ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయవాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సావానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిధ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని పలు అంశాలను చర్చించారు. కార్యక్రమంలో పోషకురాలు డాక్టర్ ఆర్ఎస్ రమాదేవి, ఏపీఎంసీ పరిశీలకులు డాక్టర్ కె.ప్రభాదేవి, ఓబీజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.గంగాధరరావు, సైంటిఫిక్ చైర్ డాక్టర్ వి.పద్మజ, విజయవాడ ఓబీజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వి.శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment