్లలో 3300 మంది రోగులకు సేవలందించింది స్పర్శ్ హాస్పీస్. ఈ గుర్తింపుతో మరింత మందికి సేవలు సమాజానికి చేస్తున్న మంచి సేవకు గొప్ప గుర్తింపు. పదేళ్లుగా జీవితపు ఆఖరి దశలో ఉన్న 4వేల మంది రోగులకు అండగా నిలిచి, వారి అంతిమదశలో కష్టాలను నివారించాం. సాక్షి లాంటి సంస్థల గుర్తింపు, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరింత మందికి సేవ చేయగలుగుతాం. – డా.రామ్ మోహన్రావు, సిఇఓ, స్పర్శ్ హాస్పీస్ -
స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు.. ఫొటోలు
-
Prof B Koteswara Rao Naik: ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా..
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్ అందుకున్నారు. నల్లమల పర్వత ప్రాంతంలోని ఓ కుగ్రామంలో మొలకెత్తిన జ్ఞానవృక్షం ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్. ప్రొఫెసర్ నాయక్ ఇప్పటివరకు 70 గొప్ప పరిశోధనా పత్రాలను వివిధ విద్యాలయాలకు సమర్పించారు. ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ లో ఆయన ఆరితేరినవారు. వినూత్నత, సాంకేతిక నిర్వహణలో నిపుణులు. ‘టెక్నో ఆంట్రప్రెన్యూర్షిప్’లో పరిపూర్ణత గలవారు. ఆయన సమర్పించిన సిద్ధాంత పత్రాలు యు.ఎస్.ఎ. జపాన్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, అబు–దాబి, థాయ్లాండ్ల విశ్వవిద్యాలయాలకు కరదీపికలయ్యాయి. మాటల్లో వర్ణించలేను తల్లిదండ్రుల సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం వారి సంతోషాన్ని చూడడం జీవితకాలపు సంతోషం అందించింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఇంతమందిని గుర్తించి, సన్మానించడం సాధారణ విషయం కాదు. సాక్షి గ్రూప్కి, జ్యూరీకి ధన్యవాదాలు. – ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావు నాయక్ -
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
అన్నదాతలు, సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, సాహసమే శ్వాసగా తీసుకునే పరాక్రమవంతులు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలు... మరెందరో స్ఫూర్తి ప్రదాతలకు సాక్షి మీడియా గ్రూప్ సలాం చేస్తోంది. వారి ప్రతిభకు గుర్తింపుగా ఈనెల 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డులను అందజేసింది. అందులో భాగంగా 2019గాను మహేశ్బాబుకు మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘థ్యాంక్యూ భారతీగారు.. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహర్షి’ చిత్రం మా అందరికీ చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది.. ఇలాంటి ఓ అవార్డు ఫంక్షన్ చూసి. మా నిర్మాతలు అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్.. ‘మహర్షి’కి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. 2020 అనే ఏడాదిని మేమందరం మిస్ అయిపోయాం.. మీరు అవార్డు ఇచ్చి మళ్లీ ఫంక్షన్స్ చేసుకునేలా చేశారు.. మా డైరెక్టర్ వంశీకి థ్యాంక్స్. ‘మహర్షి’ లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు మహర్షి’ విడుదలై రెండున్నరేళ్లు అయింది.. ఈ అవార్డు మేం చేసిన పనికి గుర్తింపు మాత్రమే కాదు.. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు.. మళ్లీ మంచి రోజులు వస్తాయని. ఇది నా ఒక్కడి అవార్డే కాదు.. మొత్తం మా టీమ్ది. నేను చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజుగారు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు. రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు కూడా థ్యాంక్స్. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. మన సంస్కృతి. మళ్లీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడే రోజుల కోసం వేచి చూస్తున్నా. ‘మహర్షి’ ప్రొఫెషనల్గా నాకు ఎంత ఇచ్చిందో తెలియదు కానీ వ్యక్తిగతంగా మహేశ్బాబుని ఇచ్చింది. నాకు జీవితాంతం రుణపడి ఉంటారని మహేశ్ అన్నారు.. ఆ మాట నాది. నేను ‘మహర్షి’ కథ చెప్పిన రోజు ఆయన చెప్పారు.. ‘ఈ సినిమాకి చాలా అవార్డులు అందుకుంటారని.. ఆ మాటలన్నీ నిజమయ్యాయి.. నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ సార్’. – వంశీ పైడిపల్లి, మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ (మహర్షి) మహేశ్ వెన్నెముకగా నిలిచారు ఈ అవార్డుకి మా ‘మహర్షి’ సినిమాని ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి థ్యాంక్స్. నాకెప్పుడూ ఓ ఎగై్జట్మెంట్ ఉంటుంది. మంచి సినిమా తీస్తే డబ్బులే కాదు.. గొప్ప గౌరవం తీసుకొస్తుందని నమ్ముతాను. ‘మహర్షి’ కథను వంశీ చెప్పినప్పుడు అదే నమ్మాను.. దానికి మహేశ్గారు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా ప్రేక్షకులకే కాదు అవార్డ్స్, రివార్డ్స్ వరకూ వెళుతున్నందుకు థ్యాంక్స్. వంశీ పైడిపల్లి చెప్పినట్లు మాది పెద్ద ప్రయాణం. తన ఐదు సినిమాల్లో నాలుగు సక్సెస్ఫుల్గా చేశాం.. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మహేశ్గారితో కూడా మా బ్యానర్లో హ్యాట్రిక్ సాధించాం. – నిర్మాత ‘దిల్’ రాజు, మోస్ట్ పాపులర్ మూవీ (మహర్షి) -
Aligireddy Praveen Reddy: రైతు బిడ్డకు సాక్షి పురస్కారం..
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఫామింగ్’ అవార్డును ములుకనూరు సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి అందుకున్నారు. ప్రవీణ్రెడ్డి రైతు బాంధవుడు. అరవై ఏళ్ల ‘యువ’ కర్షకుడు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామ రైతుబిడ్డ అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి. వ్యవసాయంలో డిగ్రీ చదివారు. మేనేజ్మెంట్లో పీజీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రైతు సంక్షేమ సంస్థలకు ప్రవీణ్రెడ్డి ప్రెసిడెంటుగా, వైస్ ప్రెసిడెంటుగా ఉన్నారు. ఆసియాలోని ఉత్తమ సహకార సంఘాలలో ములుకనూరు సొసైటీ ఒకటి. ఆ సొసైటీకి 1987 నుంచీ ప్రవీణ్రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. సొసైటీ తరఫున 18 గ్రామాల్లోని 7,600 మంది రైతులకు సమగ్ర సేవలు అందిస్తున్నారు. ఆ సొసైటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు ప్రవీణ్ రెడ్డి. రైతు సాయానికి భరోసా గత 62 ఏళ్ళ నుంచి రైతులకు అండదండగా ఉన్నాం. మా ప్రాంతంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా సంభవించలేదు. ఈ కృషిని సాక్షి గుర్తించడం ఎంతో సంతోషం సంతృప్తి ఇచ్చింది. ఈ స్ఫూర్తితో ఆర్ధికంగా బలోపేతం అయేందుకు గ్రామీణ ప్రాంత రైతులకి మరింతగా సహకారం అందిస్తాం. – అలిగెరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ప్రెసిడెంట్, ముల్కనూర్ కో ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ -
నాన్నకి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డుల్లో భాగంగా సాక్షి మీడియా గ్రూప్, దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి లెజెండరీ లైఫ్టైమ్ అవార్డు 2020 ఇచ్చి సత్కరించింది. దీని గురించి ఆయన తనయుడు గాయకుడు ఎస్పీ చరణ్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటాల్లోనే.. ‘సాక్షి యాజమాన్యం నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కి లెజెండరీ లైఫ్టైమ్ అవార్డు ఇచ్చారు. ఇందుకు పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాం. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మా మనసంతా అక్కడే ఉంది. మా తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి మా కుటుంబసభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు వేడుకుంటున్నాన’ని తెలిపాడు. -
నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం: అమర జవాను సతీమణి
Sakshi Excellence Awards: దేశ సేవకు అంకితమై.. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర జవాను బాబూరావుకు ‘సాక్షి’ నివాళి అర్పించింది. వీర సైనికుడి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు(‘మరణానంతర’ పురస్కారం)’ను ప్రకటించింది. హైదరాబాద్లో సెప్టెంబరు 17న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న అమర జవాను సతీమణి ప్రియ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వీర జవాను బాబూరావు ‘మరణానంతర’ పురస్కారం కుటుంబాలకు దూరంగా అనుక్షణం ప్రమాదపుటంచుల్లో విధులు నిర్వర్తిస్తూ భరతమాత రక్షణకు తమ జీవితాలను అంకితం చేస్తారు జవాన్లు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన బాబూరావు కూడా పాతికేళ్ల ప్రాయంలోనే అస్సాం రైఫిల్స్ లో చేరారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొన్నారు బాబూరావు. అక్కడ టెర్రరిస్టులకు, జవాన్లకు మధ్య జరిగిన భీకర పోరులో తీవ్రగాయాలు పాలై అమరుడయ్యారు. అంతకు ఎనిమిది నెలల ముందే బాబూరావుకు వివాహం అయింది. దేశం కోసం.. పురస్కారం సైనికునిగా దేశానికి అందించిన సేవలకు, త్యాగానికి గాను నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. –ప్రియ, అమర జవాన్ బాబూరావు సతీమణి చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు -
ఈ అవార్డుతో ఇంకా చేయాలనే ప్రోత్సాహం లభించింది: సింగీతం
Sakshi Excellence Awards: కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఇందులో భాగంగా 2019గాను జీవితసాఫల్య పురస్కారంతో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని సత్కరించింది. అయితే వివిధ కారణాలతో ఆయన వేడుకకి రాలేకపోయారు. ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అవార్డు అందుకున్నారు. అనంతరం అవార్డు గురించి సింగీతం సాక్షితో మాట్లాడాడు. ఆయన మాటాల్లోనే.. ‘ముందుగా జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించిన ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు. సినిమా పరిశ్రమకు మా కాంట్రిబ్యూషన్ ఉంది. అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్గా మిగతా రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ‘సాక్షి’ వారు నాకు ప్రదానం చేసిన ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగినట్లుగా భావిస్తున్నాను. ఇంకా కాంట్రిబ్యూషన్ చేయాలన్నది ఇప్పుడు నా మెయిన్ ప్లాన్. నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ‘ఇంకా చెయ్’ అనేవారు నాకు కావాలి. ఇప్పుడు ఈ అవార్డుతో నాకింకా చేయాలనే ప్రోత్సాహం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలవడం ఒక ఆనందం. కానీ ఈ అవార్డు ఫంక్షన్కు రావాలని నేను ఎంత ప్రయత్నించినప్పటికీ రాలేని పరిస్థితి. ఇందుకు నేను చాలా బాధపడుతున్నాని’ అన్నారు. మేం ఏం చేస్తే ఈ అవకాశం వస్తది: దర్శకుడు గుణశేఖర్ సింగీతం శ్రీనివాసరావు తరఫున అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘పెద్దాయన సింగీతం శ్రీనివాస రావు గారు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అందుకుంటూ కూడా... ‘ఇంకా నాకు ఎంతో కంట్రిబ్యూట్ చేయాలనిపిస్తోంది’ అన్న తర్వాత మాలాంటివాళ్లం ఇంకా ఎంత కంట్రిబ్యూట్ చేస్తే మాకిలాంటి అవకాశం వస్తది! ఆయన అవార్డును ఆయన తరఫున నేను అందుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్.’ అన్నాడు. -
‘అల వైకుంఠపురములో’కు అవార్డు వస్తదనుకోలేదు: అల్లు అర్జున్
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలకు సాక్షి’ మీడియా గ్రూప్ 2019, 2020 సంవత్సరాలకు గాను ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ‘అల వైకుంఠపురములో’గాను బెస్ట్ యాక్టర్ అవార్డు(2020) అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు అవార్డులంటే చాలా ఇష్టం. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. మా బ్రదర్ తమన్ని నాకు వన్ బిలియన్ ప్లే అవుట్స్ కావాలని ఏ ముహూర్తాన అడిగానో..! అంటే.. వందల కోట్ల సార్లు పాట ప్లే అవ్వాలని.. ఇప్పటికి దాదాపు 300 కోట్ల సార్లు ప్లే అయింది... ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ ఇవ్వడమే కాదు.. 2020 లాస్ట్లో ఎవడు సిక్సర్ కొడతాడో ఆడే మొత్తం డికేడ్ అంతా కొట్టినట్టు. ఆల్బమ్ ఆఫ్ ద డికేడ్... థ్యాంక్యూ తమన్. ఆల్బమ్లో ‘మల్లెల మాసమా...’ రాసిన సీతారామ శాస్త్రిగారికి, ‘రాజుల కాలం కాదు.. రథము, గుర్రము లేదు’ అని రాసిన రామజోగయ్య శాస్త్రిగారికి , ‘రాములో రాముల..’ పాట రాసిన కాసర్ల శ్యామ్గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నానంటే నాకు లాంగ్వేజ్ అంతగా రాదు.. కానీ లిటరేచర్ వేల్యూ బాగా తెలుసు. వచ్చే జనరేషన్ నాలా తెలుగు మాట్లాడకూడదు... చాలా బాగా మాట్లాడాలి (నవ్వు..). త్రివిక్రమ్గారిలా మాట్లాడాలనుకోండి. మా ప్రొడ్యూసర్ చినబాబుగారికి, వంశీగారికి, మా నాన్న అల్లు అరవింద్, బన్నీ వాసుకి థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే... నాలుగైదేళ్లుగా ఇలాంటి ఒక పెద్ద హిట్టు పడాలి, ఇండస్ట్రీ రికార్డో లేదా ఆల్ టైమ్ రికార్డో పడాలి.. అనుకుంటూ ప్రతిసారీ సినిమా చేసేవాణ్ణి. అయితే రాలేదు. ప్రతిసారీ అలాగే అనుకుంటాం.. ఈసారి అన్నీ వదిలేసి సరదాగా ఒక సినిమా చేద్దాం అనుకుని చేస్తే.. ఆ సినిమానే ఆల్టైమ్ రికార్డ్, బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది సినిమాకే కాదు.. లైఫ్కి కూడా మంచి పాఠం. అదేంటంటే మన లైఫ్లో అద్భుతం రావాలంటే కొన్నిసార్లు పట్టుకోవడం కాదు.. వదిలేయాలి, వదిలేసినప్పుడే అద్భుతం వస్తుంది. మీ లైఫ్లో కూడా ఏదైనా అద్భుతం రావాలంటే వదిలేయండి. అదొస్తదంతే. – అల్లు అర్జున్, మోస్ట్ పాపులర్ యాక్టర్ (అల వైకుంఠపురములో...) అవార్డులు మాకు చాక్లెట్స్లాగా.. చిన్నపిల్లలకు చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో బేసిగ్గా సినిమావాళ్లకు అవార్డులు కూడా అంతే ఇష్టం. మీరు ఎన్ని చాక్లెట్లు ఇస్తామన్నా పిల్లలు వద్దనరు.. మేము అవార్డులు వద్దనం. ‘అల వైకుంఠపురములో..’ తాలూకు అవార్డు మొట్టమొదటగా ‘సాక్షి’తో స్టార్ట్ అయింది. ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి మా ‘అల వైకుంఠపురములో..’ టీమ్ తరఫున ధన్యవాదాలు. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్గార్లకు, సినిమా రిలీజ్ అవక ముందే అత్యద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లిన నా మిత్రుడు తమన్కి, ఈ సినిమాని మా అందరితో కలిసి నటుడిగానే కాదు తోటి టెక్నీషియన్గానూ చేసిన మా హీరో అల్లు అర్జున్గారికి.. నాగవంశీ, పీడీవీ ప్రసాద్, పూజా హెగ్డే, టబులతో పాటు మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. – త్రివిక్రమ్ శ్రీనివాస్, మోస్ట్ పాపులర్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) 2020 తర్వాత మొదటిసారి.. 2020లో వైజాగ్లో చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ (‘అల వైకుంఠపురములో’)లో అంతమందిని జనాలను చూసిన తర్వాత.. మళ్లీ అంతమందిని చూడటం, ఓ ఫంక్షన్కి అటెండ్ కావడం కరువైపోయింది. ఓ ఏడాదిన్నర అటువంటి కరువులో ప్రయాణించిన మాకు ఒక చల్లటి గాలిలా మా ఇండస్ట్రీకి ఫస్ట్ వేడుకగా. ప్రప్రథమంగా ‘సాక్షి’ వారు ముందుకొచ్చి ఈ ఫంక్షన్ చేయడాన్ని ఎంతో అభినందిస్తున్నాను. ఇక ‘థర్డ్ వేవ్’ లేదనుకుంటూ ముందుకు సాగాలి. ‘సాక్షి’ వారు మా సినిమాని ఎన్నుకుని నాకు ,రాధాకృష్ణగారికి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. – అల్లు అరవింద్, మోస్ట్ పాపులర్ మూవీ (అల వైకుంఠపురములో...) క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే.. ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మాకు మ్యాజికల్ ఫిల్మ్. ఈ క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే. ఈ సినిమాని ఇంత పెద్ద స్థాయిలో తీసిన రాధాకృష్ణ, అల్లు అరవింద్కు థ్యాంక్స్. ఓ సినిమాలో ఒక పాట హిట్ అయితే ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ది. ఆరు పాటలూ హిట్ కావడం అంత సులభం కాదు. త్రివిక్రమ్గారు చాలా తెలివైనవారు.. రియల్లీ జీనియస్. ఈ సినిమాకి మంచి లిరిక్స్ ఇచ్చిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి, కృష్ణ చైతన్య, కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్గార్లకు థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా అవార్డులు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది.. ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. – సంగీత దర్శకుడు తమన్, మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) ఇది నా రెండో సాక్షి అవార్డు.. ‘సాక్షి’ అవార్డు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇది నా రెండో సాక్షి అవార్డు. మొదటిసారి ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి అందుకున్నాను.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి తీసుకున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ త్రివిక్రమ్ సార్. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకం. అల్లు అర్జున్, నిర్మాత చినబాబుగారు, వంశీ, గీతా ఆర్ట్స్కి థ్యాంక్స్. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వారు మళ్లీ మళ్లీ నా సినిమా చూసి నన్ను ఆశీర్వదించడంతో పాటు అభినందించారు.. అందుకు వారందరికీ థ్యాంక్స్. – పూజా హెగ్డే, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (అల వైకుంఠపురములో...) గర్వంగా ఉంది.. చిన్మయి ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది. ఇంత అద్భుతమైన పాట (మోస్ట్ పాపులర్ సింగర్–‘ఊహలే...’ (జాను) కోసం ‘సాక్షి’ తనను గౌరవించడం చాలా సంతోషం. డైరెక్టర్ ప్రేమ్గారికి, నిర్మాతలు ‘దిల్’రాజు గారు, శిరీష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత, లిరిక్ రైటర్ శ్రీమణి గారు... అలాగే తెరపైన ఈ పాటకి ప్రాణం పోసిన సమంత, శర్వా.. అందరికీ చిన్మయి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ. – రాహుల్, నటుడు–దర్శకుడు, చిన్మయి భర్త -
Mountaineer Amgoth Tukaram: మట్టిలో మాణిక్యాలకు వెలుగు ‘సాక్షి’
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ (స్పోర్ట్స్– మేల్) అవార్డును పర్వతారోహకుడు అమోఘ్ తుకారాం అందుకున్నారు. అమోఘ్ తుకారం‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ (స్పోర్ట్స్– మేల్) ఇరవై ఏళ్ల వయసులో.. పది నెలల వ్యవధిలో.. నాలుగు ఖండాల్లో.. ఎనిమిది శిఖరాలు అధిరోహించాడు అమోఘ్ తుకారాం. ప్రతి అధిరోహణ.. ఒక సందర్భం. ఒక సందేశం. ఒక సంకేతం. పర్వతారోహకులలో ప్రత్యేకం అమోఘ్ తుకారాం. ఎవరెస్టు శిఖరాన్ని సౌత్ కోల్ రూట్ గుండా ఎక్కడం ప్రమాదకరమైనా, ఈ దుస్సాహసం చేసి, విజయుడై నిలిచిన యంగెస్ట్ పర్సన్. ఆదివాసీ రైతు బిడ్డగా పుట్టి, పర్వత పుత్రుడిగా ప్రఖ్యాతి చెందిన ఈ యువ ఉత్తుంగ తరంగంది తెలంగాణా, రంగారెడ్డి జిల్లాలోని యాచారం. మట్టిలో మాణిక్యాలకు వెలుగు సాక్షి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడంలో సాక్షిదే అగ్రస్థానం. ఈ తరహా స్ఫూర్తిని అందించడం ద్వారా మరెందరో వెలుగులోకి వస్తారని భావిస్తున్నాను. సాక్షికి ధన్యవాదాలు. ముఖ్యంగా వై.ఎస్. భారతీరెడ్డిగారి నిరాడంబరత, ఆత్మీయ పూర్వక ప్రోత్సాహం నన్ను చాలా ఆనందాశ్చర్యాలకు గురిచేశాయి. వారికి ఎంతైనా రుణపడి ఉంటాను. – అమోఘ్ తుకారాం, పర్వతారోహకుడు -
‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది: జమున
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2019 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. నటి జమునకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారంపై ఆమె స్పందిస్తూ.. ‘‘సాక్షి’వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘సాక్షి’ టీవీకి చాలాసార్లు నా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. సీనియర్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ ‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు. -
Sakshi Excellence Awards: థ్యాంక్యూ సాక్షి: కోనేరు హంపి
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో సెప్టెంబర్ 17న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథులుగా... ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా... ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’(స్పోర్ట్స్- ఫిమేల్) అవార్డును కోనేరు హంపి అందుకున్నారు. ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కోనేరు హంపి(స్పోర్ట్స్- ఫిమేల్) చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. 15 ఏళ్ల వయసులో గ్రాండ్మాస్టర్గా చరిత్ర సృష్టించిన ఘనత కోనేరు హంపికి ఉంది! హంపీ అకౌంట్లో బంగారు పతకాలూ ఉన్నాయి. అండర్ 10, అండర్ 12, అండర్ 14 ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయి. అర్జున ఉంది. పద్మశ్రీ ఉంది. ఇప్పుడు సాక్షి ఎక్స్లెన్స్ ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కూడా హంపి విజయాలకు జత కలిసింది. హంపీ ఏపీ చెస్ క్రీడాకారిణి. మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్. ఆమె కనని కల ఒకటి సాకారం అయింది! అది.. అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం. హంపి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ. మరిన్ని విజయాలకు స్ఫూర్తి... క్రీడల్లో నాకు పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు విభిన్న కేటగిరీల్లో అవార్డులు తీసుకుంటున్న అందరికీ అభినందనలు. జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏది సాధించినా దానికి ప్రతిగా వచ్చే ఇటువంటి పురస్కారాలు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్యూ సాక్షి. ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. –కోనేరు హంపి, చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి గురించి సంక్షిప్తంగా.. ►కోనేరు హంపి 31 మార్చి 1987లో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ►తండ్రి కోనేరు అశోక్ ఆమె మొదటి కోచ్ ►15 ఏళ్ల వయసులో గ్రాండ్మాస్టర్గా కోనేరు హంపి చరిత్ర సాధించిన విజయాలు- వరల్డ్ చాంపియన్షిప్స్ ►అండర్-10 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్స్ 1997, ఫ్రాన్స్- స్వర్ణ పతకం ►అండర్-12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్స్ 1998, స్పెయిన్- స్వర్ణ పతకం ►అండర్- 12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్స్ 1999, స్పెయిన్- రజత పతకం ►అండర్-14 వరల్డ్ చెస్ చాంపియన్షిప్ 2000, స్పెయిన్- స్వర్ణ పతకం ►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్షిప్ 2001, ఏథెన్స్, గ్రీస్- స్వర్ణ పతకం ►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్షిప్ 2002, గోవా, ఇండియా- రజత పతకం ►వరల్డ్ కప్ 2002, హైదరాబాద్, ఇండియా- సెమీ ఫైనలిస్ట్ ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్ 2004, ఎలిస్తా, రష్యా- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్ 2008, నల్చిక్, రష్యా- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్, 2010 టర్కీ- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్- 2011- రజత పతకం చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు -
స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు
అన్నం పెట్టే అన్నదాతలు, ఆపన్నులకు ఆసరా ఇచ్చే సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, పర్వతాల మెడలు వంచిన పరాక్రమవంతులు.. ఇంకా ఎందరో స్ఫూర్తి ప్రదాతల విజయాలకు సాక్షి పట్టం కట్టింది.. పురస్కారాలు అందించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథిగా... అతిరథ మహారథుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నవారి స్పందనలు వారి మాటల్లోనే. తెలుగు వారందరి మీడియా నిజాలు తెలిపే నిష్పాక్షిక మీడియా గ్రూప్గా సాక్షి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రలో అందరికీ ఇష్టమైన మీడియా గ్రూప్ సాక్షి, ఈ తరహా కార్యక్రమాల ద్వారా ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్న చైర్ పర్సన్ భారతీ రెడ్డి కృషి ఎంతైనా అభినందనీయం. విభిన్న రంగాల్లో విజేతలను గుర్తించడం, వారి విజయాలను వెలుగులోకి తీసుకురావడం, గొప్ప కార్యక్రమం. స్ఫూర్తి దాయక విజయాలతో పురస్కారాలు దక్కించుకున్న విజేతలను, వివేకానందుని మాటలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి పురస్కారం ప్రకటించడం, అమర జవాన్ బాబూరావు వంటివారిని పురస్కరించడం ద్వారా సరైన విజేతలను ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలకు అభినందనలు – ముఖ్య అతిథి తమిళసై, గవర్నర్, తెలంగాణ కట్టా సింహాచలం ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఆయనది అగాథం నుంచి అత్యున్నత శిఖరానికి సాగిన ఒక జైత్రయాత్ర. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో జన్మించిన సింహాచలం బాల్యంలోనే చూపు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్రా బ్లైండ్ స్కూల్లో చదువుకున్న తరువాత, ఆర్వీఆర్ కాలేజీలో బిఏలో చేరారు. బీఈడీలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకు సాధించి, విశాఖలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో చేరి కోర్సు పూర్తి చేశారు. ఆ తరువాత కేంద్రీయ విద్యాలయలో అధ్యాపకునిగా చేరారు. అక్కడితో ఆగిపోలేదు. సివిల్స్కు ప్రిపరేషన్ మొదలెట్టారు. ఐఆర్ఎస్కు సెలెక్టయినా మరోసారి సివిల్స్ అటెంప్ట్ చేశారు. 2019 లో జాతీయ స్థాయిలో 457వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. అక్షరమనే ఆయుధంతో తనను చుట్టుముట్టిన ప్రతికూలతలను ఛేదిస్తూ గమ్యాన్ని ముద్దాడిన సింహాచలం ఎంతోమంది విద్యార్థులకు నిలువెత్తు స్ఫూర్తి. ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గొప్ప గౌరవం చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో ఇదో గొప్ప గౌరవం. ఈ గౌరవం నా కృషిలో నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుందని భావిస్తూ మరికొంత మందికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను. – కట్టా సింహాచలం, ఐ.ఎ.ఎస్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఐఏఎస్కు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్. భారతీరెడ్డి మీడియా ప్రాథమ్యాలు మారాలి ఒక చక్కని, అద్భుతమైన కార్యక్రమాన్ని సాక్షి నిర్వహిస్తోంది. ఇటీవలే మేం కూడా సిఎన్ఎన్ ఐబిఎన్లో ఇండియా పాజిటివ్, రియల్ హీరోస్ పేరిట ఇలాంటి పురస్కార ప్రదాన కార్యక్రమాలు ప్రారంభించాం. కేవలం చెడు వార్తలు, రాజకీయాలు మాత్రమే చూడడం పాక్షిక దృష్టి మాత్రమే అవుతుంది.. మనది సుసంపన్న దేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్న వ్యక్తులున్నారు. ఎన్నో విశేషాలున్నాయి. మీడియా ప్రాథమ్యాలు మారాలని కోరుకుంటున్నా. వాస్తవిక అంశాలు, వాస్తవమైన పరిస్థితులు, విజయవంతమైన వ్యక్తుల ప్రయాణాలపై మీడియా మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాక్షి ఎంపిక చేసిన అవార్డు గ్రహీతలు స్ఫూర్తిదాయకమైన రియల్ హీరోస్, మోడల్ సిటిజన్స్. –సాగరికా ఘోష్, ప్రముఖ పాత్రికేయురాలు, సిఎన్ఎన్ ఐబిఎన్ పారదర్శకంగా ఎంపిక సాక్షి మీడియా మాకు విజేతల ఎంపికలో ఎంతో స్వేచ్ఛనిచ్చింది. న్యాయనిర్ణేతల బృందంలో రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులతో సహా మరెందరో ప్రముఖులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా, పారదర్శకంగా విజేతల ఎంపిక జరిగింది. విజేతలు ఇలాగే భావితరాలకు తమ విజయ పరంపర కొనసాగించాలని, రోల్ మోడల్స్గా మారాలని కోరుకుంటున్నాను. – నరేంద్ర సురానా, చైర్మన్, న్యాయనిర్ణేతల జ్యూరీ ఎండి, సురానా టెలికామ్ డాక్టర్ చావా సత్యనారాయణ ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. సమష్టి కృషి ఫలితం.. ఈ అవార్డ్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో భాగమైన అందరి కృషికీ ఇదో గొప్ప గుర్తింపు. మా సంస్థ సభ్యులు అందరి తరపున సాక్షికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – డా. చావా సత్యనారాయణ, ఫౌండర్ అండ్ సియీఓ, లారస్ ల్యాబ్స్ డా.సత్యనారాయణ చావాకు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్. భారతీరెడ్డి డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి ‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. పల్లె విలువలే పురస్కారాలు.. ఈ పురస్కారం అందుకోవడం చాలా గర్వకారణం. అమెరికాలో ఉంటున్నా ఆంధ్రప్రదేశ్లోని ఓ మారుమూల పల్లెటూళ్లో నేర్చుకున్న విలువలు మాకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా, అనుసరణీయాలుగా ఉన్నాయి. ఈ పురస్కారం అందుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. డా.ప్రేమ్ సాగర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు, (అమెరికా నుంచి వీడియోబైట్) సాగరిక ఘోష్ నుంచి డా.ప్రేమ్ సాగర్ రెడ్డి తరఫున అవార్డు అందుకుంటున్న వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్, బాలకృష్ణ, -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2019 & 2020
-
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డులు