నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్‌ వ్యవస్థ | Nigeria restoring power after nationwide blackouts | Sakshi
Sakshi News home page

నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్‌ వ్యవస్థ

Published Fri, Sep 15 2023 5:58 AM | Last Updated on Fri, Sep 15 2023 5:58 AM

Nigeria restoring power after nationwide blackouts - Sakshi

అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్‌ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.

నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్‌ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్‌ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్‌ విఫలమైందని నైజీరియా విద్యుత్‌ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement