చింతపల్లి మేజర్‌కు సాగునీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

చింతపల్లి మేజర్‌కు సాగునీరు విడుదల

Published Wed, Feb 19 2025 1:30 AM | Last Updated on Wed, Feb 19 2025 1:28 AM

చింతపల్లి మేజర్‌కు సాగునీరు విడుదల

చింతపల్లి మేజర్‌కు సాగునీరు విడుదల

అచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్‌ కాలువల ద్వారా చింతపల్లి మేజర్‌కు సాగునీటి అవసరాలకు కెనాన్స్‌ ఏఈ చిల్కా భాస్కర్‌ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్‌ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్‌కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్‌కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్‌కు, ఐదు రోజులు కస్తల మేజర్‌కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement