సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ

Published Sun, Mar 16 2025 1:54 AM | Last Updated on Sun, Mar 16 2025 1:49 AM

సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ

సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ

పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటరులో కవి డాక్టర్‌ కత్తి పద్మారావు రచించిన ‘సావిత్రీబాయి పూలే’ పుస్తకాన్ని అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ గుంటూరు జిల్లా కన్వీనర్‌ పిల్లి సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జీవిత కథను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియ చేసిన డాక్టర్‌ కత్తి పద్మారావును అభినందించారు. భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతి దీపం సావిత్రీబాయి పూలే అని పేర్కొన్నారు. ఆ మహనీయురాలి పుస్తకాన్ని ప్రతి మహిళ చెంతకు చేరుస్తానని తెలిపారు. అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ గుంటూరు జిల్లా కన్వీనర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతను పద్మారావు సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement